breaking news
lord ganapathi
-
దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా
ముంబైలో GSB సేవా మండల్ ఏర్పాటు చేసిన అత్యంత సంపన్నమైన గణేష్ విగ్రహం విశేషంగా నిలుస్తోంది. ఈ ఏడాది గణపతి నవర్రాతి వేడుకలకు సంబంధించి తన ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. దీంతో ముంబైలో పండుగ ఉత్సాహం మిన్నంటింది. ఈ అద్భుతమైన విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇది నిజంగా "విరాట్ దర్శనం" అని అభివర్ణించారు భక్తులు. అంతేకాదు ఈ ఏడాది గణపతి విగ్రహం భారతదేశంలోనే అత్యంత ధనిక గణపతి విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది.గణేష్ చతుర్థి 2025 వేడుకలుGSB సేవా మండల్ గణపతి వేడుకలు ఆగస్టు 27న సియోన్లోని కింగ్స్ సర్కిల్లో ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. పలు నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం విగ్రహం 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు. ఇది ముంబైలో అత్యంత సంపన్నమైన గణపతిగా నిలిచింది. అంతేకాదు దీనికి గట్టి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం విశేషం. View this post on Instagram A post shared by Youth of GSB (@youthofgsb)అలాగే GSB సేవా మండల్ తన 71వ గణేష్ ఉత్సవాలకు రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల భీమా కవరేజీని కూడా పొందింది. ఇదీ ఓ రికార్డే. ఇందుల దాదాపు రూ. 375 కోట్లు పూజారులు, స్వచ్ఛంద సేవకులు, వంటవారు, భద్రతా సిబ్బంది , పండల్ చుట్టూ ఉన్న చిన్న సేవా స్టాళ్లలో పనిచేసేవారికి వ్యక్తిగత ప్రమాద బీమాకు కేటాయించబడింది. ఈ పాలసీలో అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక ప్రమాదాలు , డిజిటల్ ఆస్తుల నుండి రక్షణ కూడా ఉంది. అదనంగా రూ. 30 కోట్లు ప్రజా బాధ్యతను కవర్ చేస్తాయి, భక్తులకు భద్రతా ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలుగణపడి ఆభరణాల కోసమే రూ. 67.03 కోట్ల బీమా ఉంది. గత ఏడాది గణేష్ మంటపానికి అందించిన మొత్తం భీమా రూ. 400.58 కోట్లుగా ఉంది, ప్రస్తుతం ఆ రికార్డును ఆ బెంచ్మార్క్ను అధిగమించింది. భక్తుల కోసం భద్రత నిమిత్తం మూడు షిఫ్టులలో 875 మంది సిబ్బంది, 100 కి పైగా CCTV కెమెరాలు, AI-ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు మరియు మెటల్ డిటెక్టర్ గేట్లను మోహరించింది. 1954లో స్థాపించబడిన GSB సేవా మండల్ ముంబైలోని గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా భారీ విరాళాలు అందుతాయి.చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Youth of GSB (@youthofgsb) -
Hyderabad: చివరి దశకు ఖైరతాబాద్ గణపతి పనులు
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మరో అయిదు రోజులే ఉండటంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈ నెల 25న మహాగణపతికి నేత్రోనిలన కార్యక్రమం ఉంటుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
సినీ దర్శకుడు వర్మపై కేసులు
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆదివారం హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ కె.శేఖర్ చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘తన తలనే కాపాడుకోలేని వినాయకుడు ఇతరులను ఎలా కాపాడుతాడు.’అంటూ ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ అభ్యంతరక వ్యాఖ్యలు చేశారంటూ శనివారం చంపాపేటకు చెందిన న్యాయవాది కె.కరుణసాగర్ సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వర్మపై 153-ఏ, 505, 298, 504, ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సరూర్నగర్ సీఐ నవీన్రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి, పెనుకొండ పోలీస్ స్టేషన్లలోనూ వర్మపై కేసులు నమోదయ్యాయి.