indian disabled cricket team
-
భారత క్రికెట్ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్గా వసంతకుమార్
హిందూపురం టౌన్: టీమిండియా దివ్యాంగుల క్రికెట్ టీ-20 జట్టు కెప్టెన్గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్లో జరిగిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్గా ఎంపికయ్యాడు. -
భారత బధిర క్రికెట్ జట్టులో ఇద్దరు మనోళ్లు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్లో జరుగనున్న ఆసియా బధిర టి20 క్రికెట్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. హైదరాబాద్ బధిర క్రికెట్ సంఘానికి చెందిన జి. రాజారామ్, మోజెస్ పీటర్ భారతక్రికెట్ జట్టుకు హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. బంగ్లాదేశ్ డెఫ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జట్టుతో ఢాకాలో మార్చి 20 నుంచి 27 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది.