chalo mallanna sagar
-
‘కాంగ్రెస్ నిషేధిత పార్టీయా?’
హైదరాబాద్: తమ పార్టీ చేపట్టిన ఛలో మల్లన్నసాగర్ను పోలీసు బలగాలతో భగ్నం చేయించడాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. మల్లన్నసాగర్ ఈ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిషేధిత పార్టీయా? తాము నిషేధిత వ్యక్తులమా? మేమేమైనా తీవ్ర వాదులమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముంపు బాధితులను పరామర్శించటం ప్రతిపక్షంగా తమ బాధ్యతని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించి తీరుతామన్నారు. ఈ విషయమై గురువారం డీజీపీని కలవనున్నట్టు తెలిపారు. అక్కడా న్యాయం జరగకుంటే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
-
మల్లన్నసాగర్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని... అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో నేడు బ్లాక్డే అని పార్టీ నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క అభివర్ణించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఆ క్రమంలో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతోపాటు తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు పిలుపు నేపథ్యంలో మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాఅంతటా 144వ సెక్షన్ విధించారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాంతానికి చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.అరెస్ట్ అయిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా ఉన్నారు. -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
నేతలు, పోలీసుల మధ్య తోపులాట హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు ఛలో మల్లన్న సాగర్ కు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. మరో వైపు ఛలో మల్లన్నసాగర్ పిలుపుతో మెదక్ జిల్లాలో పోలీసులు 12 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 144వ సెక్షన్ విధించారు. కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. గాంధీభవన్ నుంచి నేతలెవరిని బయటకు రానివ్వకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత గా ఉంది కాగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. ఛలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని డీసీపీ కమలాసన్ రెడ్డి తో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ భేటీ లో జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. -
రేపు టీపీసీసీ చలో మల్లన్న సాగర్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను సందర్శించేందుకు రేపు ఉదయం 10 గంటలకు గాంధీభవన్ నుంచి టీపీసీసీ ముఖ్య నేతలు బయల్దేరుతున్నారు. లాఠీ చార్జ్ లో గాయపడిని రైతులను వారు పరామర్శిస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్లిన ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను టీపీసీసీ తీవ్రంగా ఖండించింది.