MLC election
-
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాజకీయాలకు దూరంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు జొప్పించకుండా, శాసన మండలిలో ఆయా వర్గాలకే ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలని మండలి చైర్మన్ మోషేన్రాజు అభిప్రాయపడ్డారు. పీడీఎఫ్ సభ్యుల పదవీ విరమణ వల్ల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రస్తావించడంలో సభ మూగబోతుందేమోనని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ(పీడీఎఫ్), యనమల రామకృష్ణుడు, పి.అశోక్బాబు, డి.రామారావు, బీటీ నాయుడు(టీడీపీ)లకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలపడంతో ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని, వారి గొంతుకను అడ్డుకుంటున్నామా? అనే భావన కలుగుతోందన్నారు. పీడీఎఫ్ సభ్యులు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ సభలో బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించేటప్పుడు సంతోషంగా ఉండేదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల యనమల రామకృష్ణుడు తాను నమ్మిన పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. బీటీ నాయుడు మరోసారి ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఇకపై ఎమ్మెల్సీలు ఎవరైనా పదవీ విరమణ పొందితే సభా సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని చైర్మన్ ప్రకటించారు.సభలో యనమల ఉంటే బాగుండేది: బొత్ససభలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపైనే పోరాటం తప్ప సొంత అజెండాలు ఉండవని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సభలో యనమల రామకృష్ణుడు కూడా ఉండి ఉంటే బాగుండేదని బొత్స అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అలాంటి సీనియర్ రాజకీయ నాయకుల మాటలు, అనుభవం సభ్యులకు అవసరమన్నారు. చైర్మన్ స్పందిస్తూ... తాను ఫోన్ చేసినప్పటి కీ అనారోగ్యం కారణంగా యనమల రాలేకపోతున్నట్టు చెప్పారన్నారు. బొత్స మాట్లాడుతూ యనమల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. స్పీకర్గా యనమల తీసుకొచి్చన సంస్కరణలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని తెలిపారు. పీడీఎఫ్ సభ్యులు సమాజంలోని రుగ్మతలను సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ శాసన వ్యవస్థలో లైవ్ స్ట్రీమింగ్ అనేది యనమల స్పీకర్గా ఉన్నప్పుడు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా వచ్చిందన్నారు. -
కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!
మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవాన ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మురిపించారని, తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న జిల్లాలోని 31 గ్రామాల్లో 1066 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అప్పటికే కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 81,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన 80వేల మందికి పైగా దరఖాస్తుదారులు తమకు కార్డు ఎప్పుడొస్తుందనే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తకార్డుల పంపిణీకి బ్రేక్పడిందని కొన్నాళ్లపాటు చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం కార్డులు అందజేసేందుకు ఏం అడ్డంకి ఉందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికై నా ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో నూతన కార్డులు జారీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.మార్పులు, చేర్పులపై కనిపించని స్పందనరేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం గత ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు పౌర సరఫరాలశాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లను స్థానికంగా కార్డుల్లో చేర్చాల్సి ఉంది. అలాగే పిల్లల పేర్లనూ చే ర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చే సుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదుకాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త కార్డుల జారీ లో జాప్యం, మార్పులు చేర్పుల అంశంపై ‘సాక్షి’ పౌర సరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.హామీని నిలబెట్టుకోవాలికొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రజలకు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు ఒక లా ఆ తరువాత మరోలా కార్డుల జారీపై మాట మా ర్చడం సరికాదు. నూతన కార్డులు జారీ చేయడంతో పాటు మార్పులు, చేర్పులు చే యాలి.– తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్నిర్లక్ష్యం తగదుకొత్త కార్డుల జారీని ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎంతో మంది కార్డులు వస్తాయని ఆశతో ఉన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కార్డులు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూడా అదే విధా నం కొనసాగించడం సరికాదు. – పెద్దరాజారెడ్డి, మాజీ సర్పంచ్, గుమ్మిర్యాల్ -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సోము వీర్రాజు
-
తెలంగాణలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
-
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది. -
సామాజిక కోణంలోనే ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతిఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్నాయక్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఓసీ కోటా మినహాయింపుఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్పక్ష నేత టి.జీవన్రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటాఅసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం
-
హస్తిన పర్యటనలతో సెంచరీ కొట్టడం ఖాయం.. రేవంత్పై లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 38వ సారి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు. -
‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం. ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్కు గిఫ్ట్ ఇచ్చాం: కిషన్ రెడ్డి
-
బండి సంజయ్ రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్
-
అధికార పక్షాలకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు!
శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్సీపీకి కొంత నష్టం జరిగింది.శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.వైఎస్సార్సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్కు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కిషన్రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలక పక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారాయన.సాక్షితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయమేమీ కాదు. ఇది బీజేపీ సాధించిన సమిష్టి విజయం. తెలంగాణలో పాలకులు మారినా.. మార్పు రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారు. .. కాంగ్రెస్కు, రేవంత్కు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. రేవంత్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అర్థమైంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా’’ అని అన్నారాయన. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ.. ఈ విజయం బీజేపీ కార్యకర్తలందరిదని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు, అందరి సహకారంతో ఈ విజయం సాధించాం. మేము ఊహించినట్టే విజయం దక్కింది. మండలిలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతా’’ అని అన్నారు.సాక్షి టీవీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కార్యకర్తల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెంపపెట్టు ఈ విజయం. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది అని అన్నారు. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
పట్టభద్రుల పట్టం ఎవరికి?
-
టీచర్లను అవమానించేలా అచ్చెన్న వ్యాఖ్యలు: యూటీఎఫ్ ఫైర్
సాక్షి, అమరావతి/భీమవరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్కు వైఎస్సార్సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఓ ప్రకటనలో ఖండించారు.ఈ సందర్బంగా ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు. కూటమి బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓడిపోవడం, విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టుగా ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ మద్దతుతో టీడీపీ అభ్యర్థులు గెలిచిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబత్తుల, గాదె గెలుపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. -
రిగ్గింగ్.. బూత్ క్యాప్చరింగ్.. దొంగ ఓట్లతో గెలిచారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్క్లాక్లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. రిగ్గింగ్కు పాల్పడ్డారుపలు పోలింగ్ బూత్లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు. అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్
సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.కూటమి పాలనలో రిషికొండ బీచ్కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్ను బీచ్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. -
తెలంగాణ: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ గెలుపు.. రాబోయేది బీజేపీ కాలమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయులందరికీ వందనం. ఈ విజయాన్ని ప్రధాని మోదీ, ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠం.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి.. బీజేపీని ఓడించాలని చూశారు. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాసింది. నితీకి నిజాయితీకి నిదర్శనం ఈ విజయం. రాబోయేది బీజేపీ కాలమే. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో పార్టీకి ఇది మూడో విజయం. కిషన్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాం. తెలంగాణలో టీచర్లు అందరూ తపస్లో చేరాలి అని సూచించారు. -
ఏపీలో చంద్రబాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి
-
గెలిచినోడే... మా వాడు!
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ.. తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్తో పాటు లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు... ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు!!పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘రఘువర్మకే కూటమి మద్దతు’ అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు.ఇవే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్టు మాట్లాడారు. ‘‘మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.... స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలు పెట్టారు.బుట్టలో వేసుకునే యత్నం...!వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచీ గాదె శ్రీనివాసులు నాయుడుకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ది చెప్పారన్న అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాదె గెలుపు దిశగా వెళుతున్న సమయంలో ... నేరుగా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్ ద్వారా గాదెతో మాట్లాడినట్టు చెబుతున్నారు. రఘువర్మ విజయానికి పనిచేయాలని పిలుపునిస్తున్న మంత్రి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అదితి తదితరులు రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ... మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని... గాదె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గాదె తమ వాడేనని.... గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. -
బీజేపీ, పీఆర్టీయూకు చెరొకటి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు. మొదటి నుంచీ ఆధిక్యంలోనే... పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్రాజ్ యాదవ్ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు. రౌండ్ రౌండ్కూ పెరిగిన ఆధిక్యం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్రాజును ఎలిమినేట్ చేసి 15వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్ చేసి 16వ రౌండ్లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్ను ఎలిమినేట్ చేసి 17వ రౌండ్ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. కరీంనగర్లో కమల వికాసం కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. అధికారుల లెక్కల్లో గందరగోళం.. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కౌంటింగ్లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. భారీగా ఇన్వాలీడ్ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు గ్రాడ్యుయేట్కు సంబంధించి భారీగా ఇన్వాలీడ్ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి నరేంందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ అభ్యర్ధి, మాజీ మేయర్ రవీందర్ సింగ్లు వాపోయారు. అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్వాలీడ్ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్సింగ్ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు బూత్ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తానని రవీందర్సింగ్ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్’ స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్బుక్ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్ కమిషనర్ ఫోన్ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది. సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం కోసం పోటాపోటీ... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. రాజకీయ జోక్యంతో...! టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. కూటమికి చెంపదెబ్బ: బొత్ససాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.విశాఖ ఏయూలోని కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బంది అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా! : గాదెతమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు. ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు. కూటమికి కౌంట్డౌన్ : ధర్మాన కృష్ణదాస్నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్డౌన్ మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితంఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి, గడ్డం సు«దీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.ఆధిక్యంలో ఆలపాటిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్కు 84,595, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి తొలిరౌండ్ ఫలితాల వెల్లడిసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్లో మార్పులు చేశారు. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. – డాక్టర్ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీఆర్టీయూపాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం. – హృదయరాజు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడుకూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి గెలిపించుకున్నాయి. – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధంఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత -
మల్క కొమురయ్య గారి విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గారి విజయంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటనప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త మల్క కొమురయ్య ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్బంగా హృదయపూర్వక అభినందనలు.ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, తెలంగాణ ప్రజలకు.. బీజేపీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు, ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు.ఏ ఆకాంక్షల కోసమైతే, ఉపాధ్యాయులు బీజేపీని గెలిపించారో.. వాటి సాధనకు బీజేపీ కృషిచేస్తుంది. -
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
కూటమి ప్రభుత్వానికి షాక్.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం అరాచకానికి పాల్పడింది: లక్ష్మణరావు
-
MLC ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అప్డేట్స్
MLC Election Counting Updates..కరీంనగర్ జిల్లా :కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బిజెపిటీచర్స్ ఓట్ల లెక్కింపు పూర్తి.భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం.అధికారికంగా ఇంకా ప్రకటించని అధికారులు.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ టీచర్ MLC మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపుకాసేపట్లో అధికారిక ప్రకటనవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ నల్లగొండ జిల్లా :కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిగెలుపోటములు సహాజంఓటమిని అంగీకరిస్తున్నాగెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నఓడిపోయినందుకు బాధపడటం లేదుఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమోప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు.వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ18 రౌండ్ ఫలితాలుటీ పీఆర్టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్మరికాసేపట్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (3115) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియతొలి స్థానంలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయానికి ఇంకా 4149 ఓట్లు అవసరంరెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 6162 ఓట్లు అవసరంవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :15 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :16 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ తర్వాతశ్రీపాల్ రెడ్డి- 7673అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5660హర్షవర్ధన్ రెడ్డి- 5309పూల రవీందర్- 3992కరీంనగర్ :టీచర్స్ కోటా ఎమ్మెల్సీలో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యసంబరాలకు సిద్దమవుతున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యమొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా కొమరయ్యకరీంనగర్: కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ టేబుల్ కౌంటింగ్.మొదటి 14 వేల ఓట్ల లెక్కింపు సాగుతుండగా.. లీడ్ లో కొనసాగుతున్న బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యవిక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ ఆలోచించి బయటికి వచ్చిన మల్క కొమురయ్యవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ప్రారంభమైన 16వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసరోత్తం రెడ్డికి వచ్చిన (2289) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా:15 రౌండ్ ఫలితాలుస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు(2040 ఓట్లు) ఎలిమినేట్15వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6916అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5205హర్షవర్ధన్ రెడ్డి- 4799పూల రవీందర్- 3617పులి సరోత్తం రెడ్డి-2645వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 15వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (2040) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :పన్నెండో అభ్యర్థి బాబు రావు( 128 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 13 వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లుబాటు అయిన ఓట్లు- 23,641చెల్లని ఓట్లు- 494గెలుపు కోటా- 11822 గా నిర్ధారణ12 రౌండ్లు ముగిసిన తర్వాత వచ్చిన ఓట్లుశ్రీపాల్ రెడ్డి- 6105అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4884హర్షవర్ధన్ రెడ్డి- 4502పూల రవీందర్- 3202పులి సరోత్తం రెడ్డి- 2337సుందర్ రాజు-2091వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :14 రౌండ్ ఫలితాలుకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ఎలిమినేట్14వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6165అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4946హర్షవర్ధన్ రెడ్డి- 4596పూల రవీందర్- 3249పులి సరోత్తం రెడ్డి- 2394సుందర్ రాజు-2141వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియతొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య( 36 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి(24 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా : ఎనిమిదో అభ్యర్థి కైలాసం( 26 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులుచలిక చంద్ర శేఖర్ 1 ఓటు, కంటే సాయన్న. 4 ఓట్లు, బంక రాజు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, లింగడి వెంకటేశ్వర్లు 15, అర్వ స్వాతి 19 ఎలిమినేటర్కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియనేటి రాత్రి వరకు కొనసాగనున్న బ్యాలెట్ పేపర్ల బెండల్స్ కట్టడం ప్రక్రియవ్యాలీడ్ ఇన్ వ్యాలిడ్ ఓట్ల పరిశీలనకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశంరాత్రి వరకు ఎమ్మెల్సీ ఓట్లు కట్టలు కట్టి సపరేషన్ ప్రక్రియఅర్ధరాత్రి దాటిన తర్వాతే పట్టభద్రుల అసలు ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళనచెల్లని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకే నష్టం అంటున్న ప్రసన్న హరికృష్ణగెలుపు ధీమా వ్యక్తం చేసిన ప్రసన్న హరికృష్ణటీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బండెల్స్ కట్టడం పూర్తివరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్నల్లగొండ జిల్లాముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక లీడ్ లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిరెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిమూడో స్థానంలో టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డినాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికాసేపట్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను ప్రకటించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లామరికాసేపట్లో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజమొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి నమోదుఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిమూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరనేది తెలిసే అవకాశంమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తొలగించి గెలుపు కోటాను నిర్ణయించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా..మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.ముగిసిన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపుటేబుల్ కు 40 కట్టల కేటాయింపుఒక్కో కట్టలో 25 ఓట్లుఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల కేటాయింపుమిగిలిన ఓట్లు చివరి టేబుల్ కు కేటాయింపుమధ్యాహ్నం మూడు గంటల వరకే ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయించనున్న అధికారులుమొత్తం పోలైన ఓట్లు- 24139👉ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. 👉కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. 👉ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. 👉గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. 👉ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. -
