indralok
-
శిథిలాల నుంచి నాలుగు మృతదేహాలు వెలికితీత
న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు నాలుగు మృతదేహలను వెలికి తీశారు. ఆ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హస్తినలోని ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం పురాతన భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ భవనంలో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా చేశారు. -
కుప్పకూలిన భవనం,శిధిలాల కింద ఆరుగురు?
-
ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
దేశ రాజధాని న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉన్నతాధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.