Hyderabad MP
-
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై దాడి కేసులో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని సోమవారం మీర్చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయం లో సోమవారం డీసీపీ వి.సత్యనారాయణ అదనపు డీసీపీ కె.బాబురావుతో కలసి ఈ వివరాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 2న మీర్చౌక్ పోలీస్ స్టేషన్ ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిలపై అసదుద్దీన్ తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితులు ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 341,506, ఆర్/డబ్ల్యూ-141 సెక్షన్ల కింద కేసులు నమో దు చేశారు. డీసీపీ కార్యాలయంలో అసద్ను ప్రశ్నించిన అనంతరం సీసీ కెమెరాల విడియో ఫుటేజీల ఆధారంగా మీర్చౌక్ పోలీసులు ఉదయం 10.15కి అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లిలో ఎమిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అనంతరం రూ. 5 వేల రెండు సొంత పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేశారు. షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన కసఫ్, షేక్ ఆబేద్ హుస్సేన్, ఎతేశ్యాం, నజీర్, జాఫర్, మిస్బాలను ఇప్పటికే అరెస్ట్ చేశామని డీసీపీ చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. మొత్తం ఎన్నికల రోజు 15 కేసులు నమోదు కాగా... చిన్నాచితక, పాల్స్ కేసులు 350 వరకు నమోదయ్యాయన్నారు. మీర్చౌక్ ఘటనలో కానిస్టేబుల్ మురళి చాకచాక్యంగా దాడికి పాల్పడ్డ వారిని పట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసుల్లో ఆధారాలు లభించక ఎత్తివేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై చాంద్రాయణగుట్ట పీఎస్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై ఆధారాలూ లభించక దాన్ని కొట్టివేస్తున్నామన్నారు. -
ఎంపీ అసదుద్దీన్పై కేసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ మ్మద్ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై మీర్చౌక్ పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. 143, 323, 341, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరి ముబాషీర్ పై దాడికి పాల్పడిన ఘటనలో కూడా అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సియాసత్ విలేకరి ముబాషీర్(35) విధి నిర్వహణలో ఉండగా ఎంపీ అసదుద్దీన్ తన అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ముబాషీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసదుద్దీన్కు ఐఎస్ బెదిరింపులు
-
అసదుద్దీన్కు ఐఎస్ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ‘‘నీవు భారతదేశ ముస్లింలను అవమానిస్తున్నావు. ఇస్లామిక్ రాజ్యాన్ని వ్యతిరేకించే నీకు నరకమే ప్రాప్తిస్తుంది. ప్రజాస్వామ వ్యవస్థ ముస్లింలకు వ్యతిరేకం. దానిని అమలు చేయకుండా నిషేధించాలి.. లేదా అంతం చేయాలి. షరియా ప్రకారం ముస్లింలందరూ ఒక్కటే. ముస్లింలు మీలాగా జాతీయవాదులు కారు. మీలాంటి వ్యక్తులే ముస్లింలను విభజించి చూస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా నోరు మెదపడం మానుకోవాలి’’ ఇదీ ట్విట్టర్లో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి వచ్చిన హెచ్చరిక. ఐఎస్ సానుభూతిపరుడు అబోతాలోత్ ట్విట్టర్ ఖాతా నుంచి అసదుద్దీన్కు ఈ బెదిరింపు వచ్చింది. దీనికి అసదుద్దీన్ తీవ్రంగానే స్పందించారు. ‘‘మీరు ముస్లిం వ్యతిరేకులు. రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్పై చర్చకు సిద్ధం. నేను లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు’’ అంటూ రీట్వీట్ చేశారు. ఐఎస్ ఓ దెయ్యం సైన్యం: అసద్ ఐఎస్ఐఎస్ దెయ్యం సైన్యమని అసదుద్దీన్ అభివర్ణించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐఎస్ ట్విట్టర్ బెదిరింపులపై ఆయన స్పందించారు. స్వర్గం, నరకం దేవుడి చేతిలో ఉంటాయని, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఐఎస్కు ఇస్లాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్కాలర్స్ ఐఎస్కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి, వారి కార్యకలాపాలను ఖండించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐఎస్ ఉగ్రవాదులు సుమారు 1.5 లక్షల మందిని హతమార్చారని, వారి ఆలోచనావిధానం మారాలని చెప్పారు. ఎక్కడో ఎలుక మాదిరిగా దాక్కొని బెదిరించడం సరికాదని సూచించారు. భారతదేశంవైపు కన్నెస్తే సహించేది లేదని ఐఎస్ను హెచ్చరించారు. రాజకీయపరంగా విభేదాలున్నా.. దేశం కోసం అందరూ ఏకమై సరైన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇక్కడి ముస్లింలు కరడుగట్టిన భారతీయులని, మాతృదేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారని చెప్పారు. -