AP: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. కూటమి అభ్యర్థి వెనుకంజ
MLC Election Results Updates..గుంటూరు జిల్లా:గుంటూరు - కృష్ణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పూర్తయిన మొదటి రౌండుమొదటి రౌండులో 28, 000 ఓట్లు లెక్కింపు.ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 17,194 ఓట్లుపిడిఎఫ్ అభ్యర్థి కే.ఎస్. లక్ష్మణరావు కు 7,214 ఓట్లు.చెల్లని ఓట్లు3070మిగిలిన 23 మందికి కలిపి:522మొదటి రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మెజార్టీ :9980 ఓట్లు గుంటూరు జిల్లా :ప్రారంభమైన గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్ఒక్కో టేబుల్ కి వెయ్యి ఓట్లు చొప్పున కౌంటింగ్ చేస్తున్న సిబ్బందిమొత్తం 28 టేబుల్స్ ఏర్పాటుమొదటి రౌండ్ లో లెక్కించనున్న 28 వేల ఓట్లు.చెల్లని ఓట్లతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను వేరు చేస్తున్న సిబ్బందిమరో అర్ధగంట లో ముగియనున్న మొదటి రౌండ్ కౌంటింగ్.ఏలూరు జిల్లా : ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియచెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరు చేసిన అనంతరం లెక్కింపు ప్రక్రియ431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు, పోలైన 243 ఓట్లుపోస్టల్ బ్యాలెట్ లో చెల్లుబాటు కాని ఓట్లు 42చెల్లుబాటు అయ్యే ఓట్లు 201 గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.మిగతా 2లక్ష 18వేల 902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..మొత్తం 28టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిమొదటి రౌండ్లో 10,783 చెల్లుబాటు ఓట్లను లెక్కించిన సిబ్బందిరెండో రౌండ్లో 13,929 చెల్లుబాటు ఓట్లుమూడో రౌండ్లో 11,870 చెల్లుబాటు ఓట్లునాలుగో రౌండ్లో 13,777 చెల్లుబాటు ఓట్లు5వ రౌండ్లో 13,163 చెల్లుబాటు ఓట్లు6వ రౌండ్లో 14,783 చెల్లుబాటు ఓట్ల లెక్కింపు7వ రౌండ్లో 12841 చెల్లు బాటు ఓట్ల లెక్కింపు8వ రౌండ్లో 14296 చెల్లు బాటు ఓట్లు లెక్కింపు..విశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఎలిమినేషన్ రౌండ్ తో తేలనున్న ఫలితంమొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితంమొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసుల నాయుడుకు ఆధిక్యం 365శ్రీనివాసులు నాయుడుకి 7210 ఓట్లురఘు వర్మకు 6845 ఓట్లు నమోదుయూటీఎఫ్ అభ్యర్ధి విజయగౌరికి 5804 ఓట్లు విశాఖ.:హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక..మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలని ఫలితం..రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు..మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీనివాస నాయుడు 331 ఓట్ల ఆధిక్యతశ్రీనివాసుల నాయుడుకు వచ్చిన ఓట్లు 6927కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కు ఓట్లు 6596యుటిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీకి వచ్చిన ఓట్లు 5684విశాఖ..హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.టేబుల్ నెంబర్ 4, 14 లో ముగిసిన ఓట్ల లెక్కింపు..కూటమి బలపరిచిన APTF అభ్యర్ధి పాకలపాటి రఘువర్మ వెనుకంజ..75 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడుమొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..సుమారుగా చెల్లని ఓట్లు 250విశాఖ..హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.టేబుల్ నెంబర్-14 లో ముగిసిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..APTF అభ్యర్ధి రఘువర్మపై 30 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడుమొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..సుమారుగా చెల్లని ఓట్లు 250 విశాఖ..ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి జరుగుతున్న కౌంటింగ్ నువ్వా నేనా అన్నట్లు పోటీ..స్వల్ప ఓట్లు ఆధిక్యంలో PRTU అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు..ఏలూరు జిల్లా..ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు.. పోలైన 243 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటు కాని ఓట్లు 42చెల్లుబాటు అయ్యే ఓట్లు 201గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.మిగతా 2,18,902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..మొత్తం 28 టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది.. 👉మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం.👉ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. 👉రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ..ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..బరిలో పదిమంది అభ్యర్థులు.123 బ్యాలెట్ బాక్సులు.20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులుమొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులుగుంటూరు..ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్మొత్తం 29 టేబుల్ ఏర్పాటుమూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఏలూరు జిల్లా..ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది ఓటర్లుమూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు28 టేబుల్స్ ఏర్పాటు17 రౌండ్స్లో తేలనున్న ఫలితం.కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు -
నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ మేరకు కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సోమవారం సాయంత్రం లోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ శనివారం అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్నికల అధికారులు మాక్ కౌంటింగ్ చేపట్టారు. ఈ మాక్ కౌంటింగ్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బందికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానం, నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఏర్పాట్లు చేసిన అసెంబ్లీ వర్గాలుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మె ల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గత నెల 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవా రం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీనికోసం అసెంబ్లీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈనెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశముంటుంది. పోలింగ్ ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాశ్రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం మార్చినెలాఖరుతో ముగియనుంది. శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్ఎస్కు దక్కనున్నాయి. మరో స్థానం ఎవరికి వస్తుందన్న దాని పై స్పష్టత లేదు. అయితే, కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలపాలని యోచిస్తోంది. ఈ నాలుగింటిలో ఒకటి తమకివ్వాలని ఎంఐఎం అడుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఇక, బీఆర్ఎస్ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై ఆ పార్టీ వర్గాలు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. -
నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడిన 70 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
MLC ఎన్నికల్లో ఓటుకు నోటు
-
దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు
కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత.. సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోకపోవడానికి తోడు డీఎస్సీ ప్రకటించక పోవడం, గ్రూప్–2 అభ్యర్థులతో ఆటలాడుకోవడం.. తదితర కారణాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దీంతో ఎలాగైనా సరే గెలవాలని సర్కారు పెద్దలు బరితెగించారు. వీరి కనుసైగతో పోలింగ్ బూత్లలోనే డబ్బులు పంచడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఏజెంట్లను తరిమేయడం మరో ఎత్తు. ఫలితంగా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని నయా సంస్కృతి ఇది.సాక్షి, అమరావతి/పిఠాపురం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, విశాఖపట్నం/గుంటూరు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని రీతిలో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నించాయి.ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలు చోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని 96, 97, 98 పోలింగ్ బూత్ల పక్కనే టీడీపీ నేతలు తిష్ట వేసి కూర్చున్నారు.ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. ‘డబ్బులు తీసుకోండి.. కూటమి అభ్యర్థికి ఓటు వేయండి’ అని కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పక్కనే ఉన్న మున్సిపల్ కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్.. వచ్చిన ప్రతి ఓటరు వద్ద ఓటరు స్లిప్ తీసుకుని, సరి చూసి మరీ ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు.ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో కూడా ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు వారికి సమాచారం ఇచ్చి.. అక్కడికి వెళ్లారు. ఆలోపే టీడీపీ నేతలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అంటూ చెప్పుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ కావడం చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్కు అతి సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అని విమర్శలు వెల్లువెత్తాయి. లింగపాలెంలో దొంగ ఓట్లుఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దకు పసుపు చొక్కాలు వేసుకువచ్చి డబ్బులు పంపిణీ చేశారు. పీడీఎఫ్ ఏజెంట్లపై దాడి చేశారు. చివరి రెండు గంటల్లో దొంగ ఓట్లు వేయించారు. పెదవేగి బూత్ నంబర్ 327లో పీడీఎఫ్ ఏజెంట్ గేదెల శివకుమార్పై కూటమి అభ్యర్థులు దాడి చేశారు.లింగపాలెం మండలంలోని శింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 277, 278 బూత్లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. అక్కడ పీడీఎఫ్ ఏజెంట్ సూర్యకిరణ్ను బెదిరించి మొబైల్ లాక్కుని బయటకు గెంటేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను తీసుకుని చివరి నిమిషంలో ఓట్లు వేశారు. దీంతో మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 4 గంటలకు 69.50 శాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలో 24.21 శాతం ఓటింగ్ పెరిగిందంటే దొంగ ఓట్ల వల్లేనని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించారని దౌర్జన్యం.. దాడులుఓటమి భయంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు బాపట్ల జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. రిగ్గింగ్కు పాల్పడ్డారు. చాలాచోట్ల పీడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాపట్లలోని మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేఛ్చగా దొంగ ఓట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం దొంగ ఓట్లు వేశారు. టీడీపీ మహిళా నేత పోలింగ్ కేంద్రంలో మకాంవేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి స్థానిక టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్కుమార్ వారిని అడ్డుకున్నారు. పోలింగ్ సమయం ముగిశాక టీడీపీ వారిని లోపలికి ఎలా అనుమతిస్తారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు మరికొందరు కలిసి పీడీఎఫ్ నాయకుడు అనిల్కుమార్పై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. భట్టిప్రోలులో పీడీఎఫ్ ఏజెంట్ లింగం శ్రీనుపై టీడీపీ నాయకులు దాడిæచేసి కొట్టారు. కూటమి అభ్యర్థి ఆలపాటికి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను లింగం శ్రీను నిలదీశారు. దీంతో టీడీపీ వారు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు.చుండూరులో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగు చేసేందుకు పలుమార్లు యత్నించారు. దీనిని పీడీఎఫ్ నేతలు అడ్డుకున్నారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, అడవులదీవి, రేపల్లె, వేమూరుతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని పీడీఎఫ్ నేతలు ఆరోపించారు.మా ఏజెంట్లను బూత్ల నుంచి వెళ్లగొట్టారు: లక్ష్మణరావు కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని, వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున నియమించిన ఏజెంట్ను అనుమతించలేదని అన్నారు.దుర్గిలో ఏజెంట్ను బయటకు పంపడంతోపాటు బెల్లంకొండ ఏజెంట్ను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూత్లలోకి ప్రవేశించి, హడావుడి సృష్టించారని, చీఫ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మె ల్యేలకు బూత్లలోకి వెళ్లేందుకు ఎటువంటి అధికారం లేద న్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని అమలు పర్చిందని ఆరోపించారు.తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్ పాఠశాలతో పాటు అమరావతి, పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లకు తెగబడిందన్నారు. సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదు కావడం సహజమేనని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. పల్నాడులోని పలు బూత్లలో 90 శాతం పోలింగ్ జరిగినట్లు నమోదైతే, అది కచ్చితంగా దొంగ ఓట్లు వేయించినట్లేనని స్పష్టం చేశారు. పోలైన ఓట్లు, తదితర పూర్తి వివరాలు వచ్చిన తరువాత, రీ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలురాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు 92.40 శాతంకుపైగా పోలింగ్ నమోదు కాగా, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28 శాతం, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58 శాతం పోలింగ్ నమోదైంది.నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించడానికి అనుమతించడంతో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీలో అత్యధిక మంది ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు వేసే సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది, ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీలో ఉండటంతో అభ్యర్థులకు ప్రాధాన్యతా నంబర్లు కేటాయించి బ్యాలెట్ పేపర్ మడత పెట్టి బ్యాలెట్ బ్యాక్స్లో వేయడానికి అయిదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంది.దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తి ఎదుట ప్రాధాన్య ఓటు సంఖ్య కాకుండా టిక్కులు పెట్టడంతో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నిరంతర పర్యవేక్షణపోలింగ్ సజావుగా నిర్వహించడానికి 6,287 మంది పోలీస్, 8,515 మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో పోలింగ్ను లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడమే కాకుండా సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యవేక్షించారు. విజయవాడలోని పటమట హైస్కూల్, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల, కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కాలేజీ, శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల బ్యాలెట్ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. -
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నుంచే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులుదీరారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 93.55 శాతంగా నమోదైంది. ఈ నియోజకవర్గ పరిధిలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,132 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 20,888 మంది ఓటర్లు ఉండగా అందులో 18,884 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు పోలింగ్ శాతం 90.41 కాగా, ఈసారి 3.14 శాతం అధికంగా నమోదైంది. » యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 96.54 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 984 ఓట్లు ఉండగా, 950 ఓట్లు పోలయ్యాయి. ఇక హనుమకొండ జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ 5,215 మంది ఓటర్లు ఉండగా, 4,780 మంది (91.66 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓట్లపరంగా చూస్తే అత్యధిక ఓట్లు హనుమకొండ జిల్లాలో ఉండగా, అక్కడే అత్యధిక ఓట్లు పోలయ్యాయి. » నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏర్పాట్లను ఎన్నికల రిటరి్నంగ్ అధికారి ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండ ఎస్పీ శరత్చంద్రపవార్ గురువారం రాత్రి పరిశీలించారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఆ రెండు స్థానాల్లో ఇలా... » కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుల్తానాబాద్, చిగురుమామిడిలో ఓ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. » కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 2019 ఎన్నికలప్పుడు 1.96 లక్షల ఓట్లు ఉండగా.. ఈసారి అది 3.55 లక్షలకు చేరింది. మొత్తంగా ఈ నియోజకవర్గ పరిధిలో 70.42 శాతంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 59.03 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. » కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 2019 ఎన్నికలప్పుడు 23,160 ఓటర్లు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 27,088 చేరింది. ఈ స్థానంలో 91.90 శాతంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 83.54 శాతం మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయా జిల్లాల్లో పోలింగ్ పదనిసలు ఇలా... సాక్షి, నెట్వర్క్: మూడు స్థానాల్లో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్లో అనేక పదనిసలు చోటుచేసుకున్నాయి. » జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్ర పరిధిలో 19 ఓట్లు తొలగించారని ధర్మకంచ జూనియర్ కళాశాల లెక్చరర్లు ఎ.శ్రీకాంత్రెడ్డి, చేర్యాల, మిడిదొడ్డి జూనియర్ కళాశాల అధ్యాపకులు కె.శ్రీధర్, గొల్లూరి రామచంద్రయ్య వాపోయారు. » జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కేవలం ఒక్కరే ఉండగా, తనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయుడు సుధాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. » సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర్ డంప్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం ప్రజలు నెలరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపుతో పట్టభద్రులు పోలింగ్కు దూరంగా ఉన్నారు. 295 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉండగా, కేవలం 42 మంది మాత్రమే ఓటేశారు. » మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రానికి చెందిన పట్టభద్రుడు అరిగెల మల్లాగౌడ్ జెడ్పీ హైసూ్కల్లో ఓటేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఎవరో ఓటేశారని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు. తన ఓటును వేరే ఎవరో ఎలా వేస్తారని అధికారులను నిలదీయడంతో అన్నీ పరిశీలించాక, చివరకు అతనితో టెండర్ ఓటు వేయించారు. » సిద్దిపేట జిల్లా మర్రిముచ్చాలకు చెందిన అమరేందర్రెడ్డి జనగామలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఓటుపై అవగాహన కల్పించేందుకు సుమారు 22 కిలోమీటర్ల మేర గ్రామాల్లో జాగింగ్ చేశారు. అనంతరం కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. -
అనేక పోలింగ్ బూత్ ల నుండి మా ఏజెంట్లను పంపించారు: లక్ష్మణరావు
-
ఓటుకు 3000.. పిఠాపురంలో ప్రలోభాల పర్వం!
