Jagitial District News
-
వాటర్ప్లాంట్ ప్రారంభం
రాయికల్(జగిత్యాల): మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, గ్రామస్తులు, దాతల సహకా రంతో శుక్రవారం వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. 2024 అక్టోబర్ 4న ‘సాక్షి’లో ‘చెర్లకొండాపూర్లో ఫ్లోరైడ్ భూతం’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి స్పందించి వాటర్ప్లాంట్ కోసం బోరు మంజూరు చేశారు. అలాగే ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామస్తులు సు మారు రూ.2 లక్షలు దాతల సహకారంతో జమచేశారు. మానోస్ యూనిదాస్ సంస్థ ఎన్జీవో, ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.1.85 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్ యంత్రాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ సిస్టర్ ప్రీత, కోఆర్డినేటర్ దీప్తి, షారోన్ థెరిస్సా, కోఆర్డినేటర్లు మర్రి మల్లేశం, శ్రీని వాస్రెడ్డి, వేలం కనిసిస్టర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ఫ్లోరైడ్ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’కి, నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలి పారు. మాజీ సర్పంచ్ ఆకుల రాజలక్ష్మి, నాయకులు దేవుని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
లక్ష్యంతో ముందుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: బంగారు భవిష్యత్ కోసం విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ‘నా గమ్యం నా ప్రయా ణం’ ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఈ మధ్యకాలంలో సామాజిక పరిస్థితుల ప్రభావాలతో ఆకర్శణకు లోనై భవి ష్యత్ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారని పే ర్కొన్నారు. పట్టుదలతో చదివి అన్నిరంగాల్లో రా ణించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, డీఈవో రాములు, బాలల పరిరక్షణాధికారి హరీశ్ పాల్గొన్నారు. పల్లెప్రగతి పనులు వేగవంతం చేయండి జగిత్యాలరూరల్: పల్లెప్రగతి పనులు వేగవంతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామాన్ని సందర్శించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే గ్రామంలోని బీసీ వెల్ఫేర్ మెన్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా గ్రామస్తులకు తాగునీరు నిత్యం అందేలా చూడాలన్నారు. ఐదు రోజులుగా భగీరథ నీరు శుభ్రంగా ఉండడం లేదని గ్రామస్తులు తెలుపగా, నాణ్యమైన నీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అలాగే నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లోని వాటర్ ట్యాంక్లను ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్ పాల్గొన్నారు. -
నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
జగిత్యాలజోన్: హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ శనివారం జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే కాసుగంటి కుటుంబసభ్యుల సహకారంతో నిర్వహిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారం కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. సమయపాలన పాటించాలిరాయికల్(జగిత్యాల): ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసీ ల్యాబ్, వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్, రిజిష్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ సతీశ్, డీపీవో రవీందర్, యూనిట్ ఆఫీసర్ శ్రీధర్, సూపర్వైజర్ శ్రీనివాస్, ఫార్మాసిస్ట్ దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, హెల్త్ అసిస్టెంట్ భూమయ్య ఉన్నారు. మేడిపల్లి సబ్స్టేషన్ నుంచి నిరంతర విద్యుత్జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే తొలి సబ్స్టేషన్ మేడిపల్లి అని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. మేడిపల్లి నుంచి వల్లంపల్లి వరకు 3 కి.మీ దూరం ఏర్పాటు చేసిన 33 కేవీ లింక్ లైన్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన ఇంటర్ లింక్ లైన్తో జగిత్యాల, రాయికల్, కథలాపూర్, కోరుట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు, మేడిపల్లి సబ్ స్టేషన్తో ఇంటర్ కనెక్ట్ అవుతాయని పేర్కొన్నారు. దీంతో మేడిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగదని, ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తితే కొత్తగా ఇంటర్ కనెక్ట్ అయిన విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెట్పల్లి డీఈ గంగారాం, కోరుట్ల రూరల్ ఏడీఈ రఘుపతి, మేడిపల్లి ఏఈ అర్జున్, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలిజగిత్యాల: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో యూనియన్ బ్యాంక్ ఎదుట ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్యాంక్ల్లో తగిన నియామకాలు చేపట్టి ఐదు రోజుల బ్యాంకింగ్ పనులు అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్చి 3న పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టి, అదే నెల 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్లు సమ్మె చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. తెలుగుభాషను అందరూ గౌరవించాలిజగిత్యాల: తెలుగుభాష ను అందరూ గౌరవించాలని, ఆంగ్ల భాష మో జులో పడి మాతృభాష ను మర్చిపోవద్దని పెన్షనర్స్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షనర్ యాకూబ్ కార్యాలయంలో ప్రతీ ఫైల్ను తె లుగులోనే రాస్తూ అందరికీ ఆదర్శంగా నిలి చారన్నారు. అనంతరం అతడిని ఘనంగా సన్మానించారు. నాయకులు విజయ్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలు తొలగించండి
గొల్లపల్లి(ధర్మపురి): మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జనవరి 30న ‘సాక్షి’లో ‘దర్జాగా ప్రభుత్వ భూ ముల కబ్జా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అక్రమంగా ఇళ్ల నిర్మాణంతో సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవా లని అధికారులను విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదేశించారు. అనంతరం రెవెన్యూ, పంచాయతీ అధికారులు పరిశీలించి నోటీసులు జారీ చేయగా, తహసీల్దార్ వరందన్ ఉన్నతాధికారులకు తగు చర్యల నిమిత్తం నివేదిక అందజేశారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సదరు ప్రభుత్వ స్థలా లను సందర్శించారు. గుట్ట ప్రాంతాల్లోని 735, 544 సర్వే నంబర్లలో 125.23 ఎకరాలలో ప్రభు త్వ కార్యాలయాలతో పాటు గుట్ట వెనకాల నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దళారుల మాటలు నమ్మి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన మండలంలోని అబ్బాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయిల్పామ్ నర్సరీని సందర్శించారు. ఆయిల్పామ్ మొక్కల సరఫరా తదితర వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో రామిరెడ్డి, ఎంపీవో సురేశ్రెడ్డి, హర్టికల్చర్ అధికారులు తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
వెలుగులోకొస్తున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు
● సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు ● 142 మందికి పాస్బుక్ల జారీ ● సుమారు 100 ఎకరాల వరకు అక్రమ పట్టాలునోటీసులు జారీ చేశాం నర్సింగాపూర్ గ్రామ శివారులోని సర్వేనంబరు 437, సర్వేనంబరు 251లో ధరణి కంటే ముందు అక్కడున్న భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. కానీ 437 సర్వేనంబరులో 142 మంది పాస్బుక్లు పొందారు. వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు సర్వే కొనసాగుతోంది. – శ్రీనివాస్, తహసీల్దార్, జగిత్యాల రూరల్ జగిత్యాలరూరల్: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. మరి కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకుని సాగు చేసుకుంటున్నారు. దీనికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకున్నారు. పోర్టల్లో ఉన్న లోటుపాట్లతోపాటు అధికారులను మచ్చిక చేసుకుని పాస్బుక్లు పొందుతున్నారు. ఇలా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని సర్వేనంబరు 437లో 378 ఎకరాల భూమి ఉండగా.. సుమారు 100 ఎకరాలకు అక్రమంగా పాస్బుక్లు పొందారు. అలాగే సర్వేనంబరు 251లో 207.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులోనూ కొంతమంది అక్రమంగా పట్టాలు పొందారు. బడా నాయకులు అప్పటి తహసీల్దార్తోపాటు ఉన్నతస్థాయి అధికారుల సహకారంతో పట్టాలు పొందినట్లు వెల్లడైంది. సర్వేనంబరు 437లో 142 మంది పాస్బుక్లు పొందారు. దీంతో ఆ భూమిని చదును చేసి కొంతమంది సాగు చేసుకుంటుండగా.. కొంతమంది ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకు ఇచ్చుకుని రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సుమారు 142 మంది ప్రభుత్వ భూమికి పాస్బుక్లు తీసుకుని ఇప్పటివరకు సుమారు రూ.70 లక్షల మేర రైతుబంధు పొందినట్లు అధికారులు నిర్ధారించారు. నోటీసులు జారీ నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా పట్టాలు పొందిన వారికి జగిత్యాల రూరల్ తహసీల్దార్ 10 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అక్రమ పట్టాలు పొందిన వారు నోటీసులకు జవాబులు ఇవ్వాల్సి ఉన్నా.. వారి నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. 83 మందివి ఫేక్ పట్టాలని నివేదిక అందజేత నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లో పట్టాదారు పాస్బుక్లు పొందిన వారిలో 83 మందివి నకిలీ పట్టాలేనని తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో పాటు, ధరణి రాక ముందు పహణిల్లో మాత్రం ప్రభుత్వ భూమి గానే నమోదై ఉందని నివేదికలో పేర్కొన్నారు. కొనసాగుతున్న సర్వే ప్రభుత్వ భూమిలో అక్రమ పట్టాలు పొందారని విషయం వెలుగు చూడటంతో కలెక్టర్ ఆదేశాల మే రకు పదిహేను రోజులుగా నర్సింగాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములకు రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో సర్వే చేస్తూ హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇటుక బట్టీలకు అద్దెకు.. నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో అక్రమ పట్టాలు పొందిన వారిలో చాలామంది ఆ భూములను చదును చేసి ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకిచ్చి లక్షలాది రూపాయలు పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇటుక బట్టీల వ్యాపారులు కూడా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూ మిని చదును చేస్తూ వినియోగించుకుంటున్నారు. -
సీజన్ దాటాక వస్తే ఏం లాభం
మొక్కజొన్నకు పీచు దశలో యూరియా అవసరం. సరైన సమయంలో యూరియా అందిస్తేనే లాభం. ప్రభుత్వ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి వంద శాతం యూరియాను సొసైటీలకు అందించేలా ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఏనుగు ముత్యంరెడ్డి, భూపతిపూర్, రాయికల్ ఎక్కువ వాడడంతోనే సమస్య వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుకు మించి వరి, మొక్కజొన్న పంటలకు యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి జిల్లా కు యూరియా సరఫరా అయ్యింది. అయినా డి మాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – రాంచందర్, జిల్లా వ్యవసాయాధికారి -
క్రీడలతో మానసికోల్లాసం
● విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జగిత్యాలరూరల్: క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం క్రికెట్, స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, లక్ష్మణ్, నిర్వాహకులు బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఆస్పత్రిలో మౌలిక వసతులుండాలి
జగిత్యాల: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆస్పత్రి స్థాపన చట్టం 2010 ప్రకారం మౌలిక వసతులన్నీ ఉండాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ జాన్బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగులకు వేచి ఉండాల్సిన స్థలం, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే నివారణకు రక్షణ చర్యలు, ఆస్పత్రి నుంచి వచ్చే వ్యర్థమైన నీటిని శుభ్రపర్చే ఎస్టీపీ ట్యాంక్లు, బయోమెడికల్ వేస్టేజీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాబ్లు సై తం అన్ని వసతులతో కూడి ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో ల్యాబ్లు, మెడికల్షాపులు, ఎక్స్రే ప్లాంట్లు, ఆపరేషన్ థియేటర్స్ను పరిశీలించారు. ఆయన వెంట డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు జైపాల్రెడ్డి, శ్రీని వాస్రెడ్డి, వెంకటరామిరెడ్డి, భూమేశ్వర్ ఉన్నారు. -
యూరియా దొరుకుతలె..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. యాసంగిలో మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగిల్ విండో, అగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో పెడుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తమకు నచ్చిన రేటుకు విక్రయించే పనిలో పడ్డారు. జిల్లాకు 38 వేల మెట్రిక్ టన్నులు యాసంగిలో జిల్లాకు 38 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. ఇప్పటి వరకు 34,900 మె.ట. రాగా, ఇంకా 3,100 మె.ట. రావాల్సి ఉంది. జిల్లాలోని అన్ని సొసైటీల్లో యూరియా అయిపోవడంతో పాటు, మార్క్ఫెడ్ గోదాంలో స్టాక్ లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో యూరియా నిల్వ చేసే పాయింట్ లేక, కరీంనగర్కు రైల్వే వ్యాగన్ వచ్చినప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే వ్యాగన్ వచ్చినప్పుడు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి డిమాండ్ ఉండటంతో కోటాకు మించి జిల్లాకు యూరియా ఇవ్వడం లేదు. దీంతో మొక్కజొన్నను అధికంగా సాగు చేసిన మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, కోరుట్ల, రాయికల్ మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి మంచిర్యాల నుంచి 500 టన్నులు, రంగారెడ్డి జిల్లా నుంచి 1,000 టన్నుల యూరియాను ఆగమేఘాల మీద తెప్పిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రైల్వే వ్యాగన్ ద్వారా 300–400 మొ.ట వచ్చే అవకాశముంది. మొక్కజొన్న జల్లు దశలో ఉండటంతో తప్పనిసరిగా యూరియా వేయాల్సి ఉండగా, రైతులంతా ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు. దీనికి తోడు యూరియా దొరుకుతుందో లేదోనని అవసరం ఉన్నా, లేకున్నా బస్తాల కొద్ది నిల్వ చేస్తున్నారు. సొసైటీ గోదానికి లారీ లోడ్ వచ్చిదంటే అందులోని 450 బస్తాలు గంటలోపే ఖాళీ అవుతున్నాయి. అన్నదాతలను వేధిస్తున్న యూరియా కొతర క్యూలైన్లలో ఆధార్ కార్డులు.. గంటల తరబడి పడిగాపులు మొక్కజొన్న సాగుతో భారీగా పెరిగిన వాడకం‘జిల్లాలో యాసంగిలో వరి దాదాపు 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50 వేల ఎకరాల్లో సాగైంది. ఈసారి వరిని తగ్గించి, మొక్కజొన్న సాగును పెంచారు. గతేడాది మొక్కజొన్న 26 వేల ఎకరాల్లో సాగవగా, ఈసారి 50 వేల ఎకరాల్లో వేశారు. దీంతో వరి ఎకరాకు 2 బస్తాల యూరియా వేయాల్సి ఉండగా 4 బస్తాల వరకు వేస్తున్నారు. అలాగే మొక్కజొన్న ఎకరాకు రెండున్నర బస్తాలకు గాను 9–12 బస్తాలు వేస్తున్నారు. ఇందుకు కారణం, యూరియాపై సబ్సిడీ ఉండి బస్తా ధర రూ.300 లోపే ఉండగా, డీఏపీ బస్తా రేటు రూ.1,600–1,700 ఉండటంతో యూరియా వాడకం పెరిగింది. దీంతో డిమాండ్కు సరిపడా యూరియా రైతులకు దొరకడం లేదు’. మార్క్ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు యూరియా అందుతుంది. యూరియా కంపెనీలు 50 శాతం మార్క్ఫెడ్, మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తాయి. జిల్లాలో ప్రైవేట్ డీలర్లు లేకపోవడంతో సబ్డీలర్ల ద్వారా యూరియా తక్కువ మొత్తంలో వస్తుంది. సబ్డీలర్లు రవాణా, హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వ ధరకంటే బస్తాపై రూ.20–30 అధికంగా తీసుకుంటున్నారు. కాగా సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే యూరియా విక్రయిస్తుండటంతో ఎక్కువగా రైతులు ఇక్కడే తీసుకుంటున్నారు. మల్లాపూర్ మండలంలోని కొన్ని సొసైటీల్లో బస్తాపై రూ.5–10 ఎక్కువ తీసుకుంటున్నట్లు తెలిసింది.మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు.. -
భయాన్ని తొలగించాలి
పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. – ఎంఏ.కరీం, సైకాలజిస్టు, కరీంనగర్ మంచి ఆహారం తీసుకోవాలి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. బయటి ఫుడ్కు దూరంగా ఉండాలి. డ్రైఫ్రూట్స్, జ్యూస్, పండ్లు ఎక్కువగా తినాలి. పడుకునే ముందు పాలు తాగాలి. – శ్వేత, డైటీషియన్, కరీంనగర్ టీవీ, ఫోన్ చూడొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, ఫోన్ చూడొద్దు. అవి ఎంటర్టైన్మెంట్ కన్నా ఒత్తిడినే ఎక్కువ కలిగిస్తాయి. బ్రీథింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
120 కిలోల గంజాయి పట్టివేత
గోదావరిఖని(రామగుండం): రామగుండం కమిషనరేట్ పోలీసులు 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గోదావరిఖని టూటౌన్ పోలీసులు జీడీకే–11 గని క్రాస్ వద్ద 96.770 కిలోలు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్డులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో 23.50 కిలోల గంజాయిని పట్టుకున్నారని సీపీ ఎం శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు. గోదావరిఖని టూటౌన్ పరిధిలో.. గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీడీకే–11 గని క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఉదయ్వీర్, రాజస్థాన్లోని దోల్పూర్కు చెందిన రాజ్లోథి, ఒడిశాలోని కోరుపుత్కు చెందిన కేశవ్ఖోరా, సోమంత ఖోరాలను అరెస్ట్ చేశారు. కారు యజమాని సూరజ్, గంజాయి సరఫరాదారు చత్తీస్గఢ్లోని జగదల్పూర్కు చెందిన అర్జున్భోరిలు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. గంజాయితోపాటు కార్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జగదల్పూర్ నుంచి మంథని మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో.. మంచిర్యాలలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. 23.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయ న వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ సెల్లార్లో సోమ ప్రవీణ్కుమార్ వైఇన్ఫోం సొల్యూషన్స్ పేరిట సీసీ కెమెరాల గోడౌన్ నిర్వహిస్తున్నాడు. కానీ, అందులోనే గంజాయి నిల్వ ఉంచారు. పక్కా సమాచారం రావడంతో మంచిర్యాల పోలీసులు గోడౌన్ వద్దకు వెళ్లి, అనుమానస్పదంగా కనిపించిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారించగా గంజాయి నిల్వలు బయట పడ్డాయి. మంచిర్యాల జిల్లా రాజీవ్నగర్కు చెందిన ఇరుగురాళ్ల సతీశ్కుమార్, సప్తగిరికాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, ఓ బాలుడు, అశోక్రోడ్కు చెందిన భీమ అనుదీప్, తిలక్నగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ఉబేద్, రాజీవ్నగర్కు చెందిన జాగి రాఘవేంద్రస్వామి, నస్పూర్కు చెందిన గూడూరు రాము, ఎస్కే.అథార్హుర్, ఎస్కే.సమీర్, కరీంనగర్ హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన అర్జున బాబు రావుచౌహాన్, కార్ఖానాగడ్డకు చెందిన మమమ్మద్ అజీజ్లను అరెస్ట్ చేయగా, మరో 11 మంది పరా రీలో ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. గంజాయితోపాటు 11 ఫోన్లు, 5 బైక్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సతీశ్కుమార్ డ్రైవర్గా పనిచేస్తూ సీసీ కెమెరాల వ్యాపారం చేసే ప్రవీణ్కుమార్తో కలిసి గంజాయి వ్యాపారానికి దిగినట్లు వెల్లడించారు. సీలేరు వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి తెచ్చారని పేర్కొన్నారు. గంజాయి ముఠాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచి, టాస్క్ఫోర్స్, గోదావరిఖని టూటౌన్, మంచిర్యాల పోలీసులను ఆయన అభినందించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడ్మిన్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు రాజ్కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 15 మంది అరెస్టు గంజాయితోపాటు 2 కార్లు, 5 బైక్లు, 17 ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ శ్రీనివాస్ -
తీర్పు రాకముందే సీఈసీ ప్రకటనా?
