Kanjurmarg police
-
అనూహ్య మలుపులు
-
అనూహ్యతో ఆరోజు ఉన్నదెవరు?
-
మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్మార్గ్కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు. అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. -
పురోగతి లేని ‘అనూహ్య’ కేసు
సాక్షి, ముంబై: అనూహ్య అదృశ్యమైంది ఈనెల 5న.. శవమై తేలింది 11 రోజుల తర్వాత.. ఇప్పుడు మరో ఐదు రోజులు గడిచిపోయాయి. అయినా ఈ హత్య కేసులో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు. హత్యకు పాల్పడ్డవారిని పట్టుకోవడం కాదు కదా.. వారికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు. ఓవైపు రైల్వే పోలీసులు.. మరోవైపు కంజూర్ మార్గ్ పోలీసులు.. ఇంకోవైపు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోతున్నారు. మృతదేహం లభిం చిన ఐదు రోజుల తర్వాత అనూహ్య పాదరక్షలు, దుప్పటిని గుర్తించారు. ఆమె మృతదేహం లభించిన చోటు నుంచి సుమా రు కిలోమీటరు దూరంలో ఈ వస్తువులు ఆదివారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి స్నేహితుడు హేమంత్పై ఇంకా ఆరా తీస్తున్నారు. ఆమె ముంబైలో దిగిన రోజు హేమంత్ సెల్ఫోన్ షిర్డీలో ట్రేస్ అయిందని, తర్వాత అతను హైదరాబాద్కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అనూహ్య మృతదేహం బయటపడ్డ కం జూర్మార్గ్ ప్రాంతంలో సోమవారం ‘సాక్షి’ పర్యటించింది. అనూహ్య కేసు దర్యాప్తు చేస్తున్న కంజూర్ మార్గ్ పోలీసు ఇన్స్పెక్టర్ నిశికాంత్ తుంగారేతోపాటు స్థానికులను కేసు గురించి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. సాక్షి పరిశీలనలో వెల్లడైన విషయాలివీ.. - అనూహ్య భౌతికకాయం లభించిన ప్రాంతం కంజూర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి సుమారు ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. - ఈ ప్రాంతాన్ని కంజూర్-భాండూప్గా చెప్పుకుంటారు. కొందరు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ నివసిస్తున్నారు. - ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన నిర్మానుష్యంగా ఉన్న చెట్లపొదల్లో అనూహ్య శవం దొరికింది. ఇక్కడ ఆకతాయిలు, నేరచరిత్ర కలిగినవారు మద్యం తాగుతుంటారు. అప్పుడప్పుడు అక్కడ గొడవలు జరిగేవి. - ఈ ప్రాంతం గురించి తెలిసినవారే అనూహ్యను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉండొచ్చని అనుమానం.