సాక్షి, పిఠాపురం: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000-3000 ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఓట్లరకు డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో సైతం ఇలాగే జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓట్లరను ప్రలోభాలు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. ఓట్లుకు 2000 అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ నగదును ఓటర్లు అందిస్తున్నారు.విశాఖలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో నాయకులతో కలిసి హడావిడి చేస్తున్నారు. చంద్రపాలెం స్కూల్లోకి నేరుగా వాహనంతో వెళ్లిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యం. 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోని వైనం. ఓటు వేయకుండా ఉపాధ్యాయులను నిర్బంధించిన యాజమాన్యం. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు పొంతలేని సమాధానం చెప్పిన సిబ్బంది. పుట్టినరోజు వేడుకలు కోసమే ఉపాధ్యాయులను పిలిచినట్లు సమాధానం. చివరకు మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులను వదిలిపెట్టారు. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్ (ఫొటోలు)
-
తెలంగాణ: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Telangana MLC Elections Polling Updates..తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ఖమ్మం :ఖమ్మం పట్టణంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం రిక్కా బజార్ వద్ద ఉద్రిక్తత..ప్రధాని నరేంద్ర మోడీపై UTF నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతల ఆందోళనబీజేపీ నేతలను అడ్డుకుని, ఇరు వర్గాల టెంట్ లను తొలగించిన పోలీసులు..బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాటపోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి..బిజెపి నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..చివరకు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను వదిలేయడంతో సద్దుమణిగిన వివాదం...2 గంటల వరకూ పోలింగ్ శాతం ఇలా..మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 40.61మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 63.49 12 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. ఉదయం 12 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 19.20 %ఉదయం 12గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 33.98%ఖమ్మంలో ఉద్రిక్తత..ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ సెంటర్లో ప్రచార టెంట్లో అభ్యర్థుల ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం.యుటీఎఫ్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం, తోపులాటఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులువరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పోలింగ్ సమీపంలో ఉద్రిక్తత.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం..గ్రాడ్యుయేట్స్ 6.37%టీచర్స్ 13.10%సూర్యాపేట జిల్లా..సూర్యాపేట జిల్లా కొనసాగుతున్న పోలింగ్ఇప్పటి వరకు శాతం 14.68% పోలింగ్ నమోదు.👉జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణి పెట్ స్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.👉ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది.👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్రెడ్డి (పీఆర్టీయూ), అశోక్కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ), రవీందర్సింగ్(ఏఐఎఫ్బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.👉టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్రెడ్డి (బీజేపీ), శ్రీపాల్రెడ్డి (పీఆర్టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఏపీలో మూడు స్థానిలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ మరో గంటలో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్..ఇప్పటికే 80శాతం పైగా పోలింగ్ నమోదు.. విశాఖ: కొనసాగుతున్న ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం నమోదుడబ్బులు పంచుతున్న కూటమి నేతలుకాకినాడ..పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకి నోటుఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపగలే డబ్బులు పంచుతున్న కూటమి నేతలుపిఠాపురంలో బరితెగించిన కూటమి నేతలుకూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్కి ఓటు వేస్తే మూడు వేలు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలుమున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు రూ.3 వేలు పంచుతున్న వైనంఓటుకి మూడు వేలు పంచుతున్నా చర్యలు తీసుకోని అధికారులువిశాఖ:టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్..ఆరు జిల్లాల్లో 12 గంటల వరకు 57.71% పోలింగ్ నమోదు..కృష్ణాజిల్లా..ఎమ్మెల్సీ ఎన్నికల పోల్ పెర్సెంటేజ్.....మధ్యాహ్నం 12.00గంటల వరకు..మొత్తం ఓటర్లు: 63,114పోలైన ఓట్లు :19,306పురుషులు: 11,330స్త్రీలు :7,976ఓటింగ్ శాతం: 30.59%. విశాఖ..ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్ హాజరవుతున్న ఉపాధ్యాయులు..విశాఖ జిల్లాలో మొదటి నాలుగు గంటల్లో 44.4 శాతం పోలింగ్ నమోదు..టీడీపీ నేతల బరితెగింపు..కృష్ణాజిల్లా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల ప్రలోభాలుపోలింగ్ కేంద్రాల వద్దే బరితెగిస్తున్న టీడీపీ నేతలుఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ నేతలుపెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలుఓటు వేసేందుకు వెళ్తున్న గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తున్న అధికార పార్టీ నేతలుపోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హల్చల్..కృష్ణాజిల్లా..గుడివాడలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు హల్చల్.నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రమైన ఎస్పీఎస్ స్కూల్ ప్రధాన గేటు ముందు తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు.ఓటు వేసేందుకు వెళుతున్న పట్టభద్రులకు.. కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాము, నేతలు.టీడీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు.గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సీపీఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి.నిబంధన ప్రకారంగా నిర్దేశించిన దూరంలో ఉండాలంటూ టీడీపీ నేతలకు సూచించిన ఆర్డీఓ బాల సుబ్రమణ్యం.ఆర్డీవో వెళ్లిన తర్వాత తిరిగి గేటు వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు.విశాఖ.. 10 గంటల వరకు 21.66 శాతం పోలింగ్ నమోదు..విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ..పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు క్యూ కడుతున్న టీచర్స్...కొనసాగుతున్న 144 సెక్షన్పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్..ఉత్తరాంధ్ర జిల్లాలలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...మొత్తం ఓటర్లు 22,493 మంది...బరిలో 10 మంది అభ్యర్థులు...ఇప్పటివరకు 6% పోలింగ్ నమోదయింది...ఇప్పటి వరకు సమస్యత్మీక ప్రాంతాలు ఏవి గుర్తించలేదుసాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది...90 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నాం.. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.👉పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ 👉ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.👉ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు.👉ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
పోలింగ్ టైం.. నేడే 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం
నూజివీడు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో జరుగుతున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వాల్ క్లాక్లు, గిఫ్ట్ బాక్స్లు, ఇతర వస్తువులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గురువారం పోలింగ్ జరుగుతుండటంతో బుధవారం వీటిని పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంవ్యాప్తంగా బుధవారం ఓటర్లకు వాల్క్లాక్లు పంపిణీ చేశారు. బత్తులవారిగూడెంలోని నగరవనంలో ఉదయం సమావేశం నిర్వహించి, మండలాల వారీగా వాల్క్లాక్లను నాయకులకు అప్పగించి, వారి ద్వారా ఓటర్లకు అందజేశారు. ఈ వాల్క్లాక్లపై సీఎం చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి, అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ల ఫొటోలతో కూడిన స్టిక్కర్ అంటించి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా గిఫ్ట్లు పంపిణీ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు క్షేత్ర స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. దీంతో టీడీపీ నేతలు టీచర్లకు గిఫ్ట్బాక్సులు అందజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి చెందిన కొంతమంది వీటి పంపిణీ బాధ్యత తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంట్యాడ మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి కుటుంబానికి చెందిన రైస్ మిల్లు వద్ద నుంచే ఇతర ప్రాంతాలకు గిఫ్ట్బాక్స్లు పంపిస్తున్నారు. సీలేరులో మద్యం పట్టివేత సీలేరు (అల్లూరి జిల్లా): ఉత్తరాంధ్ర ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్న నేప«థ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. జీకే వీధి మండలం సీలేరులోని ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపారు. నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్ను లైవ్వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు తూర్పు–పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానానికి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవరా>్గనికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. -
Telangana: నేడు ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం జరిగే పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్రెడ్డి (పీఆర్టీయూ), అశోక్కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా... మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ), రవీందర్సింగ్(ఏఐఎఫ్బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్రెడ్డి (బీజేపీ), శ్రీపాల్రెడ్డి (పీఆర్టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 9 ఓట్లు.. 12 మంది సిబ్బందిఇది భీమారం ప్రభుత్వ పాఠశాల (జగిత్యాల జిల్లా)లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం. దీని పరిధిలోని కరీంనగర్– ఆదిలాబాద్–నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్కు సంబంధించి 9 మంది ఓటర్లే ఉండగా,పోలింగ్ కేంద్రం నిర్వహణకు 12 మంది సిబ్బంది, పోలీసులు నియమితులయ్యారు. చిత్రవిచిత్రాలు – రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రానికి ఒక వైపు ప్రహరీ లేదు. దీంతో టెంట్హౌస్ నుంచి పరదాలు తెప్పించి చాటు చేశారు. – జగిత్యాల జిల్లా కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగే కేంద్రం(ఉపాధ్యాయ, పట్టభద్రులు కలిపి)లో తొమ్మిది మంది ఓటర్లే ఉన్నారు. వీరికోసం పోలింగ్ సిబ్బంది ఎనిమిది మంది, మరో ఆరుగురు పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో పాలుపంచుకుంటున్నారు. – జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలోని పట్టభద్రుల ఓటర్లు 38 మంది ఉండగా, ఉపాధ్యాయ ఓటరుఒక్కరే ఉన్నారు. -
మాది భారత్.. కాంగ్రెస్ది పాక్ టీం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ భారత జట్టు.. ఎంఐఎంతో అంటకాగే కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్కు ఓటెయ్యాలి. బీసీ కులగణనకు మేం వ్యతిరేకం కాదు. కానీ అందులో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేసు కేసుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నా.. సీఎం కనీసం వారికి నోటీసులైనా ఇచ్చే సాహసం చేయడం లేదు..’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్పై దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి ⇒ ‘దూదేకుల కులాలకు రిజర్వేషన్లను మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే అడ్వకేట్ జనరల్ ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు విదేశాలకు పంపిస్తే..మేం పట్టుకురావాలా? మేం లిక్కర్ కేసులో కవితను జైల్లో వేశాం. ట్యాపింగ్ కేసులో మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి. దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తాం..’అని సంజయ్ అన్నారు. బీసీ సమాజాన్ని సీఎం అవమానించాడు ⇒ ‘పేదరికం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. ఆదాయాన్ని బట్టి కాదు. యూపీఏ పదేళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలిస్తే, పదేళ్లలో మోదీ 17.19 కోట్ల కొలువులిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరితే, తోకముడిచి పారిపోయారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ సీఎం బీసీ సమాజాన్ని అవమానించాడు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?..’అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఓడిపోతే ముక్కు నేలకు రాస్తారా? ఆరు గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని, సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీ అనుకుంటే తమకు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. ‘కాంగ్రెస్ పాలన బాగుందనుకుంటే మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?..’అని నిలదీశారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. -
బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు.. బీజేపీని బొంద పెట్టాలి
సాక్షి ప్రతినిధులు నిజామాబాద్/కరీంనగర్/మంచిర్యాల: ‘లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టలేని బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉప ఎన్నికలొస్తే గెలుస్తుందట. అధికారంలో ఉన్న పదేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితకు, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్కు మంత్రి పదవులిచ్చినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? బీఆర్ఎస్ది గతమే.. భవిష్యత్తు లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీని బొంద పెడితేనే.. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు వస్తాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించండంటున్న పట్టభద్రులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత తాము ఎవరికి ఓటేస్తరో పట్టభద్రులకు సమాధానం చెప్పాలి..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల నస్పూర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం, సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నిధుల కోసం ఢిల్లీ వెళ్లకుండా.. కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మాతో కలిసి రావాలి. కానీ చీకటి బేరాలు కుదుర్చుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని పెట్టలేదు. బండి సంజయ్ ద్వారా బేరాలు కుదుర్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు అభ్యర్థి లేకున్నా ఓడించాలంటున్నారంటే, దాని వెనుక మతలబు ఏంటో చెప్పాలి. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా.. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పకుందని ప్రజలు గమనించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, శ్రవణ్రావులను అమెరికాలో దాచిపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలి. ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్ కాగితాలను ఈడీ పట్టుకుపోయింది. కేటీఆర్, హరీశ్రావు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకోగానే బండి సంజయ్ కేసులు నీరు గారుస్తున్నారు..’ అని సీఎం మండిపడ్డారు. కుల గణన సర్వే మోదీ ఎందుకు చేయలేదు? ‘కులగణనపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వీధినాటకాలు అడుతున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఉపకులాలకు రిజర్వేషన్లు అమలవుతున్న మాట వాస్తవం కాదా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేని బీజేపీవి చావు తెలివితేటలు. మతం పేరుతో ప్రతిసారీ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరూ నమ్మరు. కులగణన సర్వేను మోదీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు వండిన అన్నంలో ఉప్పు వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బలహీనవర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోంది. మేము వందేళ్ల సమస్యను పరిష్కరించాం. మంద కృష్ణమాదిగను కౌగిలించుకున్న మోదీ సమస్య పరిష్కరించలేదు. మా ప్రభుత్వమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది. 100 ఏళ్ల కింద తెల్లోళ్లు చేసిన తరువాత నేను కులగణన చేసి లెక్క తేల్చిన ఘనత నాది. నా లెక్కలు తప్పయితే మేమంతా ముక్కు భూమికి రాస్తాం. బీజేపీకి దమ్ముంటే..జనగణనలో కులగణనలో చేయాలి..’ అని రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణకు శకునిలా కిషన్రెడ్డి ‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు శకునిలా మారాడు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు ఇతర ప్రాజెక్టులకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నాడు. కాశీలో గంగ, ఢిల్లీలో యమున, గుజరాత్లో సబర్మతి నదులను ప్రక్షాళన చేస్తున్న బీజేపీ హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనకు మాత్రం అడ్డుపడుతోంది..’ అని ముఖ్యమంత్రి విమర్శించారు. మేము చేసిన మంచిని చూసి ఓటేయండి ‘పదేళ్లు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ చేయలేని పనిని మేం చేశాం. ఏడాదిలో 56 వేల కొలువులు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలతో బాధలు దూరం చేశాం. యువతలో నైపుణ్యం పెంచాలన్న సంకల్పంతో ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్స్ వర్సిటీ ప్రారంభించాం. వరికి రూ.500 బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం. మేము చెప్పేవి అబద్ధాలైతే మాకు ఓటేయొద్దు. భావోద్వేగాలకు, అబద్ధాలకు ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు. మేము చేసిన మంచిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించండి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు, శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, అభ్యర్థి నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నగారా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు గాను మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే నెల 20న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. మార్చి 24 లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని తెలిపింది. తెలంగాణలో మండలి ఎన్నికల సందడిసాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల కోటా స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మరోవైపు శానసమండలిలో ఎమ్మెల్యేల కోటాలో వచ్చే నెల 29న ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి సోమవారం షెడ్యూల్ విడుదలైంది. 40 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో రాష్టంలో రాజకీయ సందడి జోరందుకుంది. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ప్రచారం జరుగుతోంది. మంగళవారం చివరిరోజు కావడంతో పార్టీలు ఆఖరి నిమిషంలో చేయాల్సిన ప్రయత్నాలతో పాటు, పోలింగ్కు అవసరమైన సన్నద్ధత, ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వర్గాలో చర్చ జరుగుతోంది. రిటైరవుతున్నది వీరే.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కు 65, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ మూడు స్థానాలను సునాయాసంగా దక్కించుకునే అవకాశముంది. మరోవైపు బీఆర్ఎస్లో కొనసాగుతున్న 28 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ పదవి కచి్చతంగా దక్కుతుంది. ఐదో ఎమ్మెల్సీ పదవి ఎన్నికలో బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారనున్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ను దక్కించుకున్న ఎంఐఎం ప్రస్తుతం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఈ ముగ్గురు.. శాసనమండలిలో మార్చి 29న ఉపాధ్యాయ కోటాలో ‘మెదక్ –ఆదిలాబాద్– నిజామాబాద్ –కరీంనగర్’ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి (పీఆర్టీయూ), ‘వరంగల్– ఖమ్మం –నల్లగొండ’ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (స్వతంత్ర), పట్టభద్రుల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి (మెదక్– నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్) రిటైర్ అవుతున్నారు. ఈ మూడు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’పట్టభద్రుల స్థానంలో 56 మంది, ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’ఉపాధ్యా య స్థానంలో 15, ‘వరంగల్ –ఖమ్మం– నల్లగొండ’ఉపాధ్యాయ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల కోటా స్థానంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉండగా, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఆగస్టులో మరొకటి ఖాళీ హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ఆగస్టు 6న పూర్తవుతోంది. బీఆర్ఎస్ నుంచి మండలికి ఎన్నికైన ప్రభాకర్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్న వచ్చే ఏడాది నవంబర్లో రిటైర్ అవుతారు. మండలిలో స్థానిక సంస్థల కోటాలో 14 మంది సభ్యులకు గాను 2028లో ఏకంగా 12 మంది పదవీ కాలం పూర్తవుతుంది. మొత్తంగా 2027లో 9, 2028లో 14 మంది, 2029లో ఐదుగురు, 2030లో ఇద్దరేసి ఎమ్మెల్సీల చొప్పున రిటైర్ అవుతారు. ప్రస్తుతమున్న మండలి సభ్యుల్లో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన అమేర్ అలీఖాన్ (కాంగ్రెస్), ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) ఆరేళ్ల పదవీ కాలం 2030లో పూర్తి చేసుకుంటారు. -
గ్రాడ్యుయేట్లను నమ్మలేం.. టీచర్లను ‘చూడండి’
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి.. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు. టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ‘ఒక ఎగ్జామ్ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. -
‘సూటిగా కేసీఆర్ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ, చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు 1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు. మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్ మండిపడ్డారు. -
