breaking news
india under -19
-
IND Vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి
నార్తాంప్టన్ వేదికగా సోమవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఒక్క వికెట్ తేడాతో భారత్ అండర్-19 జట్టు ఓటమి పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. భారత్ నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ యువ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఓ దశలో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రెవ్ అద్భుతమైన సెంచరీతో భారత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రెవ్ మాత్రం విరోచిత పోరాటం చేశాడు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు సెబాస్టియన్ మోర్గాన్నాట్(20), అలెక్స్ గ్రీన్(12) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హెనిల్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.వైభవ్ మెరుపులు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు విహాన్ మల్హోత్రా(49), రాహుల్ కుమార్(47), కన్షిక్ చౌహన్(45) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ నాలుగు.. హోమ్, గ్రీన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఇదే వేదికలో జరగనుంది.చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనను భారత అండర్-19 జట్టు ఘనంగా ఆరంభించింది. హోవ్ వేదికగా శుక్రవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఇసాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ధాటిగా ఆడగా... మిడిలార్డర్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత యువ బౌలర్లలో కనిష్క్ చౌహన్ 3, హెనిల్ పటేల్, అంబ్రీశ్, మొహ్మద్ ఇనాన్ తలా 2 వికెట్లు తీశారు.వైభవ్ విధ్వంసం..అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కేవలం 24 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. భారత ఓపెనర్, ఐపీఎల్ సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 48 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి తొలి వికెట్కు 71 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరు అవుటైనప్పటికీ అభిజ్ఞాన్ కుండు (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో ఏ ఇబ్బంది లేకుండా యువభారత్ గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫ్రెంచ్ 2 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే నార్తాంప్టన్లో జరుగుతుంది.చదవండి: అది ఆసీస్కు రిటర్న్ గిఫ్ట్ -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఇంగ్లండ్
5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల కోసం భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (జూన్ 27) జరుగుతున్న తొలి యూత్ వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. యంగ్ ఇండియా బౌలర్లలో కనిష్క్ చౌహాన్ (10-1-20-3), మొహమ్మద్ ఎనాన్ (10-1-37-2) తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్ఎస్ అంబరీష్, హెనిన్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. మరో పేసర్ యుద్దజిత్ గుహా (7-0-46-0) కూడా బాగానే బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్తో ఓ ఓవర్ వేసి రెండు పరుగులిచ్చాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రాకీ ఫ్లింటాఫ్ (ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డాకిన్స్ (18), బెన్ మేయర్స్ (16), జేమ్స్ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్ థామస్ ర్యూ (5), జోసఫ్ మూర్స్ (9), రాల్ఫీ ఆల్బర్ట్ (5), జాక్ హోమ్ (5), తజీమ్ చౌద్రీ అలీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ టూర్లో యంగ్ ఇండియాకు ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. మాత్రే, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మాత్రే, సూర్యవంశీ బ్యాటింగ్ చూసేందుకు భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. -
భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ఫ్లింటాఫ్ తనయుడు
భారత అండర్-19 జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్రకటించింది. ఇంగ్లీష్ అండర్-19 జట్టుకు థామస్ రెవ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు దక్కించుకున్నాడు.రాకీ ప్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన రాకీ.. 15.22 సగటుతో 137 పరుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్-ఎ మ్యాచ్లలో అతడి పేరిట 167 పరుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచరీ కూడా ఈ జూనియర్ ప్లింటాప్ సాధించాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు యూత్ వన్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు యువ సంచలనం అయూష్ మాత్రే సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.ఇంగ్లండ్ అండర్-19 టీమ్థామస్ రెవ్ (కెప్టెన్), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్జేద్ ఎహమ్జెనా. -
పాక్పై చివరి బంతికి ఓడిన భారత్..
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్కు తొలి ఓటమి ఎదురైంది. చివరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అండర్–19 జట్టు 2 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయ సమీకరణం 8 పరుగులు కాగా... తొలి ఐదు బంతుల్లో 6 పరుగులు లభించాయి. దాంతో ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన స్థితిలో ఫోర్ బాదిన అహ్మద్ ఖాన్ (19 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పాక్ను గెలిపించాడు. శనివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య యాదవ్ (50; 3 ఫోర్లు), హర్నూర్ సింగ్ (46; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. పాక్ మీడియం పేసర్ జీషన్ జమీర్ (5/60) భారత్ను పడగొట్టాడు. ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి గెలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్ను రేపు అఫ్గానిస్తాన్తో ఆడనుంది. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
106 పరుగులే చేసినా...
కొలంబో: ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు ఆసియా అండర్–19 వన్డే విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అండర్–19ను ఓడించింది. ముందుగా భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కరణ్ లాల్ (37), కెపె్టన్ ధ్రువ్ జురేల్ (57) ఫర్వాలేదనిపించగా... ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. అనంతరం భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అథర్వ అంకోలేకర్ (5/28) ధాటికి బంగ్లాదేశ్ 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ అక్బర్ అలీ (23), మృత్యుంజయ్ (21) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో విజయానికి 29 పరుగులు చేయాల్సిన దశలో తన్జీమ్ (12), రకీబుల్ (11 నాటౌట్) తొమ్మిదో వికెట్కు 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. గెలుపు కోసం మరో 6 పరుగులు చేయాల్సి ఉండగా... ఒకే ఓవర్లో అథర్వ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఆట ముగిసింది.