కరీంనగర్: సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీని ఎలా ప్రకటిస్తారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీలో చర్చించకుండా సీఈసీగా జ్ఞానేశ్కుమార్ను ఏకపక్షంగా ప్రకటించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తున్నామని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పార్టీలు మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టుల గురించి కేసీఆర్ మాట్లాడటం అంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనన్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజలింగ మూర్తి హత్య అనేక అనుమానాలు తావిస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, నాయకులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి -
నాగులపేటలో ఇసుక వివాదం
● రీచ్ ఓచోట.. తరలింపు మరోచోటు నుంచి ● కలెక్టర్ సీరియస్.. ఇసుక డంపుల సీజ్ కోరుట్ల: మండలంలోని నాగులపేటలో ఇసుక తరలింపు అంశం వివాదాస్పదంగా మారింది. రీచ్ ఓచోట ఉండగా.. మరోచోటు నుంచి తీసుకెళ్తుండటాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల మండలంలోని పైడిమడుగు వాగు నుంచి ఇసుక తరలింపు కోసం రీచ్కు రెవెన్యూ అధికారులు అనుమతించారు. ఇక్కడి ఇసుక నాణ్యత తక్కువగా ఉండటంతో కొనుగోలుకు వినియోగదారులు ఇష్టపడటం లేదు. దీంతో ఇసుక రవాణాదారులు కొత్త దారిని ఎంచుకున్నారు. పైడిమడుగు ఇసుక రీచ్ పేరిట ఒక్కో ట్రాక్టర్కు రూ.800 డీడీలు కట్టి, వాటి ఆధారంగా ఇసుక బాగుండే నాగులపేట వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. అంతేకాదు, ఒకటి, రెండు ట్రాక్టర్ల ఇసుక తీసుకెళ్లేందుకు డీడీలు కట్టి, పొద్దంతా అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ సత్యప్రసాద్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. స్వయంగా నాగులపేట వాగు వద్దకు వచ్చి, పరిశీలించారు. వాగు పరిసరాల్లో ఉన్న ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆదేశించడంతో అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ కిషన్ను వివరణ కోరగా.. ఇసుక, మొరం తరలింపుపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, అక్రమ రవాణా చేస్తే జరిమానా విధించడంతోపాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు
వేములవాడ: ఎములాడ రాజన్న ఆలయంలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు 29 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు సభ్యులు అనుముల చంద్రం, వడ్డేపల్లి వెంకటరమణ, కె.రాజిరెడ్డి, సి.విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగ స్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపల్లి రామస్వామి, కాయతి నాగరాజు, తొట్ల అంజయ్య, ఏనుగు రమేశ్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, ధర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సుగూరి లక్ష్మి, తోట లహరి కృతజ్ఞతలు తెలిపారు. కుక్క దాడిలో 10 మందికి గాయాలుసిరిసిల్ల కల్చరల్: కుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల బీవైనగర్కు చెందిన ఉమాదేవి, రాణి, లత, రామచంద్రం, లక్ష్మి, భూలక్ష్మి, విజయ, విట్టల్, శేఖర్తోపాటు ఐదేళ్ల పాప వైశాలిపై గురువారం కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో అందరికీ గాయాలయ్యాయి. బాధితులను సుందరయ్యనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ సాహితి వారికి చికిత్స అందించారు. కోరుట్లలో తల్లీకూతురికి.. కోరుట్ల: పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన వెల్లుల్ల గౌతమి, ఆమె కూతురు ధాన్విలపై గురువారం రాత్రి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు ఆ కుక్కను చంపేశారు. నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసుపాలకుర్తి(రామగుండం): నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్సజ్ సీఐ మంగమ్మ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకుర్తి మండలంలోని జీడీనగర్కు చెందిన పల్లపు వెంకట్ గురువారం ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్నాడు. అదే సమయంలో జీడీనగర్ నుంచి బసంత్నగర్ వెళ్లే దారిలో ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. వెంకట్ను ఆపి, తనిఖీ చేయగా 8 లీటర్ల నాటుసారా లభ్యమైంది. నాటుసారా స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. హెడ్కానిస్టేబుల్ ఖదీర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, నరేశ్, రాజు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పెళ్లి పనులు చేసొస్తూ.. వాగులో పడి
రామగిరి(మంథని): చిన్నమ్మ కుమారుడి పెళ్లి పనులు చేసి, ఇంటికి వస్తున్నాడు.. బైక్ అదుపుతప్పి, వాగులో పడి, సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన ఊరగొండ రాజ్కుమార్(39) అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఫోర్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా సెంటినరీకాలనీలోని జోన్–1 ఎస్టీటూ 559 క్వార్టర్లో ఉంటున్నాడు. గురువారం రాంపెల్లికి చెందిన తన చిన్నమ్మ కుమారుడి పెళ్లి మంథని మండలం ఎక్లాస్పూర్లో జరగనుండటంతో బుధవారం రాత్రి వరకు రాంపెల్లిలో వివాహ పనులు చేశాడు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి పెళ్లికి హాజరవుదామని బైక్పై బయలుదేరాడు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిలోని కల్వచర్ల బొక్కల వాగు వద్ద వాహనం అదుపుతప్పి, వంతెన పైనుంచి వాగులో పడింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంథని సీఐ రాజుగౌడ్, ఎస్సై దివ్య పరిశీలించారు. రాజ్కుమార్ మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన ఒక్కగానొక్క కుమారుడు తమను పోషిస్తాడనుకుంటే చనిపోయాడంటూ మృతుడి తల్లిదండ్రులు గట్టమ్మ–శంకర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. సింగరేణి కార్మికుడి దుర్మరణం కల్వచర్ల బొక్కలవాగు వద్ద బైక్ అదుపుతప్పి, ఘటన -
నాంపల్లిలో వివాహిత ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులోని రామన్నపల్లెకు చెందిన బత్తుల మల్లయ్య గత నెల 19న రామన్నపల్లె శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతని భార్య రేణ(28) ముగ్గురు పిల్లలతో కలిసి, కొన్ని రోజులుగా వేములవాడ మండలంలోని నాంపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. గురువారం అద్దె ఇంట్లోనే ఉరేసుకుంది. అయితే, రేణ ఆత్మహత్య, ఆమె భర్త మృతికి రామన్నపల్లెకు చెందిన అంజయ్య కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. రేణ మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అంజయ్య ఇంటి పైకప్పును ధ్వంసం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామన్నపల్లెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై ప్రశాంత్రెడ్డిని వివరణ కోరగా.. రేణ ఆత్మహత్యపై బాధిత కుటుంబసభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. ¯ðlÌS {MìS™èl… Æøyýl$z {ç³Ð]l*-§ýl…-ÌZ ˘ ¿ýæÆý‡¢ Ð]l$–† రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని కుటుంబీకుల ఆరోపణ మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన -
క్షుద్రపూజల కలకలం
కరీంనగర్రూరల్: మనిషి చంద్ర మండలంలోకి వెళ్తున్న ఈ కాలంలో గ్రామీణులు కొందరు ఇంకా మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. దుర్శేడ్ ఉన్నత పాఠశాల, చెర్లభూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం గురువారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. దుర్శేడ్ హైస్కూల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానోపాధ్యాయుడి గది ఎదుట పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు పెట్టి, క్షుద్రపూజ చేశారు. మరుసటిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి, భయభ్రాంతులకు గురయ్యారు. ఇన్చార్జి హెచ్ఎం రత్నాకర్ వెంటనే వాటిని తొలగించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలాగే, చెర్లభూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఐపై ఆర్డీవోకు ఫిర్యాదుమంథని: ముత్తారం ఆర్ఐ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మంపల్లికి చెందిన తీర్థల కొమురెల్లి గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ముత్తారం మండలం ఇప్పలపల్లి శివారులోని 9 గంటల వ్యవసాయ భూమిని పట్టా చేయిస్తానంటూ కొమురెల్లి వద్ద ఆర్ఐ శ్రీధర్ రూ.10 వేలు తీసుకున్నాడు. కానీ, పని చేయలేదు. అడిగితే డబ్బులు పాత తహసీల్దార్కు ఇచ్చానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితుడు ఆరోపించాడు. ఆర్ఐపై చర్యలు తీసుకొని, భూమిని తన పేరిట పట్టా చేయాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపాడు. కారు బోల్తాజూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం లోకపేట కోళ్ల ఫాం వద్ద గురువారం ఓ కారు బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. లోకపేట నుంచి కాచాపూర్ వరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో పెద్దపల్లి నుంచి వెంకట్రావుపల్లె వైపు వస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, ఎవరు ఫిర్యాదు చేయలేదని, సమాచారం కూడా లేదని జూలపల్లి ఎస్సై సనత్కుమార్ తెలిపారు. -
ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి ● యోగా, ధ్యానం చేయాలి ● సమతుల ఆహారం తీసుకోవాలి ● సెల్ఫోన్కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు ● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలుసప్తగిరికాలనీ(కరీంనగర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం వచ్చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, పరీక్షలంటే భయం వీడాలని, ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కథనం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇవి పాటించాలి.. ● పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. ● జంక్ ఫుడ్, బయటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ● పండ్ల రసాలు, స్వీట్, నెయ్యి, వాటర్ మిలాన్, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలి. ● ప్రతీరోజు యోగా, ధ్యానం చేయాలి. దీనివల్ల చదువుపై ఏకాగ్రత వస్తుంది. పద్మాసనం, శశాంకాసనం, గోముకాసనం, శవాసనం వేస్తే మంచిది. ● రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. 15 నుంచి 20 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి. ● విద్యార్థులు మంచి ఆహారం, విశ్రాంతి తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. ఇతర విద్యార్థులతో పోల్చవద్దు. ● ఎక్కువ సమయం చదవాలని ఒత్తిడి చేయొద్దు. పిల్లలతో స్నేహంగా ఉండాలి. ● టీచర్లను సంప్రదిస్తూ సలహాలు తీసుకోవాలి. హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలి పరీక్షల సమయంలో మానసిక రుగ్మతలకు గురయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత కన్సల్టేషన్, కౌన్సెలింగ్ కోసం 94404 88571 లేదా 040–35717915 నంబర్లో సంప్రదించాలి. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జిల్లా పదోతరగతి ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ కరీంనగర్ 12,516 17,799 17,763 జగిత్యాల 12,059 7,067 7,370 రాజన్న సిరిసిల్ల 6,768 5,065 4,245 పెద్దపల్లి 6,393 5,844 5,141క్లిష్టమైన టాపిక్స్పై ఫోకస్ నేను ఉదయం 3:30 గంటలకే నిద్ర లేచి, చదువుకునేదాన్ని. క్లిష్టమైన టాపిక్స్పై ఫోకస్ పె ట్టాను. అర్థం కాని పాఠ్యాంశాలను టీచర్లను అడిగి, మళ్లీ చె ప్పించుకున్న. మా అమ్మానాన్న, ఉపాధ్యాయులు సహకారం అందించారు. నేను పడిన కష్టానికి 10 జీపీఏ వచ్చింది. – దుర్శెట్టి నందిని, 2023–24 ఎస్సెస్సీ 10 జీపీఏ, కరీంనగర్ టెన్షన్ పడొద్దు విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్షలకు హాజరుకావాలి. మా పిల్లలకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో వివరించాం. – ఎ.నిర్మల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల కళాశాల, కరీంనగర్ -
ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వేయర్
మంథని: భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. మంథని మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్గా పని చేస్తున్న జాటోతు గణేశ్శ్ రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద 814 /డి /1, 815/సి సర్వే నంబర్లలో ఎకరం భూ మిని కొలిచి రిపోర్టు ఇచ్చేందుకు మంథనికి చెందిన రైతు సువర్ణ క్రాంతినాగ్ను రూ.17 వేలు డిమాండ్ చేశా రు. ఈ నెల 5న రూ.9వేలు తీసుకున్నా డు. మిగిలిన డబ్బు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మరో రూ.3వేలు రెండో వాయిదాగా గురువారం ఇస్తానని ఫోన్ చేయగా, సర్వేయర్ ఆఫీసుకు కాకుండా బస్టాండ్కు రావాలని బాధితుడికి చెప్పాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు బస్టాండ్లో సర్వేయర్ గణేశ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరుచనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు తిరుపతి, కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డులు అశోక్, సంతోష్ ఉన్నారు. భూసర్వేకు రూ.20 వేలు డిమాండ్ రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
23 నుంచి ‘ఓదెల’ బ్రహ్మోత్సవాలు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈ నెల 23న(ఆదివారం) స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు మహాగణపతి పూజ, గౌరీపూజ, సాయంత్రం ధ్వజారోహణం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, 24న ఉదయం 10:30 గంటల నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం, 25న నాకబలి, గ్రామోత్సవం, 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిత్యోత్సవం, 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8 గంటలకు రథోత్సవం, 11:45 గంటల నుంచి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక, ఏకాదశ రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రధాన ద్వారాలు రంగులతో ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. నీడ కోసం పందిళ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు, కోనేరు నీరు, గదులు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి కరీంనగర్, గోదావరిఖని, హుజూరాబాద్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులతోపాటు సికింద్రాబాద్, కొత్తగూడెం, సిర్పూర్ కాగజ్నగర్ల నుంచి రైళ్ల సౌకర్యం ఉంది. ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రిళ్లు జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. – సదయ్య, ఈవో, ఓదెల దేవస్థానం -
భయాన్ని తొలగించాలి
పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. – ఎంఏ.కరీం, సైకాలజిస్టు, కరీంనగర్ మంచి ఆహారం తీసుకోవాలి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. బయటి ఫుడ్కు దూరంగా ఉండాలి. డ్రైఫ్రూట్స్, జ్యూస్, పండ్లు ఎక్కువగా తినాలి. పడుకునే ముందు పాలు తాగాలి. – శ్వేత, డైటీషియన్, కరీంనగర్ టీవీ, ఫోన్ చూడొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, ఫోన్ చూడొద్దు. అవి ఎంటర్టైన్మెంట్ కన్నా ఒత్తిడినే ఎక్కువ కలిగిస్తాయి. బ్రీథింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి ● సెల్ఫోన్కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు ● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలుమార్చి.. విద్యార్థులకు పరీక్షా కాలం.. చదివిన చదువులకు ఫలితం కోసం శ్రమించే సమయం. మార్చిలో విద్యార్థులకు కీలకమైన ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అంటున్నారు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. పరీక్షలంటే భయం వీడాలని, సెల్ఫోన్కు దూరంగా ఉండి.. ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లోu -
ఎంపీడీవో గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి
పెగడపల్లి: ఎంపీడీవో అధికారుల గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పెగడపల్లి ఎంపీడీవో ఎడబోయన శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి (రాయికల్), కోశాధికారిగా రామకృష్ణ (కోరుట్ల), ఉపాధ్యక్షులుగా ఎస్.రమాదేవి (జగిత్యాల రూరల్), బి.లచ్చాలు (బీర్పూర్), సంయుక్త కార్యదర్శిగా ఆర్.పద్మావతి (మేడిపల్లి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇ.స్వరూప (కొడిమ్యాల), ప్రచార కార్యదర్శిగా ఎం.శంకర్ (కథలాపూర్) ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
యూరియా కోసం ఎదురుచూపులు
బుగ్గారం/కోరుట్లరూరల్: వరి, మొక్కజొన్న చివరి దశకు చేరడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు ఆగ్రోస్ సేవా కేంద్రాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ సరిపడా లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. యూరియా లోడ్ ఎప్పుడొస్తుందా.. అని అక్కడే వేచి ఉంటున్నారు. కొందరు చెప్పులు, ఆధార్కార్డు, పాస్బుక్కులను లైన్గా పెడుతున్నారు. బుగ్గారం మండలానికి మొత్తం 350 నుంచి 400 టన్నుల వరకు యూరియా అవసరం ఉండగా కేవలం 200 టన్నులే వచ్చింది. ఇంకా 200 టన్నుల వరకు యూరియా రావాల్సి ఉంది. అలాగే కోరుట్ల మండలం మాదాపూర్ పీఏసీఎస్కు గురువారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. చివరిగా వచ్చిన కొందరికి యూరియా లభించక వెనుదిరిగారు. ఆందోళన వద్దు : ప్రభుత్వ విప్ అడ్లూరి ధర్మపురి: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 24 గంటల్లో సరిపడా తెప్పిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని జైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం సందర్శించారు. యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా పై విధంగా స్పందించారు. సంబంధిత ప్రిన్సిపాల్ సెక్రెటరీ, డైరెక్టర్, జిల్లా కలెక్టర్లలతో ఫోన్లో మాట్లాడి సరిపడా యూరియాను తెప్పించాలని కోరారు. ఆయన వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ సంగ నర్సీంహులు, నాయకులు ఎస్.దినేష్, చీపిరిశెట్టి రాజేష్, సింహరాజు ప్రసాద్ తదితరులున్నారు. -
గంజాయి విక్రయాలపై నిఘా ఉంచాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో గంజాయి విక్రయాలు, ఇసుక అక్రమంగా తరలిపోకుండా నిఘా పెట్టాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో నెలవారీ నేరాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలని, స్పెషల్ డ్రైవ్, తనిఖీలు నిర్వహించాలన్నారు. శివరాత్రి, హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. నేరం జరిగినప్పుడు సంఘటన స్థలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచంధర్, రాములు, రంగారెడ్డి, డీసీఆర్బీ, ఎస్బీ, ఐటీ కోర్, సీసీఎస్ సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సీఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, నిరంజన్రెడ్డి, కృష్ణరెడ్డి, సురేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పదు కోర్టు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడం.. శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ప్రాసిక్యూటర్లను అభినందించారు. పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలన్నారు. రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలుశిక్ష పడిందన్నారు. పీపీలు బి.రాజేశ్, ఎం.రజని, జి.ప్రణయ్, జె.మల్లికార్జున్, కాసారపు మల్లేశం, సీహెచ్.రామకృష్ణను అభినందించి ప్రశంసపత్రాలు అందించారు. -
కుష్ఠురహిత సమాజానికి కృషి చేయాలి
మల్యాల: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని, వ్యాధి రహిత సమాజం కోసం కృషి చేయాలి కుష్ఠువ్యాధి నియంత్రణ జాయింట్ డైరెక్టర్ జాన్బాబు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమై వ్యాఽధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ఎండీటీ డ్రగ్ ద్వారా నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వరచారి, వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామయ్య, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ ఎన్.శ్రీనివాస్, మండల వైద్యురాలు మౌనిక, హెచ్ఈఓ రమేశ్, పీహెచ్ఎన్ నాగలక్ష్మీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు ● కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం ● యూరియా కొరత దురదృష్టకరం ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతజగిత్యాల: కాంగ్రెస్ అంటేనే కరువు అని, ఆ పార్టీలో కన్నీళ్లు తప్పవని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొరత ఏర్పడిందని, అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. ఎరువులు అందడ లేదని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎరువులు, విత్తనాలు, నీరు, కరెంట్ కొరత ఎప్పుడూ రాలేదన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని, పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, మహిపాల్రెడ్డి, సందీప్రావు, ఆనందరావు పాల్గొన్నారు. ఈనెల 18న అత్యధిక విద్యుత్ వినియోగం జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈనెల 18న అత్యధికంగా విద్యుత్ వినియోగమైనట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ తెలిపారు. 18న 5.167 మిలియన్ యూనిట్లు వినియోగమైందని, రానున్న మూడు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ లోడ్ను తట్టుకునేందుకు అదనంగా 121 ట్రా న్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లలో కొత్తగా 3 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జగిత్యాల బల్దియా ప్రత్యేకాధికారిగా లతజగిత్యాల: జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ లత బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన లత.. మున్సిపల్ ప్రత్యేకాధికారిగానూ విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. తాగునీటి సమస్య రానీయొద్దుకథలాపూర్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని డీపీవో మదన్మోహన్ అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమయ్యారు. మార్చి వరకు వందశాతం ఇంటిపన్ను వసూలు చేయాలన్నారు. ఉపాధిహామీ పనులకు కూలీలు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శంకర్, ఈసీ లక్ష్మయ్య పాల్గొన్నారు. -
150 క్వింటాళ్ల బోనస్ రాలేదు
నేను 150 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని డిసెంబర్లో కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. బోనస్ రూపంలో రూ.75 వేలు రావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే బ్యాంకులో జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు మూడు నెలలైంది. రూ.500 బోనస్ మాత్రం ఇవ్వడంలేదు. ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేశా. – దండవేని మల్లయ్య, దమ్మన్నపేట, ధర్మపురి 300 క్వింటాళ్లు విక్రయించిన నేను 300 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. కానీ బోనస్ రూ.1.50లక్షలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు రాలేదు. ఫోన్ టింగ్మని మోగినప్పుడల్లా మేసేజ్ చూసుకుంటున్నా. వేరే మేసేజ్ కావడంతో నిరుత్సాహానికి గురవుతున్న. – మడిపెల్లి రాజన్న, దమ్మన్నపేట, ధర్మపురి -
ప్రచారంలో కొత్త పుంతలు
● అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్ నంబర్లు ● ఓటు వేయాలని అభ్యర్థనలు.. ఎవరికి వేస్తారనీ సర్వేలు ● ఆన్లైన్లో వ్యక్తిత్వ హననానికి దిగుతున్న పార్టీలు ● సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలకు దిగుతున్న అభ్యర్థులు ● కులాలు, వర్గాల వారీగా ఓటర్లకు విందులు, సమావేశాలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబా ద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు.. అభ్యర్థులు గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ ముందుకు సాగేవారు. తనను గెలిపించాలని సభలు, సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేసేవారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయి. గతంలో ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య పోటీ కనిపించేది. ఈసారి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల్లో అన్ని ముఖ్య పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగారు.ఫలితంగా వారి ప్రచారం.. తోటి అభ్యర్థులను అవమానించేలా సాగుతోంది. ఆరోపణలు చేసుకుంటూ.. ఓటర్లను కులాల వారీగా, వర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రలోభాలకు దిగుతుండటం, ఓటర్లను ఇబ్బంది పెట్టే ధోరణిలో ఫోన్కాల్స్ చేస్తుండటం కలవర పెడుతోంది. సోషల్ మీడియాలో ఆరోపణలు గెలవాలంటూ తామేం చేస్తామో చెప్పుకునే ధోరణి కంటే.. ఎదుటి వారి లోపాలు, వారు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపడమే కొందరు ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు అభ్యర్థులు పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి వారి సోషల్మీడియా ద్వారా పరస్పరం దూషించుకుంటున్నారు. వృత్తిపరంగా వ్యవహరించిన విధానాన్ని ఇప్పుడు గుర్తు చేసి వీళ్లేం సేవ చేస్తారు..? అని వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఫొటోలను డీటీపీ చేసి వారిని అవమానిస్తున్నారు. అలా నాయకులను కించపరిచేలా మార్చిన ఫొటోలను ఆయా పార్టీ, ఇతర వాట్సాప్ గ్రూపులు, సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయా ఫొటోల కింద ఘాటైన పదజాలంతో దుర్భషలాడుతూ కామెంట్లు పెడుతూ చెలరేగిపోతున్నారు. సూటిగా చెప్పాలంటూ ఎన్నికల ప్రచారం కంటే కూడా వ్యక్తిత్వ హననానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో నాయకుడు అసలు ఎన్నికలు జరుగుతున్న తీరే సరిగా లేదని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సర్వేలు, కాల్స్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్ నంబర్ల జాబితా చిక్కింది. ఫలితంగా ఓటర్లకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతీ ఓటరుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ఏ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు..? అంటూ రోజుకు నాలుగైదు సార్లు వివిధ పార్టీలు ఐవీఆర్ ద్వారా ఫోన్లో నిర్వహిస్తున్న సర్వేలు చికాకు తెప్పిస్తున్నాయి. ఓటర్లంతా గ్రాడ్యుయేట్లే కావడంతో మీరు చెప్పిన అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి..? అని చాలామంది ప్రశ్నిస్తుండటం గమనార్హం.విందులు, సమావేశాలు ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని.. కుల సంఘాల నాయకులకు ఎక్కడాలేని గిరాకీ పెరగింది. పార్టీల అభ్యర్థులందరూ వీరిని మచ్చిక చేసుకుని మరీ సమావేశాలు పెడుతున్నారు. అవససరమైతే మందుపార్టీలు కూడా నడిపిస్తున్నారు. దీంతో కులసంఘాల నేతలు అభ్యర్థులందరినీ సంతృప్తి పరిచేలా వారితో తమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ప్రైవేటు లెక్చరర్లను కూడా విందులతో తమ వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. -
అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు
కోరుట్ల: పట్టణ శివారులోని ఏసికోని గుట్టకు కొందరు చేపడుతున్న మొరం తవ్వకాలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడ కనిపించిన జేసీబీని చూసి సీజ్ చేయాలన్నారు. అక్రమంగా మొరం, మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గుట్ట ప్రాంతంలో 1254 సర్వే నంబర్లోగల 15 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇంటిపన్ను రికార్డులను పరిశీలించారు. ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని కమిషనర్ బట్టు తిరుపతిని ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కిషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పన్నులు వందశాతం వసూలు చేయాలి మేడిపల్లి: గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులతో గురువారం సమీక్షించారు. మార్చి 8 వరకు వసూలు పూర్తి చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి ఏసికోని గుట్ట అక్రమ తవ్వకాల పరిశీలన జేసీబీ సీజ్ చేయాలని ఆదేశం -
సన్నాలకు అందని బోనస్
● సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇస్తామన్న సర్కార్ ● కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన అన్నదాతలు ● కొందరికి మాత్రమే విడుదలైన డబ్బులు ● ఇంకా వందలాది మంది రైతుల ఎదురుచూపులు ● రావాల్సిన డబ్బులు రూ.10.16 కోట్లు ● ఒక్క జైనా సంఘానికే రూ 2.80 కోట్లుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అయితే సన్న ధాన్యం అమ్మిన రైతుల్లో కొందరికి ఇంకా బోనస్ జమ కాలేదు. సన్న ధాన్యం క్వింటాల్కు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా క్వింటాల్కు రూ.500 ఇస్తామని ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ.. బోనస్ మాత్రం జమ కావడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. సన్న ధాన్యం 3.10 లక్షల క్వింటాళ్లు జిల్లాలో సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 68 ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 3,10,921.60 క్వింటాళ్ల సన్నవడ్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గింజ పొడవు, వెడల్పు నిష్పత్తుల ఆధారంగా 30 రకాల సన్న ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఆ సమయంలోనే తప్ప, తాలు పేరిట కిలో నుంచి రెండు కిలోల వరకు తరుగు తీశారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపించారు. సన్న ధాన్యం పండించిన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో గత వానాకాలం సీజన్లో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను పండించారు. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక పచ్చి వడ్లనే క్వింటాల్కు రూ.2800 చొప్పున రైస్మిల్లుల్లో విక్రయించుకున్నారు. బోనస్ ఆశతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి, తేమ శాతం లేకుండా విక్రయించినా ఇంకా బోనస్ అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రైతులకు చెల్లించాల్సిన బోనస్ రూ.15.54 కోట్లు సన్న ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ రూ 15.54 కోట్లు. ఇందులో వివిధ దఫాలుగా ఇప్పటి వరకు కేవలం రూ.5.38 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.10.16 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంది. ధర్మపురి మండలంలోని జైనా సొసైటికే రూ.2.80 కోట్ల బోనస్ రావాల్సి ఉంది. జైనా సొసైటీ పరిధిలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రంలో దాదాపు 350 మంది రైతులు ఏడు వేల క్వింటాళ్ల సన్న ధాన్యం విక్రయించారు. సన్నధాన్యం విక్రయించిన 48 గంటలలోపు బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. 16 నవంబర్ 2024న తొలిసారి బోనస్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు విడుతల వారీగా విడుదల చేస్తోంది. బోనస్ కోసం ప్రతిరోజూ రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాల్లో డబ్బుల గురించి చెక్ చేయించుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నవంబర్ నుంచి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది రైతులకు బోనస్ డబ్బులు రాకపోవడంపై గుర్రుగా ఉన్నారు. బోనస్ లెక్కల వివరాలు ఈ–కుబేర్యాప్కు సన్న ధాన్యం కొనుగోలు నుంచి బోనస్ జమ అయ్యే వివరాలను ఈ–కుబేర్ యాప్కు పంపిస్తున్నారు. ఇందులో సివిల్ సప్లయ్ కమిషనర్ పీడీ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో సివిల్ సప్లయ్ శాఖ డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. బోనస్ చెల్లింపులు తొలిసారి కావడంతో కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ విడుతలవారీగా బోనస్ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ రాని రైతులు ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బోనస్ కోసం అవసరమైతే ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
బీర్పూర్ నృసింహునికి రూ.26.33లక్షల ఆదాయం
సారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామికి బ్రహ్మోత్సవాల ద్వారా రూ.26,33,525 ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో అధికారులు హుండీ ఆదాయంతోపాటు, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.13,69,163, వేలంపాటల ద్వారా రూ.7.10 లక్షలు, టికెట్ల ద్వారా రూ. 5,54,362 వచ్చాయి. గతేడాది రూ.26.06 లక్షలు ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది రూ.26,806 పెరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ బంగారం 6 గ్రాములు, మిశ్రమ వెండి 1.280 కిలోలు, విదేశీ నోట్లు 20 వచ్చాయి. లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, మాజీ ఎంపీపీలు మసర్తి రమేశ్, గుడిసె శ్రీమతి, ఆలయ మాజీ చైర్మన్లు ఎనగంటి సామ్రాట్, నేరెళ్ల సుమన్గౌడ్, మాజీ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీచర్స్’ టఫ్ఫైట్!
