రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కొండాపురం(మెదక్ జిల్లా): కొండాపురం మండలం మల్కాపురం వద్ద బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో కారు, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బాధితులంతా హైదరాబాద్లోని రామచంద్రాపురంలో ఉన్న శ్రీనివాస్ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్తుండగా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.