Defamation Murder
-
Karnataka Honour Killing: ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..
మైసూరు: ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని, అది తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించడం నిజమైంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో దళిత కులానికి చెందిన యువకున్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబి తనను వదలరని, చంపడానికి కూడా వెనుకాడరని హతురాలు, పీయూసీ చదివే శాలిని (17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల లేఖను రాసింది. తను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని, నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్కు ఎలాంటి సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే కారణమని స్పష్టం చేసింది. చదవండి: (ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!) ఏడాది కిందట ఒక పరువు హత్య కాగా, గత ఏడాది జూన్లోనూ ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. పిరియాపట్టణలో ఇతర కులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందన్న అక్కసుతో గాయత్రి అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. -
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
-
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
గుంటూరు : కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక దారుణంగా హతమార్చిన ఆమె తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆవేశంలోనే కూతుర్ని చంపుకున్నామని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులే హతమార్చారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కాగా రిసెప్షన్ చేస్తామని దీప్తిని ఇంటికి తీసుకు వచ్చామని... ఆమె తల్లి స్నానానికి వెళ్లినప్పుడు, తాను దీప్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకు తిట్టానని, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని తండ్రి హరిబాబు తెలిపారు. ఇష్టం లేకపోతే ఎప్పటికీ పుట్టింటికి రానని దీప్తి తెగేసి చెప్పడంతో, కోపంతో ఆమెను కొట్టానని, అయితే కణతపై దెబ్బ తగలడంతో చనిపోయిందని విచారణలో తెలిపారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నానని హరిబాబు విచారణలో చెప్పారు. నిందితుల్ని పోలీసులు ఈరోజు కోర్టులో హాజర పరచనున్నారు. -
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు?
గుంటూరు, సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మృతురాలు దీప్తి తల్లిదండ్రులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి కుమార్తె దీప్తిని కడతేర్చడం విదితమే. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం దీప్తి తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దీప్తి మృతదేహానికి సోమవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త కిరణ్కుమార్, కుటుంబసభ్యులు మృతదేహాన్ని తమకుఅప్పగించాలని కోరారు. దీప్తి బంధువులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని పట్టుపట్టడంతో ఇరువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని దీప్తి తరఫు బంధువులకే అప్పగించేందుకు నిర్ణయించారు