కరీంనగర్: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఎన్నికలు ఉపాధ్యాయుల్లో జోష్ పెంచుతున్నాయి. కులాలు, సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు విడిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని బీసీ కులగణనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహిస్తూ తమవర్గం వారి గెలుపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నిక కొత్త 15జిల్లాల పరిధిలో జరగనుండగా.. మొ త్తం 27,088మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నా రు. బీజేపీ తరఫున మల్క కొమురయ్య, పీఆర్టీ యూ నుంచి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ సంఘా ల మద్దతుతో సంగారెడ్డికి చెందిన అశోక్కుమార్, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎస్టీయూ, మోడల్ స్కూల్, కేజీబీవీ, సీపీఎస్ సంఘాల మద్దతుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగి, చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. 15 జిల్లాల పరిధిలో 27,088 మంది ఓటర్లు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం 15 కొత్త జిల్లాల్లో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఇందులో 16,932 మంది పురుషులు, 10,156మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్లో 4,305 మంది, నిజామాబాద్లో 3,751మంది, సిద్దిపేటలో 3,212 మంది ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. హన్మకొండ జిల్లాలో 166ఓట్లు, ఆసిఫాబాద్లో 470 ఓట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950 ఓట్లు ఉన్నాయి. విజేతలెవరో? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి వ్యాపారులు, రియల్డర్లు ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారు తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డికి పీఆర్టీయూ టికెట్ నిరాకరించడంతో ఎస్టీయూ, మిగతా సంఘాలను కలుపుకుని బరిలో నిలిచారు. హైదరాబాద్లో విద్యాసంస్థలను నెలకొల్పి రియల్డర్గా పేరు సంపాదించుకున్న మల్క కొమురయ్య బీజేపీ మద్దతుతో బరిలో నిలిచారు. అత్యధిక మెంబర్షిప్ కలిగిన పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోవడంతో ఉపాధ్యాయులు విరివిరిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థుల విజయం కోసం విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో మునిగి తేలుతున్నారు. వంగ మహేందర్రెడ్డి, మల్క కొమురయ్య, రఘోత్తమరెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో వారంరోజులే గడువు కుల, సామాజికవర్గాలుగా విడిపోతున్న ఉపాధ్యాయులు విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో ఊపందుకున్న పోరుఖరీదైన ఎన్నిక... ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఖరీదుగా మారింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పీఆర్టీయూ సంఘంతో పాటు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు బలమైన సామాజికవర్గంతో పాటు వ్యాపారవేత్తలు కావడంతో భారీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగితా వారు కూడా ఇప్పటినుంచే విందులు, వినోదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలుగా ఉపాధ్యాయులు విడిపోయి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలు నాయకుల మధ్యవిగా పరిగణించగా ఈసారి కుల సమీకరణాలవారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఆంజనేయ స్వామి ఆలయంలో కల్యాణ వేడుకలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పురాణిపేట ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్స వం సందర్భంగా శివపార్వతుల కల్యాణంను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరస్వామి జాతర ఉత్సవాలుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో పుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కోడెలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. -
● అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల బుక్లెట్ ● జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు
గొల్లపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి.. పూర్వ పద్ధతిలో మార్కులు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అడిషనల్స్ అవసరం లేకుండా 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్లెట్లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. వచ్చే నెల 21 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు 337 ఉన్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు 11,855 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎంఆర్ షీట్, జవాబు రాసేందుకు నాలుగు పేజీలు ఇచ్చేది. అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్ ఇచ్చేవారు. అయితే అడిషనల్ షీట్ అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ను తీసుకొస్తున్నారు. జవాబులన్నీ ఆ బుక్లెట్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగుచోట్ల.. జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణ కేంద్రాల్లో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్లెట్లను తీసుకెళ్లనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు పదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈ సారి విద్యార్థులు జవాబులు రాసేందుకు బుక్లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తరచూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. – రాము, డీఈవో -
మీటర్లు గిరగిరా..
● జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం ● వేసవి సమీపించడంతో మరింత పెరిగే చాన్స్ ● అప్రమత్తంగానే ఉన్నామన్న విద్యుత్ అధికారులు ● జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ● వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052 ● గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696 ● పారిశ్రామిక కనెక్షన్లు 58,196 జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సమీపిస్తుండటంతో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు గృహాలకు, మరోవైపు వ్యవసాయానికి విని యోగం ఒక్కసారిగా పెరుగుతుండటంతో అధికా రులు అప్రమత్తమయ్యారు. విద్యుత్శాఖ అధికారు ల బృందం ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో వేసవిలో ఎలాంటి అంతరాయమూ లేకుండా విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకోవైపు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఎండ వేడిమి, ఉద యం, సాయంత్రం వేళ చలిగా ఉంటోంది. మొన్న టి వరకు చలి ప్రభావంతో ఫ్యాన్లు వేసేందుకే జంకిన జనం.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, ఉక్కపోత మొదలుకావడంతో కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఏసీలు కూడా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. గతేడాది జనవరిలో 130.596 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే.. ఈ ఏడాది జనవరిలో 130.75 మిలియన్ యూనిట్లు వినయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో 139.04 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా.. ఈ ఏడాది 17వ తేదీ వరకు 87.222 యూనిట్లు వాడకం జరిగింది. ఈ నెల ముగియడానికి మరో 11 రోజులు ఉండడం.. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తంగా ఉన్న విద్యుత్ సిబ్బంది జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ఉన్నాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052, గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696, పారిశ్రామిక కనెక్షన్లు 58,196 వరకు ఉన్నాయి. వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అధి కారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వినియోగమయ్యే విద్యుత్కు అదనంగా 10 శాతం ఎక్కువ కేటాయింపు చేసుకుంటున్నారు. ఓవర్లోడ్ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా 147 ట్రాన్స్ఫా ర్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ట్రాన్స్ఫార్మర్ల మీద పెరుగుతున్న లోడ్ వివరాలను సేకరిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్గాని, సబ్స్టేషన్లోగాని ట్రిప్ అయితే ఎందుకై ందో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు పరిశీలిస్తూ.. ఆ మేరకు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ వారి విద్యుత్ డిమాండ్ పరిస్థితిని పరి శీలించేందుకు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈలు, ఏడీఈ, ఏడీ, ఏఈలు జిల్లా విద్యుత్ అధి కారి సాలియానాయక్తో సమావేశమవుతున్నారు. పొదుపే పరిష్కారం సహజ వనరులైన బొగ్గు, నీరు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఆ కరెంట్ను గృహాలు, వ్యవసాయ కనెక్షన్లకు వినియోగించేందుకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని, విద్యుత్ను పొదుపుగా వాడటమే ఏకై క పరిష్కారమని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో అయినా వీధి దీపాలైన అవసరం లేనప్పుడు స్విచ్ఛాప్ చేయాలని కోరుతున్నారు. అవసరం లేని సమయంలో ఫ్లాన్లు, లైట్లు ఆపివేయాలని నచ్చజెప్పుతున్నారు. రైతులకు అవగాహన సదస్సులు జిల్లాలో దాదాపు మూడు లక్షల వరకు విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా రైతులకు విద్యుత్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు విద్యుత్ పంపుసెట్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు బిగించుకుని, అవసరమున్నా.. లేకున్నా విద్యుత్ను ఎక్కువగా వృథా చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. విద్యుత్ పొదుపు చేసేందుకు ఫ్యూజ్ బాక్స్లో కెపాసిటర్లు బిగించుకోవాలని చెపుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్ల వద్ద ఉన్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. -
ఇసుక అక్రమ రవాణా కావొద్దు
జగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా కా కుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మైనింగ్, పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఇసుక రవాణా జరగకుండా రెండుశాఖలు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి చెక్పోస్టుల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ట్రాక్టర్, లారీ ఏదైనా చెక్ చేయాలని, తహసీల్దార్ అనుమతి ఉందా లేదా తప్పనిసరిగా చూడాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఇసుక వాగుల ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిపోకుండా బృందాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అర్ధరాత్రి వేళల్లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచి చెక్పోస్టుల వద్ద పకడ్బందీ చర్యలు ఉండాలన్నారు. ఇబ్రహీంపట్నం, ధర్మపురి ప్రాంతాల్లో గోదావరి నుంచి ఇసుకకు అనుమతి లేదని, గుర్తించిన ఇసుక రీచ్ల ద్వారానే రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అశోక్కుమార్, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు జివాకర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరెపల్లిలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ధర్మపురి: అనుమతి లేకుండా ఇసుకను తరలించినా.. డంపింగ్ చేసిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని దమ్మన్నపేట, ఆరపెల్లి గ్రామాల్లోని గోదావరి తీరాలను ఎస్పీ అశోక్కుమార్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఇసుక తరలిస్తున్నవారితో మాట్లాడారు. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? పర్మిషన్ ఉందా... ఎంతకాలంగా తరలిస్తున్నారు..?అని ప్రశ్నించారు. గోదావరి ఒడ్డుపై నిల్వ ఉంచిన ఇసుక రీచ్లను పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మైనింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగులతో బుధవారం సమావేశమయ్యారు. దశాబ్దకాలంగా కలిసి ఉన్నామని, ప్రజాజీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయని, రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధికి కృషి చేశానని గుర్తు చేశారు. ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 317 ప్రకారం నాలుగు జోన్లుగా విభజించడంతో ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్కు అండగా నిలవండిమెట్పల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వేలాది పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డికి పట్టభద్రుల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఎన్నికల్లో అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు. మెరుగైన వైద్యం అందించాలిజగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. కొడిమ్యాలలోని పీహెచ్సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సరైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని, ఒకవేళ కొరత ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట వైద్యులున్నారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలిజగిత్యాలరూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ కార్యదర్శి పులి మల్లేశం అన్నారు. బుధవారం మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బందికి వేతనాల కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు విడుదల చేసిందని, కార్మికులకు వేతనాలు, చెక్కులు గ్రామపంచాయతీ వారు పంపినా ట్రెజరీల్లో బిల్లులు పెండింగ్లో ఉండటంతో వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని డీఆర్డీవో రఘువరణ్ అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో మొదటి విడత మంజురైన ఇళ్లకు మంగళవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, బేస్మెంట్ వరకు పూర్తయితే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే వరకు విడతల వారీగా రూ.5లక్షలు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టి కి తేవాలన్నారు. అంతకుముందు హుస్సేన్నగర్, ఒబులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వన నర్సరీల్లో మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఎండకుండా షేడ్ నెట్లు ఏర్పా టు చేయాలన్నారు. ఎండీపీవో శశికుమార్రెడ్డి, ఈజీఎస్ ఎపీవో సతీష్, టీఏ సరిత, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం
రాయికల్: బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో మంగళవారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేలా కార్యకర్తలంతా ఐకమత్యంగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మండల కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, కొల్లూరి వేణు, మహిళా విభాగం అధ్యక్షురాలు స్పందన, ఎస్సీ విభాగం అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, నారాయణగౌడ్, శ్రీనివాస్గౌడ్, రొట్టె శ్రీనివాస్, చంద్రశేఖర్, మహేశ్, రఘునాథ్ పాల్గొన్నారు. -
ఉపాధి హామీ కూలీలు
కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252అక్షరాస్యత శాతం కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
జగిత్యాల
న్యూస్రీల్7బీర్పూర్ నృసింహునికి ఏకాంతోత్సవంసారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఏకాంతోత్సవం జరిపించారు. ఆలయం చుట్టూ సప్తవర్ణ ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, మధుకుమార్, చిన్న సంతోష్, హేమంతాచార్యులు, చిన్న జీయర్స్వామి ఆశ్రమ అర్చకులు లాలిపాటలతో అమ్మవారిని, స్వామివారిని నిద్రపుచ్చారు. బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 -
మహాలక్ష్మి పథకంలో..
