![YS Jagan Meetng With Visakha YSRCP Leaders On Aug 13 and 14th](/styles/webp/s3/article_images/2024/08/12/YS-Jagan-Meetng.jpg.webp?itok=LYPInL60)
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా రేపు, ఎల్లుండి సమావేశం కాబోతున్నారు.
కాగా, విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలు ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్ను కలిసేందుకు అవకాశంలేదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
![YSRCP కార్యకర్తలకు విజ్ఞప్తి](/sites/default/files/inline-images/ys_5.jpg)
Comments
Please login to add a commentAdd a comment