Advertisement
Kalvakuntra Chandrasekhar Rao
-
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ -
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఐదురోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గత శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా.. దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: CM KCR: ఏకమై ఎండగడదాం! -
‘టీఆర్ఎస్ ఒక నీటి బుడగ లాంటిది’
సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ లాంటిదని, ఎప్పుడు పేలిపోయేది తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆధికారం చేపట్టే దిదశగా బీజేపీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ పరిణామం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ఎన్నికై 3 నెలలు గడుస్తున్నా వారికి నిధులు ఇవ్వలేదని, కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్టంలో 3 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్లో అంతర్గత అసంతృప్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకే ఉందని అందుకే బీజేపీలో భారీగీ చేరికలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 18న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వేలాది మంది బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. -
తెలంగాణ భవన్ నిర్మించండి
సాక్షి, ముంబై: నగరంలో తెలంగాణ భవన్ నిర్మించేందుకు సహకరించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ర చంద్రశేఖర్రావును తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక సభ్యులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని లేక్వ్యూ అతిధిగృహంలో ఆయనతో శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ అద్భు త విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్కు వలసబిడ్డల సాధకబాదలతోపాటు పలు డిమాండ్లను వివరించారు. ముంబైలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవనం నిర్మించాలని, దీర్ఘకాలిక ఉపాధి కల్పించి వలసలు జరగకుండా చూడాలని కోరారు. ముంబైతోపాటు మహారాష్ట్రలో ఉండే తెలంగాణ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ఆదాయపు పత్రాలు, ఇతర విషయల్లో సహకరించాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా కలలు కన్న కల సాకారం అవుతున్న నేపథ్యంలో ముంబైలో స్థిరపడ్డ తెలంగాణ వలసబిడ్డలకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా, ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయాలన్నింటికి కేసీఆర్ ఎంతో ఓపిగ్గా విని సానుకూలం గా స్పందించారని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం సభ్యులు పేర్కొన్నారు. కేసీఆర్తో భేటీ అయి న వారిలో వేదిక కన్వీనర్లు గ్యారా శేఖ ర్, గోండ్యాల రమేష్, సింగపం గ సైదులు, స్వామి యాదగిరి, బత్తుల లింగం ఉన్నారు. సంబరాలు చేసుకుంటాం జూన్ రెండో తేదీ నుంచి అధికారికంగా ప్రత్యేక తెలంగాణ ఉనికిలోకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైతోపాటు మహారాష్ట్రలోని వలసబిడ్డలందరు జరుపుకోవాలని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలను నిర్వహిస్తుందని కన్వీనర్లు అక్కనపెల్లి దుర్గేష్, వెంకటేష్, మచ్చప్రభాకర్లు పేర్కొన్నారు. బాబును కలసిన ఆంధ్ర మహాసభ సభ్యులు తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడిని ఆహ్వానించామనిది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ అధ్యక్షుడు సంకు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్లోని టీడీపీ పార్టీ కార్యాల యంలో చంద్రబాబును ఆయ న భేటీ అయ్యారు. సీమాంధ్ర ఎన్నికల్లో విజయం సాధించిన బాబుకు అభినందనలు తెలిపారు. అనంతరం ముంబైలోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తెలుగువారి కోసం పని చేస్తున్న వివిధ సంస్థల గురించి తెలిపారు. ఆంధ్ర మహాసభకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన వార్తను చూపించారు. అనంతరం తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆహ్వానం పలికారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిం చారని, 2014 డిసెంబర్లోపు ఆంధ్ర మహాసభకు వస్తానని హామీ ఇచ్చారని సంకు సుధాకర్ తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో ఆంధ్ర మహాసభ సభ్యుడు సత్యం కూడా ఉన్నారు.