
మహబూబ్నగర్లో దామోదర్రెడ్డి విజయం
మహబూబ్నగర్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠబరితంగా సాగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాలను టీఆర్ఎస్ గెలుపొందగా, 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్, మరో ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రెండో ప్రాధాన్యత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు.
అంతకముందు మహబూబ్నగర్ ఒక ఎమ్మెల్సీ స్థానానికి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.