breaking news
ganesh nimmajjanam
-
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్సాగర్లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్బండ్పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్బండ్పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్ఫామ్కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం
-
HYD : ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు
-
గంగ ఒడికి గణనాథుడు
– అత్యంత వైభవోపేతంగా నిమజ్జనోత్సవం – ఉదయం 10 గంటల నుంచి నిమజ్జనానికి తరలిన వినాయకులు – వీధివీధిలో మిన్నంటిన సంబరాలు – వేషధారణలు, భాజాభజంత్రీలు – వెల్లివిరిసిన మతసామరస్యం కర్నూలు(కల్చరల్): నింగి నిండా నిర్మలమైన వాతావరణం... చెమ్మ నింపుకున్న మేఘాల సమావేశం... అప్పుడప్పుడూ కురుస్తూ చినుకుల చప్పుడు చేస్తూ మేఘుడు నింగి నుంచి ఆశీస్సుల జల్లులు కురిపిస్తున్న వేళ గణనాథుడు గంగమ్మ ఒడికి తరలివెళ్లాడు. గత తొమ్మిది రోజులుగా ఘనమైన పూజలందుకున్న ఏకదంతుడు భాజాభజంత్రీల మధ్య, చప్పట్లు, తాళాల నడుమ... భక్తజనుల సంబరాల నడుమ నిమజ్జనానికి కదలివెళ్లాడు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రాంభొట్ల దేవాలయం నుంచి నిమజ్జనోత్సవ ఊరేగింపు ప్రారంభమయ్యింది. రాంభొట్ల ఆలయం నుంచి కుమ్మరి వీధి, చిత్తారి గేరి, వన్టౌన్ కూడలి, గడియారం ఆసుపత్రి కూడలి, పెద్దమార్కెట్ కూడలి, అంబేద్కర్ కూడలి దాటి గణేష్ విగ్రహాలు కొండారెడ్డిబురుజు కూడలిని చేరుకున్నాయి. హనుమాన్ జంక్షన్ నుంచి ప్రారంభమైన రెండో ఊరేగింపు ఆనందోత్సాహాల నడుమ... కొత్తబస్టాండ్, బంగారుపేట, మౌర్యా ఇన్ సర్కిల్ మీదుగా రాజ్విహార్ సెంటర్ను చేరుకుంది. కల్లూరు చౌరస్తా నుంచి ప్రారంభమైన మూడో ఊరేగింపు కష్ణానగర్ హైవే కూడలి, బిర్లాగేటు, విజ్ఞాన మందిరం, టీటీడీ కళ్యాణ మండపం మీదుగా మద్దూర్నగర్, గాయత్రి ఎస్టేట్స్ మీదుగా వినాయక ఘాట్ను చేరుకున్నది. నగరంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన గణేశ్ విగ్రహాలు మధ్యాహ్నం 2 గంటలకు వినాయక ఘాట్ను చేరుకున్నాయి. వెంకటరమణ కాలనీ, సంతోష్నగర్, జొహరాపురం, బి.తాండ్రపాడు, నంద్యాల చెక్పోస్టు తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలు సాయంత్రం వినాయక ఘాట్ను చేరుకున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నిమజ్జనోత్సవం ప్రారంభం నగరంలోని వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్లో ఏర్పాటు చేసిన తెప్పపై విద్యార్థులు నత్యాలు ప్రదర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ వినాయక ఘాట్ వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత భరతమాతకు పూజలు చేశారు. పరిపాలనా గణపతికి డిప్యుటీ సీఎం నిమజ్జనం గత తొమ్మిది రోజులుగా కలెక్టరేట్లో పూజలందుకున్న పరిపాలనా గణపతిని వినాయక ఘాట్ వద్ద తొలి నిమజ్జనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కష్ణమూర్తి పూజలు చేసిన అనంతరం పరిపాలన గణపతిని నిమజ్జనం చేశారు. తెప్పపై ఉంచిన రాంభొట్ల ఆలయ గణపతికి డిప్యుటీ సీఎం కె.ఇ.కష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఎస్పీ ఆకే రవికష్ణ, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. అనంతరం నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన విగ్రహాలను వరుసగా వినాయక ఘాట్లోని క్రేన్ల ద్వారా నిమజ్జనం చేశారు. సామరస్యానికి ప్రతీక గణేశ్ ఉత్సవాలు... కర్నూలులో గణేశ్ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ తెలిపారు. స్థానిక వినాయక ఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవంలో ఆయన సందేశాన్ని అందిస్తూ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథుడు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకు గణేష్ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు భారతీయులు గణేశ్ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో భారతీయ సంస్కతికి ప్రతీకగా జరుపుకుంటున్నారన్నారు. కర్నూలు నగరం ముపై ్ప ఏళ్లకు పైగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్కే ఆదర్శంగా నిలిచిందన్నారు. వెల్లివిరిసిన మతసామరస్యం నగరంలో బక్రీద్ పండుగ, గణేశ్ నిమజ్జనం ఒకే రోజున కలసిరావడంతో ముస్లింలు, గణేష్ భక్తమండలి సభ్యులు కలసిమెలసి రెండు పండుగలను అత్యంత ఆనందోత్సాహల నడుమ జరుపుకున్నారు. నగరంలో వన్టౌన్, పూలబజార్, బండిమెట్ట, గడ్డా వీధి, కుమ్మరి వీధి, మేదారి వీధి, బుధవారపేట, కొత్తపేట, ఎన్ఆర్ పేట, అబ్బాస్నగర్, అమీన్ అబ్బాస్నగర్, ఖడక్పుర తదితర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనోత్సవంలో పలువురు హిందువులు, ముస్లింలు పాల్గొని ప్రసాదాలు పంపిణీ చేసుకున్న దశ్యం అందరినీ ఆకట్టుకుంది. నగర వీధుల్లో గణేష్ విగ్రహాలను తరలిస్తున్న వేళ భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో గణేష్ భక్తులు చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అన్ని మతాల, కులాల యువకులు పాల్గొనడం విశేషం. బహుమతి ప్రదానం గణేష్ ఉత్సవాల సందర్భంగా బుధవారపేటలోని కేశవ మెమోరియల్ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వ పోటీలలో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు డిప్యుటీ సీఎం కె.ఇ.కష్ణమూర్తి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి బహుమతులు అందజేశారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా కేసీ కెనాల్లో ఏర్పాటు చేసిన తెప్పపై నత్యజ్యోతి సంస్థ కళాకారులు ప్రదర్శించిన తెలుగు తేజం నత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం అన్నపూర్ణ వసతి గహం విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ల విన్యాసం శ్రీగణనాథం నత్యప్రదర్శన, పలుకే బంగారం, తారంగం, గణేష కీర్తన తదితర నత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవ కమిటీ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న అతిథులందరికీ జ్ఞాపికలు అందజేసింది. కార్యక్రమంలో గణేష్ మహోత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు కపిలేశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు కిష్టన్న, మాకం నాగరాజు, కాళింగి నరసింహవర్మ, సందడి సుధాకర్, సందడి మహేష్, ప్రాణేష్, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.