breaking news
items prices
-
తగ్గిస్తే మంచిది.. కనీసం 175 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 56వ సమావేశం ప్రారంభమైంది. జీఎస్టీ శ్లాబులో భారీ మార్పులు, సరళీకరణ చర్యలు, సంస్కరణలపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఏ వస్తువు చౌక అవుతుంది.. ఏది మరింత ప్రియం అవుంతుందన్నది ఈ రెండు రోజుల సమావేశంలో తేలుతుంది.మధ్యతరగతి మేలు కోసం..హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, సుమారు 175 వస్తువులపై జీఎస్టీని కనీసం 10 శాతం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే మరికొన్ని సవరణల కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతమున్న 5%, 12%, 18%, 28% నాలుగు శ్లాబుల నుంచి కేవలం రెండు శ్లాబులను మాత్రమే ప్రతిపాదించారు. నిత్యావసర వస్తువులకు 5 శాతం, అత్యవసరం కాని వస్తువులకు 18 శాతం. వీటితో పాటు పొగాకు వంటి హానికర వస్తువులు, రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై అదనంగా 40 శాతం శ్లాబ్ ను ప్రతిపాదించే అవకాశం ఉంది.12 శాతం కేటగిరీలోని వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి రానున్నాయి. వీటితో పాటు నెయ్యి, తాగునీరు (20 లీటర్లు), నామ్కీన్, కొన్ని బూట్లు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతం పన్ను శ్లాబుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఉపయోగించే పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులు, హెయిర్ పిన్స్ వంటి వస్తువులను కూడా 5 శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకురావచ్చు.జీఎస్టీ తగ్గించే అవకాశం ఉన్న వస్తువుల జాబితా ఇలా..వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: టూత్స్ట్, షాంపూ, సబ్బు, టాల్కమ్ పౌడర్పాల ఉత్పత్తులు: వెన్న, జున్ను, మజ్జిగ, పనీర్ మొదలైనవి.రెడీ టు ఈట్ ఫుడ్స్: జామ్ లు, ఊరగాయలు, స్నాక్స్, చట్నీలు మొదలైనవి.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్: ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు.ప్రైవేటు వాహనాలు: చిన్న కార్లు, హైబ్రిడ్ కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు.చాలా వరకు ఆహార, వస్త్ర ఉత్పత్తులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. జీవిత, ఆరోగ్య బీమాపై సున్నా శాతం జీఎస్టీ ప్రతిపాదించారు. కొన్ని కేటగిరీలకు చెందిన టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని, వీటిపై ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 18 శాతం పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, ఇప్పుడు వాటిపై వేర్వేరు రేట్లను వర్తింపజేయవచ్చు. ఎంట్రీ లెవల్ కార్లపై 18 శాతం పన్ను వర్తిస్తుంది. ఎస్ యూవీలు, లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను వర్తిస్తుంది. -
వదిలేదెంత.. మిగిలేదెంత?
న్యూఢిల్లీ: 2015-16 బడ్జెట్లో వేతన జీవులను ఉస్సూరుమనిపించిన విత్తమంత్రి జైట్లీ... జనం జేబుకు మాత్రం బాగానే చిల్లుపేట్టేశారు. సేవల పన్ను పెంపు ద్వారా దండిగా ఖజానాను నింపుకోనున్నారు. అయితే, మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కోసం దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపులు, మినహాయింపులు ఇచ్చారు. కొన్ని సేవలను సర్వీసు పన్ను పరిధి నుంచి తప్పించడం కూడా కంటితుడుపుకిందే లెక్క. మొత్తంమీద ఈ బడ్జెట్లో జనాలకు ఒరిగేది గోరంత... వదిలేది కొండంత అన్నది తేటతెల్లమైంది. ఇవి పెరుగుతాయ్... వాణిజ్య వాహనాలు(పూర్తిగా తయారై దిగుమతి చేసుకున్నవి) ఎందుకంటే: దిగుమతి సుంకం 10% నుంచి 40%కి పెంపు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, మద్యం. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతం మేర పెంచారు. ఆల్కహాల్ ఉత్పత్తిపైనా సర్వీసు పన్ను విధింపు. రెస్టారెంట్లు-హోటళ్ల బిల్లులు, విమాన ప్రయాణం, బ్యూటీపార్లర్లు, స్పా సేవలు,. కేబుల్-డీటీహెచ్ సేవలు, ఫోన్ బిల్లులు, లాటరీ టికెట్లు, చిట్ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఫీజులు, బీమా ప్రీమియం. అమ్యూజ్మెంట్ పార్కులు, సంగీత కార్యక్రమాల టిక్కెట్లు. ఎందుకంటే: సేవల పన్నును 12.36% నుంచి(విద్యా సెస్సుతో కలిపి) 14 శాతానికి పెంచడం, కొన్నింటిని ఈ పన్ను పరిధిలోకి తీసుకురావడం. సిమెంటు, ప్లాస్టిక్ బ్యాగులు ఎందుకంటే: సిమెంటుపై ఎక్సైజ్ సుంకం టన్నుకు రూ.1,000 చొప్పున, ప్లాస్టిక్ బ్యాగులపై 12% నుంచి 15 శాతానికి పెంచడం సుగంధ పానీయాలు, ప్యాకేజ్డ్ తాగునీరు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12% నుంచి 18 శాతానికి పెంపు. దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 6% నుంచి 12.5 శాతానికి పెంపు. ఇవి తగ్గుతాయ్... ప్యాకేజ్డ్ పండ్లు, కూరగాయలు. ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు. మ్యూజియంలు, జూ-వన్యప్రాణి సంరక్షణ (జాతీయ పార్కులు) కేంద్రాల సందర్శన. ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు. దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు. ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానళ్లు, ఎల్ఈడీ బల్బులు-లైట్లు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. అంబులెన్స్, అంబులెన్సు సర్వీసులు. ఎందుకంటే: సేవల పన్ను నుంచి మినహాయింపు తోలు పాదరక్షలు(రూ.1,000 కంటే ఎక్కువ ధర) ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. అగర్బత్తీలు, పేస్ మేకర్లు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు. రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్లు. మైక్రోవేవ్ ఓవెన్లు. ఎందుకంటే: విడిభాగాలు, పరికరాలపై దిగుమతి సుంకంలో కోత.