machavaram police station
-
ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!
సాక్షి, అమరావతి: ఓ యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత తరచూ వేధింపులకు ఒడిగడుతున్న ఓ యువకుడిని విజయవాడ నగర పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్లుగా బెదిరింపుల పర్వం కొనసాగుతుండగా యువతి గత శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు విజయవాడ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా మాచవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయాలేమీ తెలియని ఆ యువకుడి తల్లిదండ్రులు సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేయడం గమనార్హం. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రేమ పేరుతో నయవంచన.. విజయవాడలో మాచవరం ప్రాంతంలో ఉన్న రితేశ్(పేరు మార్చాం)కు ఉమ్మడి స్నేహితుల ద్వారా ఓ పుట్టిన రోజు వేడుకలో ఒక యువతితో 2017లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి ఆ యువకుడిని నమ్మడంతో.. ఇద్దరూ హద్దులు దాటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత రితేశ్ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రితేష్ గతంలో తాము తీసుకున్న చిత్రాలను తన స్నేహితుడు భార్గవ్(పేరు మార్చాం)కు ఫోన్లో షేర్ చేసి.. నయ వంచనకు పాల్పడ్డాడు. స్నేహితుడి బెదిరింపులు.. ఆస్ట్రేలియాలో ఉన్న రితేష్ స్నేహితుడు భార్గవ్ కూడా యువతికి ఫ్రెండ్ కావడంతో ఓ రోజు యువతికి భార్గవ్ ఫోన్ చేసి తన దగ్గర ఉన్న ఫొటోల వివరాలు చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే మీ అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరింపుల పర్వానికి తెరదీశాడు. ఒంటరిగా కలవాలని సూచించాడు. దీంతో చేసేది లేక భార్గవ్ చెప్పినట్లుగానే యువతి ఒంటరిగా కలిసింది. ఆ సమయంలో బెదిరించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించ సాగాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అలా రూ. 3 లక్షలు వరకూ యువతి భార్గవ్కు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో.. తాళలేక చివరకు జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మా చవరం పోలీసులు సోమవారం భార్గవ్ను అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ఆస్ట్రేలి యాలో ఉన్న రితేష్పై కూడా కేసు నమోదు చేశారు అరెస్టును అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీ విశ్వప్రయత్నం! యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసి.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ యువకుడిని అరెస్టు చేయకుండా కాపాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పదేపదే నగర కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఫోన్లు చేశారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ద్వారా కూడా సిఫార్సు చేయించినట్లు సమాచారం. అయితే ఎంపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. -
అవినాష్ అనుచరుడుపై కేసు నమోదు
విజయవాడ: ఘరానా మోసగాడు అవినాష్ అనుచరుడు సుబ్రహ్మణ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతర్జాతీయ మానవహక్కుల కమిటీలో పదవి ఇప్పిస్తామంటూ.. రూ. 3లక్షలను సుబ్రహ్మణ్యం తీసుకుని మోసం చేసాడంటూ బీజేపీ నేత గురునాథ్ ఆరోపించారు. డబ్బు తిరిగి ఇవ్వమంటే తనపై సుబ్రహ్మణ్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గురునాథ్ పోలీసులను అశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసినట్టు మాచవరం పోలీసులు తెలిపారు. -
అందంగా లేదని.. భార్యని చంపేశాడు!
-
'శిరీష కేసును హత్య కేసుగానే పరిగణిస్తాం'
-
శిరీష చనిపోయింది
విజయవాడ: కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించని భర్త వైఖరితో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఈపూరి శిరీష చనిపోయింది. దాదాపు 85 శాతం మేర కాలిన శరీరంతో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచింది. కృష్ణా జిల్లా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు.. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన పరసా అనుపమ్కుమార్(28)కు, అదే ప్రాంతానికి చెందిన ఈపూరి శిరీషతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 నెలల పాప ఉంది. అనుపమ్ ఆటోనగర్లో స్టీల్ ఫౌండ్రీ నడుపుతుంటాడు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో పాటు కుటుంబ విషయాల్లో బాధ్యతగా వ్యవహరించడం లేదంటూ శిరీష కొద్దికాలంగా అతడితో గొడవపడుతుండేది. సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన అనుపమ్ భార్యతో గొడవకు దిగాడు. దీంతో శిరీష పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించింది. మాటామాటా పెరగడంతో మనస్తాపం చెందిన శిరీష ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో అనుపమ్ కంగారుగా మంటలను ఆర్పి.. ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు మంగళవారం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్న మేజిస్ట్రేట్ బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. భర్తతో గొడవపడిన తాను అతడ్ని బెదిరించేందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె తన వాంగ్మూలంలో తెలియజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ‘మా అమ్మాయి అందంగా లేదని పరాయి మహిళతో సంబంధాలు కొనసాగిస్తూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్న అల్లుడే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేశా’డని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి ఇది హత్యాయత్నమేనని, తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని వారు అంటున్నారు. ఈ మేరకు శిరీష బంధువులు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా, తనను బెదిరించేందుకు శిరీష ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే తాను మంటలు ఆర్పేందుకు వెళ్లానని, ఆ సమయంలో చేతులకు గాయాలయినట్లు అనుపమ్కుమార్ పోలీసులకు తెలిపారు. అయితే తన కూతురిని చంపేస్తానని భర్త బెదిరించడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు శిరీష నిన్న వాంగూల్మం ఇచ్చిందని చెబుతున్నారు. నేడు మళ్లీ వాంగూల్మం ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించిందని సమాచారం. దీంతో శిరీష భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇంకా ఏమైనావుంటే మేజిస్ట్రేట్ ముందు చెప్పాలని శిరీష బంధువులకు సూచించారు.