Global Investors Meet
-
పరిశ్రమలు క్యూ...
కొత్త పెట్టుబడులను ఆకర్షించడం.. వచ్చిన పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో గతంలో ఎన్నడూలేని విధంగా ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్నింటి పనులు ప్రారంభదశలో ఉన్నాయి. వీటికి అదనంగా దావోస్ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా 38 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఒకేచోట లభించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరుతో యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 86 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. మూడేళ్ల నుంచి సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది. కొత్తగా 3 పారిశ్రామిక కారిడార్లు.. ♦ విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్. ♦ విశాఖ–చెన్నై కారిడార్ అభివృద్ధిలో భాగంగా 2 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. ♦ విశాఖలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లను, చిత్తూరు నోడ్లో ఏర్పేడు, శ్రీకాళహస్తి క్లస్టర్లలో అంతర్గత సదుపాయాలను కలి్పంచారు. ♦ వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టెర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. ♦ నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలు. అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు. ♦ వీసీఐసీలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలోని 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్. ♦ కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఎంఎస్ఈసీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక. రూ.2,595.74 కోట్ల నిక్డిక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ. ఇప్పటికే 66 పరిశ్రమలు కొలువుదీరాయి. రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. ♦ కృష్ణపట్నంను పారిశ్రామిక నోడ్గా తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. ♦ పారదర్శక పెట్టుబడుల కోసం ప్రభుత్వం ‘పారిశ్రామిక అభివృద్ధి విధానం–2023–27’ను తీసుకొచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం’ పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక పాలసీ. 9,140 ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. ♦ వీటికి గత ప్రభుత్వం జూన్ 2019 నాటికి పెండింగ్లో పెట్టిన రూ. 3,409 కోట్ల ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. ♦ 11,059 ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన రూ.1,324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిల (7,039 ఎంఎస్ఎంఈలకు మంజూరు) ఎరియర్లను కూడా అందజేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ. 380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్ చేసింది. ♦ వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్టైల్ యూనిట్లకు రూ.242.13 కోట్లు ఇచ్చింది. సీఎం ప్రారంభించిన కొన్ని ప్రముఖ పరిశ్రమలు.. అచ్యుతాపురంలో యకహోమా టైర్స్.. జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఏర్పాటు చేసిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ)ని సీఎం జగన్ 2022 ఆగస్టు 16న ప్రారంభించారు. తొలిదశలో రూ.1,384 కోట్లతో హాఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి. యకహోమా గ్రూప్ విశాఖ యూనిట్ను రూ.680 కోట్లతో విస్తరణ చేపట్టింది. 2024 చివరి త్రైమాసికానికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిర్లా గ్రాసిం కాస్టిక్ సోడా యూనిట్.. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపు సుమారు రూ. 2,700 కోట్లతో కాస్టిక్ సోడా తయారీ యూనిట్ను 2022 ఏప్రిల్ 21న సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. అంతకుముందు 2 నెలల క్రితం బిర్లా గ్రూపు వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్ యూనిట్ను ఏర్పాటుచేసింది. బద్వేల్లో సెంచురీ ప్యానల్స్.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలోని గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేశారు. ఈ యూనిట్ తొలిదశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏసీ తయారీ హబ్గా శ్రీసిటీ.. తిరుపతి జిల్లా శ్రీసిటీకి ఏసీ తయారీ యూనిట్లు క్యూ కడుతున్నాయి. బ్లూస్టార్, డైకిన్ వంటి బ్రాండ్లతో పాటు దేశంలోని 20కి పైగా బ్రాండ్లకు సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్ డ్యూరబుల్స్, పానాసోనిక్–యాంకర్ వంటి విడిభాగాల తయారీ యూనిట్లు తమ పెట్టుబడులకు రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, 9,700 మందికి ఉపాధి కల్పించనున్నాయి. కొప్పర్తిలో డిక్సన్ ఉత్పత్తి ప్రారంభం.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లో ఏఐఎల్ డిక్సన్ కంపెనీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. రూ.127 కోట్లతో సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డుల తయారీ యూనిట్ను ఏర్పాటుచేసింది. ఆదిత్య ఇన్ఫోటెక్తో కలిసి డిక్సన్ టెక్నాలజీస్ ఏర్పాటుచేసిన ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ను ఈ ఏడాది జూలై 11న సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరులో ఐటీసీ స్పైసెస్ పార్క్.. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఐటీసీ కూడా రాష్ట్రంలో భారీగా విస్తరిస్తోంది. రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్స్టార్ హోటల్ను, రూ. 200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్కులను ప్రారంభించింది. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసేలా గ్లోబల్ స్పైసెస్ పార్కును అభివృద్ధి చేసింది. దీనిని సీఎం జగన్ సెపె్టంబర్ 2022లో ప్రారంభించారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. చిన్న పరిశ్రమలకు చేయూత ♦ చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఎంఎస్ఎంఈల సంఖ్య1,93,530 ♦ జగన్ సీఎం అయిన తర్వాత కొత్తగా వచ్చిన యూనిట్లు 3.87 లక్షలు ♦ నాలుగున్నరేళ్లలో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 12.61 లక్షలు ♦ ఈ ఏడాది నెలకు సగటున ఏర్పాటైన యూనిట్లు 19,476 ♦ జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అందించిన ప్రోత్సాహకాలు రూ.2,087 కోట్లు ♦ ఎంఎస్ఎంఈల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు 54 ♦ చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిల కోసం జగన్ సర్కార్ చెల్లించిన మొత్తం రూ.1,588 కోట్లు తాజాగా విజయనగరంలో జిల్లా ఎస్.కోటలో రూ.531 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు అభివృద్ధి.. ఇది అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగా, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. అనకాపల్లి, కొప్పర్తిలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు
-
AP: గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్కు విస్తృత ఏర్పాట్లు: సీఎస్
