ఉరి శిక్ష తప్పదు.. 30నే అమలు | 1993 Mumbai blasts Convict Yakub Memon to be Execute on July 30 | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 15 2015 3:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఈ నెల 30న ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలును ఆపాలంటూ మెమెన్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమెన్కు అదే జైల్లో ఈ శిక్ష అమలు కానుంది. 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement