DUVVA
-
AP: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఎగిసిపడుతున్న మంటలు!
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చలువు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పాపం ముసలయ్య.. ఓటేసి మృతి
సాక్షి, పశ్చిమ గోదావరి: ఎన్నికలు సందర్భంగా జిల్లాలోని దువ్వ పోలింగ్ కేంద్రంలో అపశృతి చోటుచేసుకుంది. బూత్ నెంబర్ 15లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన బంగారు ముసలయ్య అనే వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ మృతి చెందారు. దీంతో పోలింగ్ కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓటు వేయడానికి ఆయన ఉదయమే వచ్చినప్పటికీ ఎక్కువసేపు క్యూలైన్లో నిలబడటం వల్ల కుప్పకూలిపోయారని స్థానికులు తెలిపారు. -
జీవనాధారమే ఉసురు తీసింది
తణుకు : కుటుంబానికి జీవనాధారంగా నిలిచిన కుటీర పరిశ్రమే వారిని కబళించింది. వారు తయారు చేసిన బాణసంచా భార్యాభర్తల్ని సజీవ దహనం చేసింది. తణుకు మండలం దువ్వలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో వేగిరౌతు సత్యనారాయణ (55), ఆయన భార్య మణికుమారి (50) సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో బాణసంచా పెద్దఎత్తున పేలడంతో ఇంట్లో ఉన్నవారిని రక్షించేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు నివసిస్తున్న రెండు పోర్షన్ల తాటాకిల్లు నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైంది. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బొగ్గుల్లా మారాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రమాదంతో దువ్వలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంట్లోనే నిల్వ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మృతుడు సత్యనారాయణ భార్య రామలక్ష్మి 15 ఏళ్ల క్రితం మరణించడంతో అదే గ్రామానికి చెందిన మణికుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఆ గ్రామంలోనే వేరే ఇంట్లో సత్యనారాయణ, మణికుమారి నివాసం ఉంటున్నారు. సత్యనారాయణకు శ్రీనివాస్, రామశివాజీ, హరికృష్ణ అనే కుమారులతోపాటు కుమార్తె చంద్రకళ ఉన్నారు. వీరందరికీ వివాహాలు కావడంతో తణుకు పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. శ్రీనివాస్, రామశివాజీ గ్రామంలోని వయ్యేరు కాలువ గట్టు సమీపంలో బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గతంలో అక్కడే పనిచేసిన అనుభవం ఉన్న సత్యనారాయణ అక్కడి నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి వద్దే బాణసంచా తయాచే చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాడని స్థానికులు తెలిపారు. 2013లో ఇదే గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. రక్షించే అవకాశం లేక.. : దువ్వ గ్రామంలోని మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో తాటాకింట్లో సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి యజమాని తన సామగ్రిని ఒక పోర్షన్లో భద్రపరచుకుని హైదరాబాద్లో ఉంటున్నారు. ఇంటిని ఆనుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం, ప్రమాదం జరిగిన సమయంలో పెద్దఎత్తున బాణాసంచా పేలడంతో గ్రామస్తులు వారిద్దరినీ రక్షించే సాహసం చేయలేకపోయారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. భార్యాభర్తలు ఒకే గదిలో బొగ్గులా మాడి ఉండటం చూపరులను కలచివేసింది. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆద్యంతం నిర్లక్ష్యమే.. బాణసంచా తయారీ కేంద్రాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడం.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి సీజన్లో హడావుడి చేయడం మినహా ఆ తర్వాత వీటి గురించి పట్టించుకునే నాథులు ఉండటం లేదు. ఫలితంగా బాణసంచా తయారీ కేంద్రాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. l 2010లో ఉంగుటూరు మండలం వెల్లమిలి్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8మంది మృత్యువాత పడ్డారు. ఈ గ్రామం తాటాకు టపాసుల తయారీ కేంద్రంగా పేరొందింది. దాదాపు 40 కుటుంబాలు దీపావళికి రెండు, మూడు నెలలు ముందు నుంచే టపాసుల తయారీలో నిమగ్నమై ఉంటారు. ఈ ఘటన అనంతరం అప్పటి ఎస్సైను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. l 2010లో పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో అనుమతులు లేకుండా ఒక ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖండవల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. l 2012లో ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సత్యనారాయణ అనే వ్యక్తి అన«ధికారికంగా బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. l 2013లో తణుకు మండలం దువ్వలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. -
వైభవంగా కలశాభిషేకం
తణుకు : వందల మంది మంది మహిళలు శిరస్సుపై కలశాలు ధరించి ఊరేగింపులో పాల్గొనడంతో గ్రామంతా సందడి నెలకొంది. అంతటా భక్తిభావం పొంగిపొర్లింది. తణుకు మండలం దువ్వ గ్రామంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వేంచేసియున్న శ్రీ పర్వత వర్థినీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ మహా రుద్రయాగ మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సహస్ర కలశాభిషేక పవిత్రోత్సవాన్ని నిర్వహించారు. సుదర్శన హోమం, మహారుద్రాహవనం, మహా పూర్ణాహుతి జరిపారు. తొలుత సుమారు 1500 మంది మహిళలు గ్రామంలో కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ వైదిక ఆగమ సలహాదారు జంధ్యాల వెంకట జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు జంధ్యాల బాలకృష్ణ, కామర్సు సూర్య రామారావు, యాగ నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
యాగాలతో ఇనుమడించే తేజస్సు
దువ్వ (తణుకు టౌన్) : పవిత్ర దేవాలయాల్లో ధర్మాధికారులు, అర్చకులు భక్తి విశ్వాసాలతో వివిధ హోమాలు, యాగాలు చేయడం ద్వారా దేవతామూర్తుల్లో తేజస్సు, శక్తి, మహిమ పెరుగుతాయని కంచి కామకోటి పీఠాధిపతుల శిషు్యలు కళావాచస్పతి శ్రీనారాయణేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. బుధవారం తణుకు రూరల్ మండలం దువ్వ గ్రామంలోని శ్రీనాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో కలుష భావాలు తొలగాలన్నారు. ధర్మాసక్తి, దైవ భక్తి, కలగడంతో ప్రజలకు మనశ్శాంతి ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. వీటి ఫలి తంగా సనాతన భారతీయ హిందూ మత పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా రుద్రహవనం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం గ్రామంలో మహిళలు వెయ్యి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ప్రభుత్వ ఆగమన సలహాదారు జంధ్యాల జగన్నా«థశాస్త్రి, జంధ్యాల బాలకృష్ణ, కామర్సు సూర్య రామారావు, టీటీడీ చతుర్వేద పండితులు జాగర్లపూడి వీరభద్ర శర్మ పాల్గొన్నారు. -
ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం
-
మీ వెంటే ఉంటా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వర్షాలు అన్నిచోట్లా కురిశాయి. పంటలు పాడైపోయి రైతులు అల్లాడిపోతుంటే ఇంకా అంచనాలేంటి. సీఎం చంద్రబాబునాయుడును నిలదీయండి. మీ వెంట నేనుంటా. మొద్దు సర్కారుపై పోరాడదాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించేందుకు శుక్రవారం తణుకు మండలం దువ్వ గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్ అక్కడి పొలాలను పరిశీలించారు. మోకాల్లోతు బురదలో దిగి పాడైపోయిన పంటలను పరిశీలించారు. ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ‘చంద్రబాబు ఇక్కడకు వచ్చారా.. కనీసం ఇక్కడి ఎమ్మెల్యే అయినా వచ్చారా’ అని ప్రశ్నించారు. ‘లేదు.. కనీసం స్థానిక నాయకులు, అధికారులు కూడా రాలేదు’ అంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పా రు. ఇందుకు జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. ‘అపార నష్టం జరిగి అన్నదాతలు నిలువునా నష్టపోయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. కనీసం రైతులకు భరోసా కలిగిం చేలా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారు ణం. మీరు, నేను కలిసి పోరాడదాం. మొద్దు సర్కారు మెడలు వంచుదాం’ అని జగన్ అన్నారు. రైతుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వా న్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు సిద్ధాంతం వద్ద జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్కు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ నేరుగా దువ్వ గ్రామానికి చేరుకుని ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంట చేల వద్దకు వెళ్లారు. మోకాల్లోతు బురద ఉన్నా లెక్కచేయక పొలాల్లోకి దిగారు. జగన్ రాకకోసం అక్కడ వేచిచూస్తున్న వందలాదిమంది రైతులతో మాట్లాడారు. ‘రంగుమారిన ధాన్యం ఉంది. పనల మీద తడిసిన ధాన్యం ఉంది. మొలకలొచ్చిన ధాన్యం ఉంది. వీటన్నిం టికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఇప్పటికీ రుణమాఫీ కాలేదన్నా.. నేలవాలిన వరి పంటను పరిశీలిస్తుండగా.. కౌలు రైతులు తోరాటి శ్రీనివాస్, కడియం ప్రసాద్ పరుగు పరుగున వచ్చి.. ఇది తాము సాగుచేసిన ఏడెకరాల పొలమని వైఎస్ జగన్కు వివరించారు. ‘మేం రైతుమిత్ర గ్రూపు ద్వారా చెరో రూ.30 వేల రుణం తీసుకున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే నిజమే అనుకున్నాం. ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం గానీ రుణాల మాఫీ కాలేదు’ అని చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు వర్షాల దెబ్బకు పంటలు దెబ్బతిని నష్టపోయాం’ అని వాపోయారు. మరో రైతు అడ్డాల కోటేశ్వరరావు వైఎస్ జగన్ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. రోడ్డుమీద వేసిన పనలను చూపిస్తూ వర్షాలకు ఇలా నష్టపోయామ య్యా అని ఆవేదన చెందారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ఇది మోసకారి సర్కారు.. అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. కాసాని రంగా, గూడుపు దానయ్య అనే రైతులు రోడ్డుకు దూరంగా ఉన్న తమ పొలాన్ని జగన్మోహన్రెడ్డికి చూపించారు. రోడ్డు వెంబడి పొలాల్లో జరి గిన నష్టాన్నే అంచనా వేస్తున్న అధికారులు తమ పొలాలు చూసేందుకు రాలేదని వివరించారు. జగన్ స్పందిస్తూ.. ‘వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయని తెలుసు. ఇంకా లెక్కలేంటి’ అని వ్యాఖ్యానించారు. దానేశ్వరి అమ్మవారి సన్నిధిలో.. దువ్వ గ్రామంలోలోని దానేశ్వరి అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపిన వైఎస్ జగన్ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు, రైతులను పరామర్శిం చేందుకు వచ్చిన వైఎస్ జగన్కు అన్నదాతలు ఎక్కడికక్కడ నీరాజనం పలికారు. ‘కనీసం మా కష్టాన్ని చూసేందుకు ఇంతవరకు ముఖ్యమం త్రి రాలేదు. ఒకరిద్దరు మంత్రులు వచ్చినా గట్ల మీదనుంచే చూసి వెళ్లిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులూ పర్యటించలేదు. వైఎస్ జగన్ నేనున్నాంటూ ముందుకొచ్చి భరోసా నింపా రు’ అని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి సిద్ధాంతం మీదుగా దువ్వ గ్రామానికి చేరుకున్న జగన్ పొలాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోంచి జాతీయ రహదారిపైకి చేరుకునేందుకు రెండు గంటలకుపైగా సమయం పట్టింది. కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్రమంలో ఎక్కడికక్కడ తన కోసం బారులుతీరిన మహిళలు, యువకులు, వృద్ధులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఊరు ప్రారంభంలో నాగలక్ష్మి అనే మహిళ ఆయనకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. పర్యటన ముగించుకుని తిరిగి రాజమండ్రి వెళ్తుండగా, తణుకు అడ్డరోడ్డు వద్ద తన కోసం వందలాది మంది వీఆర్ఏలు వేచి చూస్తున్నారని తెలిసి వైఎస్ జగన్ వాహనం దిగి వెళ్లి వారితో మాట్లాడారు. వినతిపత్రం స్వీకరిం చారు. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వీఆర్ఏలు ‘వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు తానేటి వనిత, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, ఘంటా మురళి, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తోట గోపీ, చీర్ల రాధయ్య, పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి గోలి శరత్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొద్దాని శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి ముక్కు కాశిరెడ్డి, యువజన విభాగం నేత చిట్టిబొమ్మ పవన్, పార్టీ సంయుక్త కార్యదర్శి పసుపులేటి శేషు పాల్గొన్నారు. అందరినీ పలకరిస్తూ.. ఓపిగ్గా సమస్యలు వింటూ.. పొలాల నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గ్రామంలో రోడ్డు వెంబడి తన కోసం ఆగి ఉన్న ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. కరచానం చేశారు. ‘అక్కమ్మా.. చెల్లెమ్మా.. చిన్నమ్మా, అవ్వా, తాతా’ అంటూ అందరితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన కోసం వేచిచూస్తున్న వృద్ధారాలు కొఠారు మహాలక్ష్మిని చూసిన జగన్ కారు దిగి వెళ్లారు. ఆయ నను చూసి చలించిపోయిన ఆమె తన బాధలను చెప్పుకుంది. అర్హత ఉన్నా అధికారులు తనకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయింది. ఇందుకు జగన్ స్పందిస్తూ.. పింఛను రాకుంటే కోర్టులో కేసువేద్దామని భరోసా ఇచ్చారు. ఊళ్లో చెరువు పరిస్థితి బాగోలేదని, తాగునీటికి, పశువుల స్నానాలకు, దుస్తులు ఉతికేందుకు అన్నింటికీ ఒక్కటే చెరువు వాడుతున్నారని మహిళ మంగతాయారు వాపోయింది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ ప్రభుత్వంలో అన్నీ ఇలానే ఉంటాయమ్మా..’ అంటూ పక్కనే ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి నాగేశ్వరరావుకు ఈ సమస్యపై పోరాడాల్సిందిగా సూచించారు. -
ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం: వైఎస్ జగన్
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వ, వరిఘేడులలో పంటపొలాలను ఆయన పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వర్షాలతో రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. తణుకులో వీఆర్ఏలు నిర్వహిస్తున్న దీక్షకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. నేరుగా ఎంపికైన వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ కు వినతిపత్రం సమర్పించారు. వీఆర్ఏలతో పాటు అంగన్ వాడీల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం జిల్లాకు రాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.