ఒవైసీకి ఐఎస్ఐఎస్ హెచ్చరికలు
-
ఒవైసీకి ఐఎస్ఐఎస్ హెచ్చరికలు
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఐఎస్ఐఎస్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐఎస్ఐఎస్ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్లో బెదిరింపు వచ్చింది. త్వరలోనే భారతదేశంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే.. ఏదో ఒకరోజు అందరూ చనిపోవాల్సిందేనని, కొందరు ఒకరోజు ముందు, మరికొందరు ఒకరోజు తర్వాత పోతారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. యువకులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని ఇటీవల పలు బహిరంగ సభలలోనూ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. దీంతో ఐఎస్ఐఎస్ ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ తాజా బెదిరింపులపై అసదుద్దీన్ స్పందించారు. ఐఎస్ఐఎస్ ఇస్లాం మతానికి వ్యతిరేకమని, ఆ ఉగ్రవాద గ్రూపు ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. ''ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే. కొందరు ముందు పోతే, మరికొందరు వెనక పోతారు. నేను మాత్రం ఐఎస్ఐఎస్ అంటే భయపడేది లేదు. ఐఎస్ఐఎస్ వల్ల లక్షన్నర మంది ముస్లింలు చనిపోయారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే అది పుట్టింది. ప్రపంచంలో ఉన్న స్కాలర్లందరూ దాన్ని ఖండించారు, నేనూ ఖండించాను. ఇస్లాంకు, ఐఎస్ఐఎస్కు సంబంధం లేదు. సోషల్ మీడియాలో మాత్రమే అలా ప్రచారం జరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఒక ఉగ్రవాద సంస్థ. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా'' అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. @abotalout sir you are a bloody Takfiri if you want to debate on Evil ISIS I am ready you will not be able to counter my Theological Points — Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 @abotalout you can dream so keep dreaming Takfiri read @Shaykhabulhuda book on ISIS will bring y out of Darkness of ISIS Allah give Taufeeq — Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 -
'నేను భారతీయుడిని'
-
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగా అర్డినెన్స్ తేవడం సరైన చర్యల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. అనంతరం అసదుద్దీన్ విలేకర్లతో మాట్లాడారు. కిషన్బాగ్ ఘటనపై జ్యుడిషయల్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి అసదుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు. -
అభివృద్ధే మా ప్రచార ఆయుధం: అసదుద్దీన్
అబిడ్స్, న్యూస్లైన్: ఈ ఎన్నికల్లో ‘మా పని.. మా నినాదం’ అనే అంశంతో ప్రజల ముందుకు వెళ్తామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధే తమ ప్రధాన ఎన్నికల ఆయుధమన్నారు. మంగళవారం దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో తమ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీలంతా తమ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులేదు.. తెలంగాణ, సీమాంధ్రలో కూడా ఎంత మంది అభ్యర్థులను పోటీకి దింపుతున్నదీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అసదుద్దీన్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో 2వ జాబితా విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి హవా కొనసాగిస్తామన్నారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే వెళుతున్నట్టు ఆయన వివరించారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చినా తాము అందుకు సుముఖంగా లేమని తెలిపారు. నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ స్థానాలలో కొత్తవారైనా విజయం సాధిస్తారన్నారు. కార్వాన్ నియోజకవర్గం ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తుందని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు. హైదరాబాద్ నుంచి తాను బరిలో దిగుతున్నట్టు చెప్పారు.