అమరావతి: మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాల మైదానంలో జరగనున్నగ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు)కు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు సీఎస్ సమావేశ మందిరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సంబంధించిన 3వ వర్కింగ్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో రానున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈసందర్భంగా సీఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 3, 4తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దఎత్తున్న విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈసదస్సులో పాల్గొనే పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు,వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు,ఇతర డెలిగేట్లు,తదితరులు అందరికీ ఆహ్వాన పత్రాలు అందించండంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా, వసతి వంటి అన్నిఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. రెండు రోజులపాటు జరగనున్నఈగ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుల్లో వివిధ సెక్టార్లపై పెద్ద ఎత్తున చర్చ జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఏరో స్పేష్ అండ్ డిఫెన్సు,అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్,ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు,హెల్తు కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్,ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రోకెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్,ఎలక్ట్రానిక్స్,స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాలపై పెద్దఎత్తున చర్చ జరగనుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రతి రంగంలోను చర్చకు సంబంధించి ఇతర ప్రతినిధులతోపాటు ఇద్దరు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనే చూడాలని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్కు సంబంధించి ఈనెల 14వతేదీన బెంగుళూర్ లోను,17న చెన్నెలోను,20న ముంబై లోను,24న హైదరాబాదులోను డొమెస్టిక్ రోడ్డు షోలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి తెలిపారు.ఈసదస్సుకు వచ్చే ఆహ్వానితులందరికీ త్వరితగతిన ఆహ్వాన పత్రికలు అందించే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సదస్సులో పాల్గొన్నఆహ్వానితులుకు జ్ణాపికలు అందించేందుకు వీలుగా జ్ణాపికల ఎంపికను కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈసమావేశంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతానికి సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులతో సమీంచారు. ఈసమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త, చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఐటిశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,పరిశ్రమలు శాఖ అధికారులు,సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.అలాగే వీడియో లీంక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ,వై.శ్రీలక్ష్మి,కె.విజయానంద్, ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా ఏపీ ‘పెట్టుబడుల’ సదస్సులు
సాక్షి, అమరావతి: పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖలో మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా పెట్టుబడుల సన్నాహక సదస్సులను ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రోడ్షోలు నిర్వహించేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రణాళికలు రూపొందించింది. సీఎం జగన్ ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు విజయవంతమవ్వడంతో.. అదే స్ఫూర్తితో ఈ రోడ్షోలను కూ డా నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10న త్రివేండ్రం, కోల్కతా, 14న బెంగళూరులో, 17న చెన్నై, అహ్మదాబాద్, 21న ముంబై, 24వ తేదీన హైదరాబాద్లో ఈ రోడ్షోలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వనరులు, ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్ర ధానంగా 13 రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రోడ్ షోలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి. మార్చి 3–4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఆ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడు లు పెడుతూ.. వాస్తవ ఒప్పందాలు చేసుకుంటా యని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్సైట్ను ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన 12 రంగాల్లో దేశీయ, విదేశీ పెట్టబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేవిధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళా శాల గ్రౌండ్స్లో జరిగే ఈ సమ్మిట్కు సంబంధించిన లో గోను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనికి విస్త్రత ప్రచారం కల్పించే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ పదవి చేపట్టిన తర్వాత విజయవాడలో వివిధ దేశాల రాయబారులతో కలిసి డిప్లమాటిక్ సదస్సు నిర్వహించారని, తర్వాత కరోనాతో పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేక పోయామని చెప్పారు. రాష్ట్రంలోని పెట్టుబడుల అవ కాశాలు, వనరులను వివరిస్తూ తైవాన్, యూఏఈ, జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోను, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరా ల్లోను రోడ్షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, మారిటైమ్ రంగాలపై రెండు భారీ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సదస్సులకు ఈవెంట్ పార్టన ర్గా సీఐఐ, నాలెడ్జ్ పార్టనర్గా కేపీఎంజీ వ్యవహరించనున్నాయని తెలిపారు. వీటి ప్రచారానికి ఈవెంట్ మేనేజర్ ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచామన్నారు. అవకాశం కల్పిస్తే.. ఈ రోజునుంచే విశాఖను రాజధాని చేస్తాం.. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీడి యాతో సహా అందరూ రాజకీయాలకు అతీతంగా సహ కరించాలని కోరారు. విలేకరుల అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానమిస్తూ విశాఖను రాజధాని చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అవకాశం కల్పిస్తే ఈ రోజునుంచే విశాఖను రాజధానిని చేస్తామని చెప్పా రు. అంతకుముందు మంత్రులు రాష్ట్ర పరిశ్రమలు, మౌ లిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐ.టి. శాఖల అధికారులు, సీఐఐ, కేపీఎంజీ అధికారులతో సమావేశమై సమ్మిట్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్వలవన్, హ్యండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సంచాలకులు జి.సృజన, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి టి.విజయకుమార్రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మన కన్నా ఆమే బెటర్
-
దటీజ్ తమిళనాడు
-
'98 సంస్థలతో సర్కారు ఒప్పందం'
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేలా 98 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం కార్యక్రమం గురువారం చెన్నైలో ముగిసింది. దీనిలో భాగంగా తమిళనాడు సర్కారు వ్యాపారవేత్తలతో రూ.2.40లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది. మళ్లీ ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం 2017లో నిర్వహించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది.