కోస్తాంధ్రలో చల్లబడిన వాతావరణం
విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని వాతావరణ విభాగం వెల్లడించింది. చాలా చోట ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదు కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని సమాచారం. ప్రస్తుతం పడుతున్న వర్షాలు మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ముందు పడే ప్రీ మాన్సూన్ షవర్స్గా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ద్రోణ కారణంగా నేడు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.