భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర గీతాంజలీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంబీఏ విద్యార్థిని శుక్రవారం ఉదయం కళాశాల భవనం పై నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నాకి గల కారణాలు తెలియరాలేదు.