daljeet singh
-
అమృత్పాల్కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్పాల్సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్పాల్ దుబాయ్లో ట్రక్ డ్రైవర్గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్లో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
బీజేపీలో చేరేందుకు... 3 కోట్లా..!
-
బీజేపీలోకి మన్మోహన్ తమ్ముడు
ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన పార్టీ కాంగ్రెస్.. ఏ మాత్రం జీర్జించుకోలేని ఉదంతమిది. మన్మోహన్ సవతి తమ్ముడు దల్జీత్ సింగ్ కోహ్లి బీజేపీలో చేరిపోయారు. అదీ ఆయనను నిత్యం కీలుబొమ్మంటూ విమర్శిస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో..! అమృతసర్లో వ్యాపారి అయిన దల్జీత్ ఎన్నికల ప్రచార సభలో మోడీ, పంజాబ్ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్ల సమక్షంలో కమలదళ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలపడుతుందని మోడీ చెప్పారు. ‘ఈరోజు ప్రధాని మన్మోహ న్ సింగ్ సోదరుడు దల్జీత్ సింగ్ బీజేపీలో చేరారు. ఇది మమ్మల్ని బలోపేతం చేస్తుంది. మాది సభ్యత్వాల గురించి చెప్పుకునే పార్టీ కాదు, సంబంధాలను నెలకొల్పుకునే పార్టీ’ అని మోడీ అన్నారు. దల్జీత్కు బాదల్, అమృత్సర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరుణ్ జైట్లీ స్వాగతం పలికారు. మన్మోహన్ కుటుంబం దిగ్భ్రాంతి దల్జీత్ బీజేపీలో చేరడం మన్మోహన్ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) వర్గాలు చెప్పాయి. దల్జీత్ ఉద్దేశాలేంటో తమకు తెలియవని, ఆయనకు, ప్రధానికి మధ్య చాలా కాలంగా సంబంధాలు లేవన్నాయి. ‘మన్మోహన్ తల్లికి ఆయనొక్కడే కొడుకు. ఆయనకు ఆరుగురు అక్కచెల్లెళ్లు. దల్జీత్సింగ్ ప్రధానికి సవతి తమ్ముడు. మన్మోహన్ తల్లి చిన్న వయసులోనే చనిపోయింది’ అని తెలిపాయి.