breaking news
Ice mountain
-
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!
ఇంతవరకు ఎముకలు కొరికే మంచు కొండల్లో విహరించడం, విచిత్రమైన స్టంట్లు చేయడం చూశాం. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ట్రెక్కింగ్ వెళ్లిన వాళ్ల గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా మంచు పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా హిమపాతం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... యూఎస్కి చెందిన లేలాండ్ నిస్కీ మంచుతో నిండిన కొలరాడో పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా భారీ హిమ పాతం వచ్చింది. ఆ హిమపాతం తన ఉద్ధృతిని పెంచుతూనే ఉంది. ఏ మాత్రం అతను పట్టు వదిలిన అంతే సంగతులు. ఎందుకంటే అతను భూమి నుండి సుమారు 400 అడుగుల ఎత్తులో ఉండగా హిమపాతం బారిన పడ్డాడు. కానీ అతను తన ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా బలంగా తన పట్టును కోల్పోకుండా గట్టిగా తన సాధనాలతో తవ్వి పట్టుకున్నాడు. ఆ హిమపాతం తగ్గే వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అతను చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన వీడియోని మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Leland Nisky (@nemonisky) (చదవండి: ఫ్రిజ్లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!) -
టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు
లండన్: అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైన మంచు పర్వతం (ఐస్బర్గ్) లక్ష ఏళ్ల నాటి దని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు. మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాం ట్ బిగ్ ‘టైటానిక్’ ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు సండేటైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు.


