feat
-
కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది
వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ వేదికగా విరాట్ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్ తరాలకు బెంచ్మార్క్ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship. This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent. I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR — Narendra Modi (@narendramodi) November 15, 2023 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్ వేదికగా అభినందించారు. వెల్డన్ కింగ్కోహ్లీ. హాఫ్ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్.. అదీ వరల్డ్కప్ సెమీఫైనల్లో. టేక్ ఏ బో అంటూ ట్వీట్ చేశారు. Supremely Well done King Kohli @imVkohli 🎉 on Half-century of Centuries 👏 What an amazing feat to achieve and that too in the semi final of the World Cup Take a Bow 🙏 #ViratKohli𓃵 — KTR (@KTRBRS) November 15, 2023 తన సెంచరీల ఫీట్ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా అభినందించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ ట్వీట్ను రీపోస్ట్ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్ను ఉద్దేశించి పోస్ట్ చేశారాయన. ఆప్ జాతీయకన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. Congratulations to Virat Kohli on achieving a historic milestone with his 50th ODI century against New Zealand in the World Cup semifinal. A true legend rewriting records. Keep on inspiring the generations to come. pic.twitter.com/tLaKWv7fNq — Arvind Kejriwal (@ArvindKejriwal) November 15, 2023 -
స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్
సాక్షి, ముంబై: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో సరికొత్త ఫీట్ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లి అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. ఇది ఐపీఎల్లో అతని 50వ 50-ప్లస్ స్కోరుతో ఆకట్టుకునే ఫీట్ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అయితేఈ లిస్ట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్ధసెంచరీలు. 5 సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ఆదివారం ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.దీంతో ఆంపియర్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. (NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను గిప్ట్గా అందుకున్నాడు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన కోహ్లి (82 నాట్ అవుట్)గా నిలిచాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (73)తో కలిసి 148 ఓపెనింగ్ పార్టనర్షిప్తో శుభారంభం చేసి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను సంస్థ కోహ్లీకి అందించింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ను కోహ్లికి అందించారు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. (Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?) కాగా ఆర్సీబీ ఆడే ప్రతి IPL మ్యాచ్ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను 'ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కి ఆర్సీబీ ప్లేయర్కు అందజేస్తుంది. ఆర్సీబీకి అధికారిక భాగస్వామి ఆంపియర్. The Limited Edition RCB themed Primus is set to be unveiled today. And the most electrifying RCB player of the match will get his very own Limited Edition scooter! Pre-booking for the Limited Edition RCB themed Primus at just ₹499 is live on our website NOW! pic.twitter.com/xkzeEEBPZd — Ampere Electric Vehicles (@ampere_ev) April 2, 2023 మరోవైపు గత వారమే లాంచ్ చేసిన ఆంపియర్ ప్రైమస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏప్రిల్ మొదటి వారం నుండి పరిమిత కాలానికి రూ. 499 ప్రీ-బుకింగ్లకు అందుబాటులో ఉంటుంది. తమ కంపెనీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ ప్రైమస్ అని సంజయ్ వెల్లడించారు.లిమిటెడ్ ఎడిషన్ ఆంపియర్ ప్రైమస్ జట్టు స్ఫూర్తిని, క్రీడను, హర్ గల్లీని ఎలక్ట్రిక్గా మార్చాలనే తమ ఉద్దేశ్యానికి జీవం పోసిందన్నారు. తమకు 1.80 లక్షల మంది వినియోగదారులున్నారని కంపెనీ పేర్కొంది. -
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ : చెంగిచర్లలో నివాసముంటున్న సందీప్, స్నిగ్థ బసు దంపతుల కూతురు సాయి అలంకృత అరుదైన ఫీట్ చేసింది. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. పిన్న వయసులోనే అదిక బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తోంది. చదవండి: మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా? -
ఎత్తైన కొండల మధ్య అద్భుత విన్యాసం
-
ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి...
కాలిఫోర్నియా: సాహసమే ఊపిరిగా బతికేవాళ్లు తాడు మీద బ్యాలెన్స్గా నడవడం, దానిపై యోగాలాగా ఆక్రోబేటిక్ విన్యాసాలు చేయడం మనకు కొత్తేమి కాదు. ఓ ఎత్తై పర్వత శిఖరాగ్రం నుంచి మరో ఎత్తైన పర్వత శిఖరాగ్రంపైకి తాడుకట్టి దానిమీద బ్యాలెన్స్గా నడిచే వాళ్లను కూడా చూసే ఉంటాం. కానీ ఎత్తైన పర్వత శిఖరంపై నుంచి కిందకు జాలువారే బీభత్సమైన జలపాతాల ముందు నుంచి కొండలపైకి సురక్షితంగా తాడుపై బ్యాలెన్స్గా నడవడాన్ని చూడకపోవచ్చు. అరుదుగా చూసినా నిమిషానికి 8, 60,000 గ్యాలన్ల నీరు కిందకు పడే వర్నల్ జలపాతం ముందు ఓ సాహసి నిర్వహించిన ఆక్రోబేటిక్ విన్యాసాలను మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చూడలేదు. కారణం ఈ వాటర్ ఫాల్ ముందు ఇలాంటి విన్యాసాలు సాహసించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. కింబర్లి వెల్జిన్ బృందమే మొదటిది. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోస్మైట్ నేషనల్ పార్కులో వర్నల్ అనే జలపాతం ఉంది. దాన్ని దూరం నుంచి చూస్తుంటే పర్యాటకులకు భయంతో వణుకు పుడుతుంది. అలాగే చూస్తే కళ్లు కూడా తిరుగుతాయి. ఎక్కువ సేపు ఉంటే వాటర్ సిక్కు కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి అతి సమీపం నుంచి ఓ కొండపైనుంచి మరో కొండకు తాడుకట్టి దానిపై బ్యాలెన్స్గా నడవడమే కాకుండా విన్యాసాలు చేయడం అంటే సాహసానినే సాహసం. ఎందుకంటే అక్కడ బయట సాధారణ తాడుపై నడిచినట్లు అక్కడి తాడుపై ఉండదు. చిమ్ముతున్న నీటి తుంపర్లతో కాళ్లు చేతులు తడుస్తుండడమే కాకుండా తాడు కూడా తడిసిపోయి జారుడుగా ఉంటుంది. దానిపై కింబర్లి వెల్జిన్ అనే 23 ఏళ్ల ముందుగా విన్యాసాలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెతోపాటు ఆమె బాయ్ఫ్రెండ్ ర్యాన్ జెంక్స్, స్నేహితులు స్కాట్ హాంగ్, ఎలెనా పోల్చుక్, మైఖేల్ మెల్నల్, సారా విహాన్లు ఒక పర్వతం నుంచి ఒక పర్వతానికి తాడుపై నడిచి రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఇలాంటి ప్రయత్నం సాహసికులు ఎవరూ చేయలేదు. కింబర్లి వెల్జిన్ బృందమే మొదటి సారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టింది.