involved
-
HYD: డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఆర్మీ
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఆర్మీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. 2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కావడంతో ఆర్మీ సీరియస్గా దృష్టి సారించింది. నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధిలో పని చేసే 2.55 లక్షల మంది డేటా లభ్యం కాగా, తమ ఉద్యోగుల డేటా నకలు ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్ను కూడా పోలీసులు విచారించనున్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సిట్ ద్వారా కేసు విచారణ చేపట్టనున్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో డేటాచోరీకి సంబంధించి నగరానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడయింది. పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా రెండో రోజు గురువారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా విచారించగా ఈ కీలక విషయం వెల్లడైనట్లు తెలిసింది. హత్యకు ఓ రౌడీషీటర్ సహకరించినట్లు సీపీకి వసంత తెలిపినట్లు తెలిసింది. మరోవైపు వసంత మరిది సంజయ్య ఫోన్లోని డేటా డిలీట్ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్ షాపు యజమానినీ పోలీసులు విచారించారు. అయితే తన షాపు వద్దకు వచ్చి ఫోన్లోని డేటా డిలీట్ చేయాలని సంజయ్య కోరగా... ఫోన్కు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పానని... అవి తీసుకొచ్చాకే డేటా డిలీట్ చేశానని... అంతకు మించి తనకే సంబంధం లేదని విచారణలో ఆ షాపు యజమాని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీపీ ఆర్కే మీనా వివిధ కోణాల్లో వసంత, గీతను విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. ఆరు రోజులు చిత్రహింసలు పెట్టి... అనంతరం సీపీ రాజీవ్కుమార్ మీనా మాట్లాడుతూ దివ్య హత్య అత్యంత క్రూరమైనదని అన్నారు. దివ్యను ఆమె పిన్ని అమ్మేయడంతో ఇంటి పనికి తీసుకొచ్చిన వసంత వ్యభిచార ఊబిలోకి దింపిందని గుర్తు చేశారు. అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో తిండి పెట్టకుండా ఆరో రోజులపాటు చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. దివ్యని వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారని తెలిసిందని... ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నామని స్పష్టం చేశారు. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం పంపించామని తెలిపారు. ప్రస్తుతం వసంత, గీతను విచారిస్తున్నామని.., రిమాండ్లో ఉన్న మిగిలిన నలుగురినీ పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరగా... కోర్టు అనుమతించడంతో వారిని శుక్రవారం నుంచి విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు. విశాఖలో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్ పుట్టిన రోజు పార్టీకి సంబంధించి చేపట్టిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర ముఠా మోసగాడు జవహర్ బాలకుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాలకుమార్ చేతిలో అనేక మంది మహిళలు మోసపోయారని పేర్కొన్నారు. దివ్య హత్యకేసు విచారణలో ఈస్టు ఏసీపీ కులశేఖర్, సీఐ కోరాడ రామారావు, ఎస్ఐలు శ్రీనివాస్, గౌరి, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
వారి అంతర్గత రాజకీయాల్లో మేం జోక్యం చేసుకోం
-
ప్రసాద్రెడ్డి హత్య వెనుక ఎస్సై..?
-
సీఎం కుటుంబీకులదే...స్ధానికులు
-
అండగా ఉంటాం...ఉద్యమంలోకి రండి
శ్రీకాకుళం/పాలకొండ రూరల్, న్యూస్లైన్:జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎటువంటి వృత్తిపరమైన సమస్యలు ఎదురైనా తాము అండగా ఉంటామని, అందరూ ఉద్యమంలో పాల్గొనాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎన్జీఓ హోమ్లో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలోని రిలే నిరిహార దీక్ష శిబిరాన్ని, పాలకొండలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమ్మెకు పిలుపునిచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు కూడా వారు ఎటువంటి పిలుపునివ్వలేదని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలకు ఛీత్కారాలను ఎదుర్కొవాల్సి ఉంటుం దన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించాలని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం పిలుపునిచ్చారు. రిలే నిరాహారదీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావాన్ని తెలియజేశారు. రాష్ట్ర సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తీసుకున్న ఉమ్మడి కార్యాచరణ ప్రతిపాదనను రాజశేఖరం స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ బైరి అప్పారావు, టి.బి.ఎస్ శర్మ, డి.సుధారాణి, దుప్పల శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, టి. తవిటినాయుడు, కోనే శ్రీధర్, వి.హరిశ్చంద్రుడు, బి.రవికుమార్, ఎ. రామారావు, బలివాడ సతీష్కుమార్, వై.బి.ఎస్ ప్రసాద్, తంగి మురళి, కె.శేషగిరిరావు, విజయ్కుమార్ పాల్గొన్నారు. జామి భీమశంకరారవు, పీఆర్ ఉద్యోగ సంఘ నాయకులు కె.నారాయణరావు, టీడీపీ నేత మజ్జి సీతారాములు ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు.