Makatoti Sucharita
-
సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
-
మహిళా లోకానికి సీఎం వైఎస్ జగన్ అన్నలా అండగా నిలిచారు
-
ఏపీ ఎస్సై ఫలితాలు: మహిళా టాపర్ ప్రజ్ఞ
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోని వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో 333 మంది ఎంపికయినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ పోస్టుల భర్తీకై మొత్తం లక్షా 35 వేల 414 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సీఎం, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతామని అన్నారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఇంకా 17శాతం వివిధ కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ‘ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో 32 వేల 745 మంది అర్హత సాధించారు. తదుపరి నిర్వహించిన ఫైనల్ రాత పరీక్షలో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో సబ్ ఇన్ స్పెక్టర్ సివిల్ కు 149 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(రిజర్వు) 75 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపీ స్పెషల్ పోలీస్) 75 మంది డిప్యూటీ జైలర్లు(పురుష) 10 మంది, డిప్యూటీ జైలర్(మహిళ) 4, స్టేషన్ ఫైర్ అధికారులు 20 మంది మొత్తం 333 మంది ఎంపికయ్యారు. రాత పరీక్షల్లో పరుచూరి మహేశ్ (నెల్లూరు), షేక్ హుస్సేన్ పీరా (కడప), పాలెం రవి కిశోర్(కడప) టాపర్లుగా నిలిచి ముగ్గురూ 255 మార్కులు సాధించారు. మహిళలు 15 వేల 775 మంది పరీక్షలకు దరఖాస్తు చేయగా వారిలో 61 మంది ఎంపికయ్యరూ. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రజ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్ గా నిలిచారు. ఎంపికైన అభ్యర్ధులను వారి సర్టిఫికేట్లు పరిశీలన అనంతరం త్వరలో శిక్షణకు పంపండం జరుగుతుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతాం. వాటి భర్తీకి త్వరలో ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపడతాం. అని హోం మంత్రి సుచరిత వివరించారు. ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల -
ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఛాంబర్లో సీఎం జగన్ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. గత పదినెలలుగా పెండింగ్లో ఉన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. 333 సబ్ ఇన్స్పెక్టర్, సివిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు సోమవారం రిలీజ్చేసింది. మొత్తం 1,35,414 మంది అభ్యర్థులకు ఈ పోస్టుల కోసం పోటీపడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు, పూర్తయ్యాక అందులో అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సబ్ ఇన్స్పెక్టర్, 75 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్) పోస్టులకు, 75 ఏపీ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు, 10 మంది డిప్యూటీ జైలర్ల, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడ్డారు. నెల్లూరుకు చెందిన పరుచూరి రమేష్, కడపకు చెందిన షేక్ హూస్సేన్, రవికిషోర్ 255 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా 61 మంది ఎంపిక అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్గా నిలిచారు. ధృవ పత్రాలు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఎస్ఐ పోస్టులకు ఎంపికయిన వారికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. -
'బాబు లేఖ వెనక్కి తీసుకో.. ఒత్తిడి పెరుగుతుంది'
-
'బాబు లేఖ వెనక్కి తీసుకో.. ఒత్తిడి పెరుగుతుంది'
రాష్ట్ర విభజనపై ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత బహిరంగ లేఖ లేఖ రాశారు. సీమాంధ్రలో 40 రోజులుగా కోట్లాది మంది ఆక్రందనలు టీడీపీకి పట్టడం లేదని వారు లేఖలో పేర్కోన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదని.. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని లేఖలో తెలిపారు. చంద్రబాబు లేఖ వెనక్కి తీసుకుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. బాబు లేఖ వెనక్కి తీసుకుంటే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో వేచి చూద్దాం అని లేఖలో వివరించారు. రాష్ట్ర విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పు నీళ్లు తప్ప.. మంచినీళ్లు దొరకవని చంద్రబాబుకు తెలిపారు. అంతేకాక మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. విభజనతో సంక్షేమ పథకాలు అమలు జరగవు.. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుందని లేఖలో తెలిపారు.