damodara reddy
-
మెదక్కు దామోదర.. జహీరాబాద్కు సుదర్శన్రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది. ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
మహబూబ్నగర్లో దామోదర్రెడ్డి విజయం
మహబూబ్నగర్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠబరితంగా సాగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాలను టీఆర్ఎస్ గెలుపొందగా, 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్, మరో ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రెండో ప్రాధాన్యత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. అంతకముందు మహబూబ్నగర్ ఒక ఎమ్మెల్సీ స్థానానికి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మహబూబ్నగర్లో కసిరెడ్డి విజయం
-
మహబూబ్నగర్లో కసిరెడ్డి విజయం
మహబూబ్నగర్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా హోరాహోరీగా కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుచుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 443 ఓట్లతో విజయం సాధించారు. తొలి ప్రాధ్యానత ఓట్లలోనే ఆయన గెలుపొందారు. మరో ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి 200 ఓట్ల అధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.