Kolkata City
-
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
నార్కో టెస్టుకు కోర్టు సంచలన తీర్పు
-
ఆ తల్లితండ్రుల ఆవేదన ఎవరికీ కనపడటం లేదా
-
రసవత్తరంగా కోల్కతా రాజకీయాలు..
సాక్షి,కోల్కతా : దేశంలో ఎన్నికల రణరంగంలో ఆసక్తికర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం కోసం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అనంతరం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ త్వరలో రాజకీయాల్లోకి అడుగపెట్టనున్నారు. బీజేపీ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జస్జిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ్ బెంగాల్ స్కూళ్లలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశం కోల్కతాతో పాటు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. తమ్లుక్ లోక్సభ అభ్యర్ధిగా.. ఇప్పుడు ఆయనే స్వయంగా రాజకీయాల్లో అడుగు పెడుతుండడంతో కోల్కతా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్లోని తమ్లుక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఈ స్థానంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు, టీఎంసీ నేత దిబ్యేందు అధికారి ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీల కోసం.. మరోవైపు కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామాపై ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.‘హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం చేయడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
ఆందోళనను విరమించనున్న జూడాలు!
కోల్కతా: గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనకు అతి త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. సోమవారం వారితో బహిరంగ చర్చలకు అంగీకరించారు. మీడియా సమక్షంలో జరిగే ఈ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మమత ఓకే అన్నారు. కోల్కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నాలో సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆందోళన చేస్తున్న జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం మమత అంగీకరించారు. జూడాల డిమాండ్ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జూడాల ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరడంతో వారు త్వరలోనే ఆందోళనలకు స్వస్తి చెప్పి.. తిరిగి విధుల్లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక, ఈ చర్చలకు మీడియాను అనుమతించే విషయంలో దీదీ యూటర్న్ తీసుకున్నారు. కేవలం ఒక్క స్థానిక మీడియా చానెల్ను మాత్రమే ఈ చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరిస్తామని ఆమె తేల్చిచెప్పారు. దీంతో ఉత్సాహంగా చర్చలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. -
ముంపు ముంచుకొస్తోంది!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోల్కతా మహానగరం తాలూకూ రెండు మ్యాప్లు. రెంటికీ మధ్య తేడా ఏమిటో తెలుసా? నీలిరంగు ఎక్కువగా ఉన్నదేమో నగరం సగం సముద్రంలో మునిగిపోతే ఎలా ఉంటుందో చూపుతుంది. బూడిదరంగు ఎక్కువగా ఉన్నదేమో అక్కడక్కడా నీటమునిగితే ఏమవుతుందో చెబుతుంది. కోల్కతా నగరం సముద్రంలో మునిగిపోయేంత ప్రమాదం ఇప్పుడు ఏమొచ్చిందబ్బా అని అనుకోవద్దు. మనం ఇప్పటిలానే విచ్చలవిడిగా పెట్రోలు, డీజిల్ మండించేస్తూ... అడవులను కొట్టేస్తూ పోతే భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతుందని వింటూనే ఉన్నాం కదా... దాని పర్యవసానం ఇలా ఉండబోతుందని అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ అనే స్వచ్ఛంద సంస్థ తన తాజా నివేదికలో హెచ్చరించింది. భూతాపం నాలుగు డిగ్రీల వరకూ పెరిగితే సముద్రతీరాల్లో ఉన్న అనేకానేక మహా నగరాలు ముంపు బారిన పడక తప్పదని ఈ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా న్యూయార్క్ మహానగరంతోపాటు దక్షిణ అమెరికాలోని రియో డి జెనీరో, యూరప్లోని లండన్, ఆసియాలోని ముంబై, కోల్కతా, షాంఘై, దక్షిణాఫ్రికాలోని డర్బన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలతోపాటు ఇతర నగరాల్లో దాదాపు 47 నుంచి 76 కోట్ల మందిని నిర్వాసితులను చేస్తుందని హెచ్చరించింది ఈ నివేదిక. ఈ నెల 30న ప్రారంభం కానున్న ప్యారిస్ వాతావరణ సదస్సు తరువాతైనా ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వచ్చి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తే... భూతాపోన్నతిని రెండు డిగ్రీలకు పరిమితం చేయగలిగితే ప్రమాద తీవ్రతను కొంతవరకూ తగ్గించవచ్చునని సూచించింది. ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలకు పరిమితమైనా కనీసం 13 కోట్ల మంది నిర్వాసితులవుతారని అంచనా.