సెప్టెంబర్లో తగ్గిన మొబైల్ యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్లో తగ్గిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. గత 5 నెలల్లో ఈ వినియోగదారుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం...
ఈ ఏడాది ఆగస్టు నాటికి 87.67 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.70%తగ్గి 87.05 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో యూజర్ల సంఖ్య 10 లక్షలు తగ్గింది.
ఆర్కామ్ సంస్థ 1.04 కోట్ల వినియోగంలోలేని కనెక్షన్లను తొలగించింది. దీంతో మొత్తం 11.62 కోట్ల యూజర్లతో(13.35 మార్కెట్ వాటా)తో ఈ కంపెనీ నాలుగో స్థానానికి పడిపోయింది.
మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా 90.61 కోట్ల నుంచి 0.70% తగ్గి 89.98 కోట్లకు పడిపోయింది.
ఐడియా సెప్టెంబర్లో 12.07 లక్షల మంది కొత్త యూజర్లను జతచేసుకోవడంతో మొత్తం యూజర్ల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది.
12.05 లక్షల కొత్త మొబైల్ యూజర్లతో వొడాఫోన్ మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 15.55 కోట్లకు పెరిగింది.
భారతీ ఎయిర్టెల్కు 11.64 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. 22.21% మార్కెట్ వాటా(19.33 కోట్ల మంది వినియోగదారుల)తో అగ్రస్థానంలో నిలిచింది.
మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్పీ) కోసం 22.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
దేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 1.52 కోట్ల నుంచి 0.52 శాతం వృద్ధితో 1.53 కోట్లకు పెరిగింది.