breaking news
India U19 Vs Australia U19
-
చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 30) మొదలైన తొలి టెస్ట్లోనూ సత్తా చాటింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా యువ పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాశించాడు.మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 91.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జెడ్ హోలిక్ (38) మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. అలెక్స్ లీ యంగ్ (18), కెప్టెన్ విల్ మలాజ్చుక్ (21), సైమన్ బడ్జ్ (15) జాన్ జేమ్స్ (13), హేడన్ షిల్లర్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.రేపు భారత ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆసీస్తో పోలిస్తే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో అప్ కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుందు లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. కాగా, భారత అండర్-19 జట్టు ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ను కూడా వారి సొంత ఇలాకాలో మట్టికరిపించింది. ఇటీవలికాలంలో యువ భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనై వైభవ్ పర్వాలేదనిపించాడు.చదవండి: హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో -
వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్లో (Australia U19 vs India U19) యువ భారత్ జట్టు (Team India) ఆస్ట్రేలియాను (Australia) వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 167 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్ల్లో (22 బంతుల్లో 38, 68 బంతుల్లో 70) సత్తా చాటిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మూడో మ్యాచ్లో (20 బంతుల్లో 16) విఫలమయ్యాడు. అయినా భారత్ ఘన విజయం సాధించగలిగింది. ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు తొలి యూత టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. దీంతో ఆస్ట్రేలియాలో యువ భారత జట్టు పర్యటన ముగుస్తుంది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. వైభవ్ విఫలమైనా, వేదాంత్ త్రివేది (86), రాహుల్ కుమార్ (62) రాణించారు. విహాన్ మల్హోత్రా (40) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.అనంతరం 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్లు ఖిలన్ పటేల్ (7.3-0-26-4), ఉధవ్ మోహన్ (5-1-26-3), కనిష్క్ చౌహాన్ (6-1-18-2) ధాటికి 28.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ 32, టామ్ హోగన్ 28, విల్ మలాజ్చుక్ 15 పరుగులు చేశారు.చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విఫలం.. అయినా భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో నామమాత్రపు మూడో యూత్ వన్డే (IND U19 vs AUS U19 3rd ODI)లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్లలో అదరగొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈసారి మాత్రం పదహారు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక.. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6, 0, 4)బ్యాట్తో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. టాపార్డర్లో ఇలా ఓపెనర్లు నిరాశపరిచినా వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (40) మాత్రం ఫర్వాలేదనిపించాడు.అదరగొట్టిన వేదాంత్, రాహుల్అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్ (Rahul Kumar) అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వేదాంత్ 92 బంతుల్లో 86, రాహుల్ కుమార్ 84 బంతుల్లో 62 పరుగులు సాధించారు. మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ హర్వన్ష్ పంగాలియా 23, ఖిలాన్ పటేల్ 20* పరుగులు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత అండర్-19 జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆసీస్ యువ బౌలర్లలో విల్ బిరోమ్, కేసీ బార్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్ల్స్ లాచ్మండ్, బెన్ గోర్డాన్, కెప్టెన్ విల్ మలాజుక్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇప్పటికే సిరీస్ 2-0తో కైవసంకాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న వన్డేల్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. ఇప్పటికే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక శుక్రవారం నాటి మూడో యూత్ వన్డేలోనూ బ్యాటింగ్ పరంగా మరోసారి దుమ్మురేపింది. ఇక బౌలర్ల పనే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్లో తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 68 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రాణించిన మాత్రే.. ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 వన్డేలు, 2 టెస్ట్లు) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత అండర్ 19 జట్టు (India U19 Tour of Australia) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇదివరకే ఓ వన్డే గెలిచిన యువ భారత్ (India A vs Australia A).. తాజాగా రెండో మ్యాచ్ కూడా గెలిచి (51 పరుగుల తేడాతో), మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (68 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) యధావిధిగా విధ్వంసాన్ని కొనసాగించాడు. విహాన్ మల్హోత్రా (70), అభిగ్యాన్ కుందు (71) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) డకౌటై నిరాశపరిచాడు.అనంతరం 301 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా యువ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 249 పరుగులకే చాపచుట్టేసింది. జేడన్ డ్రేపర్ (72 బంతుల్లో 107; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా ఆసీస్ను గెలిపించలేకపోయాడు. డ్రేపర్కు తోడుగా ఎవ్వరూ రాణించలేదు. అతనొక్కడే ఒంటరిపోరాటం చేశాడు.బ్యాట్తో విఫలమైన యువ భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో రాణించాడు. 4 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. కనిష్క్ చౌహాన్ 2, కిషన్ కుమార్, అంబ్రిష్, ఖిలన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేయగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్) ఆ మ్యాచ్లోనూ రాణించాడు.ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే సెప్టెంబర్ 26న జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు తొలి టెస్ట్.. అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగనున్నాయి.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఉన్ముక్త్ చాంద్ (Unmukt Chand) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టాడు.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో రెండో యూత్ వన్డే (IND U19 vs AUS U19) సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. కాగా భారత అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్లో ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో గెలిచి భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.300 పరుగులుఈ క్రమంలో బుధవారం నాటి రెండో యూత్ వన్డేలోనూ భారత్ అదరగొట్టింది. 