July 30
-
ఈ రోజే ఫ్రెండ్షిప్ డే ఎందుకు?
అన్నింటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమ్మిద ఉండే ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలు ఉండవు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య, సోదరుల మధ్య ఆఖరికి భార్యభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. అంతటి గొప్ప స్నేహ బంధానికి గుర్తుగా ప్రతి ఏడాది ‘స్నేహితుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఫ్రెండ్షిప్ డేని ప్రపంచ దేశాలు ఒకేరోజు జరుపుకోవు. ఒక్కోదేశం ఒక్కోరోజు జరుపుకుంటుంది. భారతదేశం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్ షిప్ డే జరుపుకుంటాయి. కానీ మిగతా దేశాల్లో కొన్ని జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జూలై 30న స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 జూలై 30 డాక్టర్ రామోన్ ఆర్టెమియా ప్రతిపాదించారు. ఈయన బ్రాచో పరాగ్వేలోని అసున్స్యోన్కు ఉత్తరాన 200 మైళ్ల దూరంలో పరాగ్వే నదిపై ఉన్న ప్యూర్టొ పినాస్కో అనే పట్టణంలో జూలై 30న స్నేహితుల కోసం విందును ఏర్పాటు చేశాడు. ఈ విందు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జూలై 30న ‘స్నేహితుల దినోత్సంగా’ నిర్వహించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అప్పుడే ‘స్నేహితుల దినోత్సవం’ అనే ప్రత్యేక రోజు పుట్టింది. ఈ రోజున జాతి, రంగు, కుల, మత బేధాలు లేకుండా మనుషులంతా స్నేహ భావంతో మెలిగేందుకు ప్రతికగా స్నేహితుల దినోత్సవం పుట్టింది. అప్పటి నుంచి పరాగ్వేలో ప్రతి ఏటా జూలై 30 స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రపంచ రాయబారి,సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భార్య నానే అన్నన్ 1998 జూలై 30ను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రతిపాదించారు. అనంతరం ఏప్రిల్ 27 2011న ఐక్యరాజ్యసమితి జూలై 30ని ‘ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా’ ప్రకటించింది. యుఎన్ఓ ప్రతిపాదనను చాలా దేశాలు కూడా స్వీకరించాయి. అయినప్పటికి కొన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఈ తేదికి ముందు లేదా తర్వాత ఫ్రెండ్షిప్ డేను సెలబ్రెట్ చేసుకుంటున్నాయి. భారత్, అమెరికా, ఐరోపా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుండగా.. ఒబెరిన్, ఓహీయో దేశాలు ఏప్రిల్ 9న, నేపాల్ జూలై 30న ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మంగా జరుపుకుంటున్నాయి. -
ఈ నెలాఖర్లో మెమన్కు ఉరి!
నాగ్పూర్ జైల్లో ఏర్పాట్లు * క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీం నిర్ణయం * వెలువడగానే శిక్ష అమలుకు సన్నాహాలు ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ర్టపతి కూడా తిరస్కరించారు. అయినా శిక్షను పునఃసమీక్షించాల్సిందిగా అతడు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. దీనిపై సుప్రీం త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది. ‘సుప్రీంకోర్టు ఏం చెబితే అది అమలు చేస్తాం. సరైన సమయంలో మీడియాకు సమాచారం అందిస్తాం’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. సుప్రీం తీర్పును అమలు చేస్తే పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన తొలి దోషి మెమనే కానున్నాడు. ప్రస్తుతం ఇతడు నాగ్పూర్లోని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. సాధారణంగా ఉరిశిక్షలను ఇక్కడే అమలు చేస్తుంటారు. నాకు తెలియదు: జైలు సూపరింటెండెంట్ మెమన్కు సంబంధించిన డెత్ వారెంట్లు జైలుకు అందాయా? అని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ని అడగ్గా.. ‘నాకు తెలియదు. ఇది ప్రభుత్వం స్థాయిలో జరిగే వ్యవహారం’ అని ఆయన పేర్కొన్నారు. మెమన్ను ఉరికంభం ఎక్కిస్తే.. నేరం చేసినవారికి శిక్ష తప్పదన్న బలమైన సంకేతం సమాజంలోకి వెళ్తుందని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ఇదీ కేసు నేపథ్యం..: 1993, మార్చి 12 (శుక్రవారం) రోజున దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇందులో 250 మందికి పైగా అమాయకులు మరణించగా, సుమారు 1200 మంది గాయపడ్డారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు సూత్రధారిగా తేలింది. పేలుళ్లలో దావూద్ అనుచరుడైన టైగర్ మెమన్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. భారత్, పాక్లోని కొందరు స్మగర్లు దాడులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని, అనేక మంది ఉగ్రవాదులకు పాక్లో శిక్షణ ఇచ్చి ముంబై పంపారని భారత్ పేర్కొంది. అయితే అధికారులు దీన్ని కోర్టులో నిరూపించలేకపోయారు. -
ఉరి శిక్ష తప్పదు.. 30నే అమలు
-
ఈ నెల 30 నే అతనికి ఉరి
ముంబై: ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు బుధవారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేశాయి. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలు కానుంది. అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముంబై పేలుళ్ల ముద్దాయి పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ ను ఉన్నత ధర్మాసనం తిరస్కరిస్తే యాకూబ్ ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే దీనిపై తదుపరి విచారణ జూలై 21 ఉంటుందని తెలుస్తోంది. కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.