నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు | Andhra Pradesh MLC election results 03 March 2025 | Sakshi
Sakshi News home page

నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

Published Mon, Mar 3 2025 3:39 AM | Last Updated on Mon, Mar 3 2025 3:40 AM

Andhra Pradesh MLC election results 03 March 2025

మూడు స్థానాల కోసం 70 మంది పోటీ 

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం 

తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడిన 70 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజక­వర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ సోమ­వారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 

ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు స్థానా­లకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమ­యం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ­కుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement