LCC
-
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
టెక్ మహీంద్రా వాటాల విక్రయం
డీల్ విలువ సుమారు రూ. 33 కోట్లు న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ఎల్సీసీ పాకిస్తాన్ సంస్థలో తమ అనుబంధ కంపెనీకి ఉన్న వాటాలను విక్రయించనున్నట్లు వెల్ల డించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ ఎల్సీసీ మిడిల్ ఈస్ట్ ఎఫ్జెడ్ సంస్థకు ఎల్సీసీ పాకిస్తాన్లో 100 శాతం వాటాలు వాటాలు ఉన్నాయి. వీటిని స్విట్జర్లాండ్కి చెందిన టాక్పూల్ ఏజీకి విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 5.2 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 33.54 కోట్లు) ఉంటుందని టెక్ మహీంద్రా పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని తెలిపింది. 2008లో ప్రారంభమైన ఎల్సీసీ పాకిస్తాన్లో సుమారు 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. పాకిస్తాన్లో కీలక నెట్వర్క్ సర్వీసుల సంస్థగా ఎదగడానికి టాక్పూల్ సంస్థకు.. ఎల్సీసీని కొనుగోలు ఉపయోగపడనుంది. -
టెక్ మహీంద్రా చేతికి ఎల్సీసీ కంపెనీ
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ అమెరికాకు చెందిన లైట్బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్(ఎల్సీసీ)ని 24 కోట్ల డాలర్లు(రూ.1,468 కోట్లకు పైగా)కు కొనుగోలు చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తయ్యే ఈ డీల్ ఈ ఏడాది అతి పెద్ద ఐటీ డీల్ అని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎల్సీసీని పూర్తిగా నగదుతోనే టక్ మహీంద్రా కొనుగోలు చేయనున్నది. కాగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే టెక్ మహీంద్రా కంపెనీ మొత్తం ఏడు కంపెనీలను కొనుగోలు చేసింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్, హచిసన్ గ్లోబల్ సర్వీసెస్, కామ్వివా టెక్నాలజీస్ వంటివి వాటిల్లో కొన్ని. టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్లను అందిస్తున్న అంతర్జాతీయ పెద్ద కంపెనీల్లో ఎల్సీసీ ఒకటి. వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎల్సీసీ 50 దేశాల్లో 5,700 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ వార్షికాదాయం 43 కోట్ల డాలర్లు. కాగా ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన వనరులను అంతర్గతంగానే సమకూర్చుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.