సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి
బీహార్ సీఎం జీనత్రాం మాంఝీ మనవడు అమిత్ మాంఝీపై కొందరు మద్యం వ్యాపారులు దాడి చేశారు. బుధవారం రాత్రి మధుబన్ జిల్లా రాణిపూర్లో పర్యటించిన అమిత్పై స్థానిక మద్యం వ్యాపారులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ప్రస్తుతం ఆయన సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
కాగా,తమపై తరచూ పోలీసులు దాడులు జరుపడానికి సీఎం మనవడు అమిత్ మాంఝీనే కారణమని మద్యం వ్యాపారులు భావించడం వల్లే ఈ దాడి జరిగినట్లు తెలిసింది.