'మద్యం సిండికేట్లో అధికారుల ప్రాసిక్యూషన్'
మద్యం సిండికేట్ వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించారు. ఆ వ్యవహారంలో 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై 180 మంది అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనాటి వ్యవహారంపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించి... ఉన్నతాధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలకు గవర్నర్ రంగంలోకి దిగారు. అందులోభాగంగా మొదటగా 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు.