-
‘పెళ్లెప్పుడు?’.. రాహుల్ సమాధానాల జాబితా!
‘పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతుంటుంది. దీనికి అతని నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మరోమారు ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు.రాయ్బరేలీ ఎన్నికల ర్యాలీలో ఒక వ్యక్తి రాహుల్ను మీ పెళ్లెప్పుడు? అని అడిగాడు. దానికి రాహుల్ నవ్వుతూ ‘త్వరలోనే చేసుకోవాలి’ అని సమాధానమిచ్చారు. గతంలో రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నప్పుడు ఓ ఆరేళ్ల చిన్నారి.. రాహుల్తో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ప్రస్తుతం నేను పనుల్లో బిజీగా ఉన్నాను’ అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ చిన్నారి ‘ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయని’ అడిగింది. ఈ ప్రశ్న వినగానే రాహుల్ ఆశ్చర్యపోయారు. అప్పట్లో రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఒకసారి పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీతో ‘మా మాట విని పెళ్లి చేసుకోండి. సమయం ఏమీ మించిపోలేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము ఊరేగింపులో పాల్గొంటాం. పెళ్లి విషయంలో మీరు మీ అమ్మగారి మాట కూడా వినడం లేదని ఆమె మాతో చెప్ప బాధ పడ్డారు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే’ అని అన్నారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘మీరు అన్నారంటే.. అయిపోతుంది’ అని అన్నారు.గతంలో రాహుల్ ఢిల్లీలోని కరోల్బాగ్కు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ మోటార్ సైకిళ్లను రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్తో మాట్లాడారు. అప్పుడు ఆ మెకానిక్ రాహుల్తో ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దానికి రాహుల్ ‘నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే చేసుకుంటాను’ అని సమాధానమిచ్చారు. -
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
మరో హాట్ బ్యూటీ పెళ్లికి రెడీ అయింది. త్వరలో శుభకార్యం ఉండనుందనే హింట్ ఇచ్చేసింది. దీని గురించి పక్కనబెడితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న 'ఎగ్ ఫ్రీజింగ్' గురించి మాట్లాడింది. తను వీటిని ఎప్పుడో చేసేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు?2012లో 'జన్నత్ 2' అనే హిందీ సినిమాతో ఈషా గుప్తా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజ్ త్రీడీ, హమ్ షకల్స్, రుస్తుమ్, టోటల్ ధమాల్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో హేరీ ఫేరీ 4, దేశీ మ్యాజిక్ అండ్ మర్డర్ 4 మూవీస్ ఉన్నాయి. యాక్టింగ్ గురించి పక్కనబెడితే హాట్ హాట్ పోజులతో ఎప్పటికప్పుడు నెటిజన్లని అలరించే ఈ బ్యూటీ.. ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. ఆరోగ్యకర అండాల్ని వైద్య పద్ధితిలో భద్రపరచడం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఇలా చేసింది. మృణాల్ ఠాకుర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటానని చెప్పింది. అయితే ఈషా గుప్తా మాత్రం 2017లోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఒకవేళ తాను నటి కాకపోయింటే ఈపాటికే ముగ్గురు పిల్లలకు తల్లిని అయ్యేదని, పిల్లలంటే తనకు అంత ఇష్టమని ఈషా చెప్పింది. అందుకే హెల్తీగా ఉన్నప్పుడే తన అండాల్ని భద్రపరుచుకున్నానని క్లారిటీ ఇచ్చింది.ఇకపోతే గతే ఐదేళ్ల నుంచి మాన్యువల్ కంపోస్ అనే యువ పారిశ్రామిక వేత్తతో రిలేషన్లో ఉన్న ఈషా గుప్తా.. త్వరలో తన పెళ్లి జరగొచ్చని హింట్ ఇచ్చేసింది. ఇతడు పరిచయం కాకముందే తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
తమిళ సినిమా: కోలీవుడ్లో లక్కీయస్ట్ కథానాయకి ఎవరంటే ప్రస్తుతం నటి అదితి శంకర్ పేరే వినిపిస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ వారసురాలైన ఈమె డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ విధంగా విరుమాన్ చిత్రంలో కార్తీకి జంటగా నటించి తొలి విజయాన్ని అందుకున్నారీమె. అదే చిత్రంలో పాట పాడి గాయనిగాను ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా ఈమెకు సక్సెస్ అందించింది. అలా ఇప్పటికీ నటించింది రెండు చిత్రాలు అయినా పలు చిత్రాల్లో నటించిన ప్రచారాన్ని పొందారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో నవ నటుడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. ఈయన దివంగత ప్రముఖ నటుడు మురళి రెండవ కొడుకు. కాగా నటి అదితి శంకర్ను త్వరలో నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వరించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. కాగా అదితి శంకర్ పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటనను పెద్ద ఫ్యాషన్గా భావించే ఈమె అంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతారని భావించలేం. కాగా సమీపకారంలో అదితి శంకర్ అక్క రెండవ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసింది. ఇకపోతే అదితి శంకర్ తరచూ ఫొటో సెషన్లను నిర్వహించుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఆమె పెళ్లి కూతురుగా తయారైన ఒక అందమైన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అక్క పెళ్లి అయ్యింది.. తర్వాత అదితి శంకర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారా? అనే కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్గానే ఉంటోంది.గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?) -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్తో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)'జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు.ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్తో రిలేషన్లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!) -
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్లో ప్రముఖ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
పెళ్లిళ్ల విషయాల్లో మనకూ వాళ్లకున్న స్పష్టమైన తేడా , మనవి చాలావరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ కాగా వాళ్ళవి ప్రేమ వివాహాలు. అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడమంటే ఒక తేనె తెట్టెను కదిల్చినట్లే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో దినదినం తగ్గిపోతున్నారు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో అసలు పెళ్లెందుకు ? అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు . పెళ్ళైనా కాకున్నా తప్పవు చికాకులు అందుకే పెళ్ళి.. బెటర్ విందువినోదాలు బెల్లమైనా పెళ్ళామైనా కొత్తలో చాలాతీపి పాతబెల్లం మందులకు.. పెళ్ళాం పిల్లలకు నచ్చినవాడే కాదు మెచ్చినవాడు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడే కళ్యాణం కలిసివుండడం గుడ్.. కుదరనప్పుడు నిత్యకలహాలకన్నా విడిపోవడం వెరీగుడ్ఇందులో మొదటి రెండు భారతీయుల మనస్తత్వాన్ని , చివరి రెండు అమెరికా వాళ్ళ ఆలోచనా ధోరణిని తెలిపే కవితలు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు , సేమ్ సెక్స్ ( స్వలింగులు ) జంటలు ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. వీళ్లను అదుపు చేయగలగిన కుటుంబ పెద్దల వ్యవస్థ అక్కడ బలహీనమై పోయింది. పేరెంట్స్ డే నాడు కలుసుకోడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో పెద్దలకు తెలిసే పరిస్థితులు. మన దేశంలో పొద్దున్నుండి రాత్రి వరకు స్త్రీ చేసిన ఇంటి వంట పనులు, పిల్లల పోషణ లెక్కలోకి రావడం లేదు. కులాలు, మతాలు ప్రాతిపదికనళ్లు పెళ్లిళ్లే ఉండవు..ఆమె భర్త చాటు అబల మాత్రమే, సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొనివున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. బయటకు వెళ్లి మగవాడు చేసిందే సంపాదన , ఆయనే కుటుంబ యజమాని. అమెరికాలో పరిస్థితి భిన్నం. మహిళ సబల, భర్త వెనక నడిచే భార్య కాదు. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా షికార్లకు వెళ్లి రాగలదు. అక్కడ భార్యభర్తలు ఇద్దరూ ఏదో ఓ ఉద్యోగం చేసేవారే. తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసివున్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పనిలేదు.తేడాలు వస్తే , కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు. అమెరికాలో కులాలు, మతాల ప్రాతిపదికన పెళ్లిళ్లు ఉండవుఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎంచుకోవచ్చుపెళ్లికి ముందే తప్పనిసరిగా పరిచయం అయి ఉంటుందిఒకరి గురించి మరొకరికి సంపూర్ణంగా అవగాహన కలిగే వారకు కలిసి ఉంటారుఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై.. కలిసి ఉంటామన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటారుఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెళ్లికి సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పద్ధతులున్నాయివయస్సులో భర్త పెద్దగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ఇష్టం ఉంటే చాలుఅమెరికాలో పెళ్లిళ్లకు ముందే చాలా మంది కౌన్సిలర్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి ఒకరి గురించి మరొకరు చర్చిస్తారు. బంధం ధృడమయ్యేందుకు చర్చలు జరుపుతారుఆడ-మగ అనే కాదు, స్వలింగ వివాహాలు కూడా ఇక్కడ చట్టబద్ధమేపెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. చట్ట ప్రకారం ఇద్దరికి అన్ని హక్కులు సమానంగా ఉంటాయిభారతదేశంతో పోలిస్తే విడాకులు ఇక్కడ సర్వసాధారణంవిడాకుల విషయంలో కోర్టులు విధించే భారీ పరిహారమే భయపెట్టేలా ఉంటుందిభారత్లో జరిగినట్టుగా పెళ్లిళ్లు భారీ హడావిడితో జరగవు.డెస్టినేషన్ వెడ్డింగ్లు కూడా జరుగుతాయి. మంచి పర్యాటక ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడమంటే అమెరికన్లకు ఇష్టంపెళ్లి ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు. వర్చువల్గా విషెస్ చెబుతారు.చాలా వరకు పెళ్లిల్లు వీకెండ్లోనే జరుగుతాయి.మన దగ్గర పెళ్లి చీరకు ఎంత విలువ ఉంటుందో.. అక్కడ వెడ్డింగ్ గౌన్కు అంత ప్రాధాన్యత.భారత్ నుంచి వెళ్లి సెటిలయ్యే వారిలో కొందరు అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనక కూడా లీగల్ పాయింట్లు లాగే వారున్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాట పడ్డా.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్లను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ పరిచయం, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించమంటున్నారు. పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్నవారే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పై పడుతుంది వాస్తవం. వీటికి తోడు పెళ్లికాని టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం, అసలు పెళ్లే చేసుకోకుండా కలిసివున్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు . నల్ల జాతీయుల్లోనైతే వివాహేతర జననాలు 25 శాతం వరకు ఉంటాయంటున్నారు !.వేముల ప్రభాకర్(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?) -
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.' అని తెలిపారు.సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. -
పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే విషయంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్ ఎలా డీల్ చేస్తారో చాలా ఎంటర్టైనింగ్గా చూపించాం. ఇందులో నరేశ్ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే. అంతే కాదు హీరోయిన్గా మాస్ మసాలా, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్కు ఫిజికల్ ట్రైనర్గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
Aparna Das: గ్రాండ్గా ముద్దుగుమ్మ అపర్ణ దాస్ హల్దీ వేడుక (ఫొటోలు)
-
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
నా పెళ్లి అలా జరగాలి: జాన్వీ కపూర్
-
పెళ్లి ప్రపోజల్ పై అర్జున్ కపూర్ కు ఫ్యూజులెగిరిపోయే సమాధానమిచ్చిన మలైకా..!
-
సీక్రెట్గా ప్రముఖ సింగర్ వివాహం.. !
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దిల్జీత్ దోసాంజ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్గా పనిచేస్తున్న రోహిత్ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
‘ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు’ అన్నారు బాలీవుడ్ నటి సన్నీలియోన్ . హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ‘కరెంట్ తీగ’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ‘పీఎస్వీ గరుడవేగ’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘స్ల్పీట్స్విల్లా’ అనే ఓ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సన్ని. తాజాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ–‘‘కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని చాలా ప్రేమించాను. తన కూడా నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదో తప్పు జరుగుతోందని, అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నా మనసుకు అనిపించింది. దీంతో ‘నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. మరో రెండు నెలల్లో మా పెళ్లిని ప్లాన్ చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పైగా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తను అలా చెప్పడంతో నా మనసు ముక్కలైంది.. ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్ వెబర్ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయినప్పుడు తను ఎంతో అండగా నిలిచాడు. మా ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి (2011) చేసుకున్నాం. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’’ అన్నారు. -
Rashmi Gautam HD Photos: అలాంటి వ్యక్తితోనే నా పెళ్లి.. యాంకర్ రష్మి (ఫోటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement