Elimination of child labor
-
బాలురా.. కార్మికులా..
బడి బయట పనిలో ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాల బాట పట్టించాల్సినవారే.. పిల్లలతో పనులు చేయిస్తున్నారు. పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూనలకు కృషి చేయాల్సిన ఉపాధ్యాయులే పిల్లలతో పనిచేయిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఎంఈవో బలిరాం రాథోడ్ పాఠశాలలవారీగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. వాటిని ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలనుంచి విద్యార్థులను తీసుకువచ్చి పుస్తకాలను మోయించారు. ఎంఈవో సాక్షిగానే ఇదంతా జరగడం గమనార్హం. - నిజాంసాగర్ -
బాలల బంధువు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్’ ఇప్పటికి 752 మంది పిల్లలకు విముక్తి పనిలో పెట్టుకున్న యజమానులకు జరిమానా {పత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా దాడులు ఇంకా పనుల్లో మగ్గుతున్న బాలలెందరో.. ఆపరేషన్ స్మైల్ కింద 2015 జనవరి 1 నుంచి 31 వ రకు 283 మంది బాలలను, జూలై 1 నుంచి 31 వరకు 160 మందిని చేరదీశారు. అదేవిధంగా 2016 జనవరి 1 నుంచి 31 వరకు 309 మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు.పిల్లలను పనిలోపెట్టుకున్న యజమానులకు 2015 జనవరి 1 నుంచి 31 వరకు రూ.5.58 లక్షలు, జూలై 1 నుంచి 31 వరకు రూ.4 లక్షలు జరిమానా విధించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆప్యాయంగా పలకరిస్తున్న ఈ చిత్రంలోని పిల్లలు బాలకార్మికులు. నగర శివారులోని ఏనుమాముల, పైడిపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో కొందరు బాలకార్మికులు పనిచేస్తున్నారని పోలీస్ కమిషనర్కు జనవరి 29న సమాచారం అందింది. ఈ మేరకు ‘ఆపరేషన్ స్మైల్’లో భాగంగా ఆయన వెంటనే హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసు బృందాన్ని అలర్ట్ చేశారు. దీంతో వారు పైడిపల్లి, ఏనుమాములలోని ఇటుక బట్టీల వద్ద ఏకకాలంలో దాడులు నిర్వహించగా 48 మంది చిన్నారులు పని చేస్తూ కనిపించారు. ఆ బాలలను వరంగల్లోని చైల్డ్హోంకు తరలించారు. అన ంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో ఇటుక బట్టి యజమానికి నోటీసులు జారీ చేశారు. ఈ బాలలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని స్వస్థలాలకు పంపించారు. -
జాతీయ అవార్డు అందుకున్న ఎంఈఓ అంజయ్య
కోహీర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యారంగానికి చేసిన కృషికి గాను కోహీర్ ఎంఈఓ అంజయ్య జాతీయ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంటర్ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ సంస్థ 2013-14కిగాను ఎంపిక చేసిన నేషనల్ స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎన్ఎస్ఐఈఏ) జాతీయ స్థాయి అవార్డు ఆయనకు లభించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి జుబేన్ ఇరానీ అవార్డును, ప్రశంస పత్రాన్ని అంజయ్యకు అందజేశారు. దేశంలో 33 మంది విద్యాధికారులకు ఈ అవార్డులు ఇచ్చారు. అందులో అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంఈఓలు అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు కూడా తెలంగాణాకే చెందిన వారు కావడం విశేషం. అందులో ఒకరు కరీంనగర్కు చెందిన ఎంఈఓ రాజయ్య కాగా మరొకరు కోహీర్ ఎంఈఓ అంజయ్య. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. 38 అవార్డులు..సొంతం అంజయ్య గతంలో గతంలో 1990లో ఎన్ఎస్ఎస్ గోల్డ్ మెడల్ లభించింది. 1993లో అక్షరాస్యత సాధనకు కృషి చేసినందుకు జిల్లా స్థాయి అవార్డు అందుకొన్నారు. 1994లో జిల్లా స్థాయి యూత్ అవార్డు, 1997లో జన్మభూమి అవార్డు, 41 సార్లు రక్తదానం చేసినందుకు 2008-2009లో బ్లడ్ డొనేషన్ అవార్డు, 2009లో బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు లభించింది. 2010లో రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు, 2011 లో జిల్లా స్థాయి బె్స్ట్ హెడ్మాస్టర్ అవార్డు, 2011-12లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎంఈఓ అవారుల్డు లభించాయి. వీటితోపాటు ఇప్పటి వరకు అంజయ్యకు 38 అవార్డులు ప్రశంసాపత్రాలు లభించాయి. మున్ముందు ఆయన విద్యా రంగ సేవలు విస్తరించి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశిద్దాం.