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వైభవ్ సూర్యవంశీ (70), విహాన్ మల్హోత్రా (70), అభిగ్యాన్ కుందు (71) అద్భుత అర్థ శతకాల కారణంగా ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. 41వ సిక్స్ఇక ఈ మ్యాచ్లో పద్నాలుగేళ్ల వైభవ్ 68 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో యూత్ వన్డేల్లో తన 41వ సిక్స్ను నమోదు చేశాడు. తద్వారా ఉన్ముక్త్ చాంద్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసి.. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు.కాగా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్. అయితే, టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో అతడు అమెరికాకు వలస వెళ్లాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక ఉన్ముక్త్ పేరు మీద భారత్ తరఫున ఉన్న ఈ ప్రపంచ రికార్డును చిచ్చరపిడుగు వైభవ్ తాజాగా బద్దలు కొట్టేశాడు.✨⚡Vaibhav Suryavanshi 🏏🔥💥#vaibhavSuryavanshi #IndiU19 pic.twitter.com/ioAyWm4n6X— Cric Insights (@cricinsights1) September 24, 2025 యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏వైభవ్ సూర్యవంశీ (ఇండియా)- 41 సిక్స్లు*- 2024-25🏏ఉన్ముక్త్ చాంద్ (ఇండియా)- 38 సిక్స్లు- 2011-12🏏జవాద్ అబ్రార్ (బంగ్లాదేశ్)- 35 సిక్స్లు- 2025-25🏏షాజైబ్ ఖాన్ (పాకిస్తాన్)- 31 సిక్స్లు- 2022-24🏏యశస్వి జైస్వాల్ (ఇండియా)- 30 సిక్స్లు- 2018-20.యూత్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన అరుదైన రికార్డులు🏏యూత్ వన్డేల్లో 52 బంతుల్లోనే శతకం🏏యూత్ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన ఇండియన్ బ్యాటర్🏏170 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 13 ఏళ్ల 188 రోజుల వయసులోనే సెంచరీ (కాంపిటేటివ్ క్రికెట్) బాదిన ఆటగాడిగా ఘనత🏏రంజీ ట్రోఫీలో 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అడుగుపెట్టిన ఆటగాడిగా రికార్డు🏏ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడు🏏యూత్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (58 బంతుల్లో) చేసిన భారత ఆటగాడు.చదవండి: IND vs AUS: ఆసీస్ భారీ స్కోరు.. కేఎల్ రాహుల్ ఫెయిల్ -
IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (IND U19 vs AUS U19)తో రెండో యూత్ వన్డేలో ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు అద్భుత అర్ధ శతకం సాధించాడు. కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. Vaibhav Suryavanshi's first game in Australia was seriously entertaining 👏Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG— cricket.com.au (@cricketcomau) September 22, 2025 ఆసీస్పై 1-0తో ఆధిక్యంఇక నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఫలితంగా ఆసీస్పై 1-0తో ఆధిక్యం సాధించిన భారత్.. తాజాగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ అదరగొట్టింది. బ్రిస్బేన్ వేదికగా రెండో యూత్ వన్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.ఆయుశ్ మాత్రే డకౌట్ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే డకౌట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టాడు. వీరిద్దరు అద్భుత అర్ధ శతకాలతో రాణించారు.వైభవ్, విహాన్ హాఫ్ సెంచరీలువైభవ్ మొత్తంగా 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించగా.. విహాన్ 74 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 70 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో వేదాంత్ త్రివేది 26 పరుగులు చేయగా.. వికెట కీపర్ బ్యాటర్ అభిగ్యాన్ కుందు మరోసారి హాఫ్ సెంచరీతో అలరించాడు.అభిగ్యాన్ మరోసారిఅభిగ్యాన్ 64 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 71 పరుగులు సాధించాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు రనౌట్ అయ్యాడు. ఏదేమైనా టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగడంతో టీమిండియా 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా అండర్-19 బౌలర్లలో విల్ బైరోమ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. కెప్టెన్ యశ్ దేశ్ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో కాసే బార్టన్, హైడెన్ షీలర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ ఘన విజయంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు.. 47.2 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో గెలిచిన భారత యువ జట్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే మూడు వికెట్లతో రాణించగా.. కనిష్క్ చౌహాన్ రెండు, కిషన్ కుమార్, ఆర్ఎస్ అంబరీశ్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ ధనాధన్.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా (AUS U19 Vs IND U19 ) పర్యటనలో శుభారంభం చేసింది. ఆసీస్ యువ జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలో మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది.పరుగుల ఖాతా తెరవకుండానేఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా ఆదివారం తొలి యూత్ వన్డే జరిగింది. ఇయాన్ హేలీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్లు అలెక్స్ టర్నర్ (0), సీమోన్ బడ్జ్ (0) వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని కిషన్ కుమార్ (Kishan Kumar) అవుట్ చేసి.. ఆసీస్కు ఆరంభంలోనే గట్టి షాకిచ్చాడు.ఇక మిగిలిన ఆసీస్ బ్యాటర్లలో స్టీవెన్ హోగన్ 39, టామ్ హోగన్ 41 పరుగులతో రాణించగా.. జాన్ జేమ్స్ 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగానే ఆసీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. భారత యువ బౌలర్లలో కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్ రెండేసి వికెట్లు తీయగా.. హెనిల్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆర్ఎస్ అంబరీష్ కు ఒక వికెట్ దక్కింది.వైభవ్ సూర్యవంశీ ధనాధన్ఈ క్రమంలో ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఆసీస్ పేసర్ చార్లెస్ లాచ్మండ్ ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (9)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం మరోసారి తన మార్కు చూపించాడు.ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టి.. ఇన్నింగ్స్ గాడిన పెట్టాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు సాధించాడు. వేదాంత్, అభిగ్యాన్ అదుర్స్ఈ క్రమంలో అతడికి జతైన వేదాంత్ త్రివేది అర్ధ శతకం (61 నాటౌట్) తో ఆకట్టుకున్నాడు. ఇక వేదాంత్తో పాటు అభిగ్యాన్ కుందు దుమ్ములేపాడు. 74 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.వేదాంత్తో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించిన భారత్.. ఆసీస్ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సూపర్ ఫిఫ్టీ సాధించిన అభిగ్యాన్ కుందు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.