Dishoom Movie
-
ఈ హీరో ఏంచేశాడో చూడండి!!
బాలీవుడ్ సినిమా 'డిష్యూమ్' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రచార చిత్రం విడుదల సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాడెజ్ చేసిన చిలిపి పనులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తో కలిసి జాక్వెలైన్ పాల్గొంది. వెరైటీ డ్రెస్సులో వేదికపైకి వచ్చిన అందాల భామ వరుణ్ తో కలిసి అల్లరి చేసింది. అతడిని చేయి పట్టుకుని లాక్కుపోయింది. తర్వాత ఆమెను వరుణ్ చేయి పట్టి లాగాడు. ఆ తర్వాత ఆమెను వెనుక నుంచి తోస్తున్నట్టుగా నటించాడు. భయపడినట్టుగా నటించి వెంటనే తన మోచేయితో అతడిని డొక్కలో ఒక్క గుద్దు గుద్దినట్టు నటించి నవ్వులు పూయించింది. తర్వాత వారిద్దరూ వేదిక దిగివెళ్లిపోయారు. సినిమా ప్రమోషన్ కోసం వీరు చేసిన ఫిట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్' జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది. -
'ఆ సినిమాతో పోలికే లేదు'
ముంబై: 'డిష్యూమ్' సినిమాతో 'ధూమ్'కు పోలిక ఉండదని హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తెలిపారు. ఈ రెండు సినిమాలకు ఎటువంటి పోలికలు లేవని స్పష్టం చేశారు. తమ సినిమా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. 'డిష్యూమ్' సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో కబీర్, జునైద్ గా నటించామని... వీరిద్దరూ ఎదుర్కొనే సమస్యలు, వాటిలోంచి బయటడేందుకు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయన్నారు. 'ధూమ్' సినిమాలోనూ కబీర్ గా జాన్ అబ్రహం నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సీక్వెల్స్ తీస్తున్నారు. అయితే రెండు సినిమాల్లో తన పాత్ర పేరు ఒకటే అయినా రెండు డిఫరెంట్ రోల్స్ అని చెప్పాడు. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్'లో జాక్వెలెస్ ఫెర్నాడెంజ్, అక్షయ్ ఖన్నా ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది.