evening walk
-
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదయం వాకింగ్ ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం పూట వాకింగ్సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాకింగ్తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చుగాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు. -
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
గోవిందపల్లెలో జంట హత్యలు
- మాజీ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, అతని బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దారుణహత్య శిరువెళ్ల/రుద్రవరం: మండలంలోని గోవిందపల్లె గ్రామం నుంచి మసీదుపురం వెళ్లే అడ్డరోడ్డులో శనివారం రాత్రి జంటహత్యలు కలకలం రేపాయి. ఘటనలో మండల వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్రెడ్డి(52), ఇతని బామ్మర్తి శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి రోడ్డు పక్కనున్న పంట కాల్వలో పడేశారు. వీరిద్దరూ రోజులాగానే శనివారం రాత్రి వాకింగ్కు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఈ హత్య జరిగినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే వాకింగ్కు వెళ్లిన ఇద్దరూ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. రింగ్ అవుతున్నా తీయకపోవడంతో ఆందోళన చెందారు. బంధువులతో కలిసి వెళ్లి చూడగా పంట కాల్వలో విగజీవులుగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి మృతదేహంపై వరిగడ్డి కప్పి ఉండగా.. ప్రభాకర్రెడ్డి మృతదేహం కాల్వలో బోర్లా పడి ఉండటం గుర్తించారు. సీఐ ప్రభాకర్రెడ్డి, డీఎస్పీ ఈశ్వర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన డీఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్ను రప్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలాఉండగా సుమారు 30 ఎళ్ల క్రితం ప్రభాకర్రెడ్డి తండ్రి నారాయణరెడ్డిని ఆళ్లగడ్డలో భూమా వర్గం హత్య చేయడం గమనార్హం. ఆ తర్వాత గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా తాజాగా జరిగిన జంట హత్యలు చర్చనీయాంశంగా మారాయి. గంగుల వర్గం ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. -
ఆ రోజు ఏం జరిగిందంటే...
1 ఒక ప్రసిద్ధ కంపెనీకి రమణ యజమాని. ఆఫీసు నుంచి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతాడు రమణ. అందుకే... ఆఫీసు పరిసరాల్లోనే ఈవినింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఈవినింగ్ వాక్ చేస్తూ హత్యకు గురయ్యాడు. రమణ హత్యకు గురయ్యాడనే వార్త సంచలనం సృష్టించింది. ఉద్యోగుల రోదనలు మిన్ను ముట్టాయి. ‘‘రమణగారికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ‘‘వ్యక్తిగతంగా తెలియదుగానీ...వృత్తి పరంగా మాత్రం చాలా కంపెనీలతో పోటీ ఉంది. ఇక్కడికి దగ్గరిలో ఒక పోటీ కంపెనీ ఉంది. దాని యజమాని రవికి మా రమణగారికి ఈమధ్య తీవ్రమైన గొడవ జరిగింది’’ అని చెప్పాడు కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి కుమార్ ఆఫీసుకు చేరుకున్నారు. ‘‘రమణ హత్యలో మీ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నాం. హత్య జరగడానికి ముందు రమణ వాకింగ్ చేసే ప్రాంతంలో మీరు కనిపించారని తెలిసింది’’ సూటిగా విషయంలోకి దిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ‘‘నాకు రమణకు మధ్య గొడవలు జరిగిన విషయం నిజమేగానీ... అతడిని నేను హత్య చేసేంత గొడవలు ఏమీ కావు. హత్యలు చేసే స్వభావం నాకు లేదు. రమణ వాకింగ్ చేసే సమయంలో నేను కనిపించాననే వార్త... నా గురించి గిట్టని వాళ్లు పుట్టించింది. వ్యాపారం అన్నాక...సవాలక్ష మంది శత్రువులు ఉంటారు. అందరినీ చంపుకుంటూ వెళ్లలేము కదా!’’ అన్నాడు రవి. ‘‘అది సరేగానీ... మీరు వేసుకున్న షూస్ చూపండి’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్కు తన షూ చూపించాడు రవి. ‘‘ఓకే... ఒక్కసారి మీ కారు దగ్గరికి వెళదాం’’ అన్నాడు ఇన్స్పెక్టర్. భయం భయంగానే ఇన్స్పెక్టర్ని కారు దగ్గరికి తీసుకువెళ్లాడు రవి. కారు డోర్ తెరిచి... మ్యాట్ను పరిశీలించాడు ఇన్స్పెక్టర్. ఆ తరువాత... ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాను’’ అన్నాడు రవితో. ఇప్పుడు చెప్పండి... రవి హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? 2 అరవై రెండు సంవత్సరాల హరిప్రసాద్ చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తన పరిధిలో వీలైనంత సహాయం చేస్తుంటాడు. ఏదైనా మంచి పుస్తకం చదవాలనుకున్నప్పుడు ఇంటికి కాస్త దగ్గరలోని తన ఆఫీసుకు వెళ్లి, పుస్తకం చదువుకొని అక్కడే పడుకోవడం అనేది అతడి అలవాటు. ‘ఇంట్లోనే చదవచ్చు కదా’ అని అంటే– ‘ఆఫీసులో నేను ఒక్కడిని ఉంటాను. ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు’ అనేవాడు. అయితే ఇదే అతడి కొంప ముంచింది. ఆరోజు పుస్తకం చదువుకుంటూ ఆఫీసులోనే పడుకొని ఉన్న హరిప్రసాద్ హత్యకు గురయ్యాడు. ఆరాత్రి హత్య జరగడానికి ముందు కొంతసేపు వర్షం పడింది. మట్టి నేల చిత్తడయింది. పోలీసులు ముగ్గురిని అనుమానించారు. 1. రంగయ్య...పాత రౌడీ. చుట్టలు విపరీతంగా కాలుస్తాడు. 2. శ్రీను... ఎప్పుడూ ఎవరితో ఒకరితో తగాద పడుతుంటాడు. గుట్కాలు విపరీతంగా తింటాడు. 3. మోహన్... ఇతడిది కూడా నేరస్వభావం. చెప్పులు వేసుకునే అలవాటు లేదు. ఆఫీసు పరిసరాల్లో... చుట్ట ముక్క ఒకటి కనిపించింది. మరో పక్క రెండు చించిన గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. వీటిని బట్టి రంగయ్య, శ్రీనులకు హత్యతో సంబంధం ఉందనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ ఇది నిజం కాదు. మోహన్ హంతకుడని పోలీసులు కనిపెట్టారు. అంత కరెక్ట్గా ఎలా కనిపెట్టారు? ఆన్సర్ 1. రమణ ఈవినింగ్ వాక్ చేసే ప్రదేశంలో..రోడ్డుకు కొత్తగా తారు వేశారు. రోడ్డు తొక్కకుండా తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. అలా రవి షూకు తారు అంటింది. హత్య చేసి కారులోకి ఎక్కినప్పుడు మ్యాట్ మీద తారు మరకలు పడ్డాయి. ఆఫీసుకు వచ్చిన రవి షూ మార్చాడుగానీ.. మ్యాట్ విషయం మరచిపోయాడు. 2. ఆఫీసు ముందు చిత్తడి నేల మీద చెప్పులు లేని కాళ్ల అడుగులు మోహన్ ని పట్టించాయి. రంగయ్య, శ్రీనులపై అనుమానం రావడానికి పరిసరాల్లో చుట్ట ముక్క, గుట్కా ప్యాకెట్ వేశాడు మోహన్