జిల్లా లబ్ధిదారులు సబ్సిడీ (రూ.కోట్లలో) జగిత్యాల 1,82,801 9.49 కరీంనగర్ 1,43,899 8.12 పెద్దపల్లి 1,05,913 5.54 సిరిసిల్ల 93,104 4.72జిల్లా కనెక్షన్లు సబ్సిడీ (రూ.కోట్లలో) కరీంనగర్ 1,33,872 594.82 పెద్దపల్లి 1,05,761 484.06 జగిత్యాల 1,71,940 719 సిరిసిల్ల 90,780 388.50 -
‘ఆదర్శానికి’ అందని ప్రోత్సాహం
● జంటలకు తప్పని ఎదురు చూపులు ● నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ● బడ్జెట్ మేరకు అందిస్తామంటున్న అధికారులుగొల్లపల్లి: సమాజంలో అంతరాలను తగ్గించేందుకు.. ఆదర్శ (కులాంతర) వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. రూ.50 వేల నుంచి ఏకంగా రూ.2.50 లక్షలకు పెంచుతూ 2019 నవంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వివా హం చేసుకున్న జంటలకు సకాలంలో అందక ఇ బ్బంది పడుతున్నారు. ప్రోత్సాహకం కోసం నాలు గేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 250 దరఖాస్తులు రాగా.. వీరిలో కేవలం 68 జంటలకు మాత్రమే ప్రో త్సాహకం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 182 మంది ఎదురుచూస్తున్నారు. అర్హులు వీరే.. ● దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా షెడ్యూల్ కులానికి చెందిన వారై ఉండాలి. మరొకరు ఇతర కులానికి చెందిన వారై ఉండాలి. ● అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి. ● వివాహ చట్టం 1965 కింద నమోదై ఉండాలి. ● కొత్తగా పెళ్లైన జంట వార్షికాదాయం రూ.5లక్షలకన్నా తక్కువగా ఉండాలి. ● మొదటి పెళ్లికి మాత్రమే ప్రోత్సాహకం అందుతుంది. ● వివాహమైన ఏడాదిలోపే జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యలయంలో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణపత్రాలు వేరువేరు కులాలకు చెందిన వారు వివాహం చేసుకుంటే పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికా రుల విచారణలో అర్హులని తేలితే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కులం, వయస్సు ధ్రువీకరణలు, విద్యాసంస్థ నుంచి టీసీ, మార్కుల జాబితా, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి నుంచి పొందిన ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివారాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణలక్ష్మీ వైపు మొగ్గు ప్రస్తుతం కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే సామాజికవర్గానికి చెందితేనే పెళ్లి సంబంధాలు కులుపుకొనే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో, అనేక కులాలు ఉన్నప్పటికీ అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు పెద్దలను ఒప్పించి ఆదర్శ వివాహం చేసుకుంటున్నారు. ఇలా పెళ్లి చేసుకున్నవారికి గతంలో ప్రభుత్వం రూ.50 వేలు ప్రోత్సాహకంగా అందించేది. 2019లో దానిని రూ.2.50లక్షలకు పెంచింది. అయితే ప్రోత్సాహకం మాత్రం అందించకపోవడంతో కల్యాణలక్ష్మీ పథకం వైపు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ మేరకు అందిస్తున్నాం ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. బడ్జెట్ మేరకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. జిల్లాలో 182 మందికి పోత్సాహకం అందించాల్సి ఉంది. ఈ సొమ్ముతో తల్లిదండ్రుల మద్దతు లేనివారు జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. – రాజ్కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి -
దుబ్బ రాజన్న జాతరను సక్సెస్ చేద్దాం
సారంగాపూర్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం వివిధ శాఖల మండల, జిల్లాస్థాయి అధికారులు సమావేశమయ్యారు. తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి, వైద్యాధికారి రాధిక, ఆలయ ఈవో అనూష, ఏఈలు ప్రవీణ్, రాజమల్లయ్య, ఆర్ఐ వెంకటేశ్, ఎంపీవో సలీం పాల్గొన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు మహాశివరాత్రి సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చర్చించారు. ● జగిత్యాల పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, జ న్నారం వైపు నుంచి ఆర్టీసీ బస్సులు నడపాల ని, పాత బస్టాండ్ నుంచి ప్రతి పది నిమి షాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. ● ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి మిషన్భగీరథ నీరు సరఫరా కావడం లేదని, ఈ నేపథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ ట్యాంకర్లతోపాటు, గ్రామపంచాయతీ ట్యాంకర్లను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ● ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసిన క్రమంలో రెండు పెద్ద జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ● పారిశుధ్య నిర్వాహణ, కోనేరులో మురికి నీరు తొలగింపు, క్లోరినేషన్కు వంద మంది వరకు గ్రామపంచాయతీల సిబ్బందిని వినియోగించనున్నారు. ● ఎస్సారెస్పీ నుంచి డి–53, 11ఆర్ కాలువకు ఈనెల 28 వరకు నిరంతరం సరఫరా చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు సూచించారు. ● దర్శనానికి వచ్చే వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని, వారికి పాస్లు జారీ చేయాలని నిర్ణయించారు. సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం ముందు ప్రత్యేక వైద్య శిబిరాలు, అగ్నిమాపక యంత్రం, రిస్క్ టీంలను అందుబాటులో ఉంచనున్నారు. బ్రహ్మోత్సవాలపై ముగిసిన సమన్వయ సమావేశం భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలకు హామీ -
బంజారాల ఆరాధ్యం సంత్ సేవాలాల్
జగిత్యాలటౌన్: బంజారాల పరిరక్షణకు కృషి చేసిన మహనీయుడు సంత్సేవాలాల్ మహరాజ్ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో మంగళవారం నిర్వహించిన సేవాలాల్ 286వ జయంతిలో అదనపు కలెక్టర్ లతతో కలిసి పాల్గొన్నారు. బంజారాల్లో చైతన్యం నింపేందుకు సేవాలాల్ కృషి చేశారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మత్తు, జీవహింస పాపమని బోధించిన సేవాలాల్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్కుమార్, డీఈవో రాము, విద్యుత్ శాఖ ఎస్ఈ సాలియానాయక్, డీఈ జవహర్నాయక్, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీవో వాసవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, దశరథ్నాయక్, భూక్యా నరేందర్, అజ్మీరా సంతోష్నాయక్, బంజారా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కుజదోష నివారణ పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు. ఆల య అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు భారీగా తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ దేవాలయాల్లో మొక్కులు చెల్లించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలిజగిత్యాలరూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా మాతా శిశు సంక్షేమాధికారి జైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సౌజన్య, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీకథలాపూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పీహెచ్సీలోని అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. పీహెచ్సీలో రోజుకు ఎంతమందికి వైద్యం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివా స్, డీపీఎం రవీందర్, వైద్యాధికారులు సింధూజ, రజిత, సూపర్వైజర్ శ్రీధర్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దాం ధర్మపురి: పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని జైనా, దొంతాపూర్, ఆరెపెల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నరేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాయకులు ఎస్.దినేష్, చీపిరిశెట్టి రాజేశ్, మొగిలి తదితరులున్నారు. -
..అనే నేను!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్ఆర్ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మార్పు కనిపించింది వీరిలోనే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్బీ బీఫామ్పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చానీయాంశంగా అభ్యర్థుల పేర్లు విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు -
ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి
కోరుట్లరూరల్: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోరుట్ల మండలంలోని నాగులపేట శివారులోని పెద్దవాగు, పైడిమడుగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను సోమవారం సందర్శించారు. నాగులపేట వెళ్లే దారిలో ఇసుక డంపులను చూసి వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్లు సమన్వయంతో నిరంతరం ఇసుక రవాణాపై నిఘా ఉంచాలన్నారు. సామాన్యులకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కట్టుదిట్టపైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నాగులపేట వాగునుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో వాగులోకి వెళ్లేదారుల్లో ట్రెంచ్లు తవ్వి ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, కోరుట్ల తహసీల్దార్ కిషన్, కథలాపూర్ తహసీల్దార్ వినోద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ బి.సత్యప్రసాద్ కోరుట్ల మండలంలో ఇసుక రీచ్ల పరిశీలన -
గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
● ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్లు ఖరారు ● ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ● నేతలందరి దృష్టి కన్నారంపైనే..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకా ల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటివరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేష న్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 8న ప్రక్రియ పూర్తికానుంది. -
ఉపాధ్యాయ ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 325 145 00 470 మంచిర్యాల 999 665 00 1,664 ఆదిలాబాద్ 1095 498 00 1,593 నిర్మల్ 1,282 684 00 1,966 నిజామాబాద్ 2,176 1,375 00 3,751 కామారెడ్డి 1,307 704 00 2,011 జగిత్యాల 1,232 537 00 1,769 పెద్దపల్లి 647 464 00 1,111 కరీంనగర్ 2,663 1,642 00 4,305 రాజన్నసిరిసిల్ల 677 273 00 950 సంగారెడ్డి 1,520 1,170 00 2,690 మెదక్ 799 548 00 1,347 సిద్దిపేట 2,020 1,192 00 3,212 హన్మకొండ 126 40 00 166 భూపాలపల్లి 64 19 00 83 మొత్తం 16,932 10,156 00 27,088 -
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జగిత్యాల/రాయికల్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మాతాశిశు కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు మహిపాల్రెడ్డి, సందీప్రావు, ఆనందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక, మాజీ జెడ్పీటీసీ మహేశ్, మాజీ కౌన్సిలర్లు శివకేసరిబాబు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను లండన్, బహ్రెయిన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లండన్లో ఎఫ్టీసీ మాజీ చైర్మన్, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్ని మతాల పెద్దలతో ప్రార్థనలు, పూజలు చేయించారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, ఉపాధ్యక్షుడు హరిగౌడ్, రవి, సతీశ్రెడ్డి, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రుల ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 4,297 1,840 00 6,137 మంచిర్యాల 19,041 11,880 00 30,921 ఆదిలాబాద్ 10,323 4,612 00 14,935 నిర్మల్ 11,497 5,644 00 17,141 నిజామాబాద్ 19,993 11,581 00 31,574 కామారెడ్డి 11,616 4,793 01 16,410 జగిత్యాల 21,667 13,614 00 35,281 పెద్దపల్లి 19,008 12,028 01 31,037 కరీంనగర్ 42,806 28,739 00 71,545 రాజన్నసిరిసిల్ల 13,772 8,625 00 22,397 సంగారెడ్డి 17,383 8,269 00 25,652 మెదక్ 8,879 3,593 00 12,472 సిద్దిపేట 21,587 11,002 00 32,589 హన్మకొండ 3,162 1,423 00 4,585 భూపాలపల్లి 1,734 749 00 2,483 మొత్తం 2,26,765 1,28,392 02 3,55,159 -
ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతలు తొలగింపు?
జగిత్యాల:రెండు రోజుల క్రితం ధర్మపురిలో జరిగిన ఓ ముఖ్య సమావేశానికి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గౌతమ్రెడ్డి హాజరుకాకపోవడాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. గౌతంరెడ్డి జెడ్పీ సీఈవో. గతంలో ఇక్కడ పనిచేసిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దివాకర్ బదిలీపై వెళ్లడంతో గౌతంరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన అదనపు కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ మధ్య వివాదాలు చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల ధర్మపురిలో నిర్వహించిన ఓ ముఖ్య సమావేశానికి రావాలని కలెక్టర్ గౌతంరెడ్డికి సూచించినా తనకు వాహనం లేదని, ఎలా రావాలని ప్రశ్నించినట్లు తెలిసింది. తనకు క్వార్టర్, వాహనం సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఆయన పోస్టు జెడ్పీ సీఈవో కావడంతో అదనపు కలెక్టర్ వసతులు ఇవ్వడానికి అధికారులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజాగా సమావేశానికి రాకపోవడంతో కలెక్టర్ రెండు రోజుల క్రితం మెమో జారీ చేసినట్లు తెలిసింది. దీంతో గౌతమ్రెడ్డి సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బాధ్యతలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్.లతకు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్కు అదనపు బాధ్యతలు -
హలో.. నేను కమిషనర్ను మాట్లాడుతున్నా..
