lakdikapul
-
మూలాలు మరిచిన టీఆర్ఎస్
లక్డీకాపూల్: తెలంగాణ ప్రజల మనోభావాలతో పెనవేసుకుపోయిన టీఆర్ఎస్ తన పరిపాలనాకాలంలో మూలాలు మరిచిపోయిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. సోమవారం పంజగుట్టలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంపాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో వంచనకు, దోపిడీకి గురైన ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారని, అలాంటి రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయిందని ధ్వజమెత్తారు. తాయిలాలు ప్రకటిస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. కమీషన్ల కోసం అనవసర ప్రాజెక్టులు కట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రజల పార్టీ నడుంబిగించిందని పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను ఒక్క తెలంగాణ ప్రజల పార్టీయే నెరవేరుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే అవినీతిలేని పాలనను అందిస్తామని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ చంద్రకుమార్ ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్త, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, న్యాయవాది ఆంజనేయులు, నాయకులు రవిప్రసాద్, లింగయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో దశ మెట్రో రూట్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ (27 కి.మీ)మార్గం ఏర్పాటుపై గతంలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించిన నివేదికలో సూచించిన అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రూట్లో ఎస్ఆర్డీపీ పథకం కింద నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, లింక్దారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో మార్గాన్ని ఫ్లైఓవర్ల వద్ద అత్యంత ఎత్తున ఏర్పాటు చేయడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకోవడమే కారణమని సమాచారం. గతంలో ఈ మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండేళ్ల క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సిద్ధం చేసిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ మెట్రో రూట్ ఇలా.. ఈ మార్గాన్ని బీహెచ్ఈఎల్, మదీనాగూడ, హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్, షేక్పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డికాపూల్ రూట్లో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ రూట్లోనే తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు ఏర్పాటు చేయడంతో మెట్రో మార్గానికి అడ్డొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దాటుతూ మెట్రోను ఏర్పాటు చేసేందుకు అధిక వ్యయం కావడం, ప్రధాన రహదారిపై పనులు చేపట్టేందుకు వీలుగా రైట్ఆఫ్ వే ఏర్పాటు చేయడం వీలుకానందున మెట్రో మార్గంలో స్వల్ప మార్పులు అనివార్యమని హెచ్ఎంఆర్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మార్పులపై మెట్రో వర్గాల మౌనం.. మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) ఉన్నతాధికారులను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశం తమ పరిధిలోది కాదని.. మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. డీఎంఆర్సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంశాలివే.. బీహెచ్ఎఈఎల్–లక్డికాపూల్ మార్గంలో 22 మెట్రో స్టేషన్ల ఏర్పాటు. బీహెచ్ఈఎల్లో మెట్రో డిపో ఏర్పాటుకు 70 ఎకరాల స్థలం కేటాయింపు. రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్ల ఎంపిక,ట్రాక్ల నిర్మాణం. భద్రతా పరమైన చర్యలు. టికెట్ ధరల నిర్ణయం. రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ. వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన. ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు. (చదవండి: పోలీసు కొలువు కొట్టేలా!) -
నిమ్స్లో గుండె మార్పిడి సక్సెస్
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. బ్రెయిన్ డెడ్గా మారిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను శనివారం ఉదయం కేవలం 3 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చినట్లు ఆస్పత్రి సీటీ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేష్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అస్తాపురం మల్లయ్య (51) ఈ నెల16న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన మల్లయ్య ఈ నెల 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్దాన్ బృందం అవయవ దానంపై ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించింది. మృతుడి భార్య హేమలత, కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను వైద్యులు సేకరించారు. అప్పటికి గుండె మార్పిడి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి మల్లయ్య నుంచి సేకరించిన గుండెను అమర్చినట్టు నిమ్స్ తెలిపారు. -
మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం,ఖండించిన మెట్రో రైల్ ఎండీ
హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలుకు శనివారం తృటిలో ప్రమాదం తప్పినట్లు వచ్చిన వార్తలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. వివరాల్లోకి వెళితే.. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లాల్సిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్లోకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై ఎన్వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఈదురు గాలుల ధాటికి ట్రాక్పై రాడ్ పడిపోవడంతో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్ దాటి లక్డికాపూల్ వద్దకు రాగానే నిలిచిపోయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ సందర్భంగా రైలులో ఉన్న ఓ ఆస్తమా పేషెంట్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో, తోటి ప్రయాణికులు ఈ సమాచారాన్ని సిబ్బందికి తెలిపారు. దీంతో బ్యాటరీ పవర్ సాయంతో రైలును రివర్స్ తీసుకువెళ్లి అసెంబ్లీ స్టేషన్లో నిలిపారు. అయితే రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో రైలు వేరే ట్రాక్లోకి వెళ్లిందంటూ పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మెట్రో రైలుకు తప్పిన ముప్పు అంటూ వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వార్తను ఖండించిన మెట్రో రైలు ఎండీ కాగా మెట్రో రైలు ప్రమాద ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. రాంగ్ రూట్లో మెట్రో రైలు వెళ్లిన వార్తలను ఆయన ఖండించారు. మరమ్మతుల కోసమే అరగంట పాటు మెట్రో సేవలలో ఇబ్బందులు తలెత్తినట్లు ఓ ప్రకటన చేశారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దంటూ సూచించారు. ‘వాస్తవాలు తెలియకుండా ఈ రకమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ గాలి పీడనం కారణంగా అసెంబ్లీ స్టేషన్ సమీపంలో ట్రాక్పై మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా, ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అలాగే పడిపోయిన రాడ్ తొలగించాం. రైలుకు ఓహెచ్ఈ (OHE) శక్తి లేకపోవడం, అది బ్యాటరీతో నడిచింది. మెట్రో రైలులో ఆస్తమాతో బాధపడుతున్నో ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో....ప్రయాణీకులను అసెంబ్లీ స్టేషన్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఖాళీ చేసి ప్లాట్ఫామ్కు తీసుకువెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా అరగంటపాటు మెట్రో సేవలను నిలిపివేయడం అయింది’ అని తెలిపారు. చదవండి: పట్టాలపై నిలిచిపోయిన మెట్రో -
ఎన్ఆర్ఐ మహిళలు మరింత సేఫ్
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల సాయం అందించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ విభాగం సిద్ధంగా ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం లక్డీకాపూల్లోని విమెన్ సేఫ్టీ వింగ్లో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ను ఆయన ప్రారంభించారు. ఎన్ఆర్ఐ మహిళలకు ఎదురయ్యే కుటుంబ వేధింపుల పరిష్కారానికి ఎన్జీవోలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయపరంగా సలహాలు, కౌన్సెలింగ్తోపాటు చట్టపరంగా ఈ విభాగం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. నిందితులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఈ విభాగం ఎన్ఆర్ఐ బాధిత మహిళల కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, భారతీయులుగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనికోసం 14 దేశాల ఎంబసీలు, విదేశాంగ వ్యవహారాల శాఖతో అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మాట్లాడుతూ.. కేసుల నమోదులో డాక్యుమెంటేషన్ చాలా కీలకమైనదని, ఈ విషయంలో తమ ప్రాసిక్యూటర్లు న్యాయసలహాలు అందజేస్తారని తెలిపారు. విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎస్పీ (సీఐడీ) సుమతి మాట్లాడుతూ.. ఈ విభాగం న్యాయనిపుణులతో బాధితులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పాస్పోర్ట్ అధికారి విష్ణువర్ధన్రెడ్డి, నీలా ఎన్జీవో ప్రతినిధి మమతా రఘువీర్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్ బోల్తా.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
హైదరాబాద్: బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ బోల్తాకొట్టింది. వేగంగా వెళ్తున్న కంటైనర్ లక్డీకాపూల్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాకొట్టింది. మెహిదీపట్నం నుంచి గ్లూకోస్ బిస్కెట్ల లోడ్తో ఈ కంటైనర్ మహావీర్ హాస్పిటల్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో ఉండే ఈ రోడ్డులో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, ఉదయం వరకు ఈ కంటైనర్ను తొలగించలేదు. దీన్ని తొలగించేందుకు 40 టన్నుల క్రేన్ అవసరం ఉన్నందున అది వచ్చేవరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
లక్డీకపూల్ చోరీ కేసును చేధించిన పోలీసులు
-
సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు!