Deccan Grameena bank
-
బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు డబ్బులు మాయం
-
బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం
రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో గల దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయ్యాయి. సుమారు 30 మందికి సంబంధించిన ఖాతాలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందింది. ఈ బ్యాంకు పరిధిలో ఎక్కువ మంది రైతులే బాధితులుగా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు వెల్లడైంది.ఈ రోజు కొందరు ఖాతాదారులు వారి డబ్బులను తీసుకోవడానికి బ్యాంకుకి రావడంతో సిబ్బంది వారి ఖాతాలు పరిశీలించారు. అందులో డబ్బులు లేకపోవడంతో విషయం బయటికి తెలిసింది. అంతే కాక వారికి బ్యాంక్లో డిపాజిట్ చేసినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది. సుమారు రూ.3 కోట్ల నిధులు మాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరగా వారు ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు. దీంతో బాధితులు మీడియాని ఆశ్రయించారు. -
దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ
-
దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసరి మండలం జోడిమెట్లలోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ శాఖలో మంగళవారం దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్యాస్ కట్టర్ల సహయంతో లాకర్లు తెరచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ... ఉడాయించారు. ఈ రోజు ఉదయం భద్రత సిబ్బంది ఆ విషయాన్ని గమనించి పోలీసులకు, బ్యాంకు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అధికారులు బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకులో చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీపై భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. లాకర్లల్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని... ఆ మొత్తం చోరీ అయిందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.