జగిత్యాల: సోమవారం ఉదయం.. 10 గంటల సమయంలో టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి 6300805117 నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. ‘నేను జగిత్యాల మున్సిపల్ కమి షనర్ను మాట్లాడుతున్న. మీరు ఆస్తిపన్ను చెల్లించాలి. లేకుంటే నోటీసు జారీ చేసి కేసు బుక్ చేస్తాం..’ అని పేర్కొన్నాడు. దీంతో ఆ వ్యాపారి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారని తిరిగి ప్రశ్నించగా.. ఇదే నంబరుకు ఫోన్పే ద్వారా చెల్లించాలని హుకూం జారీ చేశాడు. విషయాన్ని సదరు వ్యా పారి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తామెవరికీ ఫోన్ చేయలేదని, పన్నులు కార్యాలయానికి వచ్చి చెల్లించాలని చెప్పారు సిబ్బంది. జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదని, ఆస్తిపన్ను చెల్లించాలని, రూ.3 వేలు 6300805117 నంబర్కు ఫోన్ పే చే యాలని కాల్ వచ్చింది. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి వార్డు అధికారికి ఫోన్ చేయగా అది ఫేక్ అని తేలింది. వారంరోజులుగా 6300805117 నంబరు నుంచి ఆస్తిపన్ను, ట్రేడ్లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఈ నంబరు ట్రూ కాలర్లో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనే కనిపిస్తోంది. దీంతో కొందరు కమిషనర్ కావచ్చని చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త పంథాలో నేరగాళ్లు ప్రస్తుత హైటెక్ యుగంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి అనేక మంది మోసపోతున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుండడంతో మున్సిపల్ సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ట్రేడ్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆసరా చేసుకుంటు న్న ఆర్థిక నేరగాళ్లు వ్యాపారుల నంబర్లకు ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ట్రేడ్లైసెన్స్, ఇతరత్రా పన్నులను మీసేవలో.. ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉందని, లేదా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించవచ్చని అంటున్నారు. మున్సి పల్ కమిషనర్ పేరిట వచ్చే కాల్స్పై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్, డిజిటల్ లావాదేవీలు ఎక్కువ కావడంతో సైబర్క్రైం అనేకం చోటుచేసుకుంటున్నాయి. పండుగలు వచ్చాయంటే చాలు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. మొన్నటివరకు పీఎం కిసాన్ పేరిట ఏపీకే ఫైల్స్ వాట్సాప్లో పంపించిన కేటుగాళ్లు.. దాని ని ఓపెన్ చేయగానే సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాకయ్యేలా చేశారు. ప్రస్తుతం వస్తున్న 6300 805117 నంబరు నుంచి ఫోన్ వస్తే ఎత్తవద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా లావాదేవీలు చేయొద్దని సూచిస్తున్నారు. కొత్త పంథా ఎంచుకున్న సైబర్ నేరగాళ్లు ఆస్తిపన్ను, ట్రేడ్లైసెన్స్ చెల్లించాలంటూ ఆదేశాలు 6300805117 నంబర్ నుంచి ఫోన్కాల్స్ఫోన్కాల్స్ను నమ్మవద్దు ఇటీవల ఆస్తిపన్ను, ట్రేడ్లైసెన్స్ ఫీజు చెల్లించాలని 6300805117 నంబరు నుంచి కాల్స్ వస్తున్నాయి. ప్రజలు నమ్మవద్దు. ఆస్తిపన్ను చెల్లించేందుకు నేరుగా కార్యాలయంలో గానీ, లేదా మీసేవ కేంద్రాల్లో, ఫోన్పే/గూగుల్పే ద్వారా చెల్లించవచ్చు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ట్రూకాలర్ యాప్లో కమిషనర్ అని ఉంటుంది. అయినా నమ్మవద్దు. – చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ -
రైస్మిల్లుల తనిఖీ
మల్లాపూర్ : మండలంలోని రాఘవపేట, చిట్టాపూర్ గ్రామాల్లోని రైస్మిల్లులను సోమవారం అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత తనిఖీ చేశారు. మిల్లులకు కేటాయించిన, ఇప్పటివరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం అందించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సీవిల్ సప్లై డీటీ ఉమాపతి, టెక్నికల్ అసిస్టెంట్ వంశీ, ఆర్ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘విప్’ను కలిసిన పీఏసీఎస్ సభ్యులుధర్మపురి: సహకార సంఘాల (పీఏసీఎస్)ల పాలకవర్గ పదవి కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పొడిగించడంపై ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ను సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో సహకార సంఘాల అధ్యక్షులు సౌళ్ల నరేష్, సాయిని సత్యనారాయణ, రత్నాకర్, వేణుగోపాల్, రాంరెడ్డి, భాస్కర్ తదితరులున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలిజగిత్యాలక్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ఆహ్వానంజగిత్యాల:జిల్లాలోని ఆదర్శపాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాము సూచించారు. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 28 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఆరో తరగతి వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉంటుందని పేర్కొన్నారు.WWW.TELANGANA.MCGG .GOV.INలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలుజగిత్యాల: ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లను పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దని, శుభ్రత పాటించాలని సూచించారు. టిఫిన్స్ సెంటర్ వద్ద పరిశుభ్రత పాటించకున్నా.. ప్లాస్టిక్ కవర్లు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్లాస్టిక్ కవర్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట సిబ్బంది చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
అప్పుల్లో పంచాయతీ కార్యదర్శులు
గొల్లపల్లి: జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా మరో మూడు పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో ఆ సంఖ్య 383కు చేరింది. కొన్ని పంచాయతీల్లో మాత్రమే ఆదాయ వనరులు ఉండగా.. అత్యధిక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. అరకొరగా వసూలైన పన్నులు ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో వైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. ప్రత్యేకాధికారులు ఉన్నా.. పర్యవేక్షించడమే తప్ప ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలు, విద్యుత్ దీపాల నిర్వహణ, బోర్ మోటార్లు, పైపులైన్ల నిర్వహణ వంటి వాటికి కార్యదర్శులు అప్పు చేయాల్సి వస్తోంది. నెలనెలా ఖర్చులు భరించడం భారంగా మారిందని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షదాకా అప్పు చిన్న పంచాయతీల్లో కార్యదర్శులు రూ.30వేలపైగా సర్దుబాటు చేశారు. కొన్నిచోట్ల రూ.50 వేల నుంచి రూ.లక్షదాకా అప్పు చేశారు. నెలల తరబడి వి ద్యుత్ దీపాలు, బోర్ మోటార్ల నిర్వహణ, పైపులైన్ పగిలినా.. స్టార్టర్లు దెబ్బతిన్నా కార్యదర్శులే చేయిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లు డీజిల్, మెయింటనెన్స్కు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలాగ్రామాల్లో నిధులు లేక వీధి లైట్లను మార్చడానికి ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్య కూలీలకు డబ్బులు సర్ధుబాటు చేయడం భారంగా మారింది. నిధులొస్తేనే.. పంచాయతీ ఎన్నికలకు ముందుగానే పెండింగ్లో ఉన్న నిధులు వస్తే తాము చేసిన అప్పులు తీర్చుకో గలుగుతామని కార్యదర్శులు పేర్కొంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతుండంటంతో పెండింగ్ నిధులు వచ్చే పరిస్థితి కానరావడం లేదని వాపోతున్నారు. ఏ పంచాయతీ కార్యదర్శిని కదిలించినా సొంత అవసరాలకన్న పంచాయతీ అవసరాలకే ఎక్కువ అప్పు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న నిధులు వస్తే తప్ప గట్టెక్కలేమని పేర్కొంటున్నారు. నిధులు రాక.. పంచాయతీలకు ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. పంచాయతీ పాలక వర్గాలు ఉంటే నిర్వహణ వ్యయం అంతా వారే చూసుకునే వారు. సర్పంచ్లు లేక భారమంతా కార్యదర్శులపై పడింది. ప్రత్యేకాధికారులు ఎక్కడా ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. మరోవైపు 13 నెలలు గడుస్తున్నా నిధుల సమస్య వేధిస్తోంది. కొన్నిచోట్ల మాత్రమే సర్ధుబాటు అవుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికిపైగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన విడుదల కాని 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు ట్రాక్టర్లు, విద్యుత్ దీపాలు, బోర్ల నిర్వహణకు ఇబ్బందులు అప్పు చేసి పనులు చేయిస్తున్నామంటున్న కార్యదర్శులుగొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ పంచాయతీ కార్యదర్శి గ్రామాల్లో ప్రత్యేక పాలన వచ్చినప్పటి నుంచి రూ.90వేలు సొంతంగా ఖర్చు చేశాడు. ఇంకా రూ. లక్ష వరకు ఎలక్ట్రికల్ షాప్లో అప్పు చెల్లించాల్సి ఉంది. అలాగే ఓ ఫర్టిలైజర్ షాప్లో సీజన్లో దోమల మందు, పారిశుధ్యం సామగ్రి తీసుకొచ్చాడు. రూ. 40వేల చెక్కు ఇచ్చి 8 నెలలు అవుతోంది. ఖాతాలో డబ్బులు లేక ఆ చెక్కు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంటి పన్ను, నీటి పన్నులను ట్రెజరీలో జమ చేసి సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఈయనకు వచ్చే అరకొర వేతనంతోనే ఇల్లు నొట్టుకొస్తున్న ఆయన.. పంచాయ తీ కోసం అప్పు తెచ్చి మరి ఖర్చు చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క కార్యదర్శిదే కాదు.. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులందరిది. ఇబ్బంది నిజమే పంచాయతీల్లో నిధులు కొరత ఉన్నమాట వాస్తవమే. అందుబాటులో ఉన్న సాధారణ నిధులు, పన్నుల వసూల ద్వారా పంచాయతీలను ఎలాగోలా గటిక్కిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కావడం లేదు. నిధులు రాకుంటే రానున్న వేసవికాలంలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. – సురేశ్ రెడ్డి. భీంరాజ్పల్లి ప్రత్యేకాధికారి, ఎంపీవో గొల్లపల్లి -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కనులపండువగా బీర్పూర్ నృసింహుని రథోత్సవంసారంగాపూర్: బీర్పూర్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం కనులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. నృసింహుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూర్ణాహుతి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య కొండపై నుంచి శోభాయాత్రగా జాతరస్థలికి తీసుకొచ్చారు. డప్పుచప్పుళ్లు, వేషధారణలు, కాగడాలతో భక్తులు రథానికి స్వాగతం పలికారు. ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రఘుచందర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. న్యూస్రీల్ -
అటవీ సంరక్షణపై అవగాహన
కథలాపూర్(వేములవాడ): అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. విలువైన వృక్ష సంపదకు నష్టం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు ఫైర్లైన్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో చెట్ల ఆకులు రాలడంతో చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవిలో మంటలు విస్తరిస్తాయి. ఇలాంటివి జరగకుండా అధికారులు ముందస్తుగా సమీప గ్రామాలు, రోడ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలో ఐదు అటవీ రేంజ్లు జిల్లాలో 53,734.789 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఈ అడవుల పర్యవేక్షణకు అటవీశాఖలో మెట్పల్లి, రాయికల్, జగిత్యాల, ధర్మపురి, కొడిమ్యాల రేంజ్లుగా విభజించారు. వీటి పరిధిలో 26 సెక్షన్లు, 76 బీట్లుగా విభజించారు. మానవ తప్పిదాలతోనే అగ్నిప్రమాదాలు అగ్ని ప్రమాదాలు సహజసిద్ధంగా.. మరికొన్ని సమయాల్లో మానవ తప్పిదాలతో జరుగుతుంటాయి. పశువుల కాపర్లు అడవులకు వెళ్లిన సమయంలో బీడీలు, సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పారేయడం, వ్యవసాయ భూముల్లో వ్యర్థాలను కాల్చడం వంటి కారణాలతో మంటలు అంటుకున్నాయి. ఇలా జరగకుండా ఉండేందుకు అటవీ అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీడీలు, అగ్గిపెట్టెలను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. ఫైర్లైన్ నిర్మాణం ఇలా.. అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎండకాలం ప్రారంభం నుంచి ఫైర్లైన్ నిర్మాణం (రాలిన ఆకులను ఒకచోట పేర్చి కాల్చడం) చేపడుతారు. ఫైర్లైన్ నిర్మాణంతో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్లైన్ ఉన్నంతవరకు మాత్రమే మంటలు వచ్చి ఆగిపోతాయి. అయినప్పటికీ మంటలు వ్యాప్తి చెందితే సిబ్బంది ఫైర్ బ్లోయర్ల సాయంతో ఆర్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఫైర్లైన్లపై ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు అధికారుల ప్రత్యేక కార్యాచరణరోడ్డు సౌకర్యం కల్పించాలి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదే. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందితే సిబ్బంది, ప్రజలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పించాలి. పెద్ద నష్టాలను అరికట్టవచ్చు. అడవుల్లో బోరుబావులు ఏర్పాటు చేసి మినీట్యాంకులు నిర్మించాలి. తద్వారా జంతువులకు దాహం తీర్చినట్లవుతుంది. – బద్దం మహేందర్, యువకుడు, కథలాపూర్ అగ్నిప్రమాదాలపై అవగాహన వేసవికాలంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదాలను నివారించి చెట్లను కాపాడటానికి ప్రజల సహకారం అవసరం. అందుకోసం అగ్నిప్రమాదాల నివారణతోపాటు ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. అగ్నిప్రమాదాలు జరిగితే ప్రజలు అటవీశాఖ అధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వాలి. – షౌకత్ఆలీ, ఎఫ్ఆర్వో, మెట్పల్లి -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
● తనిఖీల కోసం జిల్లాలో ప్రత్యేక బృందాలు ● సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుకు అధికారుల నిర్ణయంమెట్పల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిన్నామొన్నటివరకు గోదావరి, ఇతర వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇటీవల ప్రభుత్వం ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో ఉన్నతాధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా బృందాలు, సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసే లా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్రమమే ఎక్కువ.. ● ఇసుకను అందుబాటులో ఉంచడానికి జిల్లాలో సిరికొండ, పైడిమడుగు, సాతారాం, ఆత్మకూర్, ఇటిక్యాలలో రీచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ● ఇంతవరకు ఇందులో ఏ ఒక్కచోట కూడా విక్రయాలను మొదలు పెట్టలేదు. ● తద్వారా జిల్లా అంతటా గోదావరి, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ● కేవలం జిల్లాకే పరిమితం కాకుండా కొన్ని ప్రాంతాల నుంచి ఇసుకను నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా టిప్పర్లల్లో తరలిస్తున్నారు. ● కొన్నిచోట్ల అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకుంటుంటే, మరికొన్ని చోట్ల మాత్రం ‘మామూలు’గా తీసుకుంటూ వదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ● ఇటీవల ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో జరిపిన సమీక్షలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పడంతోపాటు దానికి సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ● దీంతో ఇంతకాలం అక్రమ రవాణాను అంతగా పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు.. ప్రస్తుతం దానికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. ● జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలకు కూడా ఇసుక తరలిపోకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ● ఇందుకు మైనింగ్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అవసరమైన చోట చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ● మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న క థలాపూర్ మండలం నుంచి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. ● దీనికి అడ్డుకట్ట వేయడం కోసం మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ వంతెన, ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హన్మాన్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులు ప్రతిపాదించారు. రీచ్ల ప్రారంభంపైనా దృష్టి పెట్టాలి ● జిల్లాలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు రీచ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● రీచ్లతో ఇసుక దొరకడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. -
బతుకు భారమై..