మళ్లీ గట్టు దాటి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే.. అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్ నిలదీశారు... రాహుల్ గాంధీ స్పిరిట్తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ల పదవీకాలం ముగియనుంది. ఏపీలో పదవీకాలం ముగిసే వారిలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.ఎన్నికల సంఘం మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 10 నామినేషన్ల ప్రక్రియ,మార్చి 11 నామినేషన్ల పరిశీలన,మార్చి 13 నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. మార్చి 20న పోలింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది. -
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముఖ్యమంత్రి రేవంత్ నీ పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవి అంటూ చెప్పుకొచ్చారు.నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తుమ్మితే ఊడిపోయే ముక్కులా తెలంగాణ, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేవంత్ నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. 14 నెలలుగా విద్యార్థుల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల వరకు రేవంత్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతోంది.రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ గత చరిత్రలా మిగిలిపోయింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటూ అభ్యర్థినే నిలబెట్టలేకపోయింది. సమస్యలపై బరిగీసి కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే.సంఘాల పేరుతో పోటీ చేస్తున్న వ్యక్తులకు రేవంత్తో పోట్లాడే దమ్ముందా అనేది ఆలోచించుకోవాలి. 317 జీవోపై పోరాడి జైలుకు పోయింది బీజేపీ నేతలు మాత్రమే. ఆనాడు ఏ ఒక్క టీచర్ ఎమ్మెల్సీ కూడా దీనిపై మాట్లాడలేదు. పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రేవంత్ పాలనపై పట్టులేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాయి. కేసీఆర్ చిప్పచేతికి ఇస్తే దాని పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
దొంగ ఓట్లతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ అడ్డదారులను తొక్కుతోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ప్రలోభాలు, అడ్డగోలు వ్యవహరాలకు తెగిస్తోంది. ఉమ్మడి కష్ణా–గుంటూరు, తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. విద్యావంతులకు సంబంధించిన ఈ ఎన్నికను సైతం పూర్తి రాజకీయమయం చేసి ఆ స్థానాలను దక్కించుకునేందుకు బరితెగిస్తోంది. నిజానికి.. ఆ రెండు సీట్లూ విద్యావంతులు, మేధావుల వేదికగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థుల సిట్టింగ్ స్థానాలు. కష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీగా విద్యావేత్త కేఎస్ లక్ష్మణరావు నాలుగోసారి పోటీలో ఉన్నారు. తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పదవీకాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో పీడీఎఫ్ తరఫున దిడ్ల వీరరాఘవరావును పోటీకి దింపారు. ఈ పోటీకి వైఎస్సార్సీపీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో టీడీపీ ఇదే అదనుగా ఆ రెండు స్థానాలను అధికార బలంతో ఎలాగైనా చేజిక్కించుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కేఎస్ లక్ష్మణరావుకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ మాజీమంత్రి ఆలపాటి రాజా.. వీరరాఘవరావుకు పోటీగా కాకినాడ రూరల్ సీటు ఆశించి పొందలేకపోయిన పేరాబత్తుల రాజశేఖర్ను రంగంలోకి దించారు. శిబిరాలు పెట్టి ఓట్లు చేర్పించిన టీడీపీఎన్డీయే అభ్యర్థులుగా ప్రకటించిన వారి కోసం టీడీపీ నేతలు నాలుగు నెలలుగా నిబంధనలు మీరి పనిచేస్తున్నారు. మొదట నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ వీధివిధినా శిబిరాలు పెట్టి మరీ అడ్డగోలుగా ఓటర్లను చేర్పించారు. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు టార్గెట్లు పెట్టి నియోజకవర్గాల వారీగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లను చేర్పించారు. ఈ టార్గెట్లు అందుకోలేకపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నేరుగా తిట్టిన సందర్భాలున్నాయి. టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, స్నేహితులు, సానుభూతిపరులు.. ఇలా ఎవరిని పడితే వారిని పెద్దఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లుగా చేర్పించారు. ఒకరి పేరుతోనే పదుల సంఖ్య ఓట్లను చేర్చి దొంగ ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. మరోవైపు.. ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు స్థానిక నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల నేతత్వంలో కులాలు, వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టి ప్రలోభాలకు గురిచేశారు. అలాగే, ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారంటూ ప్రతిరోజూ ఓటర్లకు వరుసగా ఐవీఆర్ఎస్ ఫోన్లు చేస్తున్నారు. చాపకింద నీరులా ‘పీడీఎఫ్’ ప్రచారం..మరోవైపు.. పీడీఎఫ్ అభ్యర్థులు లక్ష్మణరావు, వీరరాఘవరావు మాత్రం విద్యార్థులు, ఉద్యోగుల కోసం తాము చేసిన పోరాటాలు, వారి సమస్యలను ప్రస్తావిస్తూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలు, తటస్థులు, మేధావులు సైతం వీరికి మద్దతు పలుకుతున్నారు. కానీ, అధికారం అండ చూసుకుని దొంగ ఓట్లతో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోంది.ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లుఈ క్రమంలో.. చాలాచోట్ల ఎన్డీయే అభ్యర్థులు చేర్పించిన దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. కష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లు జాబితాలో దర్శనమివ్వడం విశేషం. గురజ ప్రకాష్రాజ్ అనే వ్యక్తి పేరు పక్కన ఇంటి పేర్లు, తండ్రి పేర్లు మార్చి ఇష్టారాజ్యంగా ఓట్లు చేర్పించేశారు.అలాగే, తాడిగడపకు చెందిన చందు రాజారావు పేరుతో నాలుగు ఓట్లు చేర్పించారు. ఇలా ప్రతిచోటా టీడీపీ శ్రేణులు వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించాయి. ఇంటి పేర్లు, అడ్రస్లు మార్చి ఒకే వ్యక్తి పేరుతో తప్పుడు ఓట్లు నమోదు చేయించాయి. పోలింగ్ రోజున ఆ ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా వేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. -
‘జిల్లాకు సంబంధం లేనివాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదు’
కరీంనగర్ జిల్లా: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్క్షప్తి చేశారు. 27వ తేదీన జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో పొన్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాకు సంబంధం లేని వాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదని, వారి మాటలు నమ్మవద్దని పొన్నం పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున ఎస్సారార్ కళాశాలలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఉంటుందని ఈ సందర్బంగా పొన్నం తెలియజేశారు.‘మా పెళ్లి అక్కడే ఐందన్నవాళ్లు గానీ, హిందువులమని చెప్పుకున్నవాళ్లుగానీ పట్టోంచుకోకపోతే మేం వేములవాడ అభివృద్ధి చేస్తున్నాం. అలాగే మిడ్ మానేరు నిర్వాసితులకు గత సర్కార్ పట్టించుకోకపోతే మేమే వారి పరిహారం చెల్లించాం. శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను తీసుకురావడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం . ఇప్పటికే మేం 50 శాతంతో ముందున్నాం, కరీంనగర్ లో కూడా కలుపుకుని మొత్తం 65 శాతంకు పైగా మెజార్టీ సాధిస్తామనే నమ్మకం మాకుంది. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, బండి సంజయ్ ఈ ఆరేళ్లల్లో కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చారో చెప్పాక ఓట్లు అడగండి. నేను ఫలానా చేశాను ఎంపీగా అని చెప్పగలను. రిజర్వేషన్లకు సంబంధించి చట్టం విషయంలో కేంద్రంలో చట్టబద్ధత కల్పించకపోతే వెంటపడతామంటూ సంజయ్ ను హెచ్చరిస్తున్నా. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ, పట్టభద్రుల దగ్గర ఆ పప్పులుడకవు. గుజరాత్ లో పదిశాతం ఈబీసీలకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్లు కల్పించారో ముందు సంజయ్ చెప్పాలి. బీసీ కులగణనపై చర్చకు మేం సిద్ధమంటూ బండి సంజయ్ కి ప్రతి సవాల్ విసురుతున్నా., ఎల్అర్ఎస్ పై ఎన్నికల ముందు చెప్పినా.. తెలంగాణాలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో నిర్ణయాల్లో మార్పు ఉండవచ్చు’ అని పొన్నం తెలిపారు. -
కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు
సాక్షి, అమరావతి: సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా వ్యవహరించడంతో శాసనసభ నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు ఎమ్మెల్యేల శిక్షణ తరగతులంటూ హడావుడి చేశారు. లోక్సభ స్పీకర్ను కూడా ఆహ్వానించారు. లోక్సభ స్పీకర్ కార్యాలయ అధికారులు అమరావతి వచ్చి చూసి.. ఇచ్చిన నివేదికతో లోక్సభ స్పీకర్ తాను రానని తేల్చి చెప్పడం, ఎమ్మెల్సీ ఎన్నికలుండటంతో సమావేశాలను రద్దు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అసెంబ్లీ వ్యవహారాలు చూసే పెద్దలు ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రెండో రోజు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడునూ ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు, అతిథులకు పెట్టాల్సిన భోజనాలు, బస, బహుమతులు, నిర్వహణ వంటి వాటి కోసం అసెంబ్లీ అధికారులతో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పలు హోటళ్లలో గదులను బుక్ చేశాయి. అతిథుల కోసం మెమెంటోలు, శాలువాలు, బహుమతులనూ కొనుగోలు చేశాయి. చివరికి నిబంధనలను పక్కనపెట్టి మరీ అసెంబ్లీ సభా మందిరంలోనే అతిథులు కూర్చునేందుకు వేదికను ని ర్మించారు. చివరి నిమిషంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిసింది. నిజానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకరించారు. లోక్సభ స్పీకర్ కార్యాలయం అధికారులు వచ్చి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. అమరావతి అంటే అక్కడ నాలుగైదు భవనాలు తప్ప ఏమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో లోక్సభ స్పీకర్.. తాను రాలేనని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. శిక్షణకు ఇదా సమయం! మరోవైపు ఈ నెల 27వ తేదీన కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో సగం మంది ఎమ్మెల్యేలు ఆ పనిలో ఉన్నారు. వారికి టీడీపీ అధిష్టానం ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మరికొందరు ఎమ్మెల్యేలనూ ఆ ఎన్నికలకు ఇన్చార్జిలుగా నియమించి పర్యవేక్షణ చేయిస్తోంది. ఈ పరిస్థితుల్లో 22, 23 తేదీల్లో శిక్షణ తరగతులకు హాజరవడం ఎలా కుదురుతుందని వారి నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. అలాగే 28న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఆ హడావుడిలో శిక్షణ ఎలా సాధ్యమని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయినా ఎన్నికలు ముగిసిన 8 నెలల తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వ ముఖ్యులు ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయించినట్లు తెలిసింది. లోక్సభ స్పీకర్ రాకుంటే పరువు పోతుందనే ప్రధాన కారణం వాయిదా వెనుక ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేదికను తొలగించేశారు. మిగిలిన ఏర్పాట్లనూ నిలుపుదల చేశారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. -
ఎల్ఆర్ఎస్ పేరుతో 50కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. -
పకడ్బందీ వ్యూహాలతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ నేతలు, కేడర్ను సిద్ధం చేస్తోంది. కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలపై వరుసగా రెండోరోజు గురువారం కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీగా ప్రచార వ్యూహం రూపొందించుకోవాలని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించాలని సూచించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని, ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వారిని పోలింగ్ బూత్కు తీసుకెళ్లి ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులకు విస్తృతంగా ప్రచారం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు.ప్రతి ఓటూ కీలకమే..: మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా సీరియస్గా తీసుకోవాలని, ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రతి ఓటు చాలా కీలకమైందని సీఎం చెప్పారు. ఓటర్ మ్యాపింగ్ చేయడం, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవని, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు. గాంధీభవన్లో కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
మనం చేసినవన్నీ యువతకు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతల జూమ్ మీటింగ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయాలను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలామంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మీనాక్షి చెప్పారు. -
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం(జనవరి31) ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది.కాగా, తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
TG: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అందరికంటే ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీకాలం ఈ మార్చితో పూర్తి కానుంది. ఈ క్రమంలో.. ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ముసాయిదాను సిద్ధం చేసింది. మరోవైపు.. రెండుసార్లు అవకాశం కల్పించినా ఓటర్ నమోదుకు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో.. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.పోటాపోటీగా ప్రచారం ఈ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి అభ్యర్థులంతా పోటాపోటీగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కలియ తిరుగుతూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకోవడంలో చివరి వరకు బిజీగానే ఉన్నారు. ఈ స్థానానికి గురువారం జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో తరలి వెళ్లారు. రెండు డివిజన్ల పరిధిలో 21 మండలాలలో 22 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లు 1,970, మహిళా ఓటర్లు 1,448 మంది. మొత్తం 3,418 మంది ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జేఎన్టీయూ కాకినాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూకే రీడింగ్ రూమ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్ నిర్వహిస్తారు, జేఎన్టీయూకేలోని రీడింగ్ హాలులో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారులుగా డీఆర్ఓ జె.వెంకట్రావు, టి.సీతారామమూర్తి, వి.విశ్వేశ్వరరావు, వి.మదన్మోహన్, ఎం.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది. -
రిజిస్ట్రేషన్కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
ప్రజాస్వామ్యం బతికుందా?
-
అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యతనీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం -
తూర్పు గోదావరి టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ గోల
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాటకు తెరతీసింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ) పదవీ కాలం ముగియడంతో ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఐవీని ప్రజా సంఘాలన్నీ ఏకమై ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో గెలిపించుకున్నాయి. పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ఓటర్లు అభిలషిస్తుంటారు. కానీ టీడీపీ ఈ ఎన్నికల్లోనూ తమ వారినే బరిలోకి దింపడానికి సిద్ధమైంది. దీంతో మూడు సామాజికవర్గాల నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ నేతలు రేసులోకి వచ్చారు. కాకినాడ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుత్తెనదీవికి చెందిన ఐ.పోలవరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ఈ రేసులో ఉన్నారు. వీరు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఒకరిని ఒకరు అడ్డుకొంటూ టిక్కెట్ దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి టిక్కెట్ దక్కకుండా వ్యతిరేక వర్గాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో పెద్ద రగడే జరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ మరికొందరు కూడా రేసులోకి రావొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.చాన్స్ ఇవ్వాల్సిందేనంటున్న సత్తిబాబుబీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు మాటకు కట్టుబడి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కూటమికి త్యాగం చేశామని, పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని బాబు ఇచ్చిన హామీపై నమ్మకంతోనే కూటమి విజయానికి పనిచేశామని సత్తిబాబు వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వకపోతే లేదంటే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.తమకే కావాలంటున్న కాపు సామాజికవర్గంకోనసీమ జిల్లా నుంచి బీసీ సామాజికవర్గంలో వాసంశెట్టి సుభాష్కు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంతో పట్టభద్రుల స్థానాన్ని పేరాబత్తుల రాజశేఖర్కు ఇవ్వాలని కాపు సామాజికవర్గం పట్టుబడుతోంది. ఆ వర్గం నేతలు ఇటీవల చంద్రబాబును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానం ఆశించారని, అధిష్టానం సూచనలతో జెడ్పీ చైర్మన్ సీటునూ వదులుకున్నామని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రచార కార్య్రకమాలకు సమన్వయకర్తగా కష్టపడ్డ రాజశేఖర్కు అవకాశం ఇవ్వకపోతే అంగీకరించేది లేదని అంటున్నారు.జవహర్ను వ్యతిరేకిస్తున్న అచ్చిబాబు వర్గంతూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి జవహర్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కొవ్వూరు స్థానాన్ని ఆశించిన జవహర్కు చంద్రబాబు సామాజికవర్గం మోకాలడ్డటంతో సీటు దక్క లేదు. ఇప్పుడు మండలికి అవకాశం కల్పించాలని చంద్రబాబును ఎస్సీ సామాజికవర్గం కోరుతోంది. అయితే, జవహర్ను టీడీపీలోని మరో కీలక నాయకుడు పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు అడ్డుకొంటున్నారు. అచ్చిబాబు వర్గం మంత్రి లోకేశ్ను ఆశ్రయించి జవహర్కు అవకాశం దక్కకుండా చేసే పనిలో ఉంది. చంద్రబాబు వద్ద జవహర్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఈ వర్గంలోని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ రేసులో ఆశావహులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులతోపాటు స్వతంత్రులు రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే బరిలో నిలవనున్న అభ్యర్థులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.సెప్టెంబరులో పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ప్రారంభంకానుంది. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరినీ బరిలోకి దించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్రెడ్డి గెలుపొందారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది స్థా నాలు గెలుచుకోవడంతో ఎలాగైనా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి కై వసం చేసుకోవాలని వ్యూహరచనలో మునిగింది.కాంగ్రెస్ నుంచి ముగ్గురి పేర్లు⇒ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత ఎమ్మెస్సార్ మనవడు మేన్నేని రోహిత్రావు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన సబ్బని వెంకట్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.⇒ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు తనకు 15 రోజులు ముందు టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో ఓటర్లందరినీ కలుసుకోలేకపోయానని తనకు ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో తన తండ్రి వెలిచాల జగపతిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తనకు టికెట్ కేటాయిస్తే విజయం ఖాయమని అధిష్టానం వద్ద విన్నవించుకున్నట్లు వినికిడి.⇒ దివంగత సీనియర్ నేత ఎమ్మెస్సార్ మనవడు రోహిత్రావు తనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని, తాత చేసిన సేవలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం.⇒ హుజూరాబాద్కు చెందిన సబ్బని వెంకట్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ తనకు కాకుండా వొడితెల ప్రణవ్కు కేటాయిస్తే చిత్తశుద్ధితో పనిచేశానని తన పేరును ఎమ్మెల్సీ టికెట్ కోసం పరిశీలించాలని అధిష్టానం వద్ద ఇప్పటికే విన్నవించుకోవడం తెలిసిందే.బీజేపీ నుంచి వీరే.. భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఓటమిపాలైన జి.రాణిరుద్రమదేవితోపాటు ఆ పార్టీ సీనియర్నేత, న్యాయవాది పొల్సాని సుగుణాకర్రావు పార్టీ అభ్యర్థిత్వం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విస్తృతమైన సంబంధాలతోపాటు పాత, కొత్త కలయికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే పథకాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయని సుగుణాకర్రావు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. రాణిరుద్రమదేవి తనదైన శైలిలో టికెట్ కోసం ప్రయత్నాలతోపాటు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.బరిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతఅల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైతే ప్రధాన పార్టీల అభ్యర్థిత్వం, లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్రోల్మెంట్ ప్రక్రియతోపాటు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు జిల్లాల పరిధిలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు విస్తరించి ఉండడంతోపాటు వేలాది మంది విద్యార్థులను, పట్టభద్రులతో ఉన్న సంబంధాలు తన విజయానికి సోపానంగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. 2019లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా రాకపోవడంతో విరమించుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టాలనే నరేందర్రెడ్డి అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.బీఆర్ఎస్లో భారీ పోటీమాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, బీఎన్ రావు, యాదగిరి శేఖర్రావు తదితరులు మరోసారి గులాబీ సత్తా చాటేందుకు వ్యూహరచనలో మునిగితేలుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసేందుకు ముందుకొస్తున్న ఆశావహులు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటూ అనుచరగణంతో మంతనాలు సాగిస్తున్నారు. -
ఈవీఎంలు లేవు.. కూటమి ఢమాల్
-
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..
-
ఎమ్మెల్సీగా బొత్స.. 16న అధికారికంగా ప్రకటన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక దాదాపు ఖరారైంది. స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ రోజు బొత్స సత్యనారాయణ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.పూర్తయిన నామినేషన్ల పరిశీలనబుధవారం ఉదయం నామినేషన్ల పరిశీలన జరిగింది. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కె.మయూర్ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బొత్స సత్యనారాయణ ఎన్నికల ఏజెంట్ మణికంఠ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. అభ్యర్థికి ప్రతిపాదన చేసిన ఓటర్లు, ఇతర పత్రాలను క్షుణంగా పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత 2 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్టు ఆర్వో మయూర్ అశోక్ ప్రకటించారు. ఆ తర్వాత షఫీ ఉల్లా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు ఆర్వో మయూర్ అశోక్కు లేఖ అందజేశారు.పోటీకి భయపడ్డ కూటమిఓటమి భయంతో కూటమి పోటీ నుంచి తప్పుకుంది. బలం లేకపోయినా పోటీ చేయడానికి చివరి వరకు టీడీపీ ప్రయత్నం చేసింది. పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. దీంతో పోటీకి వెనకడుగు వేశారు. -
ఒక్కటిగా నిలబడ్డాం.. అందుకే బాబు తలవంచారు: వైఎస్ జగన్
నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపే ఉంటాడు. కానీ ధర్మం, న్యాయం గెలిచింది. మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి ఆయన ఆటలు సాగలేదు. సంఖ్యా బలం లేనప్పుడు పోటీ పెడతాననడమే తప్పు. అలా చేయడం ఆయన నైజం. ఆ మనిషి అలా చేసినా కూడా వైఎస్సార్సీపీ నాయకులు అందరూ ఒకే తాటిమీద విలువలు, విశ్వసనీయతతో నిలబడటం వల్లే ఆ మనిషి తల వంచారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మనమంతా ఏకమై ఎప్పుడైతే యుద్ధం చేయడం ప్రారంభించామో.. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించిందో అప్పుడు చంద్రబాబు వెన్నులో భయం ప్రారంభమైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకే ఎన్నికలో పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన చేశారని చెప్పారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ‘గత ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజా ప్రతినిధులుగా మీరంతా చూసే ఉంటారు. ఎన్నికల్లో ఈ మాదిరి ఫలితాలు రావడానికి కారణం పది శాతం ఓటర్లు చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వైపు మొగ్గు చూపారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలతో మోస పూరితమైన ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు’ అని చెప్పారు. ఇప్పడు ప్రతి ఇంట్లోనూ జగన్ ఉండి ఉంటే.. అన్న విషయంపై చర్చ జరుగుతోందన్నారు. ‘జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశ చూపాడని అంటున్నారు. చివరకు పలావు పోయింది. బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు రాకపోగా, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మనం ఏ సాకూ చూపలేదు » ఇవాళ ఏ సమస్య లేకపోయినా చంద్రబాబు ఎన్నో సమస్యలున్నట్టు చిత్రీకరిస్తున్నాడు. నిజానికి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు. ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పులు.. ఆ అప్పుల మీద వడ్డీలు.. వాటికి తోడు కోవిడ్ మహమ్మారి.. ఇలా మన పరిపాలన కాలంలో సమస్యలు తాండవించాయి. ఆ సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినా, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినా మనం ఎలాంటి సాకులు చూపలేదు. ఎటుంటి కారణాలు చెప్పలేదు. శ్వేతపత్రాలు అని చెప్పడమో.. గత ప్రభుత్వాల మీద నిందలు మోపడమో చేసి.. ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఎప్పుడూ చూపించలేదు.» ఎన్ని కష్టాలున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఇంటికి మంచి చేస్తూ.. ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తామని.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్లో ఒక కేలండర్ విడుదల చేసి.. బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ నేరుగా డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిది. దేవుని దయతో ఇవన్నీ చేయగలిగాం. అందుకే ఈ రోజు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి సగర్వంగా తలెత్తుకుని పోగలుగుతాడు. అక్కా, అన్నా మా ప్రభుత్వంలో ఇది చెప్పాం.. చెప్పింది తూ.చా. తప్పకుండా ప్రతి ఒక్కటీ అమలు చేశామని చెప్పగలుగుతారు.ఇప్పటికే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత » రెండున్నర నెలల చంద్రబాబు పాలన చూశాం. ఇంతలోనే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంత వేగంగా పుట్టడం మొట్ట మొదటిసారి చూస్తున్నాం. ఇవాళ జగనే ఉండి ఉంటే.. అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది. వైఎస్సార్సీపీ ఉండి ఉంటే.. ప్రతి తల్లికి అమ్మఒడి వచ్చేది. ప్రతి రైతన్నకు రైతుభరోసా సొమ్ము వచ్చి ఉండేది. 2023–24 ఖరీఫ్కు సంబంధించి ఇన్సూ్యరెన్స్ సొమ్ము కూడా వచ్చి ఉండేది. » విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ప్రతి త్రైమాసికం అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితులు గతంలో ఉంటే.. ఇప్పుడు రెండు త్రైమాసికాలు అయిపోయినా డబ్బులు ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. పొదుపు సంఘంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు మామూలుగా ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యేవి. అవి కూడా పడలేదు. » నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా లేదు. వాహన మిత్ర కూడా లేదు. ఎక్కడా ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా సాఫీగా అన్నీ జమ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కరికీ ఒక మేలు జరగకపోగా.. అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. అంతా అస్తవ్యస్తం » విద్యా రంగంలో టోఫెల్ అనే సబ్జెక్టు పీరియడ్గా ఉండేది. దాన్ని ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం, రోజుకొక మెనూతో గోరుముద్ద.. పాఠశాల పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయింది. డిసెంబర్లో పిల్లలకిచ్చే ట్యాబుల పరిస్థితి ప్రశ్నార్థకం అయింది. » ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,800 కోట్లు దాటాయి. మార్చిలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి జనవరి నుంచి ఉన్న రూ.1,800 కోట్ల బకాయిలు ఆపేశారు. ఇవాల్టికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఏ ఆసుపత్రిలోనూ డాక్టర్ల కొరత ఉండకూడదన్న పరిస్థితి నుంచి, ఈ రోజు ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? అన్న పరిస్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు వెళ్లిపోయాయి. ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు. 108, 104 బిల్లులు లేవు. ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, పరిశుభ్రత అన్నది లేనే లేని పరిస్థితి.» రైతులు విత్తనాల కోసం మళ్లీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రీ ఇన్సూరెన్స్ పోయింది. ఈ–క్రాప్ పోయింది. ఉచిత పంటల బీమాను కూడా పక్కన పెట్టేశారు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవ్వాతాతల పెన్షన్ నుంచి, బియ్యం వరకు ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. ఇప్పుడు అంతా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ.. జన్మభూమి కమిటీలంటూ నాయకులు ఎక్కడున్నారని వాళ్ల దగ్గరకు ప్రజలు వెళ్లాల్సిన దుస్థితిలో ఇవాళ పాలన సాగుతోంది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన » రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తి అధ్వానంగా మారింది. రెడ్బుక్ పాలన సాగుతోంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదన్నది పక్కన పెట్టి.. గ్రామ స్థాయిలోనే వాటిని ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి.. పోలీసులను మేం చూసుకుంటాం.. అని రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. దిశ యాప్ ఏమైందో కూడా అర్థం కావడం లేదు. ఇవన్నీ కేవలం రెండున్నర నెలల్లోనే మన కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు. » ఎక్కడా అబద్ధాలు, మోసాలు లేకుండా ప్రజలకు మనం మంచి చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడు. ఇచ్చిన ఏ మాట నెరవేర్చనప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న భావవ నుంచి కోపం పుడుతుంది. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.మన వ్యక్తిత్వమే మనకు రక్ష» ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టే ఉండదు. చీకటి వచ్చిన తర్వాత మళ్లీ పగలు రాక తప్పదు. కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. 16 నెలలు నన్నే జైల్లో పెట్టారు. కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. రానున్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్లి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఉండదు. » ఎందుకంటే వాళ్లు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు కాబట్టి ప్రజలు వాళ్లను నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అదే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తే చెప్పిందే చేశారని దండలు వేసే పరిస్థితి వస్తుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ మీకు, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. -
విజయం వైఎస్సార్సీపీదే.. విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగీవ్రమైంది.కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.ఇదిలా ఉండగా.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. -
టీడీపీ అవుట్!.. బొత్స విజయం ఖాయం
-
మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్కు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు. యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందిదీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుందిగత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారుప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారుమన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదుప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందిమేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాంచంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడుమన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయివాటికి వడ్డీలు కూడా ఉన్నాయివీటికితోడు కోవిడ్లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయిఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదుశ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదుకోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదుఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాంఐదేళ్లపాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించాంపథకాలను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాందేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాంప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడుచెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడుఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదురెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోందిప్రతి ఇంట్లో కూడా.. జగనే ఉండి ఉంటే.., వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోందిఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్మెంట్నేరుగా ఖాతాల్లో పడేదివసతి దీవెన కూడా అందేదిపొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదుపథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవిఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారుస్కూళ్లలో టోఫెల్ పీరియడ్ను ఎత్తివేశారు ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదుమధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యిందిడిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టేఇప్పుడు ఆర్డర్కూడా ఇవ్వలేదు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందిఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటిందిప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాంఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోందిఆరోగ్య ఆసరా ఊసే లేదుమందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదుఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదురైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్ పక్కనపడేశారుఉచిత పంటల బీమాను వదిలేశారుబియ్యం డోర్ డెలివరీ లేదుతెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది రెడ్ బుక్ పాలన కొనసాగుతోందిగ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారుమీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారుదిశ యాప్ ఏమైందో తెలియడంలేదుదిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారుఅన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయిఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాంఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండిచంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుకష్టాలు లేకుండా సృష్టే ఉంటుందిచీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుందిరాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుందినన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాంమన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడుచంద్రబాబు సహజ నైజం ఇది కాదుఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడునీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడుఅందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడుఅలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడుకాని ధర్మం, న్యాయం గెలిచిందిమీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదుసంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పుకాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది. భీమిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయానికి పాతరవేయాలని చూశారుఅదే అజెండాతో యుద్ధంచేయాలని చూశారుకాని మనం అంతా ఐకమత్యంగా ఉన్నాంప్రలోభాలకు లోనుకాకుండా మీరంతా గట్టిగా నిలబడ్డారుచివరకు అధర్మ రాజకీయాలు చేయాలనుకునేవాళ్లు తలొగ్గారు:సహజంగా పోటీపెట్టాలనే ఆలోచనకూడా వాళ్లకి రాకూడదుమనకు అంత మెజార్టీ ఉందిపార్టీ సింబల్మీద జరిగిన ఎన్నికల్లో వీళ్లంతా గెలిచారుపోలీసులను పెట్టి బెదిరించాలని చూశారుఏకంగా సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారుమొన్న జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ అబద్ధాలు చెప్పారు:నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు, రైతు కనిపిస్తే నీకు రూ.20వేలు అంటూ మోసపూరితమైన క్యాంపెయిన్ చేశారుచంద్రబాబు చెప్పిన అబద్ధాలకు కొంతమంది ఆశపడ్డారని అనిపిస్తుందిఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారుఐదేళ్ల పాలనలో మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదుఇవ్వాళ్టికీ మన కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతారు:చంద్రబాబు అప్పుల భారాన్ని, వడ్డీలభారాన్ని మనంకూడా మోసాంకరోనా లాంటి మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆదాయాలు పెరిగిపోయాయిఖర్చులు కూడా పెరిగిపోయాయికాని శ్వేతపత్రాల పేరుతో సాకులు చెప్పలేదు చంద్రబాబు అప్పులుగురించి, ఆ అప్పులు వడ్డీల గురించి మనం ఏరోజూ చెప్పలేదుమేనిఫెస్టోలో మనం చేసిన ప్రతి మాటనూ అమలు చేశాంచంద్రబాబులా చెత్తబుట్టలో వేయలేదుదేశచరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి అమలు చేశాంపథకాలను నేరుగా డోర్డెలివరీ చేశాంఇప్పడు ఏ ఇంట్లో చర్చ జరిగినా.. జగన్ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోందిజగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశచూపాడని అంటున్నారుచివరకు పలావు పోయింది, బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందిజగనే ఉండి.. ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి.. ఉంటే.. అన్న చర్చ జరుగుతోందిటీడీపీ వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయిప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్ నేరుగా ఇంటికే అందేదిఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నదీ ప్రజలంతా చూస్తున్నారుకక్ష తీర్చుకోండి… పోలీసులు మీకు అండగా ఉంటారని టీడీపీ నాయకులు బాహాటంగా చెప్తోందిరెడ్బుక్ పాలన కనిపిస్తోందిప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితిలా అండ్ ఆర్డర్ నుంచి గవర్ననెన్స్, ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యారంగం… ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతోందిమరో మూడు నెలల్లో టీడీపీ కార్యకర్త ఏ గడపకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుందిప్రతి కుటుంబం కూడా టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుందినువ్వు చెప్పింది ఏంటి.. ఇప్పుడు జరుగుతన్నది ఏంటని అడిగే పరిస్థితికష్టాలు అనేవి ఉంటాయి, కాని అవి శాశ్వతం కాదుకష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలిప్రజలకు మనం తోడుగా ఉంటే చాలు.. వాళ్లే మనల్ని ఆదరిస్తారుటీడీపీ అబద్ధాలు, మోసాలతో విసుగెత్తిపోయే పరిస్థితి ఉంటుందివైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తొగ్గలేదు, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి.. చంద్రబాబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. -
విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
-
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్కి తెగేసి చెప్పేశారు. -
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోటీ నుంచి టీడీపీ ఔట్
సాక్షి, విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం ముగిసింది. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్గా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టెలీకాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.మంగళవారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో అభ్యర్ధి పోటీపై విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని నిలబెట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అయితే అందుకు పార్టీ నేతలు ఒప్పుకోలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని ఎలా పెడతారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు రూపాయలు కుమ్మరించిన ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులతో టీడీపీ నిండిపోయిందన్న టీడీపీ నేతల అభిప్రాయంతో చంద్రబాబు అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. -
బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది?: బొత్స
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్మేన్ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని, రాజకీయాలంటే ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. 300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు. కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు. దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్ జగన్ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
రేపు, ఎల్లుండి విశాఖ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా రేపు, ఎల్లుండి సమావేశం కాబోతున్నారు.కాగా, విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలు ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్ను కలిసేందుకు అవకాశంలేదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
మళ్లీ ‘ఓటుకు నోటు’ పాలిటిక్స్కు టీడీపీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ ఓటుకు నోటు రాజకీయాలకు టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచనలో ఉంది. ఓట్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని టీడీపీ తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకు ప్రయత్నించిన బైరా దీలీప్ చక్రవర్తి తెరపైకి వచ్చారు. టీడీపీలో సభ్యత్వం లేకపోయినా దిలీప్ను పోటీకి దించాలనే కూటమి భావిస్తోంది. డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని దిలీప్కు టీడీపీ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.ఓడిపోయినా సరే పోటీ చేయాలని బైరా దిలీప్పై టీడీపీ ఒత్తిడి తెస్తోంది. ఓడిపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్లు ఇస్తామంటూ ఆఫ్ర్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్ల ద్వారా డబ్బు సంపాదనకు టీడీపీ పోటీకి దింపుతోంది. ఇప్పటికే డబ్బులు పెట్టేది లేదని ఇప్పటికే పీలా గోవింద్, గండి బాబ్జి చెప్పేశారు.మొత్తం 840 ఓట్లు ఉండగా, 11 ఖాళీలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 615 మంది ప్రజాప్రతిధులు ఉండగా, టీడీపీకి కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. 400 మంది వ్యత్యాసం ఉన్నా పోటీకి దిగాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు రాజకీయానికి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను కొనేందుకు అప్పగింతల తంతు కొనసాగుతోంది. -
Vizag MLC Election: కూటమిలో కన్ఫూజన్.. పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలంమరో వైపు ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. -
ఆత్మరక్షణలో చంద్రబాబు.. కారణం ఇదేనా?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుతెన్నులను ఎండగడుతూ, మరో వైపు వైఎస్సార్సీపీ స్థానిక నేతలలో నైతిక స్థైర్యం నింపే యత్నం చేస్తున్నారు. పార్టీపరంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ముందుగానే మేల్కొన్నారని అనుకోవచ్చు. అదే టైమ్లో చంద్రబాబు నాయుడును ఆత్మరక్షణలో పడేసేలా ఆయన ముందుకు సాగుతున్నారని భావించవచ్చు.ఎందుకంటే ఈ నెలాఖరుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడానికి ఆలోచన చేస్తున్న తరుణంలోనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ పక్షాన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును తమ అభ్యర్దిగా డిక్లేర్ చేశారు. ఇందుకోసం విశాఖ ప్రాంత పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. బొత్స అయితే పార్టీలో జోష్ వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అన్ని హంగులపరంగా గట్టి వ్యక్తిగా పేరున్నందున, పార్టీలో అందరికి బాగా తెలిసిన వ్యక్తి అయినందున బొత్స ఎంపిక జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు.ఇటీవలి శాసనసభ ఎన్నికలలో పరాజయం నేపథ్యంలో పార్టీ క్యాడర్ను చురుకుగా ఉంచడానికి ఈ ఎన్నికను ప్రాతిపదికగా తీసుకున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల మీదే ఆధారపడి నిర్ణయాలు చేసేవారన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు సుమారు ఏడాది క్రితం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే, ఆయన పూర్తిగా సమన్వయకర్తలు, ఆ ప్రాంత నేతలకు వదలివేశారు. కారణం ఏమైనా ఆ ఎన్నికలో వైఎస్సార్సీపీ ఓడిపోయి టీడీపీ అభ్యర్ది గెలిచారు. అది సాధారణ ఓటర్లలో, ప్రత్యేకించి విద్యాధికులలో భిన్నమైన సంకేతాన్ని ఇచ్చింది. ఆ ఓటమిని పార్టీ తేలికగా తీసుకుందన్న అభిప్రాయం ఉంది. దాని కారణంగా సాధారణ ఎన్నికలలో మూల్యం చెల్లించవలసి వచ్చింది.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో స్వయంగా రంగంలో దిగి ఆయా నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు తదితర ఓటింగ్ హక్కు కలిగినవారితో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ చంద్రబాబు చేసేది అధర్మ యుద్దం అని, దానిని ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. నిజానికి టీడీపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కాని చంద్రబాబు ఏ ఎన్నికను అంత తేలికగా వదలిపెట్టరు. బలం ఉన్నా, లేకపోయినా ఎలాగోలా అన్ని రకాల ప్రలోభాలను ప్రయోగించి గెలవాలని ఆలోచిస్తారన్న భావన సర్వత్రా ఉంది. అందులోను అధికారంలో ఉన్నప్పుడు అసలు వదలిపెట్టరు.శాసనమండలిలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యతతో ఉంది. దానిని తగ్గించడానికి, పార్టీని బలహీనపరచడానికి ఈ ఉప ఎన్నికను వాడుకోవాలని టీడీపీ సహజంగానే యత్నిస్తుంది. కాని బలం రీత్యా టీడీపీ గెలవడం కష్టం. 600 పైగా ఓటర్లు ఉంటే అందులో 400 మంది వైఎస్సార్సీపీ ఓటర్లే. టీడీపీకి 200 మంది మాత్రమే ఉన్నారు. అంటే టీడీపీ గెలవాలంటే మరో 200 మందిని ప్రలోభపెట్టవలసి ఉంటుంది. అయినా చంద్రబాబు వదలిపెడతారని ఎవరూ అనుకోవడం లేదు. విశాఖపట్నం కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ కూటమికి బలం లేకపోయినా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కొందరిని ప్రలోభాలకు గురి చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడడం వంటి చర్యల ద్వారా గెలిచారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్లో ఆయా అంశాలను ప్రస్తావించి చంద్రబాబు అధర్మ యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అని, అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ జగన్ రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ తన బలాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బొత్సను గెలిపించుకోగలిగితే పార్టీకి అది ఊపు ఇస్తుంది. పార్టీ క్యాడర్ నైతిక స్పూర్తి వెల్లడవుతుంది. ఒకవేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీల కూటమి అనైతిక పద్ధతులకు పాల్పడి ఓటర్లను కొనుగోలు చేస్తే, దానిని రాష్ట్రం అంతా ప్రచారం చేసి కూటమిని ఎండగట్టవచ్చు. చంద్రబాబు తన వెనుకటి గుణం మానుకోలేదన్న విషయం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పవచ్చు. ఈ రకంగా రెండు రకాలుగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడవచ్చు.ఇప్పటికే గత శాసనసభ ఎన్నికలలలో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. దానికి తోడు ఇలాంటి అక్రమ పద్ధతులు అవలంభిస్తే టీడీపీ మరింత వేగంగా అప్రతిష్ట పాలవుతుంది. ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక్కో ఓటర్కు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వరకు ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నారని, దానికి ప్రజలు ఆశపడ్డారని, చివరికి పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని, ప్రజలకు పస్తులు మిగిలాయని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.తాను అధికారంలో ఉంటే ఈసరికి అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి స్కీములు వచ్చి ఉండేవని, ప్రజలకు మేలు జరిగేదని ఆయన వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎగవేస్తున్న విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. తాను విశ్వసనీయతకు నిలబడే వ్యక్తిని అయితే, చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఆధార సహితంగా చెబుతున్నారు. 2014 టరమ్లో చంద్రబాబు ఇరవైమూడు మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత, వారికి ఆశచూపిన మొత్తం పూర్తిగా ఇవ్వలేదని, ఆ తర్వాత వారిలో ముగ్గురికి తప్ప మిగిలినవారికి టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. వారిలో పలువురు తిరిగి తన వద్దకు రావడానికి యత్నించినా అంగీకరించలేదని, ఫలితంగా రెండు విధాలుగా వారు నష్టపోయారని ఆయన అన్నారు.ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఓటర్లను కూడా ఆకర్షించే యత్నం చేస్తున్నారని, చంద్రబాబును నమ్మితే, ఆ తర్వాత వారికి దక్కేది ఏమీ ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబు రాజకీయాలలో మోసపూరితంగా ఉండే నేత అని, అలాంటి వ్యక్తిని నమ్మవద్దని, తాను విశ్వసనీయతకే పట్టం కడతానని, ఏదైనా చెబితే చేయాలన్నదే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా వైఎస్సార్సీపీలో కొత్త ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. వైఎస్సార్సీపీకి అండగా ఉంటే కాడర్కు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇవ్వడానికి యత్నిస్తున్నారు.నిజానికి బలం లేనందున టీడీపీ పోటీ చేయకుండా ఉంటే వారికి గౌరవం మిగులుతుంది. అలాకాకుండా చంద్రబాబు కనుక తన రాజకీయ వ్యూహాలను అమలు చేసి టీడీపీ అభ్యర్ధిని రంగంలో దింపి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రచారం కల్పిస్తే ఆయనకే నష్టం కలగవచ్చు. టీడీపీ గెలిచినా అది డబ్బుతో విజయం సాధించినట్లు అవుతుంది. అభివృద్ది కోసమే స్థానిక ప్రతినిధులు టీడీపీలోకి వచ్చారని చెప్పినా, జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందులోను చంద్రబాబు ట్రాక్ రికార్డు అటువంటిది అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇంత చేసినా టీడీపీ ఓటమి చెందితే పార్టీకి మరింత అప్రతిష్ట అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే వ్యూహరచన చేసి ఎమ్మెల్సీ ఎన్నికపై పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కూటమి కుట్రలు తిప్పికొడతాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కూటమి కుట్రలన్ని తిప్పికొడతామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైఎస్సార్సీపీ సింబల్తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ మాకున్నా.. వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే.. వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది.. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఆ మాట పదే చెప్తుంటారు. కచ్చితంగా స్టాండింగ్ కమిటీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
ఓట్లు కొనేందుకు చంద్రబాబు కుట్ర: బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మంగళవారం ఆయన నర్సీపట్న నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీకి 600 పైగా సభ్యుల బలం ఉందని.. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందన్నారు. ‘‘ఎంపీటీసీ జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజా స్వామ్యంలో మంచి పద్దతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాము’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘సంపద సృష్టస్తానని చంద్రబాబు చెప్పారు.. ఎన్నికల తరువాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెపుతున్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా?’’ అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయ నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయానికి కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే సంఖ్యా బలం ఉంది. ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురిచేశారు. మా ప్రజా ప్రతినిధులపై మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వైఎస్సార్సీపీకే అండగా ఉంటారు అని చెప్పారు.అంతకుముందు, అనకాపల్లిలోని చోడవరం మాడుగుల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 600 మందికిపైగా సభ్యుల బలం వైఎస్సార్సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. ప్రలోభాలతో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. దేశంలో రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. రాజకీయాల్లో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?. వైఎస్సార్సీపీ సభ్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా?. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఎన్నో రోజులు నమ్మరు అంటూ కామెంట్స్ చేశారు.ఇక, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ను సోమవారం సాయంత్రం కలెక్టర్ విడుదల చేశారు.షెడ్యూల్ ఇలా.. ఈనెల 30 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.రేపటి నుంచి అమలులోకి నోటిఫికేషన్.ఈనెల 13వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ.14న నామినేషన్ల స్క్రూన్నీనామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు.ఈనెల 30న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.సెప్టెంబర్ 3న కౌంటింగ్.రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు.ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన వైఎస్సార్సీపీ. -
మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం మల్లన్న గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు (1,55,095) రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి« తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,697 ఓట్లు లభించాయి. అయినా గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. 48 మందిని ఎలిమినేట్ చేయగా.. ఈ ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన 48 మంది ని ఎలిమినేట్ చేసి, వారికి పడిన మొదటి ప్రాధాన్య ఓట్లలోని రెండో ప్రాధాన్యతను లెక్కించగా వచ్చిన ఓట్లను కలుపుకోగా కాంగ్రెస్ అభ్యర్థి 1,24,899 ఓట్లకు, బీఆర్ఎస్ అభ్యర్థి 1,05,524 ఓట్లకు, బీజేపీ అభ్యర్థి 43,956 ఓట్లకు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 30,461 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు.49వ రౌండ్లో అశోక్ ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 49వ రౌండ్లో స్వతంత్ర అభ్యర్థి అశోక్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలోని రెండో ప్రా«ధాన్య ఓట్లను లెక్కించారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 10,383 ఓట్లు రావడంతో ఆయన 1,36, 246 ఓట్లకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 10,118 ఓట్లు రావడంతో ఆయన 1,16,292 ఓటకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 4,918 ఓట్లు రాగా ఆయన 48,874 ఓట్లకు చేరుకున్నారు. 50వ రౌండ్లో ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు అప్పటివరకు ఎవరికీ రాకపోవడంతో 50వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన 48,874 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తీన్మార్ మల్లన్నకు 14,278 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 19,510 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 1,50, 524 ఓట్లకు చేరుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు 1,35,802 చేరుకున్నారు.అయినప్పటికీ గెలుపు కోటాకు 4,571 ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మల్లన్నకు రాకేశ్రెడ్డి కంటే 14,722 ఓట్లు అధికంగా (మెజారిటీ) ఉన్నాయి. దీంతో రాకేశ్రెడ్డిని ఎలిమినేట్ చేయకుండానే, మల్లన్నకు అధిక ఓట్లు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆమోదంతో మల్లన్న గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలో 10 వేల మంది గ్రాడ్యుయేట్లు ప్రేమేందర్రెడ్డికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వ లేదు. మరో 5 వేలమంది గ్రాడ్యుయేట్లు అశోక్కు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వలేదు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కొనసాగుతున్న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్కు ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్లో 96 వేల చొప్పున 4వ రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి రౌండ్కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్ బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
పట్టభద్రుల MLC ఎన్నిక కౌంటింగ్ పూర్తి అప్డేట్..
-
మరో ఆరు రోజులే!
