Maaya
-
మేకింగ్ ఆఫ్ మూవి ”మాయ”
-
మహేశ్భట్ మాయ
నీలకంఠ ‘మాయ’ చిత్రానికి సుప్రసిద్ధ హిందీ దర్శకుడు మహేశ్భట్ ప్రశంసలు లభించాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మాతలు ముఖేష్భట్, విశేష్భట్లతో కలిసి మహేశ్భట్ వీక్షించారు. దర్శకుడు నీలకంఠ, చిత్ర నిర్మాత ‘మధుర’ శ్రీధర్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘మాయ’ ఓ వినూత్న ప్రయత్నమనీ, ఈ కథాంశాన్ని హిందీలో నిర్మిస్తామనీ, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామనీ మహేశ్భట్ తెలిపారు. -
''మాయ'' టీమ్తో చిట్చాట్
-
అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్
‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు. -
అనుభూతినిచ్చే మాయ
మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మాయ’. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మారాజ్, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. వైవిధ్యమైన థ్రిల్లర్ ఇదని, ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయని నీలకంఠ అన్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నానని, సాంకేతికంగా తెలుగు సినిమాను మరో మెట్టుపై నిలబెట్టే సినిమా ఇదని మధుర శ్రీధర్ చెప్పారు. నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్రెడ్డి, సంగీతం: శేఖర్చంద్ర, కూర్పు: నవీన్ నూలి, నిర్మాణం: షిర్డి సాయి కంబైన్స్.