mass communication
-
టీయూలో ప్రశ్నాపత్రం లీకేజీ?
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పీజీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. మే 16న జరిగిన ఎంఏ మాస్ కమ్యూనికేషన్ నాలుగో సెమిస్టర్ మొదటి పేపర్లోని ప్రశ్నలు బయటికి పొక్కినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజుల ముందే ఈ ప్రశ్నలు బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ పీజీ పరీక్షలు మే 16 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలను ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తయారు చేయించి తెప్పిస్తుంటారు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రశ్నపత్రాన్ని తెప్పించినట్లు సమాచారం. ఈ పత్రాలు పరీక్షకు కొద్ది రోజుల ముందు యూనివర్సిటీకి చేరుతాయి. ఆ పత్రాల్లో ఏమైన అక్షర దోషాలు, తప్పులు, సవరణలు చేయాల్సిన ప్రక్రియ మోడరేషన్ను చేపట్టిన అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. మోడరేషన్ సందర్భంగా ఈ పేపర్లోని ప్రశ్నలు బయటకు పొక్కాయా? లేక ఇంకా ఏదైనా సందర్భంలో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఏ మాస్ కమ్యూనికేషన్కు సంబంధించి ప్రశ్నలు బయటికి పొక్కినట్లు సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. పరీక్షలో ఏయే ప్రశ్నలు వస్తాయనే అంశంపై వివరిస్తున్న సంభాషణ వాట్సాప్లో తిరుగుతోంది. ఈ విషయమై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యను సంప్రదించగా, ప్రశ్నపత్రం బయటికి పొక్కిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలు లీకయ్యే అవకాశాలుండవన్నారు. ఇవన్నీ వదంతులు కావచ్చని, అయినా.. విషయం పరిశీలిస్తానని చెప్పారు. -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అసోసియేట్ ప్రొఫెసర్ అర్హతలు: మీడియా స్టడీస్/ కమ్యూనికేషన్/ జర్నలి జంలో పీహెచ్డీతో పాటు 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.iimc.nic.in భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఎంపిక: గేట్-2014 స్కోర్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వెబ్సైట్: www.bbnl.nic.in ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హతలు: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: గేట్ 2015 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వెబ్సైట్: www.ntpc.co.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ జైపూర్లోని చౌదరి చరణ్సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్ అర్హతలు: అగ్రికల్చర్/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ టెక్నాలజీ/ ఫుడ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జనవరి 31, 2015 వెబ్సైట్: www.ccsniam.gov.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్: డీఎస్సీ బయాలజీ మెథడ్స డీఎస్సీ బయాలజీ మెథడ్సలో ‘ఉద్దేశాలు- విలువల’కు సంబంధించి ఎలా అధ్యయనం చేయాలి? ఏ విధంగా చదివితే విలువలను సులువుగా గుర్తుంచుకోవచ్చు? -కె.రాగసుధ, అల్వాల్ ‘ఉద్దేశాలు-విలువలు- సహ సంబంధం’ చాప్టర్లో ఉద్దేశం- లక్ష్యానికి మధ్య ఉన్న భేదాలపై అవగాహన పెంచుకోవాలి. భావనలు, వాటికి సరైన ఉదాహరణలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవడం వల్ల సమాధానాలను తేలికగా గుర్తించవచ్చు. విలువలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలకు (సత్య శీలత, నిజాయతీ, నిష్పాక్షికత, ఓర్పు) సంబంధించింది నైతిక విలువగా, జ్ఞానానికి సంబంధించింది బౌద్ధిక విలువగా, దైనందిన జీవితంలో పాఠ్యాంశంగా ఉపయోగపడితే ఉపయోగాత్మక విలువగా, వృత్తిని ఎంచుకుంటే- వృత్తి పరమైన విలువగా, ప్రకృతిని అభినందిస్తే సౌందర్య విలువగా, కొత్త ఆలోచనలు వస్తే సృజనాత్మక విలువగా గుర్తుం చుకోవాలి. అప్పుడే విలువలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇదే చాప్టర్ చివరలో సహ సంబంధం ఉంది. ఇచ్చిన ఉదాహరణలను బట్టి ఏ శాస్త్రాల మధ్య సహ సంబంధం ఉందో అవగాహన చేసుకోవాలి. జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఏయే శాస్త్రాల పరిజ్ఞానం అవసరమవుతుందో విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఎంచుకోవాలి. ఇన్పుట్స్: ఎస్.పి.డి. పుష్పరాజ్, సీనియర్ ఫ్యాకల్టీ -
8న బళ్లారిలో కే-సెట్
= 32 సబ్జెక్టులకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు = వీఎస్కేయూ వీసీ మంజప్ప హొసమనె సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో ఈనెల 8వ తేదీన కేసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ)వైస్ చాన్స్లర్ మంజప్ప హొసమనె తెలిపారు. నగర శివార్లలోని వీఎస్కేయూలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నోడల్ కేంద్రాల్లో కేసెట్ పరీక్షలు జరుపుతున్నారని, అందులో భాగంగా బళ్లారి నగరంలోని సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్,ప్రభుత్వ ఎక్స్ మున్సిపల్ పీయూ కళాశాల, బసవరాజేశ్వరి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజీ, వాసవీ పీయూ కళాశాల, గాంధీనగర్ చైతన్య పీయూ కళాశాల కేంద్రాల్లో 32 సబ్జెక్ట్లకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టులవారిగీ కేంద్రాలు కన్నడ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి సరళాదేవి కళాశాలలో, కన్నడ, లైబ్రరీ సైన్స్, హిందీ, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించి ఎక్స్ మున్సిపల్ కళాశాలలో, ఎకనామిక్స్ సోషియల్ వర్క్, లైఫ్ సైన్స్, మేనేజ్మెంట్ మాస్ కమ్యూనికేషన్, ఉర్దూ బసవరాజేశ్వరీ పీయూ కళాశాలలో, సోషియాలజీ, మేథమెటికల్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, పర్యావరణ పరిరక్షణ సమితి ఎగ్జామ్స్, అర్థ్ సైన్స్, లా, హోంసైన్స్ వాసవీ పీయూ కళాశాలలో, హిస్టరీ, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫి, సాంస్కృతికం, ఫ్లో లిటరేచర్, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ చైతన్య కళాశాలలో ఆయా సబ్జెక్ట్లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం బళ్లారి సెంటర్లలో 3626 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారన్నారు. ఫస్ట్, సెకెండ్ పేపర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మూడవ పేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.