సాక్షి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరితోపాటు అధికారుల చూపు లోక్సభ ఎన్నికల ఫలితాల వైపు మళ్లింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్ల స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమైన వరంగల్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం పనులు చేయాలి, రోజువారీగా ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.ఈవీఎంలలో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో సిబ్బందికి వివరించారు. అదేసమయంలో స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. తరచూ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్యతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.కౌంటింగ్ సజావుగా సాగేలా..న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, డాక్టర్ సుక్భీర్సింగ్సంధుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రత్యేక కౌంటింగ్హాల్ ఉండేలా ఏర్పాట్లు ఉండాలని ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్రూం నుంచి కౌంటింగ్హాల్కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బంది ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 28 టేబుళ్లు, కనిష్టంగా 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్య పెంచనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్యకాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కౌంటింగ్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు.ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కౌంటింగ్ హాల్లో అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమతుందని, అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల ఫలి తాలు ప్రకటించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ, ఎన్నికల నోడల్ అధి కారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా అభ్యర్థుల్లో గుబులు..ఈ నెల 13న ఎన్నికలు ముగిసినా ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం లోలోన గుబులు ఉంది. పైకి గెలుస్తామని అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రోజుకో యుగంలా ఫీలవుతున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చేసరికి కాస్త మనస్సు అటువైపు మళ్లింది. సోమవారం ఆ ఎన్నిక కూడా ముగియడంతో తమ భవితవ్యం ఏమిటి అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఇంకోవైపు ఆయా స్ట్రాంగ్ రూంల వద్ద తమకు నమ్మకమైన అనుచరులను పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అక్కడి దృశ్యాలను తిలకిస్తూ షిఫ్ట్ల వారీగా అక్కడే ఉంటున్నారు. ఏదేమైనా మరో ఆరు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. -
తగ్గిన పోలింగ్ శాతం
-
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
TG MLC By-Election 2024 Photos: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక : పోటెత్తిన పట్టభద్రులు (ఫొటోలు)
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో తక్కువ సమయంలో రెట్టింపు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్కు ఓటు వేశారని అన్నారు. మేధావులందరూ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.కాగా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ నల్గొండలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదు.బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది. అదే పంథాను కాంగ్రెస్ అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనలేదు. బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. అవినీతి అక్రమాలకు సివిల్ సప్లై శాఖ అడ్డాగా మారింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద అవినీతి సివిల్ సప్లై శాఖలో జరిగింది. ఆ శాఖ నష్టాల్లో ఉండటానికి కారణం ఏంటి?. మధ్యవర్తిగా ఉన్న సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు దండుకుని ఢిల్లీకి పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన కత్తి తీయడం లేదు. ఏ రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా ముట్టిందో బయట పెట్టాలి. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి.కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు మోసం చేశారు. విద్యా, వ్యవసాయం, అన్ని రంగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేసింది. మైనార్టీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. రాములోరి అక్షింతలు, ప్రసాదాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హేళన చేస్తోంది. ఓ వర్గానికి కొమ్ముగాస్తే బీజేపీ అడ్డుకుంటుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జ్లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జ్ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్చార్జ్లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో, ఇన్చార్జ్లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. -
పాలమూరు.. ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో పోటాపోటీ ఉండొచ్చన్న సర్వేల అంచనాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వరుస పర్యటనలు, అక్కడి నాయకులు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తున్నారని.. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వీలైనప్పుడల్లా పర్యటిస్తూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాపై రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు లోక్సభ ఎన్నికపైనా దృష్టిపెట్టారు. అటు అధిష్టానానికి, ఇటు తనకు సన్నిహితుడైన వంశీచంద్రెడ్డికి లోక్సభ టికెట్ ఇప్పించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకముందు, తర్వాత చాలాసార్లు వంశీతో భేటీ అయి ప్రచారం, ఇతర అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. అంతేకాదు వీలైనప్పుడల్లా మహబూబ్నగర్ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్నగర్కు వెళ్లిన రేవంత్.. రెండు సభల్లో పాల్గొన్నారు.రెండుసార్లు కొడంగల్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లింది మూడే సార్లు కావడం గమనార్హం. తాజా సభల్లో, కార్యక్రమాల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కూడా పాలమూరులో గెలుపే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. 70ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచి్చందని.. పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ చెప్తున్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూరు, వాల్మికి బోయ కులస్తులతో భేటీ అయి హామీలివ్వడం ద్వారా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను అమలు చేశారు. మ్మెల్యేలకు ‘స్పెషల్’గా హామీలిస్తూ.. పాలమూరులో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారని.. ఇందుకోసం ఆ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోభాగంగానే మహబూబ్నగర్ సభ వేదికగా ముదిరాజ్లకు మంత్రివర్గంలో స్థానం కల్పింస్తామని ప్రకటించారని అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా మంచి మెజార్టీ తీసుకురావాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు సమాచారం. -
ముగిసిన మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్కుమార్రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్లోని రిసార్ట్స్కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బిహార్లో మూడు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్లో ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది. బిహార్లో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతానికి మంగళ్ పాండే, డాక్టర్ లాల్ మోహన్ గుప్తా, అనామికా సింగ్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ బహదూర్ పాఠక్, మహేంద్ర కుమార్ సింగ్, మోహిత్ బెనివాల్, అశోక్ కటారియా, ధర్మేంద్ర సింగ్, రాంతీరత్ సింఘాల్, సంతోష్ సింగ్లను రంగంలోకి దింపింది. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 21న జరగనుండగా నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మార్చి 11. మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మాజీ మంత్రి అబ్దుల్బరీ సిద్ధిఖీ, ఊర్మిళా ఠాకూర్, సయ్యద్ ఫైసల్ అలీలను బరిలో నిలిపింది. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
TS: కాంగ్రెస్ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?
కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్లో ఏం జరిగింది? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్.. మహేష్ గౌడ్లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళుతున్న నేపధ్యంలో బీసీ నేత అయిన మహేష్గౌడ్ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెష్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి.. అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించలేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయనకు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ, తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని సీఎం సలహాదారుడిగా (ప్రజా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్అలీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు)లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా, మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం రేవంత్ దావోస్ నుంచి రాగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగింది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. త్వరలోనే మాకు కూడా...! : మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుదన్న ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు మొత్తం 9 లేదా 18 కార్పొరేషన్ పదవులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలాకాలంగా అధికారిక పదవుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకంతో మాకు కూడా త్వరలోనే పదవులు వస్తాయనే ఆశ చిగురించింది. నామినేటెడ్ జాబితా ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.’అని కార్పొరేషన్ పదవుల ఆశావహుల లిస్టులో ముందు వరుసలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపై కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానని, కొత్త పాలకవర్గాల నియామకంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులైన మార్కెట్ కమిటీ నియామకాలు కూడా త్వరలోనే జరుగుతాయనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. పలువురి అభినందనలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వేం నరేందర్రెడ్డి, షబ్బీర్లీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మల్లురవిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వారి నివాసాలకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. పలువురు మంత్రులు కూడా వేర్వేరు ప్రకటనల్లో వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డిలకు వేం, షబ్బీర్, హర్కర, మల్లురవిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. -
MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
కాంగ్రెస్ మార్క్ సెలక్షన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్తో పాటు ముందు నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ను మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బల్మూరి వెంకట్ ఓసీ (వెలమ) వర్గానికి చెందిన వారు కాగా, మహేశ్కుమార్ బీసీ (గౌడ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తొలుత బల్మూరితో పాటు దళిత నాయకుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఝలక్ ఇచ్చింది. గవర్నర్, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఎస్సీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తారని తెలుస్తోంది. మొదట్నుంచీ పార్టీకి విధేయుడు ఎన్నికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అతి తక్కువ వయసులో ఎమ్మెల్సీ అయిన నేతగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఆయన ఎంపికకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వెంకట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు పంపడంలో భాగంగానే వెంకట్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలు పంచుకున్న పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించిందని, అందులో భాగంగా వెంకట్కు ఈ ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ పట్ల వెంకట్కున్న విధేయత కూడా కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021 అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి వెంకట్ను పోటీకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. అంతకు ముందు 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ను, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్ల విధేయతతో వెంకట్ అవిశ్రాంతంగా ఉద్యమాలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పేపర్ లీకేజీలు, పోలీసు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. అనేకసార్లు గాయపడ్డారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు. చర్లపల్లి జైల్లో ఉన్న వెంకట్ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ కూడా పరామర్శించారు. ఈ విధేయతే వెంకట్కు అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని, 2023 ఎన్నికల కంటే ముందే కేసీ వేణుగోపాల్ స్వయంగా వెంకట్ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వెంకట్ పేరును రాహుల్గాంధీ స్వయంగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, మహేశ్గౌడ్ల పేర్ల పరిశీలన జరిగిందని, చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో మహేశ్ సక్సెస్ మహేశ్కుమార్ గౌడ్ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1986–1990 వరకు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లోనూ పనిచేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు ఉమ్మడి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా కొన్ని సమీకరణల వల్ల సాధ్యం కాలేదు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలీకృతులయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని కారణంగా ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని గతంలోనే అధిష్టానం మహేశ్కు హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. నిస్వార్థంతో చేసిన కష్టానికి గుర్తింపు: వెంకట్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంతో సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓ యువ కార్యకర్తకు గుర్తింపునిచ్చిందని బల్మూరి వెంకట్ చెప్పారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాందీ, రాహుల్గాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ గౌడ్, బల్మూరి నేడు నామినేషన్ల దాఖలు సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్) అభ్యర్థిత్వాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. కాగా మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం ఉదయం విడివిడిగా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. బల్మూరి వెంకట్ బయోడేటా పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) మహేశ్కుమార్ గౌడ్ బయోడేటా పేరు: బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
MLC Election: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీనియర్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. దీంతో, వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక, ఈనెల 18వ తేదీన ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆఖరు తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. -
TS MLC: ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలనలో ఐదుగురు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. సామాజిక సమీకరాణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల పోటీలో బీసీ సామాజికవర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్ పేర్లను పరిశీలినలో ఉండగా.. ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓసీ కోటా నుంచి పటేల్ రమేష్ పేరు హైకమాండ్ దృష్టిలో ఉన్నట్టు పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, జావిద్ అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్రెడ్డి బీజేపీ బీ–ఫామ్పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన!
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్కుమార్గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ఖాన్, అజారుద్దీన్తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్తో కలిసి ఇంఫాల్కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్ జరగనున్నారు. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్కుమార్గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్పెద్దలున్నట్టు సమాచారం. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
TS MLC: ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. కాగా, రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదేరోజున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. -
TS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వివాదం నెలకొంది. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు స్థానాలకు జనవరి 29వ తేదీన విడివిడిగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే తేదీలో రెండు విడివిడిగా ఎన్నికలు జరుగుతామని ఈసీ తెలిపింది. రెండు సార్లు తమ ఓటును ఎమ్మెల్యేలు వినియోగించుకోనున్నారు. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున, ఎన్నికల నిబంధనల ప్రకారం విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. 119 మంది ఎమ్మెల్యే లలో 65 స్థానాలతో అధికార పార్టీ బలంగా ఉంది. సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాకేనని కాంగ్రెస్ అంటోంది. రెండు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పోగొట్టుకోనుంది. ఇదీ చదవండి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యతగానీ, ఆచరణాత్మక అనుభవంగానీ వీరికి లేదని.. అందువల్ల వారి అభ్యర్దిత్వాలను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాలు, వ్యాపారం, విద్యా రంగాల్లో.. కుర్ర సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్టు ప్రతిపాదనల సారాంశం వెల్లడిస్తోందని గవర్నర్ వివరించారు. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖలు సోమవారం బయటికి వచ్చాయి. రాజ్యాంగబద్ధంగానే తిరస్కరణ రాజ్యాంగంలోని 171(1ఈ), 171(5) అధికరణాల ద్వారా చట్టసభలకు సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉందని.. దానిని అనుసరించే తాను నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ తమిళిసై తన లేఖల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 10లో పొందుపరిచిన షెడ్యూల్–3ను అనుసరించి శాసనమండలిలో సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుందని వివరించారు. ఆ చట్టంలోని షెడ్యూల్–3కు ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 17 ద్వారా సవరణ జరిపి తెలంగాణ రాష్ట్రానికి 40 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారని, అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే 6 సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నిక కాబోయే అభ్యర్థి ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును లేదా రాష్ట్రంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 3, 6(2) సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల అనర్హతలపై సెక్షన్ 8 నుంచి 11 (ఏ) వరకు పొందుపరిచిన నిబంధనలు శాసనమండలికి నామినేట్ అయ్యే సభ్యులకు కూడా వర్తిస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ ఫైల్ పంపలేదు ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనలతో ఇతర వివరాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జత చేయలేదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మంత్రివర్గం, సీఎం సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించినట్టు ధ్రువీకరించే కేబినెట్ నోట్ ఫైల్ను పంపలేదని.. ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 8 నుంచి 11(ఏ) వరకు పేర్కొన్న అనర్హతలు వీరికి వర్తించవని ధ్రువీకరిస్తూ నిఘా విభాగం, ఇతర సంస్థల నుంచి ఎలాంటి నివేదికలూ అందలేదన్నారు. సిఫార్సుల కోసం పంపే ఫైలు సంబంధిత అన్ని రికార్డులతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇన్ని లోపాలకు తోడు అర్హతలను ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దు రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5)లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని చాలా మంది రాష్ట్రంలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వారికి కేటాయించిన పదవుల్లో రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను నియమిస్తే.. ఆయా రంగాల్లోని వారు చేసిన కృషిని, సాధించిన నిపుణతను విస్మరించినట్టు అవుతుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు సైతం నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ 171(5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎంకు, మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు. నెలన్నరకుపైగా పెండింగ్ తర్వాత సుమారు రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డిని మంత్రిమండలి నామినేట్ చేయగా.. కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఎస్టీల్లోని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్కుమార్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని జూలై 31న మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్కు ప్రతిపాదనలను పంపింది. అప్పటి నుంచి దాదాపు నెలన్నరకుపైగా ఆ సిఫార్సులు రాజ్భవన్లోనే పెండింగ్లో ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ లేఖ రాశారు. కొత్త వారికి అవకాశం ఇస్తారా? మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కొత్తవారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో తీర్మానం చేసి పంపిస్తుందా? వీరినే నియమించాలని మళ్లీ కోరుతుందా? అసలు ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కొందరు బీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించడం గమనార్హం. మరోవైపు ఈ పరిణామంతో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రాజ్భవన్ అడ్డాగా రాజకీయాలు.. బీఆర్ఎస్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం ఉందంటూ తిరస్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఇతర నేతలు గవర్నర్ చర్యను ఖండించారు. మీరు తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు?: హరీశ్రావు వెనుకబడిన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే బీఆర్ఎస్ సభ్యులంటూ గవర్నర్ తిరస్కరించడం దారుణమని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సూచనల మేరకు గవర్నర్గా పనిచేసేందుకు తమిళిసై అనర్హులని పేర్కొ న్నారు. బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానా, మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషకల్, రాకేశ్ సిన్హా తదితరులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్రాజ్ విశ్వకర్మ తదితర బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపారని, ఇప్పుడేమో ఎమ్మెల్సీ అభ్యర్దిత్వాలను తిరస్కరించారని.. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించడమే: ప్రశాంత్రెడ్డి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు చెందిన దాసోజు శ్రవణ్, షెడ్యుల్డ్ తెగకు (ఎస్టీ) చెందిన కుర్రా సత్యనారాయణ అభ్యర్దిత్వాలను గవర్నర్ తిరస్కరించడం ఆయా వర్గాలను అవమానించడమేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. రాజ్భవన్ను అడ్డాగా చేసుకొని గవర్నర్ రాజకీయా లు చేస్తున్నారని, ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హతను తమిళిసై కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు: ఇంద్రకరణ్రెడ్డి గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గవర్నర్ తీరు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. కిషన్రెడ్డి కుట్ర వల్లే తిరస్కరణ: శ్రీనివాస్గౌడ్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన కుట్ర వల్లే గవర్నర్ ఎమ్మెల్సీల ఫైల్ను తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఇది బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర అని మండిపడ్డారు. ఇది కక్ష సాధింపు కోసమే.. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార్సు లను గవర్నర్ ఆమోదించకపోవటం సరికాదని, దీనికి రాజకీయ దురుద్దేశమే కారణమని విమర్శించారు. -
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్రావు, ఫారూఖ్ హుస్సేన్ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్షా, జేపీ నడ్డా -
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
ఓటుకు కోట్లు 2.0: కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం.. చంద్రబాబు
చెప్పులు రుచి మరిగిన కుక్కకు చెరకు తీపి రుచిస్తుందా?.. పుట్టుకతో వచ్చిన గుణం పుడమిలో కలిసేదాకా పోదు కదా! బేరసారాలే ఊపిరిగా బతికే నేతల నైజం కూడా అంతే!.. కుమ్మక్కు రాజకీయాలు, కొనుగోళ్లే వారి లక్షణం.. లక్ష్యం! సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల క్రితం.. తెలంగాణ శాసన మండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీ శాసన మండలి ఎన్నికల్లోనూ అదే విధానాన్ని నమ్ముకుంది. ఓటుకు కోట్లను ఎర వేసింది. గెలిచే బలం లేకపోయినా బేరసారాలకు దిగి నిస్సిగ్గుగా క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించింది. ఆది నుంచి తాను నమ్ముకున్న కొనుగోళ్లు, కుమ్మక్కు రాజకీయాలనే మరోసారి అనుసరించింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో విఫలమైన వారితోపాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ దక్కదనే సంకేతాలున్న వారిని ప్రలోభాలకు గురి చేసి అనైతిక చర్యలకు పాల్పడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వాస్తవాలను వెల్లడించడంతో చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం అమలైన ‘ఓటుకు కోట్లు స్కాం 2.0’ బహిర్గతమైంది. బలం లేదని స్పష్టంగా తెలిసినా.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ తన అభ్యర్థి పంచుమర్తి అనూరాధను గట్టెక్కించుకోగలిగింది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్సీపీకి 151 మంది సభ్యులున్నారు. టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో నలుగురు ఆదిలోనే ఆ పార్టీకి దూరంగా జరగడంతో సాంకేతికంగా ఉన్న సభ్యులు 19 మంది మాత్రమే. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక కూడా ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. టీడీపీ, జనసేన విధానాలతో విబేధించిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. అంటే అధికార పార్టీకి సాంకేతికంగా ఉన్న సభ్యులు 156 అని స్పష్టమవుతోంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలంటే 22 మంది ఎమ్మెల్యేల ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నందున ఖాళీ అయిన ఏడు స్థానాలకు తన అభ్యర్థులను బరిలోకి దించింది. తగిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టారు. సంఖ్యా బలం లేకుండా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రూ.కోట్లు ఎర వేసి బేరసారాలకు చంద్రబాబు వ్యూహం రచించినట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదిలోనే చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.పది కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వెదజల్లి కొనుగోలు చేసి టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు గెలిపించుకున్నారని సజ్జలతోపాటు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వాస్తవాలను వెల్లడించడటంతో ఓటుకు కోట్లు స్కాం 2.0 బట్టబయలైంది. అసెంబ్లీ లాబీ వేదికగా పదేపదే ప్రలోభాలు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలుపొందినా పవన్ కళ్యాణ్ పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ వెంట ప్రజాభీష్టం ప్రకారం నడుస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాకను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు బరిలోకి దించారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఎమ్మెల్యే రాపాక తాజాగా మీడియాకు బహిర్గతం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే పెద్ద ఎత్తున డబ్బులతో పాటు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని రామరాజు తనకు ప్రతిపాదన పంపారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనను పక్కకు పిలిచి మరోసారి ప్రలోభపెట్టారని రాపాక చెప్పారు. తనను పదేపదే ప్రలోభాలకు గురి చేసినా డబ్బులకు అమ్ముడుపోయి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేనని మరోసారి తేల్చి చెప్పినట్లు రాపాక పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీ ప్రలోభాలకు గురిచేసిన విషయం తెలిసిందన్నారు. కాగా ఈ అంశంపై ఉండి ఎమ్మెల్యే రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే రాపాకను కలసి మాట్లాడిన విషయం వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం. అయితే రాపాకను ప్రలోభపెట్టలేదంటూ దాటవేసే యత్నం చేశారు. ప్రలోభాలకు ఆదిగురువు రాజకీయాల్లో ప్రలోభాల పర్వం చంద్రబాబుతోనే మొదలైందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ శాసన మండలికి 2015లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థి వేం నరేంద్రరెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు. రూ.కోట్లు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తన శిష్యుడు రేవంత్రెడ్డిని పురమాయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బుల కట్టలతో కూడిన బ్యాగ్ను అందచేస్తుండగా తెలంగాణ ఏసీసీ సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్గా 2015 మే 31న పట్టుకుంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్కు తాకట్టుపెట్టి మరీ రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పరారై కృష్ణా కరకట్టపై ఉండవల్లి వద్ద ఉన్న అక్రమ నివాసానికి చేరుకున్నారు. తాజాగా శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రీతిలో ఓటుకు నోట్లు కుంభకోణానికి చంద్రబాబు పాల్పడటం గమనార్హం. అందుకే పుట్టుకతో వచ్చిన గుణం చచ్చే దాకా పోదనే నానుడి ఆయనకు అతికినట్లు సరిపోతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
చంద్రబాబు మరోసారి అప్రతిష్టపాలు
సోషల్ మీడియాలో ఒక జోక్ వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే.. బైకులు కొనడం ధోనీకి సరదా! కారులు కొనడం సచిన్ కు సరదా! ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు సరదా .. అన్నది ఆ జోక్.. ఇది చూడడానికి హాస్యంగానే ఉన్నా, ఇందులో చాలా అర్ధం, పరమార్ధం ఉన్నాయి. టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని, ఆయన ఎంత సేపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారన్న అభిప్రాయం సర్వత్రా మరోసారి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను, నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టిడిపి కొనుగోలు చేసిందన్న విమర్శ ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. వారిలో ఇద్దరు ముందుగానే వైఎస్సార్సీపీ ఓటు వేయబోవడం లేదన్న సంకేతం ఇచ్చారు. మరో ఇద్దరు మాత్రం సీక్రెట్గా టిడిపికి ఓటు వేసి దొరికిపోయారు. వైఎస్సార్సీపీ నాయకత్వం సమర్దంగా కోడింగ్ ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది. వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపెట్టడంతో వాటికి లొంగి పోయారని, ఒక్కొక్కరికి పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు చంద్రబాబు ముట్ట చెప్పారన్నది తమ సమాచారం అని ప్రభుత్వ సలహాదారు ,వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దాంతో ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎలాగూ రాజకీయ జీవితం అనిశ్చితిగా మారినందున, టిడిపి ఇచ్చే డబ్బు అయినా గిట్టుబాటు అవుతుందని అనుకుని ఉండాలన్న వాదన సహజంగానే ముందుకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు మరోసారి అప్రతిష్టపాలు అయితే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిదే పైచేయి అయ్యింది. ఒకరకంగా సీఎం జగన్ వేసిన ట్రాప్ లో చంద్రబాబు చిక్కి విలవిలలాడినట్లు అయింది. సాదారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభ పెడుతుందని అంతా విశ్వసిస్తారు. కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి దిక్కుమాలిన పని ప్రతిపక్షం చేస్తుండడం విశేషం. జగన్ ఎప్పుడైతే ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలను పిలిచి టిక్కెట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారో, అప్పుడే వీరిపై డౌటు వచ్చి ఉండాలి. అయినా వారిని ఇతరత్రా వనరులు సమకూర్చి సంతృప్తి పరచాలని అనుకోలేదు. పోతే ఒక సీటు పోయిందిలే అనుకున్నారు. ఒకవేళ చంద్రబాబు కనుక వీరిని కొనుగోలు చేస్తే ఆ విషయం బయటపడి ఆయనే గబ్బు అవుతారులే అని వ్యూహాత్మకంగా ఊరుకుని ఉండవచ్చు. 2015లో తెలంగాణ శాసనమండలి ఎన్నికలలో కూడా చంద్రబాబు ఇలాగే టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయబోయి అడ్డంగా బుక్ అయిపోయిన సంఘటన ఎవరూ మరవలేదు. ఆ దెబ్బకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వదలుకుని హుటాహుటిన విజయవాడకు చంద్రబాబు వెళ్లిపోవలసి వచ్చింది. ఈ చేదు అనుభవం ఉన్నా, ఏపీలో మళ్లీ అదే ప్రకారం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్య హననానికి పాల్పడ్డారు. తమకు ఎన్నెన్ని కోట్ల డబ్బు ముట్టింది అప్పట్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొందరు ఓపెన్ గానే చెప్పేవారు. తదుపరి మళ్లీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఆ ధోరణి మానుకోలేదనుకోవాలి. మళ్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పరువు పోగొట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ రకంగా చంద్రబాబు తన పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించుకున్నా, అది అనైతిక విజయం అని తేల్చేసిన జగన్.. ఎన్నికలలో చంద్రబాబు కోట్లు వెచ్చించడం మామూలే అన్న భావన కలిగేలా చేయగలిగారు. ఆ రకంగా జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడినట్లు అయింది. అదే చంద్రబాబు ఇలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించకుండా ఉన్నట్లయితే ఆయన పార్టీ అభ్యర్ది గెలిచే అవకాశం ఉండేదికాదు. అయినా విలువ మిగిలేది. టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు అధికార పార్టీకి ఓట్లు వేశారు కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అది నిజమే. కాని వారు పార్టీకి దూరం అయి దాదాపు రెండు,మూడేళ్లు అయ్యింది. వారిపై చర్యపై తీసుకోవడానికి కూడా చంద్రబాబు వెనుకాడారు. అందువల్ల తమకు టిడిపి ఎమ్మెల్యేలుగా ఉన్న ఇరవై మూడు మంది ఓట్లు వేశారన్న వాదనకు బలం లేకుండా పోయింది. తమ పార్టీకి నలుగురు దూరం అయ్యారు కనుక వైఎస్సార్సీపీ నుంచి నలుగురిని ఆకర్షించడంలో తప్పేముందని ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. విధానపరంగా విభేదించినవారు ఎవరైనా ఉంటే , ఆ ప్రాతిపదికన టిడిపికి మద్దతు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని బహిరంగంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే దానికి విలువ ఉండేది. అలాకాకుండా రహస్యంగా ఆపరేషన్ చేయడం వల్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేశారన్న విమర్శను ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. టిడిపికి దూరం అయిన నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎప్పటి నుంచో ఉంటున్నారు కనుక వారిని కొనుగోలు చేయవలసిన అవసరం కాని, పరిస్థితి కాని వైఎస్సార్సీపీకి ఉండదు. టిడిపి ఎమ్మెల్యేలు ఎవరికి జగన్ డబ్బు ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించినప్పుడు కాని, ఆయా ఇతర సందర్భాలలో కాని చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం డబ్బులు ఇస్తుండేవారని చెప్పుకునేవారు. జగన్ పై అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ రాలేదు. నైతిక విలువలు, నిజాయితీ గురించి ఉపన్యాసాలు చెప్పే సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ఎంతవరకు కరెక్టు అని అంటే ఎవరూ సమర్దించజాలరు. ఇదే టైమ్ లో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు రావడం, అమరావతిలో సచివాలయం , కోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టులలో కిక్ బాక్స్ పొందారన్న అభియోగాన్ని ఆదాయపన్ను శాఖ చేసింది. ఎవరెవరి ద్వారా డబ్బు వసూలు చేసింది అన్ని వివరాలు ఆదాయపన్ను శాఖ రిపోర్టులో తెలిపింది. ఆ విషయాన్ని సీఎం జగన్, మంత్రి అమరనాథ్లు అసెంబ్లీలో సవిస్తరంగా తెలియచేశారు. ఇదొక అప్రతిష్ట విషయంగా టిడిపికి, చంద్రబాబుకు మారింది. దీనిని ఖండించలేని దైన్య స్థితి. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబుపై వైఎస్ఆర్కాంగ్రెస్ ఆరోపించే పరిస్థితిని చంద్రబాబు తెచ్చుకున్నారు. ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకున్నామన్న సంతోషం మిగలకుండానే టిడిపి ఇలా భ్రష్టుపట్టిందన్న బాధ ఆ పార్టీ అభిమానులలో ఏర్పడడం విషాదమే. కొనసమెరుపు ఏమిటంటే వైసిపి నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని చెబుతుంటే, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు టిడిపి నుంచి ఆఫర్ వచ్చిందని, టిడిపి ఎమ్మెల్యే ఈ ఆఫర్ గురించి ప్రస్తావించారని ,దానిని ఒప్పుకోలేదని వెల్లడించారు. తాను సిగ్గు,శరం వదలివేస్తే పది కోట్లు వచ్చి ఉండేవని సంచలన వ్యాఖ్య చేయడం ద్వారా ఎపిలో తెలుగుదేశం రాజకీయాలు ఏ విధంగా తయారైంది ప్రజలకు మరోసారి విశదమైందని అర్ధం చేసుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
‘చంద్రబాబు మరోసారి నీచ బుద్ధి బయటపెట్టాడు’
ఏలూరు: దిగజారిపోయిన నీచుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన దుర్మార్గమైన బుద్ధిని బయటపెట్టాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇంతకుముందు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికొపోయిన చంద్రబాబు.. పారిపోయి అక్రమ బిల్డింగ్ దాక్కున్నాడని మంత్రి విమర్శించారు. ఎవరైనా దిగజారిపోయిన రాజకీయాలు చేయాలనుకుంటే తన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనే విధంగా తన బుద్ధి బయటపెట్టాడని మండిపడ్డారు. రూ. 10 కోట్లు ఒక శాసనసభ్యుడికి ఆఫర్ చేసి దొరికిపోయిన చంద్రబాబు.. మళ్లీ ఏదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నాడని మంత్రి మండిపడ్డారు. పశ్చిమగోదావిరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కేసు పెడితే హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..నేడు మళ్లీ బ్యాక్డోర్ పాలిటిక్స్కు తెరలేపాడన్నారు. నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీని ఇబ్బంది పెట్టాలని చూశాడు. నేడు రాపాక వరప్రసాద్ నుకొనుగోలు చేయాలని ఉండి ఎమ్మెల్యే ఆయన అనుచరులతో ప్రయత్నం చేశారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయడం కో చంద్రబాబు సిద్దహస్తుడు . ప్రజా స్వామ్యం లో ఓటు హక్కు విలువైనది.చంద్ర బాబు ఎమ్మెల్యే లను సైతం కొనుగోలు చేసే స్థాయికి దిగజారడం దురదుష్టకరం. నాడు అధికారంలో ఉండి చేశాడు నేడు ప్రతి పక్ష నేత గా చంద్రబాబు అదేపని చేస్తున్నాడు. సీఎం జగన్ ఇలాంటి ప్రలోభాలకు పూర్తి వ్యతిరేకం. నాడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లినా, నేడు నలుగురు వెళ్లినా సీఎం జగన్ పట్టించుకోరు’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు’
కృష్ణాజిల్లా: చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని మోపిదేవి ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రాయితీపై ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మోపిదేవి.. ‘ సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే, చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావటం చంద్రబాబుకు అలవాటు. మామకు వెన్నుపోటు నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వరకు చంద్రబాబుది ఇదే పద్ధతి.చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయం’ అని మోపిదేవి స్పష్టం చేశారు. -
ఓటుకు కోట్లు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం స్పష్టంగా బట్టబయలైంది. అనైతికంగా ఒక ఎమ్మెల్సీ సీటును గెలిచి ఏదో గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ బాగోతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సాక్షిగా బయటపడింది. రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాకను కొనేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రూ. 10 కోట్లు అంటూ రాపాకను కొనేందుకు టీడీపీ పావులు కదిపింది. టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇందుకు మధ్యవర్తిత్వం వహించారు. రాపాకను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని యత్నాలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ. 10 కోట్లు అంటూ ఆఫర్ తెచ్చారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. టీడీపీకి ఓటేస్తే ఎన్నో ప్రయోజనాలు అంటూ రాపాకను ప్రలోభ పెట్టే యత్నం చేశారు ఎమ్మెల్యే మంతెన. అయితే రాపాక మాత్రం కుదరదని తేల్చి చెప్పడమే కాకుండా తాజాగా ఆ విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టడంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. తన ఓటు అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేదని, తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని, ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమనే తనకు ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. ‘నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయమని ఓ రాజుగారు కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని చెప్పారు. సిగ్గు, శరం విడిస్తే నాకు రూ. 10 కోట్లు వచ్చేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేం’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేయాలని మొదటి ఆఫర్ తనకే వచ్చిందన్నారు రాపాక. కాగా, గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో టీడీపీ అధినేత చంద్రబాబే డైరెక్ట్గా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇదే ప్రలోభాలకు పాల్పడటం గమనార్హం.