అప్పులు చెల్లించలేక..జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ల లింగన్నకు తోకల లక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. లింగన్న వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చేసేవారు. లింగన్నకున్న మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, సజ్జ, వరి పండించాడు. దిగుబడి సరిగా రాక రూ.16 లక్షలు అప్పు చేశాడు. అది వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అయ్యింది. ఈ సీజన్లో పసుపు రెండెకరాల్లో వేయగా దుంపకుళ్లు రోగం వచ్చింది. దీనికితోడు బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2లక్షలు మాఫీ కాలేదు. రైతు భరోసా సమయానికి అందలేదు. ఆ ఆవేదనతో లింగన్న ఈ ఏడాది జనవరి 14న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 20వ తేదీన మృతిచెందాడు. లింగన్న కొడుకు హర్షవర్దన్ 8వ తరగతి, కూతురు నైనిక 2వ తరగతి చదువుతున్నారు. పెంకుటింట్లో నివసిస్తూ, బీడీలు చుడుతూ లక్ష్మి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఉన్న మూడెకరాలు అమ్మినా.. తన భర్త చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి. -
● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది బలవన్మరణం ● పంటలు సరిగా పండక పెరుగుతున్న అప్పులు ● వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు ● రైతు భరోసా, రుణమాఫీ జాప్యంతో ఇబ్బందులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆరుగాలం శ్రమించి.. నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అలసిపోతున్నాడు. ఎంత కష్టపడ్డా.. ఫలితం రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి కట్టలేకపోతున్నాడు. రుణభారం భరించలేక జీవిత పోరాటంలో ఓడి ప్రాణాలు తీసుకుంటున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ మధ్యలోనే ఆ తల్లితో బంధం తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడు. దిగుబడి రాని పంటలు, పెరిగిన వడ్డీలకు భయపడి అప్పులోళ్లకు ముఖం చెల్లక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు 30 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అన్నదాత దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రైతు భరోసా, రుణమాఫీ సమయానికి కాకుండా జాప్యమవడం రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. పాత జిల్లాలో కలకలం ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. సాగును నమ్ముకుని అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తే.. చివరికి వడ్డీలు పెరిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక వేదనతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ రైతుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో కరీంనగర్లో 10 మంది, జగిత్యాలలో 6 మంది, సిరిసిల్లలో 10 మంది, పెద్దపల్లిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో మెజారిటీ సాగు కోసం అధిక పొలం కౌలుకు తీసుకున్న వారే కావడం గమనార్హం. వీటికితోడు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అయ్యే ఖర్చ అదనం. ఫలితంగా రైతు చేస్తున్న అప్పులకు వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అన్ని కష్టాలకు ఓర్చి పండించిన పంట సరైన దిగుబడి రాక, అనుకున్న మేర గిట్టుబాట ధర రాకపోవడంతో రైతు కలత చెందుతున్నాడు. ముందున్న బాధ్యతలు, అప్పులు, వాటికి వడ్డీలు తలచుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మరణించిన రైతులకు చెల్లించిన రైతు బీమా వివరాలుజిల్లా రైతులు బీమా కరీంనగర్ 234 రూ.11 కోట్లు రాజన్నసిరిసిల్ల 186 రూ.9.30 కోట్లు జగిత్యాల 378 రూ.18.90 కోట్లు పెద్దపల్లి 183 రూ.9.15 కోట్లు -
ఆశలు ఆవిరి
గొల్లపల్లి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చని ఎమ్మెల్యేలు సంకేతాలు ఇవ్వడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. దీంతో చాలామంది ఆశావహులు పోటీ చేసేందుకు ముందుకొచ్చి ఆర్థిక వసనరులు సమకూర్చుకుంటున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మరోసారు కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతపై ప్రకటన చేయడంతో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా ఇన్నాళ్లు హైరానా పడిన ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఒక్కో ప్రక్రియ ముగియడంతో.. గతేడాది ఫిబ్రవరి రెండు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్ పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత ఇటు పంచాయతీలు, అటు పరిషత్లు పత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. అనంతరం ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఒక్కో ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడంతోపాటు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇవన్నీ జరుగుతుండటంతో ఎన్నికలే తరువాయి అన్నట్లు ఆశావహులు హడావుడి చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటన వారిలో నైరాశ్యాన్ని నింపింది. వేడెక్కి.. చల్లారి స్థానిక పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్దిరోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు ఇచ్చిన వారిని గెలుపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో బలనిరూపణను అన్ని పార్టీల నేతలు సవాల్గా తీసుకున్నారు. జిల్లాలో 383 గ్రామ పంచాయతీలు, 20 జెడ్పీటీలు, 262 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలుత పరిషత్.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, ఆశావహులతో సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చంటూ నేతలు, కేడర్కు దిశానిర్దేశం చేశారు. పంచాయతీలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీకి దిగాలని భావించిన వారు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి వనరులు సమకూర్చుకున్నారు. అలాగే స్థానికులతో మమేకం కావడం, యువత మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించారు. తాజాగా ప్రభుత్వం మరోసారి కులగణనకు అవకాశం ఇవ్వడంతో రాజకీయం చప్పున చల్లారింది. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో లక్షల మంది సర్వేలో పాల్గొనకపోవడంతో ఈనెల 28వరకు మరోసారి కులగణన నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్ సర్వేతోపాటు టోల్ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. మే వరకు వేచి చూడాల్సిందే.. ఈనెల చివరిలోగా బీసీ కులగణన రీసర్వే పూర్తి చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదించనున్నారు. తర్వాత పార్లమెంట్లో ఆమోదించడానికి పంపించనున్నారు. బీసీలకు 42 శాతం రిజరేషన్ అమలుకు చట్టబద్దత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మే, జూన్ నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండవచ్చని నేతలు పేర్కొంటున్నారు. అప్పటి వరకు పరిస్థితితులు మారకుండా చూసుకోవడం తలకు మించిన భారంగా మారుతుందని ఆశావహులు భయపడుతున్నారు. పరిషత్, పంచాయతీ ఎన్నికలు మరింత జాప్యం..? ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సందిగ్ధత వనరులు సమకూర్చుకున్న ఆశావహుల్లో నైరాశ్యం -
చావు శరణ్యమై..
ప్రభుత్వం సాయం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన రైతు కోమటి నాగరాజు (49) అప్పుల బాధ తాళలేక 2024 నవంబర్ 30న తనపొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం భార్య లక్ష్మి తన కొడుకు రంజిత్తో కలిసి తనకున్న నాలుగెకరాలతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి వివాహమైంది. రెండో కూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగిని. చిన్న కూతురు కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదని లక్ష్మి తెలిపింది. తన భర్త పేరిట రైతుబీమా వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, ప్రభుత్వం సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
ధర్మపురిలో సంకటహర చతుర్థి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. బీర్పూర్ నృసింహుని సన్నిధిలో వేదసదస్సుసారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి సన్నిధిలో ఆదివారం రాత్రి వేదసదస్సు నిర్వహించారు. చిన్నజీయర్ ట్రస్టు నుంచి వచ్చిన వేదపండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదాలను పటించారు. యాగశాలలో హోమం చేశారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్దసంతోష్, చిన్నసంతోష్, మధుకుమార్, హేమంతాచార్యులు, ఆలయ మాజీ చైర్మన్ ఎనగంటి సామ్రాట్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నేడు స్వామివారి రథోత్సవం నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. -
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. -
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
పెగడపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన మహారాజ్ సంత్సేవాలాల్ మార్గం అనుసరనీయమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో గ్రామంలో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవాలాల్ ఆశయాలకు అనుగణంగా గిరిజనులు నడుచుకోవాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మహాశివరాత్రికి దుబ్బరాజన్నకు ప్రత్యేక బస్సులుసారంగాపూర్: మహాశివరాత్రి సందర్భంగా దుబ్బరాజన్న జాతర బ్రహ్మోతవాల్లో మూడు రోజుల పాటు జగిత్యాల ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆలయ ఈవో అనూష తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనుండగా, 25,26,27 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంటుందని ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ జగిత్యాల డిపో నుంచి ప్రతి 10 నిముషాలకో ప్రత్యేక బస్సు నడుపుతారని ఆలయ ఈవో అనూష తెలిపారు. కోనాపూర్ స్టేజి వద్ద బస్సులు ఆపుతారని తెలిపారు. నేటి ప్రజావాణి రద్దుజగిత్యాలటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావద్దని సూచించారు. -
బాల్యం.. బానిసెల్!
● అన్నం తినాలన్నా, హోంవర్క్ చేయాలన్నా స్మార్ట్ఫోన్ ఇవ్వాల్సిందే ● వీడియోలు, రీల్స్ చూడకపోతే ముద్ద దిగదు ● తల పట్టుకుంటున్న తల్లిదండ్రులు ● అలవాటు మానకపోతే ఆరోగ్యానికి హానికరం ● హెచ్చరిస్తున్న నిపుణులుకరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనాకు ముందు వరకు చదువులో చురుగ్గా ఉండేవాడు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ ఇంటికే పరిమితమవడంతో ఆ చిన్నారి స్మార్ట్ఫోన్ చూడటం మొదలు పెట్టాడు. గంటల తరబడి చూశాడు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక ఫోన్లోనే లీనమవుతుండటంతో చదువుపై ధ్యాస లేక పూర్తిగా వెనకబడి పోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలికదీ ఇదే పరిస్థితి. స్మార్ట్ఫోన్కు బానిసగా మారి, ఇవ్వకపోతే ఏడవడం, చెప్పినట్లు వినకపోవడం వంటివి చేస్తోంది. ఫోన్ ఇస్తేనే అన్నం తింటానంటూ భీష్మించుకు కూర్చుంటోంది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పాప ఆరోగ్యం, భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిఫోన్ చూడడం మొదలు పెట్టాడు. యూట్యూబ్లో చానెల్ క్రియేట్ చేశాడు. సొంతంగా రీల్స్ చేస్తూ సెల్కు బానిసయ్యాడు. ఇంటివద్దే కాదు.. స్కూల్లోనూ ఫోన్పైనే దృష్టిపెడుతూ.. చదువు పక్కన పెట్టాడు. గమనించిన క్లాస్ టీచర్ విద్యార్థితో పాటు తల్లిదండ్రులను మందలించింది. ఫోన్ ఇస్తే స్కూల్కు పంపొద్దని గట్టిగా హెచ్చరించింది. -
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించారు. డీఎస్సీ–2008 అభ్యర్థులకు నియామక పత్రాలుజగిత్యాల: డీఎస్సీ–2008 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించినట్లు డీఈవో రాము తెలిపారు. 2008లో ఎంపికై న 40 మంది అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి కౌన్సెలింగ్ ద్వారా ఉత్తర్వులు అందించామని వెల్లడించారు. పాఠశాలల తనిఖీకథలాపూర్: మండలంలోని సిరికొండ, కథలాపూర్ జెడ్పీ హైస్కూళ్లతోపాటు ఎంఈవో కార్యాలయాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలకు ప్రభుత్వం అందించిన ఐఎఫ్బీ బోర్డులను బోధనకు వినియోగిస్తున్నారా..? లేదా..? అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన ఎస్సెస్సీ ఫలితాలు తెలుసుకొని ఈసారి వందశాతం ఉత్తీర్ణతకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, ఇన్చార్జి హెచ్ఎంలు రవికుమార్, వెంకటేశం ఉన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్సారంగాపూర్: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ అని, వారి సంస్కృతి, సంప్రదా యాలను కాపాడిన గొప్ప వ్యక్తి అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని ధర్మనాయక్తండాలో సేవాలాల్ జయంతిని నిర్వహించారు. సేవాలాల్ ఆలయంలో పూజలు చేశారు. సేవాలాల్ ప్రకృతి ప్రేమికుడని, సంఘ సంస్కర్త అని కొనియాడా రు. ఆయన వెంట బంజారాల పెద్దలు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సేవాలాల్ ఆలయంలో పూజలు చేశా రు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలు గా గుర్తించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ‘నవోదయ’కు కోరుట్లలో సర్వేకోరుట్ల: జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గం పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాటు కోసం సర్వే నిర్వహించిన చొప్పదండి నవోదయ పాఠశాల ప్రతినిధుల బృందం.. శనివారం కోరుట్ల పట్టణానికి వచ్చింది. పట్టణ శివారులోని జంబిగద్దెల సమీపంలో ఉన్న 58 ఎకరాల స్థలంలో సుమారు 30 ఎకరాల స్థలాన్ని నవోదయకు కేటాయించే విషయంలో సర్వే నిర్వహించారు. ఈ స్థలం కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉండటం, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్లు సమాచారం. -
రాజరాజేశ్వరుని పాలకమండలి ఏర్పాటెప్పుడో..?
● ట్రస్ట్ సభ్యులుగా ఏడుగురి పేర్లు ● ప్రకటించడంలో జాప్యం ● ఈనెల 26 నుంచి శివరాత్రి ఉత్సవాలు రాయికల్: మండలంలోని కొత్తపేటలోగల రాజరాజేశ్వర నాగాలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే మరో 10 రోజుల్లో వేడుక నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆలయ పాలకమండలిని దేవాదాయ శాఖ ప్రకటించలేదు. దీంతో ఉత్సవాలు ఎలా చేయాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ మూడు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల కోసం ఎండోమెంట్ అధికారులు పాలకమండలిని ఏర్పాటు చేసి చైర్మన్ను ఎన్నుకుంటారు. ఆ పాలకమండలి నేతృత్వంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటారు. రాయికల్, మేడిపల్లి, జగిత్యా ల, కోరుట్ల మండలాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటారు. గతంలో 11 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం ఏడుగురు ట్రస్ట్ సభ్యులతోపాటు 8 మంది పేర్లతో ఎండోమెంట్ అధికారులకు నివేదించారు. అయినా ఇప్పటివరకు పాలకమండలి పేర్లను ప్రకటించకపోవడం.. మరోవైపు మహాశివరాత్రి ఉత్సవాలు కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లకు ఏ విధంగా చేయాలో సతమతమవుతున్నారు. ఈ విషయంపై ఎండోమెంట్ ఏవో విక్రమ్ను వివరణ కోరగా ఏడుగురు సభ్యుల పేర్లను నివేదిక పంపించామని, అనుమతి రాగానే ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పందించి రాజరాజేశ్వర నాగాలయ పాలకమండలిని నియమించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
కూలీల సమస్యకు చెక్
జిల్లాలో పసుపు తవ్వకాలు పూర్తయ్యాయి. రైతులు పసుపును ఉడకబెట్టి మార్కెట్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడకబెట్టేందుకు అన్నదాతలు ఆధునాతన ఆవిరి యంత్రాలవైపు దృష్టి సారిస్తున్నారు. కొన్ని యంత్రాలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలకు సబ్సిడిపై అందిస్తుండగా.. రైతులు బృందాలుగా ఏర్పడి కొంటున్నా రు. ప్రస్తుతం గ్రామానికి ఒకటి రెండు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రమ్ముకు రూ. 100 నుంచి రూ.150 వరకు తీసుకుంటున్నారు. ఈ యంత్రంలో రోజులోనే 100 నుంచి 150 డ్రమ్ముల పసుపు ఉడుకబెట్టవచ్చు. యంత్రంలో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఉంటుంది. ఇరువైపులా నాలుగు డ్రమ్ములు ఉంటాయి. వీటిని పైపుల ద్వారా నీటి ట్యాంక్కు అనుసంధానం చేస్తారు. పసుపును ముందుగా నాలుగు డ్రమ్ముల్లో నింపుతారు. నీటి ట్యాంక్ కింద కట్టెలతో మంట పెడుతారు. ట్యాంక్లోని నీరు మరిగిన తర్వాత పైపుల ద్వారా నీటి ఆవిరి పసుపు కొమ్ములు ఉన్న డ్రమ్ముల్లోకి వెళుతుంది. డ్రమ్ముల కింది భాగంలో ఓపెన్ చేసి ఉడికిన కొమ్ముల్ని ఆరబోస్తారు. – జగిత్యాలఅగ్రికల్చర్ -
ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
జగిత్యాల:ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై పీవో, ఏపీవోలకు అవగాహన ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వారికి శనివారం కలెక్టరేట్లో శిక్షణ కల్పించారు. ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలు తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. ఓపిక, సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, గడువు లోపు కేంద్రంలో లైన్ ఉంటే టోకెన్ నంబరు ఇచ్చి ఓటింగ్ వేయించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని, పోలింగ్ సామగ్రి, బ్యా లెట్ బాక్స్లు, చెక్లిస్ట్ సరిచూసుకోవాలన్నారు. సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దన్నారు. ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లకు సమస్యలుంటే నివృత్తి చేయాలన్నారు. జిల్లాలో 51 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు, 20 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలున్నాయని, 18 కామన్ పోలింగ్ కేంద్రాలని పేర్కొన్నారు. పేదలందరికీ ఇళ్లు పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటే వందశాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అర్హులను గుర్తించి గ్రామసభల్లో ప్రదర్శిస్తామని, ఈనెల 26వరకు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో పడక గది, హాల్, కిచెన్ సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం మేసీ్త్రలు, కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. దశలవారీగా లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయని, ఆధార్ లింక్ చేయబడిన లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయని పేర్కొన్నారు. అధికారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పక్కాగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు గౌతంరెడ్డి, బీఎస్.లత, డీఆర్డీవో రఘువరణ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
