district incharge ministers
-
జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా విద్యుత్శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. మొన్నటి వరకు హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆమె స్థానంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ను కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. -
జిల్లా ఇన్చార్జిగా మంత్రి పేర్ని నాని
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నియమితులయ్యారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను మార్చింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పేర్ని నానిని నియమించింది. ఇదిలా ఉంటే ఉపముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న నేపథ్యంలో బాధ్యతలు ఎక్కువైనందున ఆళ్ల నానికి ఇన్చార్జి మంత్రి పదవి నుంచి ఉపశమనం కల్పించారు. ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల నానిని మార్చి మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు. -
ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం ఎదురైంది. జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్లో అందరికంటే సీనియర్ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో శాఖలు మారిన మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత కూడా పరాభవం తప్పలేదు. వీరికి కూడా జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో చోటు దక్కలేదు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావును పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అనంతపురం ఇన్చార్జిగా కామినేని శ్రీనివాస్ స్థానంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్థానం కల్పించారు. జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ సీఎస్ దినేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాకు యనమల రామకృష్ణుడు, వైఎస్సార్ జిల్లాకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, చిత్తూరు జిల్లాకు అచ్చెన్నాయుడిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు.