యూఎస్ రాయబార కార్యాలయ ఉద్యోగి కాల్చివేత
పాకిస్థాన్లోని యూఎస్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పెషావర్కు చెందిన ఉద్యోగి ఫైసల్ సయ్యద్ (33)ని ఆగంతకుడు సోమవారం తుపాకితో కాల్చి చంపాడు. ఆ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. పెషావర్ గుల్బహర్ కాలనీలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న అతడిని ఆగంతకుడు కాల్చి చంపాడని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.