778 అదనపు బస్సులు
మహాశివరాత్రి జాతరకు వేములవాడఅర్బన్: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ బస్టాండ్లోని మేనేజర్ కార్యాలయంలో 11 డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. వేములవాడలోని బస్టాండ్కు 443, కట్ట కింద బస్స్టేషన్కు 335 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. వీటికితోడు ఉమ్మడి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి కూడా అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మేనేజర్లు, సిబ్బంది తమకు కేటాయించిన డిపోల్లో విధులు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భూపతిరెడ్డి, సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాస్ తదితరులున్నారు. డిపోల వారీగా వేములవాడ గుడి చెరువు కట్టకింద బస్టాండ్కు వచ్చే బస్సులు.. నిర్మల్ 83, ఆర్మూర్ 100, నిజామాబాద్–1 నుంచి 17, కామారెడ్డి 33, నర్సంపేట 30, వరంగల్–1 నుంచి 21, హనుమకొండ 27, పరకాల 24 మొత్తం 335 బస్సులు నడవనున్నాయి. వేములవాడ బస్టాండ్కు వచ్చే బస్సులు.. కరీంనగర్–1 డిపో నుంచి 67, కరీంనగర్–2 నుంచి 37, కోరుట్ల 62, మెట్పల్లి 105, వేములవాడ 105, సిరిసిల్ల 52, హుజూరాబాద్ 15 మొత్తం 443 బస్సులు నడి పించనున్నారు. కాళేశ్వరానికి.. మంథని డిపో నుంచి మంథని–కాళేశ్వరం 26 బస్సులు. వీటికితోడు భక్తుల రద్దీకి అనుగుణంగా గోదావరిఖని, కరీంనగర్ల నుంచి కూడా బస్సులను నడపనున్నారు. వేలాలకు.. గోదావరిఖని డిపో నుంచి గోదావరిఖని–వేలాలకు 56, మంథని డిపో నుంచి మంథని–వేలాలకు 40 బస్సులు నడుస్తాయి. దుబ్బ రాజన్నకు ఆలయానికి.. జగిత్యాల డిపో నుంచి జగిత్యాల–దుబ్బరాజన్న ఆలయానికి 50 బస్సులను ఆర్టీసీ నడిపించనుంది. పొట్లపల్లికి.. హుస్నాబాద్ డిపో నుంచి హుస్నాబాద్–పొట్లపల్లికి 23 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్తెలిపారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి సౌజన్యంతో 14 మినీ బస్సులు వేములవాడ(తిప్పాపూర్) నుంచి వేములవాడ గుడి వరకు, తిరుగు ప్రయాణంలో గుడి నుంచి వేములవాడ బస్స్టేషన్ వరకు ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వేములవాడకు ఈ నెల 25 నుంచి 27 వరకు నడిపిస్తాం ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
కరీంనగర్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బిర్లా ఇంటర్నేషన్ స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం బొమ్మకల్ బైపాస్లోని బిర్లా స్కూల్లో ఒలింపియా ప్రథమ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పదిరోజుల నుంచి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, స్కేటింగ్, త్రోబాల్, రన్నింగ్ తదితర క్రీడలు నిర్వహించారు. విద్యార్థుల మార్చ్ఫాస్ట్, స్కూల్ లోగో ప్రదర్శన ఆకట్టుకుంది. చైర్మన్ ప్రశాంత్రెడ్డి క్రీడాజ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో ప్రావీణ్యత పెంచుకుని రాణించాలని కోరారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మల్లాపూర్(కోరుట్ల): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలంలోని సిరిపూర్కు చెందిన ముద్దంగుల కిష్టయ్య(50)కు భార్య ఎల్లమ్మ, కుమారుడు, కుమార్తె సంతానం. కూతురుకు వివాహం కాగా, కొడుకు కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో మెట్పల్లి పట్టణంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూతుర్ని చూసేందుకు కిష్టయ్య శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. రాఘవపేట శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు. ఆర్టీవో అధికారుల అక్రమ వసూళ్లపై నిరసనసాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి రవాణాశాఖ అధికా రుల అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా బసంత్నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్గౌడ్ నిరసనకు దిగాడు. ప్రతినెలా మామూళ్లు అడుగుతున్నారని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద శనివారం లారీపైకి ఎక్కి, విద్యుత్ తీగలు పట్టుకుంటానని హల్చల్ చేశాడు. కార్యాలయంలోని కొందరు అధి కారులు ఒక్కో లారీకి నెలకు రూ.8 వేల లంచం వసూలు చేస్తున్నారని, ఇవ్వనందుకు తన లారీపై కేసు నమోదు చేశారన్నాడు. సిబ్బంది వచ్చి కిందకు దిగాలని విన్నవించినా ఒప్పుకోలేదు. తనను లంచం అడిగిన అధికారులను సస్పెండ్ చేస్తేనే దిగుతానని మొండికేశాడు. ఆర్టీవో రంగారావు.. ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పిస్తే లారీని వదిలేస్తామని చె ప్పడంతో బాధితుడు దిగివచ్చాడు. ఫోన్ చోరీ చేసిన వ్యక్తి అరెస్టుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సెల్ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలి పారు. ఆయన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి చెందిన నూకల సాయివంశీ కడుపునొప్పితో బాధ పడుతూ ఈ నెల 13న మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. రాత్రి బాత్రూంకు వెళ్లొచ్చేసరికి రూ.25 వేల విలువైన అతని ఫోన్ కనిపించలేదు. బాధితుడు మరుసటిరోజు ఇచ్చిన ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశా రు. శనివారం బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రాచర్లతిమ్మాపూర్కు చెందిన బొ డ్డు నిఖిల్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని, విచారించగా ఫోన్ ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. నిఖిల్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బంగారం చోరీమేడిపల్లి(జగిత్యాల): తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు బంగారం చోరీ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేటకు చెందిన ఏనుగు పద్మ శనివారం ఇంటికి తాళం వేసి, వ్యవసాయ ప నులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాగా తా ళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి, బీరువా లో చూడగా 8 తులాల బంగారం కనిపించలే దు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. -
ఆన్లైన్ పెట్టుబడుల కోసం మీటింగ్
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో ఇప్పటికే అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి, పెట్టుబడులు పెట్టించి, పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయి. వీటిలో ఓ కంపెనీ పేరు మార్చుకొని, మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని, వారితో కొడిమ్యాల మండలంలోని ఓ రిసార్ట్లో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించింది. కంపెనీ యజమాన్యం మొదట వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై ఓ 5 నిమిషాలు అవగాహన కల్పించి, తర్వాత ఆన్లైన్ పెట్టుబడులపై సూచనలు చేసింది. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే ఇతర కంపెనీల కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడంతోపాటు సెక్యూరిటీ ఇస్తామని హితబోధ చేశారు. కొన్ని కంపెనీలు మూత పడటంతో పెట్టుబడి పెట్టేవారు వెనకడుగు వేస్తున్నారని చాలామంది ఏజెంట్లు అడిగితే.. అలాంటిదేమీ లేదని, మన కంపెనీ పూర్తిస్థాయిలో గ్యారెంటీ ఇస్తుందని, పెట్టుబడి పెట్టేవారిని తీసుకువస్తే.. మీకు విదేశీ టూర్లతోపాటు భారీ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశం జరుగుతుందని పోలీసులకు తెలిసినా అక్కడికి వెళ్లలేదని, చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం శనివారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. ఇలాంటి మీటింగ్ జరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్లతో ఓ రిసార్ట్లో రహస్య సమావేశం విషయం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు! -
హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు
● కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోల్సిటీ(రామగుండం): హక్కుల సాధన కోసం పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నాయకులు కోరారు. గోదావరిఖని మార్కండేయకాలనీ లో శనివారం నిర్వహించిన సమావేశంలో బీఆర్టీయూ గౌరవ అధ్య క్షుడు మురళీధర్రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.ముత్యంరావు, మున్సిపల్ ఏరియా గౌరవ అధ్యక్షుడు వై.యాకయ్య తదితరులు మా ట్లాడారు. పారిశుధ్య కార్మికులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చీపుర్లు, పారలు, గంపలు, చెప్పు లు, మాస్కులు, గ్లౌస్లు, బెల్లం, స బ్బులు, కొబ్బరినూనె ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని ధ్వ జమెత్తారు. వీటిగురించి అడిగితే పనులకు రావద్దని బెదిరిస్తున్నారని అన్నారు. పండుగ, జాతీయ సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు జనగామ రాయమల్లు, వేల్పుల కుమారస్వామి, కిష న్ నాయక్, రాధాకృష్ణ, నాగమణి, సారయ్య, సునీత, రామలక్ష్మి, పోస మ్మ, బోయిని రవీందర్, మంథని లింగయ్య, రాజేందర్, వేల్పుల రాయమల్లు, రూప పాల్గొన్నారు. మద్దిర్యాలలో బాల్య వివాహం అడ్డగింతరామగుండం: అంతర్గాం మండలంలోని మద్దిర్యాల గ్రామంలో ఓ బాలికకు వివాహం చేస్తున్నట్లు తెలిసి, తహసీల్దార్ రవీందర్ పటేల్, చైల్డ్ హెల్ప్లైన్, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాలికకు ఈ నెల 15న(శనివారం) పెళ్లి చేయాలని నిర్ణయించారని కొందరు ఈ నెల 10న చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కనకరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలి, 1098 కో–ఆర్డినేటర్ ఉమాదేవి, చైల్డ్లైన్ సూపర్వైజర్ రమాదేవి తదితరులు తహసీల్దార్తో కలిసి మద్ధిర్యాలలోని బాలిక ఇంటికి చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. అయితే, శనివారం ఆ బాలికకు పెళ్లి చేస్తున్నారని తహసీల్దార్ రవీందర్ పటేల్, ఎస్సై వెంకటస్వామిలకు సమాచారం వచ్చింది. వారు బాధితురాలి తల్లిదండ్రులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, సఖీ సిబ్బంది సమక్షంలో కౌన్సెలింగ్ చేశారు. అనంతరం పెళ్లి రద్దు చేసుకునేందుకు వారు అంగీకరించారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. మైనర్లను పెళ్లి చేసుకునే మగవారికి పోక్సో చట్టం కింద జైలుశిక్ష పడుతుందని పేర్కొన్నారు. -
కేసీఆర్కు పట్టిన గతే రేవంత్రెడ్డికి పడుతుంది
● ప్రధాని కులం గురించి మాట్లాడేస్థాయి సీఎంకు లేదు ● బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కరీంనగర్టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయిలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నా రు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వా సం కోల్పోయిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డికి ప్రధా ని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అన్నా రు. రెండోసారి కులగణన ఎందుకని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి తీరు మార్చుకోకుంటే కేసీఆర్, కేజ్రీ వాల్కు పట్టిన గతే పడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే, ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్స్ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
మోటార్లు చోరీ.. ముగ్గురి అరెస్టు
మెట్పల్లి: సులభంగా డబ్బు సంపాదించడం కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని, వారు తీసుకువచ్చే సొత్తును కొనుగోలు చేస్తూ సహకరిస్తున్న ఓ స్క్రాప్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత వివరాలను శనివారం మెట్పల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ అశోక్కుమార్ వెల్ల డించారు. మెట్పల్లి పట్టణంలోని దీన్దయాళ్ నగర్కు చెందిన కుంచెపు వెంకటేశ్, మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన సూర్యవంశీ సాయికుమార్ ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వెంకటేశ్కు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు, తన జల్సాలకు సరిపోకపోవడంతో పలుచోట్ల దొంగతనాలు చేశాడు. అలాగే, గ్యాంగ్రేప్ కేసులో అరెస్టయ్యి, జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత సాయికుమార్కు అతనితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ కలిసి వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీ చేయడం మొదలుపెట్టారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. ఈ ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని, విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. సంబంధిత సామగ్రిని స్థానిక స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ బారికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు వెంటనే స్క్రాప్ దుకాణానికి వెళ్లి, బారిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్తోపాటు 30 వ్యవసాయ మోటార్లు, 30 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, రాజు ఉన్నారు. 30 వ్యవసాయ మోటార్లు, 30 కిలోల కాపర్వైరు స్వాధీనం వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ -
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్కల దాడిలో ముగ్గురు గా యపడ్డారు. స్థాని కుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన తొమ్మిదేళ్ల శాన్వితో పాటు ఇద్దరు మహిళలు రుక్కుంబాయి, అనురాధలపై శనివారం కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు స్పందించి, వాటిని దూరంగా తరలించాలని కోరుతున్నారు.‘ఎల్లంపల్లి’లో తగ్గుతున్న నీటి నిల్వలు రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు శనివారం వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.5 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేదు. గూడెం పంపుహౌస్కు 290 క్యూసెక్కులు, హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 283 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గంజాయి విక్రయించేందుకు యత్నం : యువకుడి అరెస్టు ఇల్లంతకుంట(మానకొండూర్): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లికి చెందిన పున్ని వేణు గంజాయికి అలవాటు పడ్డాడు. దాన్ని అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావించి, కొనుగోలు చేశాడు. శనివారం జంగారెడ్డిపల్లి సమీపంలో విక్రయించాలని చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి, ఒక ఫోన్ స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టింగ్ తరహాలో గంజాయి తాగిన వారిని పట్టుకునేందుకు కిట్లు ఉపయోగిస్తున్నామని తెలిపారు. గంజాయి సేవించినవారు దొరికితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై శ్రీకాంత్గౌడ్ ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి పాలకుర్తి(రామగుండం): జీడీనగర్ శ్మశానవాటిక సమీపంలో శివరాత్రి పోచమ్మ(55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బసంత్నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. పోచమ్మ స్థానిక బీసీ కాలనీలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఆమె భర్త గతంలోనే మరణించగా, కుమారుడు రామగుండంలో ఉంటున్నాడు. శనివారం జీడీనగర్ శ్మశానవాటికలో కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, బసంత్నగర్ ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మృతదేహం పక్కనున్న ఆధార్కార్డు ఆధారంగా పోచమ్మగా గుర్తించారు. మృతురాలి కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురి పట్టివేత జగిత్యాల క్రైం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శనివారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం శివారులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. జగి త్యాల రూరల్ మండలం అంతర్గాం, నర్సింగాపూ ర్, ఆదిలాబాద్కు చెందిన యువకులు కలిసి, గంజాయి తరలిస్తుండగా పట్టుకొని, రూరల్ పోలీసులకు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ వ్యసనపరులను గుర్తించి పునరావాస కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకల డీ– అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ బానిసలకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు అటవీ భూముల్లో గంజాయి సాగు వివరాలను పోలీస్ అధికారులకు చేరవేయాలన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో నిల్వలపై ప్రతినెలా తనిఖీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా ప్రమాణాలు, బర్డ్ ఫ్లూ తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఏసీపీలు కృష్ణ, రమేశ్, డీఎఫ్వో శివయ్య, ఆబ్కారీ శాఖ అధికారి మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణు ఆదేశం -
విద్యార్థినులను కరిచిన ఎలుకలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని మెట్లచిట్టాపూర్లోగల మహాత్మజ్యోతిబాపూలే బాలికల గురుకులంలో పలువురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకట్రావుపేటలో నిర్వహిస్తున్న గురుకులంలో ఈనెల 8న వేకువజామున విద్యార్థినులు నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో కొందరిని ఎలుకలు కరిచాయి. తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన విద్యార్థినులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు యాంటీరేబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఎలుకలు కరిచిన వారిలో 8వ తరగతికి చెందిన ముగ్గురు, తొమ్మిదో తరగతికి చెందిన ఒకరితోపాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఇప్పటికే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మూడు డోస్లు పూర్తయినట్లు తెలుస్తోంది. గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, పక్కనే ఉన్న ఓ బియ్యం గోదాం నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇదే గురుకుల పాఠశాలలో గతంలో కూడా ఎలుకల బెడదతో విద్యార్థినులు గాయపడిన సందర్భాలున్నాయి. అయినా సిబ్బంది ఆ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెట్లచిట్టాపూర్ జ్యోతిబాపూలే బాలికల గురుకులంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి