ICC Womens World Cup Qualifier
-
పాకిస్తాన్ భారత్లో మ్యాచ్లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్రేట్లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్లాండ్తో మ్యాచ్లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్రేట్తో వరల్డ్కప్నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్రేట్తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
ICC WC Qualifier: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.ఒక్క వికెట్ తేడాతోఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది. ఒకవేళ ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథాలాహోర్ వేదికగా ఐర్లాండ్తో పోరులో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.పాక్ బెర్తు ఖరారుఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్కప్కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్ హ్యాట్రిక్
లాహోర్: మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు విజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫర్జానా (57; 6 ఫోర్లు), షర్మిన్ అక్తర్ (57; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ బ్రైస్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ప్రియనాజ్ (63 బంతుల్లో 61; 7 ఫోర్లు), రాచెల్ (73 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా 4, జన్నతుల్ 2 వికెట్లు తీశారు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో ఐర్లాండ్ 46 పరుగుల తేడాతో థాయ్లాండ్ జట్టుపై గెలిచింది. ఇది కూడా చదవండి: శ్రేయస్ అయ్యర్కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుదుబాయ్: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మార్చి నెలకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కింది. చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చినందుకుగానూ అయ్యర్ను ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వివరాలు వెల్లడించింది. చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో అయ్యర్ అత్యధిక పరుగులు (243) చేసిన ప్లేయర్గా నిలిచాడు.న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ కూడా ఈ పురస్కారం కోసం పోటీపడగా... ఆ ఇద్దరినీ వెనక్కి నెడుతూ అయ్యర్ విజేతగా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీ హస్తగతం చేసుకోవడంతో పాటు అవార్డు గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని అయ్యర్ అన్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారాన్ని భారత ఆటగాడు శుబ్మన్ గిల్ దక్కించుకున్నాడు. -
ICC World Cup Qualifiers: పాకిస్తాన్ గెలుపు బోణీ
లాహోర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 38 పరుగుల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించనున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. 179 పరుగులకేసిద్రా అమీన్ (112 బంతుల్లో 51; 3 ఫోర్లు), ఆలియా రియాజ్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... మునీబా అలీ (32) రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో జానె మగుర్ 3 వికెట్లు పడగొట్టగా... కెల్లి, కారా ముర్రె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు తడబడింది. 44 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై పరాజయం ముటగట్టుకుంది. కెప్టెన్ గాబీ లూయిస్ (67 బంతుల్లో 44; 5 ఫోర్లు), అమీ హంటర్ (54 బంతుల్లో 44; 4 ఫోర్లు), ఒర్లా ప్రెండెర్గాస్ట్ (37) పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డయానా బేగ్ 4, నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టారు. తదుపరి మ్యాచ్లో శుక్రవారం స్కాట్లాండ్తో పాకిస్తాన్ జట్టు తలపడుతుంది. హీలీ మాథ్యూస్ సెంచరీ వృథా... మరో మ్యాచ్లో కెప్టెన్ హీలీ మాథ్యూస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టినా... వెస్టిండీస్ జట్టుకు పరాజయం తప్పలేదు. బుధవారం జరిగిన పోరులో విండీస్ 11 పరుగుల తేడాతో స్కాట్లాండ్ చేతిలో ఓడింది. మొదట స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. సారా బ్రైస్ (56 బంతుల్లో 55; 6 ఫోర్లు), మేగన్ మెక్కాల్ (45; 5 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో హీలీ మాథ్యూస్ 4 వికెట్లు పడగొట్టగా... అలీనె, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హీలీ మాథ్యూస్ (113 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు) ఓపెనర్గా బరిలోకి దిగి అజేయంగా నిలిచినా... మరో ఎండ్ నుంచి ఆమెకు సరైన సహకారం లభించలేదు. జైదా జేమ్స్ (45; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూస్ మొండిగా పోరాడింది. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ 3 వికెట్లు తీసింది. -
క్యాచ్ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్ కాదా.. ఇదెక్కడి రూల్
Canadian Cricketer Blatant Cheating.. క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. తన వికెట్ను కాపాడుకోవడానికి ఒక బ్యాటర్ చేసిన పని ఆమెను నవ్వులపాలు చేసింది. ఐసీసీ లాంటి టోర్నీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సగటు క్రికెట్ అభిమానులను ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. విషయంలోకి వెళితే.. ఐసీసీ వుమెన్స్ టి20 ప్రపంచకప్ అమెరికాస్ క్వాలిఫయర్స్లో భాగంగా గతవారం కెనడా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో తొలుత కెనడా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ దివ్య సక్సేనా ఓవర్ మూడో బంతిని గాల్లోకి లేపింది. ప్రత్యర్థి వికెట్ కీపర్ సిందూ శర్మ క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేయగా.. మధ్యలో దూరి కీపర్ను క్యాచ్ తీసుకోకుండా అడ్డుపడింది. క్రికెట్ నిబంధనల్లో లా 37.3 ప్రకారం ఒక బ్యాటర్ తాను ఔట్ కాకూడదని ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్కు అడ్డురావడం ''అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్'' కింద పరిగణిస్తారు. అలా చేస్తే సదరు బ్యాటర్ ఔట్ అని క్రికెట్ పుస్తకాల్లో ఉంది. కానీ ఇక్కడ మాత్రం దివ్య సక్సేనా ఔట్ కాదంటూ అంపైర్ నిగిల్ డుగ్డిడ్ ప్రకటించడం అందర్ని ఆశ్చర్యపరించింది. ఆ తర్వాత దివ్య సక్సేనా 40 పరుగులు చేయడం.. అనంతరం బ్యాటింగ్ చేసిన అమెరికా 7 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఒకవేళ దివ్య సక్సేనాను అంపైర్ ఔట్ అని ప్రకటించి ఉంటే మ్యాచ్ను అమెరికా గెలిచి ఉండేది. చదవండి: Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీనిపై న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ స్పందించాడు.'' క్రికెట్ రూల్స్ ప్రకారం ఇది చీటింగ్ అని అందరికి తెలుసు.. కానీ ఎందుకో వీడియో చూస్తే ఫన్నీగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు. ఇక వీడియో చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''ఆమె అంత చీటింగ్ చేసినా ఔట్ కాదంటా.. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్..'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. From last week in Mexico... @usacricket Women loss by 7 runs to Canada. Blatant obstructing the field by opener Divya Saxena off her first ball in the first over of play. Given not out. She went on to make 40 out of Canada's total of 85. pic.twitter.com/WHRbryODSk — Peter Della Penna (@PeterDellaPenna) October 31, 2021 -
టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదు..
ముర్షియా: టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముర్షియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్(యూరోప్ రీజియన్) పోటీలు ఈ పరమ చెత్త రికార్డులకు వేదికగా నిలిచాయి. ఆగస్ట్ 26న మొదలైన ఈ క్వాలిఫయర్ పోటీల్లో యూరోపియన్ మహిళా క్రికెట్ జట్లు ఒకదాని మించి ఒకటి పోటీపడుతూ.. పొట్టి ఫార్మాట్ పరువును బజారుకీడ్చాయి. నెదర్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టీ20ల్లో జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి. ఓ జట్టేమో(జర్మనీ) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే స్కోర్ చేసి అత్యంత జిడ్డు బ్యాటింగ్ను ప్రేక్షకులకు రుచి చూపించగా, మిగతా జట్లు తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ పడి మరీ జిడ్డు ఆటకు బ్రాండ్ అంబాజిడర్లుగా నిలిచి టీ20ల్లో అత్యల్ప స్కోర్లను నమోదు చేసాయి. ఈ జట్లలో ఫ్రాన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో వరుసగా 33 ఆలౌట్(నెదర్లాండ్పై), 45 ఆలౌట్(ఫ్రాన్స్పై), 24 ఆలౌట్(ఐర్లాండ్పై), 24 ఆలౌట్(స్కాట్లాండ్పై) స్కోర్లు నమోదు చేసింది. ఈ అత్యల్ప స్కోర్లన్నీ అటుఇటు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సాధించినవే కావడంతో క్రికెట్ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ జట్టుకు ఐసీసీ పోటీల్లో అనుమతిచ్చింది ఎవడ్రా అంటూ సోషల్మీడియలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక స్కాట్లాండ్తో ఫ్రాన్స్ ఆడిన చివరి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ మహిళా జట్టు 17.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 24 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే నమోదైంది. అనంతరం స్కాట్లాండ్ కేవలం14 బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
‘సూపర్ సిక్స్’లో దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో నేటి నుంచి సూపర్సిక్స్ మ్యాచ్లు జరుగనున్నాయి. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో భారత జట్టు... దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మిథాలీ సేన క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో అదరగొట్టింది. ఇదే జోరుతో ఇప్పుడు పటిష్టమైన సఫారీలతో పోరు కు సై అంటోంది. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తన బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. బౌలింగ్లో ఏక్తా బిస్త్ విశేషంగా రాణిస్తోంది. మరో వైపు ఐసీసీ మహిళల వన్డే బ్యాట్స్విమెన్ ర్యాంకుల్లో మిథాలీ రాజ్ ఒక ర్యాంకును మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకింది.