కారు బోల్తా: గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు
నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద కామినేని ఆసుపత్రి సమీపంలో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ జాయింట్ సెక్రటరీ భసంత్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనం బుధవారం బోల్తా పడింది. ఆ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... ఆయన్ని సమీపంలో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. విజయవాడ నుంచి ఆయన కారులో హైదరాబాద్ వస్తుండగా ఆ ప్రమాదం సంభవించింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.