breaking news
district cooperative central bank
-
సీడీసీఎంఎస్ ఆస్తులు అన్యాక్రాంతం
చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్) ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. పాలకవర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు(గిరింపేట), న్యూస్లైన్: రైతుల అభ్యున్నతి కోసం 1946లో చిత్తూరులోని గాంధీరోడ్డులో సొంత భవనంలో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్)ని స్థాపించారు. రైతాంగానికి అవసరమైన రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అందిస్తోంది. దీనికి అనుసంధానంగా ఎరువులు, క్రిమిసంహారక మందు లు, విత్తనాలను అందించే ఉద్దేశంతో సీడీసీఎంఎస్ను స్థాపించారు. దీని లావాదేవీలు కొన్నేళ్లు సజావుగా సా గాయి. తర్వాత పాలకులు, పాలకవర్గాల స్వార్థం, అధికారుల ఉదాసీనత కారణంగా సీడీసీఎంఎస్ పాలన గాడి తప్పింది. ఖరీదైన ఆస్తులపై నేతల కన్ను సీడీసీఎంఎస్కు చిత్తూరు, మురకంబట్టు, పూతలపట్టు, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, హార్సిలీహిల్స్, వాల్మీకిపురం, కలికిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పాకాల తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలు, అతిథి భవనాలు, హోటళ్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. చిత్తూరులో ప్రధాన కార్యాలయం పక్కనే పెద్ద గోడౌన్ ఉంది. మురకంబట్టు వద్ద జాతీయ రహదారికి పక్కనే కోట్లాది రూపాయల విలువైన స్థలం, పాత భవనాలు ఉన్నాయి. ఇక్కడున్న గోడౌన్, ఖాళీ స్థలాన్ని ఏదో ఒక రూపం లో నొక్కేయాలనే ఆలోచన మాజీ పాల కవర్గానికి చెందిన ముఖ్య నాయకుడికి కలిగింది. మార్కెట్లో ప్రస్తుత మున్న రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వందేళ్ల లీజు పేరుతో దీన్ని నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా అత్యంత ఖరీదైన భవనం ఉంది. దీనికి నిన్నమొన్నటి వరకు రూ.12 వేలు మా త్రమే అద్దె వసూలు చేసుకునే విధంగా అధికారులపై పాలకవర్గం ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీనిపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో రూ.12 వేలు కాస్త రూ.1.2 లక్షలకు పెరిగింది. ఇదీ తక్కువేనని చెప్పవచ్చు. బహిరంగవేలం ప్రకటిస్తే నెలకు నాలుగైదు లక్షల రూపాయల అద్దె వచ్చే పరిస్థితి నెలకొంది. అ యినా పాలకవర్గం తమకు కావాల్సిన వారి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి అద్దెను కట్టడి చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని సీడీసీఎంఎస్ ఆస్తులు తరిగిపోయేలా పాలకులు వ్యవహరిస్తు న్నా అధికారులు నోరు మెదపడం లే దనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గోడౌన్ అద్దెలో మతలబేంటి? సీడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న గోడౌన్ను అద్దెకివ్వడంలో మతలబేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీని అద్దె రూ.30 వేలకుపైనే ఉంటుంది. దీన్ని రూ.12 వేల అద్దెకే కట్టబెడుతూ మాజీ పాలకవర్గం తీర్మానించింది. అంతేకాకుండా ఎక్కువ కాలం అద్దెకు ఇచ్చే విధంగా తీర్మానాన్ని ఆమోదిం చింది. ప్రస్తుతం ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నా అద్దెకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గోడౌన్ అందుబాటులో లేని కారణంగా ఎరువు లు, విత్తనాల అమ్మకాల కోసం కార్యాలయ భవనాన్ని సిబ్బంది వాడుకుంటున్నారు. కారు షెడ్లో ఎరువులు, ప్ర ధాన కార్యాలయంలో వేరుశెనగ విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిపై సీడీసీఎంఎస్ మేనేజర్ వెంకటమునిరెడ్డిని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా పాలకవర్గాల తీర్మానాలను కాదని తామేమీ చేయలేమన్నారు. అయితే ఆస్తులను కా పాడేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిత్తూరు గోడౌన్ విషయంలో మాజీ పాలకవర్గం తీర్మానా న్ని అమలు చేశామన్నారు. దాన్ని ఖాళీ చేయించాలంటే న్యాయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు. -
రైతులకు సహకారమే
తాండూరు, న్యూస్లైన్: రబీ రుణాలు ఈసారి కొంతమంది రైతులకే దక్కనున్నాయి. గత ఏడాది రుణాల పంపిణీతో పోల్చితే ఈసారి భారీగా కోత పడింది. సహకార సంఘాలకు డీసీసీబీ చేసిన కొత్త రుణాల అలాట్మెంట్లే ఇందుకు ఉదాహరణ. సహకార సంఘాల పరిధిలోని వేలాది మంది రైతుల్లో కొంతమందికి అందులోనూ అరకొర పంపిణీకే రబీ రుణాలు పరిమితం కానున్నాయి. ఈసారి సహకార సంఘాల్లో ఒక్క రైతుకు రూ.లక్ష రుణ పరిమితి లక్ష్యంగా డీసీసీబీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఖరీఫ్ రుణ బకాయిల వసూలు శాతం ప్రకారం కొత్త అలాట్మెంట్లు అరకొరగా కేటాయించడంతో రబీ రుణాలకు భారీగా కొత పడింది. దీంతో ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో పుట్టెడు నష్టాలను చవిచూసిన రైతులకు రబీ పంట సాగుకు పెట్టుబడుల కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. సహకార సంఘాల్లో రబీ రుణాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నెల 5వ తేదీన కొత్త రుణాల అలాట్మెంట్ జరిగింది. తాండూరు డివిజన్లో తట్టేపల్లి, ఎల్మకన్నె, యాలాల, నవాంద్గి సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో సుమారు 5 వేలమందికిపైగా రైతులు ఉన్నారు. 2012-13లో నాలుగు సహకార సంఘాల పరిధిలో మొత్తం రైతుల్లో 2,249మంది రైతులకు రూ.566.83 లక్షల రబీ రుణాలు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో సగం మందికి కూడా ఈసారి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు రూ.కోటి.. ఇచ్చింది గోరంతే... 2013-14 సంవత్సరానికిగాను నాలుగు సహకార సంఘాలకు కలిపి కేవలం రూ.70లక్షల రబీ రుణాల అలాంట్మెంట్లు జరిగాయి. నిజానికి ఒక్కొక్క సంఘానికి సుమారు రూ.కోటి అలాట్మెంట్ చేయాలని సహకార సంఘాల పాలకమండళ్లు డీసీసీబీకి ప్రతిపాదనలు చేశాయి. తక్కువైనా కావాల్సింది 1.12 కోట్లు... కానీ అరకొర రుణాలతో సరిపెట్టారు. తక్కువగా ఒక్క రైతుకు రూ.5వేల చొప్పున రుణం ఇవ్వాలన్న గత ఏడాది ప్రకారం 2,249 మందికి సుమారు రూ. కోటి, 12 ల క్షల, 45వేలు అవసరమవుతాయి. అలాట్మెంట్ చేసిన రూ.70లక్షలు ఎంతమంది రైతులకు సరిపోతాయనేది అధికారులకే తెలియాలి. ఒక్కో రైతుకు రూ.3వేలే... ఈ అలాట్మెంట్ ప్రకారం 2,249మంది రైతులనే ప్రామాణికంగా తీసుకున్నా ఒక్కో రైతుకు రూ.3వేల వరకు రుణం అందే అవకాశం ఉంది. రూ.3వేలు పంటల సాగుకు ఎలా సరిపోతాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కనిష్టంగా రూ.10వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు ఈసారి ఒక రైతుకు రుణ పరిమితి లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితం కానున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొరగా జరిగిన రుణ అలాంట్మెంట్లు అందరికీ ఎంతోకొంత పంపిణీ చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ముందుగా కొంతమంది రైతులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో ఈసారి కొంతమందికే రుణాలు దక్కే పరిస్థితి ఉంది. కొత్త రైతులకు రుణం నిల్.. ఇటీవల కొత్తగా సహకార సంఘాల్లో సభ్యత్వం పొందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తట్టేపల్లి, యాలాల, నవాంద్గి సహకార సంఘాల్లో ఇంకా రబీ రుణాల పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. ఇక తాండూరు మండలంలోని ఎల్మకన్నె సహకార సంఘంలో కేవలం ఐదుగురు రైతులకు రూ.1.5 లక్షల రుణాలు పంపిణీ చేశారు. రబీ కొత్త రుణాల అలాంట్ రూ.70 లక్షలే అయినప్పటికీ.. గత ఏడాది రబీ రుణాలు రూ.566.83లక్షలను కలుపుకొని మొత్తం రూ.636.83 లక్షల అలాట్మెంట్గా చూపెట్టడం గమనార్హం. ఎంతమందికి ఇస్తారో...ఎంతిస్తారో తెలియని గందరగోళంగా మారింది కొత్త రుణాల పంపిణీ పరిస్థితి.