hero akhil
-
ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది!
వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం "ఉప్పెన". ఈ సినిమా రిలీజవకముందే కృతీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన కుర్రకారంతా కృతీ నవ్వుల మాయలో పడి తూగుతున్నారు. ఎక్కడ చూసినా ఆమె పేరే జపిస్తున్నారు. అటు సినీ ఉద్ధండులు కూడా ఆమె అందాన్ని, ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు సెలబ్రిటీలు ఆమె చాలా బాగా నటించిందని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా 'దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్లను బుక్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో దొరక్కపోవచ్చు' అని వేదిక మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరి మాటలను అక్షరాలా నిజం చేస్తూ కృతీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే నాని, సుధీర్బాబు సినిమాల్లో నటించే ఛాన్స్ రాగా నాగశౌర్య చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరోతో జోడీ కట్టే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ క్యూటీ అక్కినేని అఖిల్ సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం బాడీ పెంచుతూ తెగ కష్టపడుతున్నాడు అఖిల్. కథ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. ఇప్పటికే గుర్రపు స్వారీ వచ్చినప్పటికీ ఇంకా సాన పెట్టేందుకే ఈ తపన, కృషి. ఏదేమైనా యంగ్ హీరో అఖిల్ పక్కన, కొత్త హీరోయిన్ కృతీని ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు. చదవండి: చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం: విద్యాబాలన్ Radhe Shyam: జూలై నెలాఖరున రిలీజ్! ఉప్పెన రూ.100 కోట్ల చిత్రం: సుకుమార్ -
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' రిలీజ్ డేట్ ఖరారు
థియేటర్లను పూర్తి సామర్థ్యంతో నడపవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చిన తరుణంలో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లైంది. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజాగా అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్" చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించింది. జూన్ 19న థియేటర్లలో సందడి చేస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాకు కాబోయేవాడు నా షూతో సమానం) కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూన్కు వాయిదా వేసుకోక తప్పలేదు. అదే నెలలో మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' చిత్రం జూన్ 4న రిలీజ్ అవుతోంది. దీనికి అక్కినేని అఖిల్ సినిమాకు మధ్య 15 రోజులు గ్యాప్ ఉండటంతో వసూళ్లపరంగా పెద్ద ఇబ్బందేమీ ఉండనట్లు కనిపిస్తోంది. అసలే వరుసగా మూడు పరాజయాలు వెంటాడుతున్న అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందేనని గట్టిగా ఫిక్సయ్యాడు. మరి అతడి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే.ఇదిలా వుంటే అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకద్వయం రాజ్, డీకేలతో మరో సినిమా చేయనున్నాడు. దీన్ని అశ్విని దత్ నిర్మించనున్నాడు. (చదవండి: మరిది కోసం రంగంలోకి దిగిన సామ్) -
హలో అఖిల్
-
అఖిలానందం...
మాదాపూర్: మాదాపూర్ కావురిహిల్స్లో యువ హీరో అఖిల్ సందడి చేశాడు. బుధవారం స్టార్టప్ క్రికెట్ లీగ్ 2016 ప్రోగ్రామ్లో పాల్గొన్న ఈ ‘సిసింద్రీ’ సెల్ఫీలతో అభిమానులను అలరించారు.